సమగ్ర గిరిజన దీపిక`కోయ సంస్కృతి

గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటైన సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ- భద్రాచలం వారి సారధ్యంలో నిర్వహించబడుతున్న గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణా సంస్థ పక్షాన రూపొం దించబడిన సచిత్ర వర్ణ పుస్తకం ‘‘కోయతెగ సంస్కృతి’’ఇరవై ఒక్క అధ్యాయాల ఈ సమగ్ర వర్ణ చిత్రాల పుస్తకంలో గిరిజన తెగకు సంబంధించిన సంస్కృతి సంబంధపు అనేక విషయాలు విశేషాలు పొందుపరచబడ్డాయి.
శిక్షణా సంస్థ పర్యవేక్షకులు వీసం వసంత రావు పర్యవేక్షణలో కె.సీతారాములు,ఎన్‌. జగన్మో హన్‌ రావు గార్ల నేతృత్వంలో సోడే మురళి, మడకం లక్ష్మణరావు,మడకం చినరత్తయ్య, సోడె శివరామకృష్ణ, సోడె సత్యనారాయణ,తదితర ఆంథ్రో పాలజీ విద్యార్థుల రచనా సహకారంతో వెలువడిన ఈపుస్తకానికి,కొండవీటి గోపి వరప్రసాద్‌ అందించిన ఛాయాచిత్రాలు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
తొలి అధ్యాయంలో పురాణ గాథల ఆధారంగా కోయతెగ పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తూ… చందా,నాగుల,తాటి,జలరేల,వంశ చరిత్రలను సంబంధిత కుటుంబాల పెద్దలను సంప్రదించి వారు చెప్పిన పురాణాల ప్రకారంగా కథల ద్వారా వారి సమగ్ర సమాచారం భద్రపరిచి అందించే ప్రయత్నం చేశారు.
కోయ తెగ యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ‘‘చందా వీరయ్య’’మాటల గాధను పొందుపరిచారు సృష్టి ఆవిర్భావానికి చెందిన ఆసక్తిదాయకమైన విషయాలు కథలుగా ఇందులో చెప్పారు.
రెండవ అధ్యాయంలో గట్లు,గోత్రాలు,గురించి పురాణాలుగా చెబుతూ ఒకటి నుంచి ఏడవ గట్టు వరకు ఏర్పడ్డ విధానాలు చెబుతూ అవి కోయ జాతి వంశవృక్షం ద్వారా నిర్దేశించిన తీరు, వివాహాలు బంధుత్వాలు దేవుళ్లను పూజించే సమయంలో ఏ విధంగా వాటి ప్రాధాన్యత ఉంటుందో ఇందులో సవివరంగా సహేతుకంగా వివరించారు.
ఆయా గట్లు గోత్రాలు ఏర్పాటుకు జానపద బాణీలోని పురాణ గాథలు అన్వయం చేసి చెప్పారు, వీటికి అంకెలతో పాటు పేర్లు కూడా ఉండే తీరు చెబుతూ వివాహాల విషయంలో ఏ గోత్రం/గట్టువారికి వియ్యం కుదురుతుందో
ఆవివరాలు కూడా పట్టిక రూపంలో వివరించడం ఎంతో ఉపయోగకరంగా ఉంది.
మూడవ విభాగం మొత్తం కుటుంబం, బంధుత్వాలతో చెప్పబడిరది.దీనిలో వీరు బంధువులను పిలుచుకునే విధానం,తెలుగు లిపితో చెప్పబడ్డ కోయ భాషలో ఉంటుంది,తెలుగు భాషకు కాస్త దగ్గర సంబంధంగల ఈకోయ భాష అర్థం చేసుకోవడం పెద్దకష్టం ఏమీ కాదు.
ఉదా: అమ్మను యవ్వఅని,అక్కను యక్క,మామ ను,మామాల్‌,అని సంబోధించడం వీరికి పరి పాటిగా ఇందులో పేర్కొన్నారు.
లిపిలేని కోయ భాషకు లిపిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి సహేతుకంగా సూచన ప్రాయంగా నాలుగవ అధ్యాయంలో ‘‘భాషా – లిపి’’ పేరుతో వివరించడం జరిగింది.
5,6 అధ్యాయాలుగా కొలుపులు,వేల్పులు, పండుగలు,గా పేర్కొనడంజరిగింది. సాధార ణంగా గిరిజనులు తమ కొలుపులుగా ముత్యా లమ్మ, నాగులమ్మ, సమ్మక్క సారక్క,లను పేర్కొం టారు. వీరిని కొలవడంలోని అంతరార్థం చెప్పడంతో పాటు ఆయా జాతరలు చేసే తీరు కూడా కూలంకషంగా వివరించారు.వీటితోపాటు గుంజేడు ముసలమ్మ,డాలుగడ్డ డోలీలు,వంటి జాతర్ల గురించి అవి కోయలు నిర్వహించే విధానాలు ఆసక్తిదాయకంగా అందమైన శైలిలో చక్కగా కొనసాగాయి.
ఇక ఆరవదైన ‘‘పండుగలు’’ విభాగంలో కూడా అనేక ఆసక్తికరమైన వివరాలు ఆవిష్కరణలు చేయడం జరిగింది.
అవి ఇంటి పండుగ, వేల్పుల పండుగ, విత్తనాల పండుగ,తో పాటు భూమి పండుగ, పచ్చ పండుగ, వంటి సాధారణ పండుగలతో పాటు లేలే పండుగ ,కొత్తల పండుగ, చిక్కుడు పండుగ, ఇప్పపూల పండుగ, తాటి చెట్ల పండుగ, చీడపీడల పండుగ, కప్పల పండుగ, తదితర పండుగల వివరాలు విశ్లేషణతో పాటు ఆయా పండుగలు చేసే విధానం. తదితరాలతో పాటు ఆయా పండుగలు చేసుకునే సందర్భంలో సామూహికంగా పాడుకునే పాటలు సైతం ఇందులో వివరించారు. ఓకే ఇంటి పేరు వాళ్ళు అంతా తొలకరి ఆరంభంలో ఒకే చోట ప్రకృతిని ఆరాధిస్తూ చేసుకునే పండుగ ‘‘ఇంటి పండుగ’’ దీని ద్వారా అందరిలో ఐక్యత భావం కలగడంతో పాటు సౌబ్రాతృత్వం వెల్లివిరుస్తుంది.
వస్త్రధారణ అలంకరణలు విభాగంలో కోయవారు ధరించే ఆభరణాల్లో ఖరీదు విషయం పక్కనపెడితే సహజసిద్ధంగా దొరికే లోహాలు వెండి ఇత్తడి మొదలైన వాటితో తయారు అయిన ఆభరణాలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరి ఆభరణాల్లో అందం కన్నా సాంప్రదాయం అధికంగా ఉండ టం విశేషం. ఇక అడవి బిడ్డల ఆహారపు అల వాట్లు, వివాహా లు,చావు,మొదలైన విషయాల గురించి సుదీర్ఘంగా సహేతుకంగా ఇందులో వివరించ బడ్డాయి,వీటి ద్వారా అనేక ఆసక్తిదాయక విషయాలు విశేషాలు తెలుసుకోవచ్చు.
కోయల సంస్కృతిలో అత్యంత ప్రముఖ పాత్ర వహించేది ‘‘వెజ్జు’’, ఆరోగ్య విషయాల్లో ఎంతో సహకరించే ఈ వెజ్జు గురించి చాలా వివరంగా ఇందులో చెప్పారు, దీనిలో అంతర్భాగంగా మూలిక వైద్యం గురించిన వివరణలో వ్యాధులు వాటి నివారణ కోసం ఉపయోగించే మొక్కల పేర్లు పట్టిక రూపంలో వివరించడం చాలా ఉప యోగకరంగా ఉంది.
ఇక 14,15,అధ్యాయాలు ఇంటి నిర్మాణం, గృహోపకరణాలు,పనిముట్లు,గురించి చాలా చక్కగా వివరించి ఛాయాచిత్రసహితంగా అందిం చారు.అదేవిధంగా కళలు, జంతువులు, వేట, వ్యవసాయం,అటవీ ఉత్పత్తులతో పాటు,కోయ జాతిలో గల సామాజిక వ్యవస్థ, కట్టుబాట్లు, గురిం చి ఎంతో వివరణాత్మకంగా వ్రాయబడ్డాయి. భావి తరాలకు అడవిబిడ్డల సంస్కృతిని సచిత్రంగా భద్ర పరచబడిన ఈవిలువైన పుస్తకం పరిశోధకుల పాలిట కల్పవృక్షం,అనడంలో అసలైనసత్యంఉంది.
కోయతెగ-సంస్కృతి (వ్యాస సంకలనం)
పేజీలు: 226, ధర: 200/-రూ, ప్రతులకు: గిరిజన సంస్కృతి పరిశోధన శిక్షణ సంస్థ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ – భద్రాచలం,507111, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా, తెలంగాణ. సమీక్షకుడు : డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు, చరవాణి : 77298 83223.- డా. అమ్మిన శ్రీనివాసరాజు

రాష్ట్ర బడ్జెట్‌202526

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అమరావతి లోని అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,22,359.33 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ సామాజిక సంక్షేమ పథకాలు, విద్య, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక అండ్‌ నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే ముందుగా పాఠశాల విద్య ఇంకా అభివృద్ధి కోసం రూ.31,806 కోట్లు కేటాయించింది.
2025-2026 సంవత్సరానికి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు ఇంకా హైదరాబాద్‌లలో పారిశ్రామిక కారిడార్‌ల కోసం రూ.837కోట్లు, పరిశ్రమలు, లు సహా ఆహార ప్రాసెసింగ్‌ కోసం రూ.1,400 కోట్లు కేటాయించింది.అలాగే 26 సంవత్సరానికి రాష్ట్రంలో ఆర్థిక,సాంకేతిక పురోగతి కోసం రూ.55,730 కోట్లు కేటాయించింది.ప్రభుత్వ హమీలోని తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో రూ 9,407 కోట్లను ప్రతిపా దించారు. అలాగే రూ.15వేలు చొప్పున తల్లుల ఖాతా ల్లో మే నెలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తేలిపింది. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం రూ 6300కోట్లు ప్రతిపాదించారు. రైతు అనుబంధ రంగాలకు13,487కోట్లు కేటాయింపు చేసారు. అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతలుగా, కేంద్రం అమలు చేస్తున్న పీఎంకిసాన్‌ కలిపి ఈ పథకం అమలు కానుంది.
పెన్షన్ల కోసం ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు కేటాయించారు. అదే విధంగా చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్‌కు రూ.450 కోట్లు ప్రతిపాదించారు. బడ్జెట్‌ లో పోర్టులు, ఎయిర్‌పోర్టులకి రూ.605 కోట్లు కేటాయింపులు చేసారు. మత్స్యకార భరోసా కోసం రూ 450 కోట్లను ప్రతిపాదించారు. తొలిసారిగా తెలుగు భాషకు నిధులను కేటాయిస్తూ తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారు. మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగంప్కె వ్యతిరేక ప్రచారం కోసం బడ్జెట్టులో ప్రత్యేక కేటాయింపులు అలాగే నవోదయం 2.0స్కీం కిందమద్యపాన, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం కోసం కూడా నిధుల కేటాయింపు చేశారు.ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మా ణానికి6,705కోట్లను,సాగునీటి ప్రాజెక్టులకు 11,314కోట్లను కేటాయించారు. ప్రకృతి వ్యవసా యం ప్రోత్సహించడానికి రూ.61 కోట్లు, మార్కెటింగ్‌ శాఖకు రూ.315 కోట్లు, సహకార శాఖకు రూ.239 కోట్లు, వ్యవసాయం యాంత్రీకరణ కోసం రూ.219 కోట్లు,పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం రూ.250 కోట్లు, ఎరువుల నిర్వహణకు రూ.40 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.వెయ్యి కోట్లు, ఆర్టీజీఎస్‌ కోసం రూ.101 కోట్లు,దీపం 2.కోసం రూ.2,601 కోట్లు, జల్‌జీవన్‌ మిషన్‌కోసంరూ.2,800కోట్లు కేటాయిం చారు.
తల్లికి వందనం
ఆంధ్రప్రదేశ్‌లో గత తొమ్మిది నెలలుగా ఎదురు చూస్తున్న తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది. బడ్జెట్‌ లో నిధులు కేటాయింపులు చేసింది. 9,407 కోట్ల రూపాయలను కేటయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రకటించారు. తల్లికి వందనం అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించినా బడ్జెట్‌ లో నిధులు కేటాయింపు ఎలా ఉంటుదన్న దానిపై ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు.
మే నెల నుంచి…
వచ్చే ఏడాది పాఠశాలలు ప్రారంభం కాగానే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తల్లికి వందనం పథకాన్ని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమ్మవొడి పథకం కింద తల్లి ఖాతాలోనే నిధులను జమ చేసేవారు. అయితే చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం పేరిట ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులున్నా వారికి ఈ పథకం వస్తుందని కూడా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. గత ప్రభు త్వం మాత్రం అమ్మఒడి ఇంటికి ఒక్కరికే ఈ పథకాన్ని అందించింది.
అర్హతలివే…దీంతో పాఠశాలలు జూన్‌ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.మేనెల నుంచి తల్లికి వందనం కింద నిధులు జమ చేయాలని నిర్ణయిం చారు. ఇందుకోసం ప్రతి వాళ్లు రేషన్‌ కార్డు లేదా ఆధార్‌ కార్డు ఉండాల్సి ఉంటుంది. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలరూపాయలు ఇస్తా మని చెప్పడంతో ఇప్పటికే దీనిపై అధికారులు కసర త్తులు ప్రారంభించారు. హాజరుశాతం కూడా 75 శాతం పైన ఉంటేనే గత ప్రభుత్వం అమ్మఒడి పథకం నిధులు విడుదల చేసేది. దానిని ఈ ప్రభుత్వం అలాగే కొనసాగించే వీలుంది. దీంతో పాటు దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న వారికే ఈ పథకం వర్తింప చేయను న్నారు. తెలుపు రంగు రేషన్‌ కార్డు తప్పనిసరి. కుటుం బంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా ఈ పథకం వర్తించదని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించి విధివిధానాలను ప్రభు త్వం ప్రకటించనుంది.-(జిఎన్‌వి సతీష్‌)

జనావాసాల్లో జంతువులు

అడవుల్లో ఉండాల్సిన వన్య మృగాలు కొంత కాలంగా జనావాసాల బాట పడుతున్నాయి. దీంతో జనపథాలుగొల్లుమంటున్నాయి.తెగించి ఎదురునిలిచినా, తెలియక ఎదురుపడినా బతుకుపై భరోసా లేనట్టే. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీయాల్సిన స్థితి. చిత్తూరు జిల్లాల్లో ఏనుగు దాడిలో ముగ్గురు మరణిం చినా,తిరుమల కొండల్లో అభం శుభం తెలియని పసిపాప చిరుతకు బలైనా, వందలాది ఎకరాల్లో పంటపొలాలు ధ్వంసమైనా.. ఆ మూల నుండి ఈ మూల వరకు ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒకప్రాంతంలో వన్యమృగాలు సంచరిస్తు న్నట్లు వార్తలు వస్తున్నా కారణం ఒక్కటే.. అది మృగాలకి, మనుషులకి మధ్య పెరుగుతున్న ఘర్షణ. అనివార్యంగా మారుతున్న మనుగడ పోరాటం. ఎక్కడో కాకులు దూరని కారడవుల్లో ప్రశాంతంగా తమ మానాన తాము బతికే పులులు, చిరుతలు, ఏనుగులు, ఎలుగుబంట్లు నుండి వివిధ రకాల వన్యమృగాలు జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి? మనకు సమస్యగా ఎందుకు మారుతు న్నాయి? ఈ సంఘర్షణకు పరిష్కారం లేదా? అసలీ దుస్థితికి కారణం ఏమిటి? దీనిపై ప్రత్యేక కథనం..
వన్య మృగాలు జనావాసాల్లోకి రావడమనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సమస్యేమీకాదు. అటవీ ప్రాంతాలకి సమీపంలో ఉండే గ్రామాల ప్రజలకు వన్యమృగాలు తారసపడటం అనేది సహజమే. అయి తే, అది మృగాలకు మనుషులకు మధ్య ఘర్షణగా మారే సందర్భాలు మాత్రం అరుదు. పొరపాటున గ్రామాల్లోకి వన్యమృగాలు వచ్చినా, మనిషి తారస పడగానే అవి వెనక్కి తగ్గేవి. అనివార్యంగా జనావా సాలను దాటాల్సి వచ్చినా.. సాధ్యమైనంత మేరకు మనిషి కంటపడకుండా వెళ్లిపోతాయి. అడవులకు సమీపంలో నివసించే చెంచులను, గిరిజనులను అడిగితే ఇటువంటి సంఘటనలను కోకొల్లలు చెబుతారు. కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. కిలోమీటర్ల దూరం జనావాసాల్లోకి వన్యమృగాలు వచ్చేస్తున్నాయి. ఆ మేరకు మనుషులకు మృగాలకు మధ్య జరుగుతున్న ఘర్షణలూ పెరుగు తున్నాయి. జంతువుల దాడుల్లో మనుషులు, మను షుల దాడుల్లో జంతువులు మరణిస్తున్న సంఘటనలూ పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021 నుండి 2025 సంవత్సరాల మధ్య కాలంలో వన్యమృగాల బారిన పడి రాష్ట్రంలో 139మంది మరణించారు. మృతులలో పురుషులే ఎక్కువ. ఏ జంతువుల బారిన పడి ఈ మరణాలు చోటుచేసు కున్నాయి అన్నది ఎన్‌సిఆర్‌బి అధికారికంగా ప్రకటిం చలేదు. అయితే, అటవీ, పోలీస్‌ అధికారులు చెబు తున్న సమాచారం ప్రకారం ఏనుగులు, ఎలుగుబంట్ల దాడుల కారణంగానే ఈమరణాలు చోటుచేసు కున్నాయి. ఇటీవల కాలంలో చర్చనీయాంశమైన చిరు తలు,పులుల దాడుల్లో మనుషులు మృతి చెందిన సంఘటనలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఇటీవల తిరుమలలో జరిగిన దురదృష్టకర సంఘటన దీనికి మినహాయింపు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలు ఏనుగుల గుంపుల బారిన తరచూ పడుతున్నట్లు ఎన్‌సిఆర్‌బి నివేదికలను పరిశీలిస్తే అర్థమవుతోంది. సంవత్సరానికి సుమారుగా 30 మంది వన్యమృగాల బారిన పడి, ప్రాణాలు కోల్పోతున్నారు. 2018 సంవత్సరంలో 31 మంది, 2019లో 25 మంది, 2020లో 32మంది మరణించారు. అనధికారికం గా మరికొన్ని సంఘటనలూ చోటుచేసుకుని ఉండ వచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు, ఎలుగుబంట్ల దాడులు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. నాలుగు ఏనుగుల మంద ఈప్రాంతంలో తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. మన్యం పార్వతీపురం జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఆరు ఏనుగులు కనిపించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో గడిచిన ఐదు సంవ త్సరాల కాలంలో ఏనుగుల దాడిలో ఆరుగురు రైతులు మరణించారు.వీటిని బంధించడానికి వచ్చిన ఒక ట్రాకర్‌ కూడా మృత్యువాత పడ్డారు. శ్రీకాకుళం జిల్లా లో ఐదు సంవత్సరాల కాలంలో పదిమంది రైతులు మరణించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో గత ఏడాది పెద్ద పులుల సంచారం కలకలం రేపగా, ఈఏడాది శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్దపులి కనిపించినట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి.కౌండిన్య వైల్డ్‌లైఫ్‌ శాంచురీ నుండి చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి ఏనుగుల రాకపోకలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్నాటక నుండి కూడా ఈ ప్రాంతంలోకి ఏనుగులు వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓఒంటరి ఏనుగు బారిన పడి,చిత్తూరు జిల్లా లో కొద్దిరోజుల క్రితం ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.-(తిరుపతి రెడ్డి మద్దిగెడ్డ)

ప్రకృతితో మమేకం..ఆదివీసల జీవనం

గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 18 వేల మందిగిరిజనులకు అటవీ సాగుహక్కు పత్రాలను అందజేసింది.ఏటా గిరిజన రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అంద జేస్తోంది. గిరిజన గూడలను కలిపేలా రోడ్లు నిర్మి స్తోంది. వరదల భారి నుంచి రక్షించేలా 114 రక్షణ గోడలను నిర్మించింది. రక్తహీనతతో బాధపడే గర్భి ణులు, బాలింతలు, చిన్నారులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణప్లస్‌ పథకాల కింద పౌష్టికాహారం అందజేస్తోంది. గిరిజనుల వైద్యంకోసం పార్వతీపురం మన్యం జిల్లాకు వైద్యకళాశాలను మంజూరు చేసింది. సీతంపేట,పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రులు నిర్మించింది. రోగులను అత్యవసరవేళ ఆస్పత్రు లకు చేర్పించేందుకు 108వాహనాలతో పాటు బైక్‌ అంబులెన్స్లు ఏర్పాటుచేసింది.గిరిజన గ్రామాల ప్రజ లకు సెల్‌ సిగ్నల్‌ సమస్యలకు పరిష్కారం చూపు తోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియంను సీతంపేట పీఎంఆర్సీలో ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఆదివాసీ జీవన విధానం ప్రతిబింబించే చిత్రాలు, విగ్రహాలను అమర్చుతోంది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది.
జీవనం విభిన్నం.. వైవిధ్యం
లి ఆదివాసీలు అటవీ సంస్కృతికి ప్రతీకలు. ఘన చరితకు వారసులు. వారి ఆధ్యాత్మిక చింతన వినూ త్నం. వారి కట్టూ బొట్టూ చూడనలవిగా ఉంటాయి. తెల్లారితే కొండపోడు తాళాలు వంటి వస్తువులను తయారు చేసి నృత్యాలకు ఉపయోగిస్తారు.
లి ఆదివాసీలు ప్రధానంగా దంపుడు బియ్యం, గంటె, జొన్న, కొర్ర, జీలుగ పిండితో జావ చేసుకుని తాగుతారు. అడవిలో లభించే ఆకు కూరలు, దుంప కూరలను ఆహారంగా వినియోగిస్తారు. బొదండం కూర, చిట్టికూర, గురుంకూర, పుల్లేరుగుడ్లను కూరగా వండి తింటారు.

  • అక్షరాలను ఆరాధ్యదేవతలుగా పూజిస్తారు. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. ప్రతి గురువారం ఆలయాల్లో పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
  • ఆదివాసీ ప్రాంతాల్లో వివాహ ఆచారం వింతగా ఉంటుంది. మైదాన ప్రాంతంలో వరకట్న భూతం వెంటాడుతున్న నేటి రోజుల్లో ఇందుకు భిన్నంగా ఆదివాసీ గ్రామాల్లో వరుడు కుటుంబ సభ్యులు వధువు కుటుంబానికి ఓలి (తిరిగికట్నం) ఖర్చుల నిమిత్తం ఇచ్చే ఆచారం ఉంది.
    ఆదివాసీలు నిరంతర శ్రమ జీవులు.అయినా తీరిక వేళల్లో మాత్రం ఆటపాటలు, ఆనందాలకు ప్రాధాన్యం ఇస్తారు.పండగలన్నీ ప్రకృతి, ఫలసాయాల సేకరణ, గ్రామదేవతలకు సంబంధిం చినవే ఉంటాయి. కందికొత్తలు,ఆగం,టెంక పండగలను డప్పుల వాయి ద్యాలతో గ్రామాల్లోని గిరిజనులంతా ఏకమై నిర్వహి స్తారు.
    అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం
    సాలూరులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం సీతంపేట ఐటీడీఏలోనూ ఆదివాసీపండగకు ఏర్పాట్లు గిరిజనాభివృద్ధికి కృషి నాలుగేళ్లలో గిరిజనుల అభివృ ద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోంది. గిరిజన పండగల నిర్వహణకు అధిక ప్రాధాన్య మిస్తోంది. రాష్ట్రస్థాయి ఆదివాసీ పండగను సాలూరు లో నిర్వహించడం, సీతంపేట ఐటీడీఏలోను ఆదివాసీ పండగను వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉంది.
    విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే
    అర్హులందరికీ సంక్షేమ పథకాలు
    ఐటీడీఏ ద్వారా గిరిజనులకు క్షేత్రస్థాయిలో పకడ్బం దీగా పథకాలు అమలు జరిగే చర్యలు తీసుకుంటు న్నాం.గిరిజనకళల అభివృద్ధిలోభాగంగా సవర పెయింటింగ్‌ కళాకారులకు సీడాప్‌ ద్వారా శిక్షణ ఇప్పించనున్నాం. గిరిజన అటవీఉత్పత్తులకు మార్కె టింగ్‌ సదుపాయం కల్పిస్తాం. గిరిజన యువతకు స్కిల్‌ కళాశాల, స్కిల్స్టాబ్‌ వంటివి ఏర్పాటు చేశాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
  • కల్పనాకుమారి, ఐటీడీఏ పీఓ
    గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు
    రాష్ట్రంలోని గిరిజనులు సరైన గూడు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా గిరిజనులకు అందించ లేదు. రాష్ట్రంలో నిర్మిస్తున్న కొద్దొగొప్పో ఇళ్లు కేంద్రం మాంజూరు చేసినవే.అయితే గత ప్రభుత్వాలు గిరిజ నుల ఇళ్ల కోసం నిర్వహించిన పథకాలు, కార్య క్రమాలన్నీ ఇప్పటి అధికార ప్రభుత్వం నీరుగార్చింది.
    జగన్‌ తాను అండగా ఉంటానంటే నమ్మి గెలిపించిన గిరిజనులు ప్రస్తుతం ఆయనను నమ్మె స్థితిలో లేరు. తమ నియోజకవర్గాల్లో ఆయన పార్టీనే గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేసినట్లే వారినీ ముంచేశారు జగన్‌. తాను మాత్రం ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్‌, గిరిజనులకు గూడు మాత్రం కల్పించలేకపోయారు.
    లక్షల్లో స్థలాలిచ్చాం. ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారని, వారికి సొంతగూడు కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపిం చడం లేదు.సొంతగూడు కల్పించాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా కనీస స్పందన లేదు. రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలోని 52 వేల మంది పీవీటీజీలకు పక్కా గృహమే లేదని కేంద్రం తేల్చింది.రాష్ట్ర ప్రభు త్వం క్షుణ్నంగా సర్వే నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత జగన్‌ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. పైగా గిరిజనులను ఉద్ధరించేసినట్టుడాంబికాలు మాత్రం పలుకుతున్నారు. ‘‘ఆదివాసీ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేక వారు పూరి గుడిసెల్లో,పెంకుటిళ్లలో,రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్నారు. సరైన ఇంటి వసతి లేక రాత్రి పూట నిద్రిస్తున్న సమయాల్లో పాముకాటుకు గురై మర ణించిన ఘటనలున్నాయి.’’`రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు
    శంకుస్థాపన-పూర్తి చేయ కుండానే మధ్యలో నిలిపివేత
    జిల్లాల విభజన వేళ గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేటాయించినట్టు గొప్పలు చెప్పారు.కానీ,నాలుగున్నరేళ్లుగా అక్కడ సొంత ఇల్లు లేని అభాగ్యులకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి.6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 17వేల ఇళ్లు మంజూరు చేసేంత వరకు వారి గోడు వినేవారే లేరు. ఈ పథకం కింద మంజూరైంది కూడా కొంతమందికే. ఇంకా అక్కడ దాదాపుగా 32 వేలమంది సొంతింటి కోసం ఇప్పటికీ ఎదురు చూస్తు న్నారంటే ఆదివాసీలపై జగన్‌కు ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది. ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆదివాసీలు జీవనం సాగిస్తుంటారు.వాటిని గుర్తించిన గత టీడీపీ ప్రభు త్వం సొంతిల్లు కట్టుకునేందుకు వీరికి అదనపు సాయాన్ని మంజూరు చేసింది. అప్పట్లో గ్రామీణ పేదల కోసం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని అమలుచేసి ఇంటి నిర్మాణం కోసం ఎస్టీలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇందులోనూ ఆదివాసీలకు మరింత తోడ్పాటు నిచ్చింది.మైదాన ప్రాంతాల్లో నివ సించే ఎస్టీలకు 2లక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి 2.25లక్షలు, ఆదివాసీలకు 2.5లక్షల సాయాన్ని అందించింది. సాధారణ వర్గా లకు అందే సాయం తో పోలిస్తే లక్ష రూపాయలు అదనంగా ఇచ్చింది.కానీ వైఎస్సార్‌సీపీ హాయంలో రాష్ట్రంలో గ్రామీణుల కోసం గృహనిర్మాణ పథకాన్నే అమలు చేయలేదు. ప్రస్తుతం అమలయ్యే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి ఆదివాసీల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించాలని ప్రభుత్వానికి నివేదించినా జగన్‌ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్నీ కొనసాగించలేదు. ఆపథ కాలనే రద్దుచేసి గిరిజనులకు మొండిచేయి చూపిం చారు. ‘‘గత ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసింది. ఈ ప్రభుత్వం పీఎంకేవీవై కింద ఇస్తున్న నిధులకు, వైఎస్సార్సీపీ కొంత మొత్తం కలిపి ఇస్తోంది. అది ఏ మూలనా సరిపోవడం లేదు.’’ -దీసారి గంగరాజు, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గత టీడీపీ హయంలో చాలా ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మధ్యలో ఆగిన ఇళ్లకు బిల్లుల చెల్లించలేని స్థితిలో ఉంది.’’-దొన్నుదొర,

జీవన విధానం మారితేనే మనుగడ..!

పరుగుతున్న జనాభా..అందుకు తగ్గట్టుగా రెట్టింపవుతున్న అవసరాలకు మొదట ప్రభావితమవుతున్నవి అడవులే. చెట్లను నరికి వ్యవసాయ భూములు,నివాస స్థలాలుగా మారుస్తున్నారు.ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అది పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది.చివరకు వర్షాభావ పరిస్థితులు,అధిక ఉష్ణోగ్రతలు,అతివృష్టి వంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయి. భూభాగంలో 33శాతం అటవీ విస్తీర్ణం ఉం డాల్సి ఉండగా..ఉభయ జిల్లాల్లో 22శాతం నమోదు కావడం ఆందోళనకడు ప్రభుత్వం తీసుకున్న హరితహారంతో కాస్త పచ్చదనం పెరిగింది.ప్రాణాధారమైన జలాన్ని సమర్థంగా వినియోగించు కోవడంలో మనిషి విఫలమవుతున్నాడు. ప్రధానంగా జలవనరుల ఆక్రమణతో నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేయడం,నీటి ప్రవాహ మార్గాలైన కాలువలను మూసి వేయడం వంటి చర్యలతో వాటి ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నాడు. దీనికితోడు కలుషితం చేస్తున్నాడు. విష రసాయనాలు మిళితమైన పారిశ్రామిక, నివాసాల మురుగును కాలువల్లోకి వదులుతున్నారు.అవి నదులద్వారా సముద్రంలోకి చేరు తున్నాయి వ్యర్థ జలాలను శాస్త్రీయ పద్ధతిలో పునశుద్ధి చేసి జలవనరుల్లోకి వదిలితే మేలు.చర్యలతో పీల్చేగాలి నాణ్యత దెబ్బతింది.వాహనాలు,విద్యుత్తు అతి వినియోగం వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి.వ్యవసాయంలో ఉప యోగించే రసాయనిక ఎరువులు ప్రమాదకరంగా మారాయి. సాధ్యమైనంత వరకు తగ్గించడమే మనం ప్రకృతికి మేలు చేసే చర్యలు. ఎన్ని చట్టాలు రూపాంతరం చెందినా నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగం తగ్గడం లేదు.వాటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు.ఈవ్యర్థాలను కాల్చడం వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది.భూమి పొరల్లోకి ప్లాస్టిక్‌ చేరి వాన నీరు ఇంకకుండా నిలువరిస్తోంది.జల వనరుల్లోకి చేరి జలచరాల హననానికి కారణమవుతోంది. నదులు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతోంది. ప్లాస్టిక్ను సాధ్యమైనంత వరకు దైనందిన జీవితం నుంచి నిషేధించాలి.
జీవ వైవిధ్యం..జాతుల కవచం
మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు.ప్రకృతిని కాపాడ డంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.మనిషి విచక్షణారాహిత్యం వల్ల రోజురోజుకూ జీవవైవిధ్యం దెబ్బ తింటోంది.ప్రకృతి విధ్వంసకర పనులవల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది.నానాటికి కాలుష్యం పెరిగిపోవడం,విస్తరించాల్సిన జీవజా తుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదం లోకి నెట్టేస్తున్నాయి.ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే మాన వాళికి భారీమూల్యం తప్పదని హెచ్చరిస్తు న్నాయి ప్రపంచ పర్యావరణ,జీవవైవిధ్య సదస్సుల నివేదికలు.
జీవవైవిధ్యం.. ఆవశ్యకత
అవనిపై జీవించే సకల జీవరాశిని కలిపి జీవవైవిధ్యం అంటున్నారు. సరళంగా చెప్పాలంటే వివిధ రకాల జీవజాతుల సముదాయాన్నే జీవ వైవిధ్యం అంటాం. సూక్ష్మరూపంలోని తొలిజీవి ప్లాజిల్ల్లెటా అనే ఏక కణజీవి ప్రీ బయాటిక్‌ సూప్‌ అనే సముద్ర అడుగు నీటిలో పుట్టిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తొలుత వృక్షాలు,జంతుజాలం అవతరించాయి.క్రమక్ర మంగా ఉభయ చరాలు,పక్షులు పుట్టుకొచ్చాయి. ప్రస్తు తం నేలమీద ఎన్నో రకాల వృక్షాలు, పండ్లు, జంతు జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం. కుందేళ్లు, గేదేలు,జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈ జంతువులను మాంసాహారులైన సింహం, పులి, చిరుతపులులు ఆరగిస్తాయి.గొల్లభామలు గడ్డిని తింటే వాటిని కప్పలు భక్షిస్తాయి. ఈ చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయి. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనుహ్యంగా పెరిగిపోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. మానవుడు తన మనుగడ కోసంచుట్టూ ఉన్న పరిసరాలపై ఆధారపడి జీవిస్తాడు. ఆహారం,గాలి,నీరురక్షణ,ఆశ్రయం నిత్యావసర వస్తువు లు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఒకజీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయి.
జీవవైవిధ్యానికి ఏం చేయాలంటే ..
అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత కావాలి. ఇంటి వద్ద ముగ్గులు పిండితో వేయాలి. అప్పుడే పక్షు లు కీటకాలకు ఆహారంగా లభిస్తుంది.భవిష్యత్‌ తరాల కోసం చెట్లు, జలవనరులను పెంపొందించుకోవాలి. రసాయనాలకు బదులు సహజ ఎరువులు వాడాలి. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి భూగర్భ జలాల పెంపు నకు కృషి చేయాలి.ప్రతి ఒక్కరూ జీవవైవిధ్యం పెంపు నకు కృషి చేయాలి.పర్యావరణానికి మొక్కలు పెంచాలి2050 సంవత్సరం వరకు దేశ జనాభా 200కోట్లకు పెరిగే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణకు,జనాభా హితంకోసం మొక్కలను విరివిరి గా పెంచాలి. లేకుంటే మనిషి సృష్టిస్తున్న విపత్తు వల్ల జీవవైవిధ్యం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. 1972 నుంచి ఇప్పటివరకు 61 శాతం వన్యప్రాణులు అంతరించినట్లు వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఆఫ్‌ నేచర్‌ రిపోర్టు చెబుతుంది. దీంతో మనుగడ సాగించాల్సిన జీవజా తులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటిమీద ఆధారపడే జీవులూ నశిస్తు న్నాయి.రాష్ట్రంలో జీవ వైవిధ్యానికి కేంద్రం లాంటిది. అనేక రకాల జంతు,పక్షి జాతులకు నెలవు.తెలం గాణ వ్యాప్తంగా 280రకాల మొక్కలజాతులు ఉన్నా యి. అందులో 1800రకాల జాతుల మొక్కలు ఔషద మొక్కలే. 900రకాల ఔషధ మొక్కలు హైదరాబాద్‌ కేంద్రంగా అందుబాటులో ఉన్నాయి. 108 జాతుల క్షీరదాలు,486 పక్షిజాతులు తెలంగాణలో మనుగడలో ఉన్నాయి. తెలంగాణ బయోడైవర్సిటీ రిపోర్టు ప్రకారం మన రాష్ట్రంలో అంతరించిపోయే దశలో ఉన్న వాటిలో అడవి కుక్క,ఉడుత,చిరుతపులి,హైనా, మౌస్‌డీర్‌, రాబందు,బాతు,హంస,మొసలి, మరిన్ని చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడా నికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా,మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా పరిధిలోనే జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్‌ సైట్లను ఏర్పాటు చేయ డానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగం గానే కూకట్‌పల్లి శివారులోని అమీన్‌పూర్‌ లేక్‌ను అభివృద్ధి చేసింది. 2016 నుంచి ఈ చెరువును వలస పక్షుల కోసం చుట్టు పక్కల జీవ వైవిధ్యాన్ని సంరక్షిం చడం కోసం ఉపయోగించుకుంటుంది. 93 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పరిధిలో కొన్ని వందల స్థానిక పక్షులతోపాటు వలస పక్షులు ఆశ్రయం పొందుతు న్నాయి.ఇక ప్రభుత్వం మనుగడలో ఉన్న జీవులు, చెట్లను గుర్తించి రాష్ట్ర ఐకాన్‌లుగా ప్రకటించింది. అందులో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు,రాష్ట్ర పువ్వుగా తంగేడు ఉన్నాయి.-(గునపర్తి సైమన్‌)

శ్రమ జీవులు గిరిజన మహిళలు

8మార్చి 2025న,‘‘అందరికీ మహిళలు మరియు బాలికల కోసం: హక్కులు అనే థీమ్‌తో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మాతో చేరండి. సమానత్వం. సాధికారత.’’ఈ సంవత్సరం థీమ్‌ అందరికీ సమాన హక్కులు, అధికారం మరియు అవకాశాలను అన్‌లాక్‌ చేయగల చర్యను మరియు స్త్రీవాద భవిష్యత్తును ఎవరూ వదలని చోటికి పిలుస్తుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల సామాజిక,ఆర్థిక,సాంస్కృతిక రాజకీయ విజయాలను జరుపుకునే ప్రపంచ దినోత్సవం.లింగ సమానత్వాన్ని వేగవంతం చేయడానికి చర్యకు పిలుపుని కూడా సూచి స్తుంది. మహిళల విజయాలను జరుపుకోవ డానికి లేదా మహిళల సమానత్వం కోసం ర్యాలీ చేయడానికి సమూహాలు కలిసి రావడం తో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన కార్యాచరణ కనిపిస్తుంది.ఏటా మార్చి 8న గుర్తు పెట్టబడు తుంది, ప్రపంచ మహిళా ఆర్థిక సాధికారతను కల్పిం చడం,మహిళా ప్రతిభను నియమిం చడం, నిలుపుకోవడం మరియు అభివృద్ధి చేయడం. మహిళలు,బాలికలను నాయకత్వం, నిర్ణయం తీసుకోవడం,వ్యాపారంలోకి మద్దతు ఇవ్వడం, మహిళలు,బాలికల అవసరాలకు అనుగు ణంగా మౌలిక సదుపాయాల రూప కల్పన, నిర్మాణం మహిళలు,బాలికలు వారి ఆరోగ్యం గురించి సమాచారం తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో సహాయప డటం. స్థిరమైన వ్యవసాయం ఆహార భద్రతలో మహిళలు,బాలికలను చేర్చడం. మహిళలు మరియు బాలికలకు నాణ్యమైన విద్య,శిక్షణను అందించడం.క్రీడలో మహిళలు మరియు బాలికల భాగస్వా మ్యాన్ని మరియు విజయాన్ని పెంచడం. మహిళలు,బాలికల సృజనాత్మక,కళాత్మక ప్రతిభను ప్రోత్సహిం చడం.మహిళలు, బాలికల అభ్యు న్నతికి తోడ్పడే మరిన్ని రంగాలలో ప్రసంగిస్తారు.
సమానత్వం ఎక్కడుంది!..
ఆకాశంలో,అవకాశంలో సగం అన్నది నినాదంగా మిగిలాల్సిందేనా?ఇది చేవికి ఇంపు కలిగించ డమే తప్ప..నేత్రానందం ప్రసాదించే అవకా శమే లేదా?జనాబా లెక్కల ప్రకారం, పురుషు లతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువన్నది ప్రపంచ స్థితి.స్త్రీలు ప్రవేశించని రంగం లేదని, నిపుణత కనబరచని పని.లేదని పదేపదే చెప్పడం సరే.వారు నిలబడగలిగేలా చేస్తున్న మా,ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చూస్తు న్నామా?అన్నదే మన దేశంలో నాటికీ నేటికీ ప్రశ్న.స్త్రీలంటే అప్పటికే ఇప్పటికీ చిన్నచూపే. విధి నిర్వహణ ప్రదేశాల్లో రక్షణ అంతంత మాత్రమే.శ్రమకు సరిపడా ప్రతిఫలం లభిస్తోందా అన్నది ఈనాటికీ సందేహాస్ప దమే.కాకుంటే..గతంలో కంటే వర్తమానంలో ప్రశ్నించే తత్వం పెరిగింది. నిలదీసి,నిగ్గదీసి నిలువునా కడిగి పారేసే ధీరత అలవాటుగా మారింది. ఆడవారిని కించపరిచే దుష్టశక్తుల పనిపట్టే తెగువా విస్తృతమవుతుంది. వీటన్నింటితో పాటు స్త్రీలపట్ల ఆలోచనా ధోరణిని ఇంకా మార్పుకావాల్సిన అగత్యమైతే ఇతర సమా జానికి చాలా ఉంది. ఆచరిస్తే సరి..!
సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. మహిళలూ మీకు జోహార్లు అంటూ ఏటేటా కవితలల్లే వారికీ కొదవ లేదు.ఆకాశం, అవకాశం వివాదాల జోరు సరేసరి.టన్నుల కొద్దీ పదజ్ఞానం కన్నా,ఎంతో కొంతైనా ఆచరించి చూపడం మిన్న.అది సాకార మైనప్పుడే ఆడపిల్ల పెదవి మీద దరహాసం మెరుస్తుంది.అంతేకానీ,ఇంటా బయటా.. మాటలు చేతలూ ఆమె కన్నీటికి కారణ మైతే,జాతికి నిష్కృతి ఉండదు.ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం దాకా ఇంతే!.
వరకట్న నిషేధ చట్టం-1961
భర్త, అతని తల్లిదండ్రులు, అడపడుచులు, అత్తింటి తరపున ఇతర బంధువులు ఎవరైనా వరకట్నం కోసం వేధిస్తే ఐదేండ్లకు పైగా జైలు,రూ.15 వేలకు తక్కువ కాకుండా జరి మానా విధిస్తారు.ఈ చట్టం ప్రకారం కట్నం ఇవ్వడం,తీసుకోవడం రెండు నేరమే. వరకట్న వేధింపులకు సంబంధించి మహిళలు నేరుగా సంబంధింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులపై మొదటి శ్రేణి జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచారణ జరిపి శిక్షలు ఖరారు చేస్తుంది.
ర్యాంగింగ్‌ నిరోధక చట్టం-1997
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం 1997లో ర్యాగింగ్‌ నిరోధక చట్టం నంబర్‌ 28ను తెచ్చింది. ఇందుకోసం జాతీయ స్థాయిలో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. 1800 18022 18055 నంబర్లకు విద్యార్థినులు ఫోన్‌చేసి సమస్యలను చెప్పవచ్చు. ర్యాగింగ్‌ వ్యవస్థ నిర్మూలనకు కళాశాలల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ర్యాగిం గ్‌కు పాల్పడినట్లు రుజువైతే ఆరు నెలల నుంచి పదేండ్ల వరకు జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటారు.
మహిళకు స్వేచ్ఛ కొంతే!
అందరూ ఒప్పుకోదగిన పరిణామం నాటికి, నేటికి స్త్రిల పరిస్థితులు మారాయి. నాలుగు గోడలమధ్య వంటిల్లే స్వర్గంలా భావించే మహిళలు ఇప్పుడు జన జీవన స్రవంతిలో ఒక విశిష్టమైన శక్తిలా కలిసిపోయి అంచెలంచెలుగా ఎదుగుతు న్నారు.ముఖ్యంగా అభినందించవలసిన విషయం- విద్యారంగం లో పాఠశాల మొదలు కళాశాల వరకు బాలికలదే అగ్రస్థానం.చదువులకోసం తాత్కాలిక ఉద్యోగాలు (మెహంది,అల్లికలు,శుభ కార్యాలలో పిండివంటలు తయారీ దార్లుగాను, హస్తకళలు, వాహనాలు నడిపే డ్రైవర్లుగాను) ఇలా ఎన్నో మరెన్నో పనులు చేసుకుంటూ తమ కాళ్ళమీద తాము నిలబడుతూ ఉన్నత వ్యక్తిత్వంతో ప్రయో జకులైన మహిళలు నేటి భారతీయ సమాజంలో నిత్య ప్రకాశ దీపాలుగా చెమటను ఆజ్యంలా పోస్తూ దశదిశలా అఖండమైన కాంతులతో వెలిగిపోతున్నారు. ఆనందించవలసిన విషయం ఏమిటి అంటే వృత్తి విద్యాకోర్సులు, ఉద్యోగాలలో రాజకీయాలలో స్త్రిలకూ ప్రాముఖ్యం లభించడం. స్త్రిలు సమంగా నేర్పుగా అంకిత భావంతో గొప్పగా పనిచేయటం, వారు రాణించి నంత గొప్పగా పురుషులు రాణించలేకపోవడం ఆశ్చర్యం కాకపోతే మరేమిటి?
ఇలా పలు విధాలుగా వైద్య,విద్యా,విజ్ఞాన, రాజకీయ,క్రీడా,రక్షణ రంగాలలో ఎక్కడ చూసినా,ఏ నోటవిన్నా పదును పెట్టిన ఆయు ధంలా మహిళా శక్తి, యావత్‌ ప్రపంచం స్తంభించిపోయేలా ఉప్పెనలా పొంగి పొరలి నింగిని తాకుతున్న కెరటాలవలే ఎగసిన మహిళా స్ఫూర్తికి, ఎవరూ సాటిలేరు, పోటీ పడరు అనే విధం రాకెట్టులా ఆకాశంలో దూసుకుపోతున్న మహిళా చైతన్యం అందరూ హర్షించదగిన విషయం. ఈ ప్రపంచంలో మహిళలు రచయిత్రులుగా,కవయిత్రులుగా ఉపన్యాస కులుగా,ఉద్యమ కారిణులుగా ఉపాధ్యాయిని లుగా,గృహిణులుగా ఉన్నత ఉద్యోగస్తులుగా, మంత్రులుగా,శాసనస భ్యులుగా,న్యాయ మూర్తులుగా, న్యాయవాదు లుగా,ప్రాణాలను రక్షించే వైద్యులుగా,స్వచ్ఛంద సంస్థల అత్యున్నత అధికార సభలకు అధ్యక్షులుగా,ఆయా రంగాలలో వారు చేపట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎందరో మహిళలు ఆకాశంలో వెలిగే స్వయం ప్రకాశక నక్షత్రాలుగా వెలుగొం దుతున్నారు.
ఇకపోతే కొన్ని గమనించవలసిన ముఖ్య విషయాలు ఏమిటి అంటే- ఇన్ని రకాలుగా అన్ని విధాలుగా ఇంత గొప్పగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించబడుతున్న ‘మహిళ పాత్ర’ సమాజంలో మమేకమవుతున్న ‘స్త్రి అభ్యుదయం’ ఇంకా మొదట్లోనే వుంది. మొక్కగానే వుంది. ఎక్కడో ఒకచోట దాని కూకటి వేరు కత్తిరించబడుతూనే వుంది. బాలికగా విద్యార్థినిగా, గృహిణిగా.. ఉద్యో గి నిగా, మంత్రిగా ఇలా ఎన్నో విధాలుగా రూపొంతరాలు చెంది సమాజంలో భాగంగా మారినా స్త్రి యొక్క స్వయం నిర్ణయం ఇంకా పురుషుల చేతులలోనే వున్నది. స్త్రి పురుషులు ఇద్దరూ పరస్పర అవగాహనతో కలిసి నడవా ల్సిందే. కాని నియంతృత్వ ధోరణితో కట్టిపడే యటమే మహిళా స్వేచ్ఛకు ఇబ్బందిగా అభ్యం తరకరంగా ఉంది కాని అదే జరుగుతుంది కదా. కొన్ని చోట్ల అడుగడుగునా ఆటంకాలు. అలుపెరుగని మహిళా పోరాటాలు, మహిళల ఆత్మాభిమాన అణచివేతలు..ఆత్మవిశ్వాసానికి అవరోధం..ఇవన్నీ..కలిసి మహిళలను ఉప్పెనలా చుట్టుకుంటున్నాయి. తర తరాలనుండి వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కట్టు బాట్లు నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ వ్యవస్థ కాలక్రమేణా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో మార్పులు జరగాలి. భార్య అంటే గృహిణిగా సేవలందించడమే కాకుండా ఉద్యోగినిగా ఆర్థిక సేవలందిస్తూ, మాతృత్వంతో సంసారాన్ని పెంచే త్రిపాత్రధారిణిగా ఉప యోగపడే యంత్రంలా ఉందనుకుంటారు. కొందరి పురుషుల ఆలోచనలు కాని అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా స్త్రిలు శ్రమిస్తూనే వున్నారు. ఎలా అంటే నిరంతర నిత్య ప్రవాహంలా మహానదులై సముద్రాలై చరిత్రపుటంలో మహిళలు సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నారు. గృహ హింస, విడాకుల చట్టం- ఇలా ఇంకా ఎన్నో చట్టాలు స్త్రిలకి రక్షణ కవచాలుగా ఉన్నప్పటికి సగటు స్త్రి జీవితంలో రక్షణ కరువైందన్న కఠినమైన వాస్తవాన్ని అందరూ అంగీకరించ వలసిందే.వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రిలపైన జరిగే అత్యాచారాలను అరికట్టే వౌలికమైన మార్పు పురుషులలో రావాలి.ఈ మార్పు ముఖ్యంగా ప్రతి ఇంటినుండి మొదలవ్వాలి. చట్టసబలో మహిళ లంతా ఏకతాటిపైకొచ్చినప్పటికీ మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికే ఎన్నెన్ని అవస్థలు పడ్డారో, ఎన్నెన్ని ఆటంకాలు ఎదుర్కొన్నారో యావత్‌ భారతావనికి తెలిసిన విషయమే. స్త్రిల యెడల ఇలాంటి పక్షపాత ధోరణి విడనాడాలి. మహిళా సాధికారత కార్యరూపం దాల్చాలి. మాటల రూపంలోనే మిగిలిపోకూడదు.
ఏది ఏమైనా సగటు స్త్రి జీవితంలో సంపూ ర్ణమైన, సమూలమైన మార్పు రావాలి. అత్యాచార కేసుల్లో దోషిని కఠినంగా శిక్షించాలి. ప్రతి మహిళా ఆత్మవిశ్వాసంతో బ్రతుకగలగాలి. నిర్భయంగా నిర్ణయాధి కారాలు చేపట్టగలగాలి. అటువంటి సమ సమాజంలో అద్భుత ప్రపంచాన్ని ఆవిష్క రించాలి.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

మేమేమీ చేశాము పాపం?మాకెందుకీ శాపం?

విశాఖ ఉమ్మడి జిల్లాలో గల నాన్‌షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను పాడేరు ఐటీడీఏ పరిధిలో విలీనం చేస్తాం…అధికారం చేపట్టిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. నన్ము నమ్మండి…మీకు పూర్తి హామీ ఇస్తున్నా..2018లోవైసీపీనేత హోదాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వద్ద మైదాన ప్రాంత గిరిజనులకు జగన్‌ ఇచ్చిన హామీ నీటిమూటగా మారింది.ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభు త్వం గిరిజనులు నివసిస్తున్న నాన్‌షెడ్యూల్‌ ఏరియా లను షెడ్యూలు ఏరియాలుగా గుర్తించాలని ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు పంప లేదు.జిల్లాల విభజన చేసినప్పటికీ నాన్‌ షెడ్యూల్‌ ఏరియా గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయలేదు.కనీసం పాడేరు ఐటీడీఏలో కూడా విలీనం చేయలేదు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల పాడేరు,అరకులోయ అసెంబ్లీ నియోజక వర్గా లకు ఆనుకుని మైదానప్రాంత మండలాల్లో (నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియా) గలగ్రామాల్లోని గిరిజనుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.అటు ఐటీడీఏ పరిధి లో చేర్చక,ఇటు మైదానప్రాంత అధికారులు పట్టించు కోక పోవడంతో రెంటికీ చెడ్డరేవడిలా తయారైంది. విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్‌, రహదారులు,పక్కా ఇళ్లు వంటి మౌలిక సదుపాయాలు కొరవడి, సమస్య లతో సతమతం అవుతున్నారు. కొద్దోగొప్పో చదువు కున్నా…ఐటీడీఏ పరిధిలో ఉద్యోగాలకు అర్హులు కారు.మైదాన ప్రాంతంలోని ఇతర గిరిజనులతో పోటీ పడే పరిస్థితి లేదు. తమ గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చి, ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాలని సుమారు 300గ్రామాల గిరిజనులు దశాబ్దాలుగా ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నారు. మన్యానికి ఆనుకుని మైదాన ప్రాంతంలో వున్న గిరిజనుల గోడు నాధుడు కరవ య్యారు.
ఏజెన్సీలో అత్యంత వెనుకబడిన గిరిజనులు, ఆది వాసీల హక్కులను కాపాడడానికి, భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి, ఇతరుల నుంచి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు ఐదు దశాబ్దాల క్రితం ఆయా ప్రాంతాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌లో చేరుస్తూ పార్లమెంటులో చట్టం చేసింది.దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 1/70చట్టం అమల్లోకి వచ్చింది. కానీ మైదాన ప్రాంతానికి ఆనుకుని వున్న సుమారు 300 గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చలేదు.
కొరవడిన మౌలిక సదుపాయాలు
అనకాపల్లి జిల్లాలో కోటవురట్ల, నాతవరం, గొలుగొండ,రోలుగుంట,రావికమతం,చీడికాడ,వి. మాడుగుల,దేవరాపల్లి మండలాల్లో 37గ్రామ పంచాయతీల్లోని సుమారు 300 గ్రామాల్లో గిరిజనుల జనాభా అధికంగా ఉంది.అధికారుల అంచనా మేర కు ఈ పంచాయతీల్లో వాల్మీకి,భగత,కొండదొర, గదబ,నూకదొర,కొండకమ్మరి,కోందు,మన్నెదొర తెగలకు చెందిన గిరిజనులు లక్ష మందికిపైగా ఉన్నారు. పోడు వ్యవసాయం, జీవాలు, పశువుల పెంపకమే వీరికి జీవనాధారం. 5వ షెడ్యూల్‌లో వున్న ఏజెన్సీ ప్రాంతంతో పోలిస్తే ఈ గ్రామాలు మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత విషయాల్లో బాగా వెనుకబడ్డాయి. గిరిజన సబ్‌ప్లాన్‌ నిధులు కూడా మంజూరు చేయకపోవడంతో తాగునీరు, రహదారులు, విద్యుత్‌, పాఠశాలలు వంటి కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ఈ గ్రామాల్లో ఎక్కడా ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేదు. ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నప్పటికీ ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండరు. నెలకు ఒకటి, రెండుసార్లు చుట్టంచూపుగా వచ్చి వెళుతుంటారు. తీవ్ర అస్వస్థతకు గురైనా, గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినా…డోలీలో మోసుకుంటూ వాహనాలు నడిచే ప్రాంతం వరకు తీసుకురావాలి. తాగునీటికి ఊటగెడ్డలు, చలమలే ఆధారం. దీంతో కలుషిత నీటి వల్ల వ్యాధులు, జ్వరాలు, అతిసార బారిన పడుతున్నారు. సాగునీటి సదుపాయం లేదు. చేద్దామన్నా కూలి పనులు ఉండవు. ఒక్క ఉన్నత పాఠశాల కూడా లేదు. ఉదాహరణకు రావికమతం మండలం చీమలపాడు పంచాయతీలో చలిశింగం, రొచ్చుపణుకు, కడగడ్డ గ్రామాలకు చెందిన గిరిజన బాలబాలికలు హైస్కూల్‌ విద్య కోసం 14 కి.మీ. దూరంలో వున్న ఎంకేపట్నం ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాలు సైతం దక్కడం లేదు. నిబంధనల ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలకు మైదాన ప్రాంత గిరిజనులు అనర్హులని అధికారులు అంటున్నారు. కనీస సదుపాయాలకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. మండల కార్యాలయాల వద్ద తరచూ ఆందోళనలు నిర్వహిస్తూ అధికారులు వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు.
గిరిజన సలహా మండలిలో తీర్మానం
రాష్ట్రంలో మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేయాలని 2020 జూలైలో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పాముల పుష్పవాణి నేతృత్వంలో గిరిజన సలహా మండలి (టీఏసీ) తీర్మానం చేసింది. ఈ మేరకు నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలోని గ్రామాల్లో సభలు నిర్వహించి 50 శాతానికిపైగా గిరిజనులు నివసిస్తున్న గ్రామాల జాబితాలను తయారుచేశారు. ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో 200 గ్రామాలను ఏజెన్సీలో విలీనం చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అయితే అధికారులు చెప్పిన వాటికంటే ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయని, వాటిని కూడా ఏజెన్సీలో విలీనం చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గ్రామసభలు నిర్వహించి 22 నెలలు అయినా ఇప్పటివరకు ఎటువంటి కదలిక లేదు.
కేంద్రానికి చేరని ప్రతిపాదనలు
మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను షెడ్యూల్‌ ఏరి యాలో (ఐటీడీఏ పరిధిలోకి) చేర్చేందుకు గల అడ్డం కులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. గిరిజనులు నివసిస్తున్న నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలను షెడ్యూలు ఏరియాలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపా దనలు పంపలేదని ఈ ఏడాది ఫిబ్రవరి పదో తేదీన పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రకటించారు. కనీసం జిల్లాల పునర్విభజన,కొత్తజిల్లాల ఏర్పాటు సమ యంలో అయినా తమను షెడ్యూల్‌ ఏరియాలో విలీనం చేస్తారన్న ఆశలు సైతం ఆవిరయ్యాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఒత్తిళ్లే కారణమా?
మైదాన ప్రాంతానికి ఆనుకుని వున్న గిరిజన గ్రామా లను ఏజెన్సీలో విలీనం కాకుండా మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు గిరిజన సంఘం నాయకులు ఆరోపిస్తు న్నారు.నాతవరం,గొలుగొండ,రోలుగుంట, రావిక మతం,వి.మాడుగులమండలాల పరిధిలో పెద్ద మొత్తం లో లేటరైట్‌, గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మైనింగ్‌ లైసెన్సులు ఎవరైనా పొంద వచ్చు. అదే ఏజెన్సీ ఏరియాలో విలీనం చేస్తే గిరిజనే తరులకు అవకాశం లభించదు. మరోవైపు మైదాన ప్రాంతంలోని మండలాలను గత ఏడాది వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)లో చేర్చారు. ఈనేపథ్యంలో ఏజెన్సీని ఆను కుని వున్న మండలాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు.ఈ మండ లాల్లోని గిరిజన గ్రామాలను ఏజెన్సీ ప్రాంతంలో విలీనం చేస్తే గిరిజనేతరులు భూముల క్రయవిక్ర యాలకు అనర్హులవుతారు.ఈకారణాల వల్లనే మైదాన ప్రాంత గిరిజన గ్రామాలు ఏజెన్సీలో విలీనం కాకుం డా మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అడ్డుపడు తున్నారని గిరిజన సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.-గునపిర్తి సైమన్‌

గిరిజనం..ఒడుదొడుకుల జీవనం

కొండకోనల్లో ప్రకృతి ఒడిలో జీవనం సాగించే గిరిజనుల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. జీవవైవిధ్య పరిరక్షణలో వారు కీలకంగా నిలుస్తారు. ప్రపంచీకరణ, పర్యావరణ మార్పుల వల్ల ఆదివాసుల జీవితాలు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మౌలిక వసతులు కరవై తీవ్ర వెనకబాటులో వారు కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో యాభై కోట్ల మంది దాకా ఆదివాసులు ఉన్నారు. ప్రపంచ జనాభాలో వారు కేవలం అయిదు శాతం లోపే. కానీ, ఏడు వేల దాకా భాషలు వారు మాట్లాడతారు. అయిదు వేల విభిన్న సంస్కృతులను ఆచరిస్తున్నారు. వారి జీవన విధానం పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలన, కాలుష్యం తదితరాలు ఆదివాసుల జీవితాలను పోనుపోను సంక్లిష్టంగా మారుస్తున్నాయి. ప్రపంచీకరణ ప్రభావం వారి సంస్కృతిని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో ఆదివాసుల
సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఏటా అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అనాదిగా ఆదివాసులు తమ హక్కులకు దూరమై సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివాసీ యువత తమ అస్తిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని, తమ పూర్వీకుల భూములపై హక్కులను గుర్తించాలని డిమాండు చేస్తోంది.ఇన్నాళ్లూ తమకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతూ తమ ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం నినదిస్తోంది. ఈ క్రమంలో స్వీయ నిర్ణయాధికారం కోసం మార్పు ప్రతినిధులుగా ఆదివాసీ యువత అనే నినాదంతో ఈ ఏడాది ఐరాస పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
హక్కులకు దూరం
భూగోళంపై దాదాపు 20శాతం భూభాగంలో ఆదివాసులు నివసిస్తున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా 80శాతం జీవవైవిధ్యం, 40శాతం రక్షిత అటవీ ప్రాంతాలు, పర్యావరణం, సహజ వనరుల పరంగా కీలక ప్రదేశాలు వారు నివసించే చోటే ఉన్నాయి. పుడమి, జీవ వైవిధ్య పరిరక్షణలో ఆదివాసుల పాత్ర కీలకమైంది.
ఆదివాసుల హక్కులకు రక్షణ కావాలి
ఆదివాసుల జీవన విధానం పర్యావరణం,అడవులు,అక్కడ ఉండే సహజ వనరులు మొదలైన వాటితో ముడిపడి ఉంది.కానీ నవీన సమాజం వారి హక్కుల నుండి దూరం చేసే సంక్షోభం నుంచి వీరిని రక్షించాల్సిన అనివార్యత ఎంతైనా ఉంది.కానీ ఆదిమజనుల హక్కులు,వాటి రక్షణే ధ్యేయంగా,ఆదివాసీల హక్కుల రక్షణకు,వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఐక్యరాజ్య సమితి స్థానిక ప్రజలపై కొనసాగుతున్న హింస,దుర్వినియోగం మీద 2006 జూన్‌ 29న ప్రపంచ మానవ హక్కుల కౌన్సిల్‌ ఆదివాసీ హక్కుల రక్షణకై ఒక తీర్మాణం జరగాలని సూచించింది.అప్పుడు మానవ హక్కుల కౌన్సిల్‌,యూఎన్‌ఓలు కలసి ఆదివాసీల హక్కుల రక్షణకు తీర్మానించాయి.ఈ తీర్మాణం ప్రకారం జనరల్‌ అసెంబ్లీ 2007 సదస్సులో ప్రతి ఏటా సెప్టెంబర్‌ 13తేదీన ప్రపంచ ఆదివాసీ హక్కుల దినంగా జరుపుకోవాలని ప్రకటించింది.దీనిని వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశంలో చర్చించి ఆదివాసుల హక్కులు,భాషలు,సంస్కృతి, సాంప్రదాయాలు,ఆదివాసీలు వివక్ష నుండి స్వతంత్రత పొంది శాశ్వతంగా స్వేచ్ఛ పొందడానికి అమలు చేయాల్సిన ముఖ్య అంశాలను వెల్లడిరచింది. ప్రపంచంలోని ఆదివాసీలను విశ్వమానవులుగా గుర్తించనప్పుడు,వారికున్న ప్రత్యేక హక్కులను రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ఈ హక్కుల దినోత్సవం గుర్తించింది.
భూతాపం ప్రభావాన్ని తొలుత ఎదుర్కొంటోంది ఆదివాసులే. పర్యావరణ మార్పుల వల్ల వరదలు, తుపానులు ఆదివాసుల భూములు, ఆవాసాలను దెబ్బతీస్తున్నాయి. కరవులు, ఎడారీకరణ వల్లఅడవులు క్షీణిస్తున్నాయి. కార్చిచ్చులు పచ్చదనాన్ని హరిస్తున్నాయి. ఆదివాసుల ప్రాంతాల్లో ఆయా అభివద్ధి ప్రాజెక్టులతో పాటు మైనింగ్‌ కార్యకలాపాలూ పెద్దయెత్తున సాగుతున్నాయి. దానివల్ల తరాలుగా జీవనం సాగిస్తున్న మాతృభూమికి వారు దూరం కావాల్సి వస్తోంది. ఇండియాలో 10.47 కోట్ల ఆదివాసీ జనాభా ఉంటుందని అంచనా. భారత్లో 90శాతం ఆదివాసులు అటవీ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారు. సాగు, వేట, అటవీ ఉత్పత్తులు వారి జీవనాధారం. ఇండియాలో 705 ఆదివాసీ సమూహాలను అధికారికంగా షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తించారు. దేశీయంగా గిరిజన గ్రామాలను రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్లో చేర్చారు. ఆంధ్రప్రదేశ్‌ లాంటి చోట్ల పెద్దసంఖ్యలో ఆదివాసులు ఉన్న వందల గ్రామాలను అయిదో షెడ్యూల్లో చేర్చకపోవడం వల్ల అసలైన గిరిజనులకు రాజ్యాంగ పరమైన హక్కులు దక్కడంలేదు. నిరక్షరాస్యత, పేదరికం, మౌలిక వసతుల కొరతతో సతమతం అవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఒకటో తరగతిలో నమోదైన పిల్లల్లో 40శాతమే పదో తరగతి దాకావస్తున్నట్లు ఆదివాసుల అభివృద్ధి నివేదిక నిరుడు వెల్లడిర చింది. దేశీయంగా 46శాతం ఆదివాసులు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని గతంలోనే పలు అధ్యయనాలు తెలియజెప్పాయి. సరైన వైద్య వసతుల లేమి కారణంగా ఆదివాసీ ప్రాంతాల్లో నవజాత శిశువుల మరణాలు జాతీయ సగటుతో పోలిస్తే 63శాతం అధికంగా ఉన్నట్లు అధికారిక నివేదికలే తేటతెల్లం చేస్తున్నాయి.
సంక్షేమ చర్యలు
అత్యంత వెనకబడిన ఆదివాసీ తెగలవారు (పీవీటీజీలు) దేశీయంగా 26 లక్షలకు పైగా ఉన్నారు. వీరు కనీస వసతులకు నోచుకోక అత్యంత దుర్భరంగా జీవనం సాగిస్తున్నారు. ఆదివాసుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పలు చట్టాలు చేస్తున్నా, పథకాలు ప్రారంభిస్తున్నా క్షేత్రస్థాయిలో సరైన ఫలితాలు ఉండటం లేదు. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన అటవీ పరిరక్షణ సవరణ బిల్లు తమ హక్కులకు తూట్లు పొడుస్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని చోట్ల ఓట్ల కోసం పార్టీలు మైదాన ప్రాంతాల్లో జీవించేవారు, ఇతర వర్గాలను షెడ్యూల్‌ తెగల జాబితాలో చేర్చాలని చూస్తున్నాయి. దీనివల్ల మణిపుర్‌ వంటి చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఆదివాసుల జీవితాల్లో నిజమైన అభివృద్ధి నెలకొంటేనే దేశం ప్రగతి పథంలో పయనిస్తున్నట్లు. పాలకులు ఈ విషయాన్ని గుర్తించి వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు నడుం కట్టాలి. అప్పుడే దేశీయంగా ఆదివాసుల బతుకు చిత్రం మారడానికి మార్గం సుగమమవుతుంది.`ఎం.వేణు
46 రకాల హక్కులను కల్పించి..
ఈ కమిటీ గుర్తించిన ముఖ్యమైన అంశాలు రాజకీయ,సామాజిక, ఆర్థిక సాధికారత,సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర, వేదాంత శాస్త్రం, వారసత్వ భూమి హక్కులు, స్థానిక వనరులు, అలాగే అన్ని రకాల వివక్షలు మొదలైన వారి హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని, వాటినిగౌరవిస్తూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందనిసమావేశంలో తీర్మానించిన అంశాలను వెల్లడిరచిన అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ను అనుసరిస్తూఅంతర్జాతీయ ఆదివాసీ హక్కుల దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఈ డిక్లరేషన్లో మొత్తం 46ప్రకరణలు పొందు పరిచారు.ఈ 46 ప్రకరణలలోఆదివాసీలు ప్రపంచ మానవ హక్కుల చట్టం ప్రకారం, ఆదివా సీలు స్వేచ్చగా మానవహక్కులు,ప్రాథమిక హక్కులు పొందాలి. ఇందులో ఎలాంటి వివక్ష చూపించొద్దని, అలాగే ఆదివాసీలు సంకల్పంతో వారి ఇష్ట ప్రకారం రాజకీయ,ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి చెందొచ్చు. వీరు స్వయం ప్రతిపత్తి, స్వయంపాలనను స్థానిక అంశాలతో నిర్వహించుకోవచ్చువనరులను సైతం ఇష్టరీతిలో వినియోగించుకోవచ్చు. వారి చట్టాలను బలోపేతం చేసుకోవచ్చు. ఆదివాసీ 2 దేశంలో నివసిస్తున్నప్పటికీ ఆదేశ పౌరసత్వం పొందే హక్కు కల్పించారు. వారి హక్కులపై, సంస్కృతిపై, సంప్రదాయాలపై, భూములపై దోపిడీ జరగకుండా బాధ్యతాయుతమైన యంత్రాంగాన్ని ఆయా రాష్ట్రాలే కల్పించాలి.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మన ఆదివాసీ సమాజాలకు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం గురించి తెలిసినంతగా ఆదివాసీ హక్కుల దినం గురించి తెలియక పోవడానికి కారణం నేటి ప్రభుత్వాల అలసత్వం. ఐక్యరాజ్య సమితి సూచన మేరకు దేశమంతటా ఆదివాసీల హక్కులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. వీటి గురించి వివరించేందుకు ఆధార్‌ సొసైటీ, ఏ ఈ డబ్ల్యూ సి ఏ,ఆదివాసీ సమన్వయ మంచ్‌ సంయుక్తంగా భద్రాచలంలో జాతీయ సదస్సు నిర్వహిస్తుంది.-జి.ఎన్‌.వి.సతీష్‌

గిరిజనులు`భూమి హక్కుల పరిరక్షణ

  • భూమి హక్కులు
  • భూమి హక్కులను రక్షించడం
  • రిజర్వేషన్లు, వివక్ష, దురాగతాలను నివారించడం
  • గిరిజన భూములను నిర్వచించడంలో స్పష్టతను పెంచడం
  • రక్షణ చర్యలను సరిగ్గా అమలు చేయడం
    భారతదేశం అత్యంత వైవిధ్యమైన గిరిజన జనాభాకు సాక్ష్యంగా ఉంది. ప్రతి తెగకు దాని స్వంత లక్షణం మరియు స్వభావం ఉంటుంది, తత్ఫలితంగా వేరే చికిత్స అవసరం.ఉదాహరణకు,మధ్య దేశం లేదా పశ్చిమ భారతదేశంలోని స్థానిక ప్రజల జీవితం మరియు పరిస్థితులు ఈశాన్య భారతదేశం మరియు అండమాన్‌లలోని తెగల స్థితికి భిన్నంగా ఉంటాయి. స్వాతంత్య్రానంతర భారత పరిపాలన దాని గిరిజన జనాభాను బాగా చూసుకున్నట్లు కనుగొనబడిరది. (ష్ట్ర్‌్‌జూం://షషష.సశీషఅ్‌శీవaత్‌ీష్ట్ర.శీతీస్త్ర.ఱఅ/అవషం/వఅఙఱతీశీఅఎవఅ్‌/్‌తీఱపaశ్రీ-తీఱస్త్రష్ట్ర్‌ం-ఱఅ-ఱఅసఱa-aతీవ-a స్త్రతీవవ-జూఱష్‌బతీవ-వఞజూవత్‌ీం-62230)
    1.భారతదేశంలో 18 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న 100మిలియన్లకు పైగా గిరిజనులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో గిరిజన సమూహాలు మెజారిటీగా ఉన్నప్పటికీ (ఉదా. ఈశాన్య రాష్ట్రాలు), షెడ్యూల్డ్‌ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాలు అని పిలువబడే చిన్న మండలాల్లో ఇతర రాష్ట్రాలలో గిరిజన సమూహాలు ఉన్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర చట్టాల ద్వారా అమలు చేయబడిన గిరిజన జనాభా చికిత్సకు సంబంధించి భారతదేశం గణనీయమైన తనిఖీలు మరియు సమతుల్యతలను కలిగి ఉంది.
    స్వదేశీ సమూహాలకు చట్టం ప్రకారం రక్షణ
    భారతరాజ్యాంగం గిరిజనప్రయోజనాలను, ముఖ్యంగా వారి స్వయంప్రతిపత్తి,వారి భూమిపై హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తుంది.(భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5డ 6) ఇది దేశీయ సమూహాలను దోపిడీ నుండి రక్షిం చడానికి మరియు వారి భూమిపై వారి హక్కులను పొందటానికి ఆదేశాలతో కూడిన సమగ్ర పథకాన్ని అందిస్తుంది. భారతదేశంలోని చాలా స్థానిక సమూ హాలను సమిష్టిగా షెడ్యూల్డ్‌ తెగలు (ఆర్టికల్‌ 342 (1అండ్‌2), భారత రాజ్యాంగం)
    3.భారత రాజ్యాంగం ప్రకారం స్వయం నిర్ణయా ధికార హక్కుకు హామీ ఇవ్వబడిరది. (పార్ట్‌శ, భారత రాజ్యాంగం)
    4.2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలోని షెడ్యూల్డ్‌ తెగలు భారతదేశ జనాభాలో దాదాపు 8.6శాతంఉన్నారు5.భారతదేశంలోని షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన చాలా మంది సభ్యులు తమ జీవనోపాధి కోసం అడవులపై నేరుగా ఆధారపడి ఉన్నారు. సంవత్సరాల పోరాటం, వివక్ష,హింస తర్వాత,భారత ప్రభుత్వం 2006లో షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం ద్వారా అటవీ నివాస తెగల ప్రాథమిక హక్కులను క్రోడీకరిం చింది (అటవీ హక్కుల చట్టం`2006).
    భారతదేశంలోని షెడ్యూల్డ్‌ తెగలు అత్యంత అణగారిన జనాభాలో ఉన్నాయి. భారతదేశంలోని షెడ్యూల్డ్‌తెగల భూమిహక్కులను రక్షించడానికి పరిరక్షించడానికి,ఈకొత్త చట్టం ద్వారా వారికి అనేక హక్కులు కల్పించబడ్డాయి.
    భారతదేశంలోని స్వదేశీ ప్రజల భూమి హక్కులు
    అటవీ హక్కులచట్టం కింద గిరిజనులకు అందించబడిన హక్కులు భారతదేశంలోని స్థానిక ప్రజలచే అడవులలో భూమిని కలిగి ఉండటం, దోపిడీ చేయడం మరియు నివాసంపై వ్యక్తిగత మరియు సమాజ యాజమాన్యాన్ని పొందేందుకు ప్రయత్ని స్తాయి. ఈ హక్కులు తరతరాలుగా ఈ భూములలో నివసిస్తున్న మరియు గతంలో అలాంటి హక్కులు లేని అటవీ నివాసితుల షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసులకు ఉంటాయి. షెడ్యూల్డ్‌ తెగ,ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అనే అటవీ నివాసం అంటే ఏమిటి? భారత చట్టం ప్రకారం,అటవీ నివాసి షెడ్యూల్డ్‌ తెగ అంటే భారత చట్టం ప్రకారం ఒక ప్రాంతంలో షెడ్యూల్డ్‌ తెగలుగా జాబితా చేయబడిన తెగల సమాజ సభ్యులు. ఇంకా, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు కూడా అటవీ హక్కుల చట్టం కింద హక్కులను పొందేందుకు అర్హులు. ఇతర సాంప్రదాయ అటవీ నివాసులలో 13-12-2005 కి ముందు మూడు తరాలు (75 సంవత్సరాలు) అటవీ భూమిలో నివసించిన మరియు వారి జీవనోపాధి అవసరాల కోసం అటవీ భూమిపై ఆధారపడిన సభ్యులు లేదా సంఘాలు ఉన్నాయి. ఇతర సాంప్రదాయ అటవీ నివాసులు అటువంటి దావాను స్థాపించడానికి ఆధారాలు జనాభా గణన, సర్వేలు,మ్యాప్‌లు, నిర్వహణ ప్రణాళికలు మొదలైన ప్రజా పత్రాలు, ప్రభుత్వం అధికారం ఇచ్చిన గుర్తింపు పత్రాలు, న్యాయపరమైన మరియు పాక్షిక-న్యాయ రికార్డులు,ఇల్లు,గుడిసెలు వంటి భౌతిక లక్షణాలు, పెద్దల ప్రకటన మొదలైనవి.(నియమం13,ఖీRA నియమాలు) ఈ ఆధారాలలో ఏవైనా రెండిరటిని దావాను స్థాపించడానికి సమర్పించవచ్చు.అటవీ నివాస షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల హక్కులు
    8 (సెక్షన్‌ 3,అటవీ హక్కుల చట్టంభూమి వినియోగం స్థానిక ప్రజలకు అనేక హక్కులు ఉన్నాయి, ముఖ్యంగా వారి భూమిని ఆక్రమించడం,ఉపయో గించడం గురించి. షెడ్యూల్డ్‌ తెగలు మరియు ఇతర సాంప్రదా య నివాసితులు అటవీ భూమిని దాని వ్యక్తిగత లేదా సాధారణ స్వాధీనంలో నివాసం కోసం కలిగి ఉండ టానికి మరియు నివసించడానికి అర్హులు. షెడ్యూల్డ్‌ తెగ లేదా ఇతర సాంప్రదాయ అటవీ నివాసితులలోని ఏ సభ్యుడైనా తమ జీవనోపాధి కోసం భూమిని స్వయం సాగుకోసం ఉపయోగించుకునే హక్కు కూడా ఉంది.
    సమాజ హక్కులు
    సాంప్రదాయ అటవీ నివాసులునిస్తార్‌ లేదా ఏ పేరుతో నైనా వారి సమాజ హక్కులను అమలు చేసు కునే హక్కునుకలిగి ఉంటారు,అలాంటి సమాజ హక్కు లను ప్రకటించవచ్చు,రాచరిక రాష్ట్రాలు,జమీం దారీ, ఇలాంటి పాలనలలో ఉపయోగించే వాటితో సహా. కొన్ని అటవీ ఉత్పత్తులపై యాజమాన్యం
    గిరిజన గ్రామంలో,వెలుపల సాంప్రదాయ కంగా సేకరించే చిన్న అటవీ ఉత్పత్తులపై కూడా అటవీ నివాసులకు యాజమాన్య హక్కు ఉంది.ఈ హక్కు అటువంటి ఉత్పత్తులను సేకరించడం,ఉప యోగించడం పారవేయడం వరకు విస్తరించింది. అటువంటి సందర్భాలలో చిన్న అటవీ ఉత్పత్తులలో వెదురు,బ్రష్‌వుడ్‌,తేనె,మైనం, ఆకులు, ఔషధ మొక్కలు మూలికలు,వేర్లు వంటి మొక్కల నుండి ఉద్భవించే కలప కాని అటవీ ఉత్పత్తులు కూడా ఉంటాయి.
    సమాజ హక్కులు
    నివాసితులు చేపలు,నీటి వనరుల ఇతర ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు పాస్టోరల్‌ కమ్యూనిటీల సాంప్రదాయ కాలానుగుణ వనరులను పొందడం వంటి ఇతర సమాజ హక్కులకు కూడా అర్హులు. స్థానిక ప్రజల హక్కులు వారి ఆవాసాల కమ్యూనిటీ పదవీకాలానికి అలాగే స్థానిక అధికారం లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పట్టాలు లేదా లీజులు లేదా గ్రాంట్ల ను మార్చడానికి కూడా విస్తరిస్తాయి. ఇంకా,ఒక భూమి లేదాగ్రామం ఒకభాగం అటవీ హక్కుల చట్టం కింద చేర్చబ డనిచోట,షెడ్యూల్డ్‌ తెగలు ఇతర సాంప్ర దాయ అటవీ నివాసులు పరిపాలనా రికార్డుల ప్రయో జనంకోసం అన్ని అటవీ గ్రామా లను రెవెన్యూ గ్రామా లుగా స్థిరపడటానికి మరియు మార్చడానికి హక్కును కల్పిస్తుంది.ఏకారణం చేతనైనా ఏదైనా కమ్యూనిటీ అటవీ వనరులను రక్షించి, పరిరక్షిస్తున్న తెగలు అటవీ నివాసుల విషయంలో, అటువంటి అటవీ వనరులను రక్షించడానికి, పునరుత్పత్తి చేయడానికి లేదా సంరక్షిం చడానికి స్థానిక సమూహాలకు హక్కు ఉంది.
    జీవవైవిధ్యంపై హక్కులు
    జీవవైవిధ్యం లేదా సాంస్కృతిక వైవిధ్యానికి సంబంధిం చిన సాంప్రదాయ జ్ఞాన హక్కులను లేదా సమాజంగా జీవవైవిధ్యం లేదా మేధో సంపత్తిని పొందే హక్కును కూడా తెగలు కలిగి ఉన్నారు.చట్టంలో ప్రత్యే కంగా జాబితా చేయని ఇతర హక్కులుచట్టంలో జాబి తా చేయబడిన ఏవైనా హక్కులు గిరిజన సమూ హాల విభిన్న అవసరాలను తీర్చనప్పుడు, వారు ఆచారంగా అనుభవిస్తున్న ఏదైనా సాంప్రదాయ హక్కును అనుభ వించవచ్చు, అడవి జంతువును వేటాడటం లేదా బంధించడం లేదా వాటి శరీరంలోని కొంత భాగాన్ని తీయడం వంటి సాంప్రదాయ హక్కు తప్ప.-(ఆర్యన్‌ మోహింద్రూ)

    వినిపించని పక్షుల కిలకిల

    తెల్లవారుతుండగా పక్షుల కిలకిలరాగాలతో పల్లెలు మేల్కొనేవి. ఎటు చూసినా పక్షుల రాగాలే.. ఇవి ఒకప్పటి మాటలు. నేడు ఆ పరిస్థితి లేదు. రోజురోజుకూ వాతావరణంలో వచ్చే మార్పులతో జీవజాతులు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. పక్షుల సరాగాలు ఇప్పుడు వినిపించడం లేదు. కొద్ది సంవత్సరాల క్రితం పక్షులు ఉదయాన్నే సందడి చేసేవి. కిలకిల మంటూ మురిపాలు కురిపించేవి. ఇంటి ముందర కట్టే వరిగొలుకలు తింటూ పక్షులు సంగీతాన్ని వినిపించేవి. తెల్లవారకముందే మనుషులను నిద్రలేపేవి. ముద్దులొలికే పిచ్చుక చేస్తున్న చేష్టలు కనువిందు చేసేవి. ఊర పిచ్చుకల జాతి అంతరించుకు పోతోంది. రసాయన ఎరువులు, రేడియేషన్‌ ప్రభవంతో ఇప్పటికే రాబంధులు కనుమరుగయ్యాయి. ఒకప్పుడు పశువులు చనిపోతే అక్కడ రాబంధులు వాలి దాన్ని మొత్తం తినేసేవి. అటువంటిది ఇప్పుడు ఊళ్లలో పశువులు లేవు…రాబంధులు రావు. దీంతో రాబోయే రోజుల్లో రాబంధులంటే ఇలా ఉండేవని చెప్పుకోవడమే. ఇంత జరుగుతున్నా మన పాలకుల్లో మార్పు కనిపించడం లేదు.(జి.ఎ.సునీల్‌ కుమార్‌)
    మనదేశంలో పదమూడు వందల యాభై మూడు పక్షి జాతులున్నాయి. అంటే ప్రపంచ పక్షి జాతుల్లో ఇవి 12.04శాతం అన్నమాట.వీటిలో డెబ్భైఎనిమిది జాతులు (ఐదుశాతం) మన దేశానికి మాత్రమే చెందినవి.ఈ డెబ్భై ఎనిమిదిలో మూడు జాతులు గత కొన్ని దశాబ్దాలుగా కనుమరుగ య్యాయని ఇటీవల జువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్త అమితవ మజుందార్‌ తెలిపారు. అవి మణిపూర్‌ బుష్‌ పిట్ట,(పెర్డికులా మణి పురెన్సిస్‌)..హిమాలయన్‌ పిట్ట (ఓఫ్రిసియా సూపర్‌సిలియోసా), జెర్డాన్స్‌ కోర్సర్‌ (రినోప్టిలస్‌ బిటోర్క్వాటస్‌)లు.అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ (ఐయుసిఎన్‌) 1907లో వీటి మనుగడకు ముప్పు ఉందని తెలిపే రెడ్‌ లిస్ట్‌ ఆఫ్‌ థ్రెటెన్డ్‌ స్పీసీస్‌ అనే అధ్యయనంలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణ కు కంకణబద్ధులు కావడం లేదు.విచ్చలవిడిగా మనం ఉపయోగించే ఎరువులు, సెల్‌టవర్‌ల ప్రభావంతో పక్షిజాతులైన రాబంధులు,గద్దలు,పాలపిట్టలు,చిలకలు,గోరింకలు కనిపించ కుండా పోతున్నాయి.వాతావరణ మార్పులకుతోడు పక్షిజాతులు అంతర్థానంతో మానవ మనుగడే ప్రమాదంలో పడబోతోందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
    పిండేస్తున్న కొండలు…
    ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే కొండలు, గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా జిల్లా ఎడారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన గుట్టలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. విచ్చలవిడిగా, ఇబ్బడిముబ్బడిగా అమ్యా మ్యాలకు ఆశపడి అడ్డగోలుగా అనుమతులిస్తుంటే కొండలు దిక్కుతోచని స్థితిలో దీనంగా చూస్తున్నాయి.మానవుని అత్యాశకు బలవుతున్నామని రోదిస్తున్నాయి. దేవుని గుట్టలైనా, ఏగుట్టలైన డబ్బుల రుచిమరిగిన బకాసురులు కొండలను పిండి చేయడంతో జంతువులు,పక్షులు,కనిపించకుండా పోతున్నాయి.గుట్టల్లో ఎలుగుబంట్లు,తోడేళ్లు,జింకలు,పక్షులు నివాసం ఉండేవి.ప్రస్తుతం జంతువులు జనారణ్యంలోకి పరుగులు పెడుతున్నాయి. ఇలా జరగడానికి కారణం కొండలు కనుమరుగు కావడమే. గుట్టలనే నివాసంగా చేసుకోని జీవించే జీవజాతుల పరిరక్షణకు ప్రభుత్వమైనాచర్యలు తీసుకోవడం లేదు.
    రసాయన ఎరువులు…
    మనం వ్యవసాయానికి వాడే రసాయన ఎరువులు వల్ల జంతువులు,పక్షులు చనిపోతున్నాయి. వాటిలో ఉండే విష పదార్థాల వల్ల పక్షులు అంత రించిపోతున్నాయి. గతంలో జాతీయ పక్షులు నెమళ్లు విషాహారం తిని మృతి చెందిన సంఘ టనలు జరిగాయి.పంటలు బాగా పండాలని మనం వాడే రసాయనాలతో పక్షులు ఆ పంట లను తిని తనువుచాలిస్తున్నాయి. పక్షిజాతుల్లో ఇప్పటికే పలు పక్షులు కనుమరుగైపోయాయి. పూర్వం కోడిపిల్లలు గద్దలను చూసి భయపడేవి. ఇప్పుడు కోడి పిల్లలు లేవు.గద్దలు కానరావడం లేదు. గద్దలు,గోరింకాలు, చిలుకలు,పిచ్చుకలు ఒకటేమిటి భూమి మీదఉన్న పక్షిజాతులన్నీ రాను..రాను కన్పించకుండ పోయే దుస్థితి నెలకొంటోంది.
    సెల్‌ టవర్లతోనూ ముప్పు..
    సెల్‌ లేని ఊరులేదు. సెల్‌టవర్‌ లేని పట్టణం లేదు.సెల్‌ టవర్ల వినియోగంతో రేడియేషన్‌ సమస్య ఉందని పర్యావరణ విశ్లేషకులు చెబుతు న్నారు. వీటి వినియోగంతో మనుషులు సైతం రోగాల బారిన పడుతున్నారు. రేడియేషన్‌ ప్రభా వంతో పక్షుల్లో రోగాలు పెరుగుతు న్నాయి. ఫలి తంగా మృత్యువాత పడుతున్నాయి.ఇటీవల కాలంలో ఎక్కువ కావడంతో అసలు పక్షులే కని పించకుండా పోతున్నాయి. భవిష్యత్తు తరాలకు మనం పక్షులంటే ఇలా ఉంటాయని బొమ్మల ద్వారా చూపించే రోజులు వస్తున్నాయి. పర్యా వరణ పరిరక్షణ కోసం పాటుపడకపోతే భవిష్యత్తు అంధకారమే.దీనిపై ప్రభుత్వాలు,పాలకులు స్పం దించి పర్యావరణ సంరక్షణ కోసం నడుం బిగించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
    ఆజాదీ ఏదీ..!
    ప్రచురణ రచయితలలో ధృతి బెనర్జీ ఒకరు. ఈమె ‘మన దేశంలో డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ‘ఆజాదీకా అమృత్‌ మహో త్సవ్‌’ వేడుకలు జరుపుకున్నాం. అదే సమయంలో జెడ్‌ఎస్‌ఐ ‘75ఎండిమిక్‌ బర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఒక నివేదికను ప్రచురించింది.ఈ విష యాన్ని అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వెల్లడిరచింది కూడా.అయినా పరిస్థితి క్షీణ దశ లోనే ఉన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచ డం..నిషేధిత ప్రాంతాలలో మాత్రమే కనిపించే జాతులను సంరక్షించడం తక్షణం చేయవలసిన కర్తవ్యం.ఇదే మా నివేదిక ప్రగాఢ ఉద్దేశ్యం’ అని ధృతి పేర్కొన్నారు.
    అరుదైనవి..అంతరిస్తున్నాయి..
    ‘తెల్ల బొడ్డు మినివెట్‌ పెరిక్రోకోటస్‌ ఎరిత్రోపైజియస్‌ పక్షులు పశ్చిమ కనుమలు, నేపాల్‌, మన దేశంలోని ఆకురాల్చే అడవుల్లో అత్యధికంగా ఉండేవన్నారు. అండమాన్‌ నికోబార్‌ దీవులలో ఆసక్తికరమైన నాలుగు పక్షి జాతులు కనిపిస్తున్నాయి.అవి నికోబార్‌ మెగాపోడ్‌ (మెగాపోడియస్‌ నికోబారియన్సిస్‌),నికోబార్‌ సర్పెంట్‌ ఈగిల్‌ (స్పిలోర్నిస్‌ క్లోస్సీ), అండమాన్‌ క్రేక్‌ (రల్లినా కన్నింగి),అండమాన్‌ బార్న్‌ గుడ్లగూబ (టైటో డెరోప్స్టోర్ఫీ).ఇవి తూర్పు హిమాలయాలు, దక్కన్‌ పీఠభూమి, మధ్య భారత అడవులకు చెందినవి. ఇంకా ఆ దీవుల్లో మరెక్కడా కనిపించని 25 పక్షి జాతులు ఉన్నాయి.అవి నికోబార్‌ మెగాపోడ్‌,నికోబార్‌ సర్పెంట్‌ ఈగిల్‌, అండమాన్‌ క్రేక్‌, అండమాన్‌ బార్న్‌ గుడ్లగూబ వంటి జాతులు.వీటి ఆవిర్భావానికి స్థానిక భౌగోళిక పరిస్థితులే కారణం’ అని డాక్టర్‌ మజుందార్‌ చెప్పారు. ఆ ప్రదేశాల్లో మారిన పరిస్థితులకు ఈ పక్షుల మను గడ ప్రమాదంలో పడిరది. పశ్చిమ కనుమల్లో ఇరవై ఎనిమిది ప్రత్యేకమైన జాతులున్నాయి. అవి మలబార్‌ గ్రే హార్న్‌బిల్‌, మలబార్‌ పారాకీట్‌, అశంబు లాఫింగ్‌ థ్రష్‌, వైట్‌-బెల్లీడ్‌ షోలకిలి.
    ‘ప్రచురణలో స్థానిక పక్షి జాతుల జీవ-భౌగోళిక ప్రాంతాల వివరాలు,శాస్త్రీయపేర్లు,ఉప జాతుల తేడాలు, ప్రత్యేక లక్షణాలు, ఇష్టపడే ఆవా సాలు,సంతానోత్పత్తి అలవాట్లు, ఆహార ప్రాధాన్యతలు, చారిత్రక ఔచిత్యం ఉన్నాయి’ అని డా.మజుందార్‌ తెలిపారు. సామాన్యులు, విద్యార్థులలో అవగాహన పెంపొందిద్దాం.. పక్షులను, ప్రాణికోటిని కాపాడు కుందాం.
    కాపాడుకోవడం మన బాధ్యత
    జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి. సామాజిక అడవుల పెంపకాన్ని పర్యావరణ వేత్తలు ఉద్యమంలా చేపట్టాలి. ప్రభుత్వం పర్యావరణ సంబంధిత శిక్షణా కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేస్తూ జీవ వైవిధ్య అవశ్యకతను తెలియజేయాలి. జానపద కళలు,వీధి నాటకాల ద్వారా ప్రజల్లో జీవవైవిధ్యంపట్ల అవగాహన కలిగించాలి. సామా జిక మాధ్యమం, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వినూత్న శైలిలో జనాలకు సులభతరమైన భాషలో సరళంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలి. పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలు అనేక అంతర్జాతీయ ధరిత్రీ సదస్సులు ఏర్పాటు చేసి కార్యాచరణ అమలుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికి భూతాపం, అనావృష్టి, అతివృష్టి, అకాల వర్షాలు, వరదలు, కరవు తదితరాలు ఇటీవలి కాలంలో ఇంకా అధికమవుతూనే ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే లక్ష్యాల సాధనకు కార్యాచరణకు పొంతన లేదనే విషయం తెలుస్తుంది. కనుక వాతావర ణంలో వస్తున్న విపరీత మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ కార్యాచరణను సత్వరమే చేపట్టాలి. ప్రకృతి అందించిన జీవవైవిధ్య సంపదను కాపాడు కోవడం ఆధునిక మానవుడి ప్రాధమిక బాధ్యత అని గుర్తెరగాలి.
    మన రాజ్యాంగం అధికరణం 48(ఏ) లో పర్యావరణ పరిరక్షణకు..అభివృద్ధికి, ప్రభుత్వం కృషి చేయాలి. దేశంలోని వనాలను, వన్యప్రాణులను కాపాడడం రాజ్యవిధి అని ఆదేశిక సూత్రాల్లో చెప్పింది. అంతేకాదు పర్యా వరణ రక్షణ పౌరుల ప్రాథమిక విధి అని 51 ఏ(జి) లో స్పష్టంగా పేర్కొంది. అంటే పౌరులుగా మనం జీవ వైవిధ్య పరిరక్షణ మన ప్రాధమిక బాధ్యత అనే విషయం గుర్తించిన నాడు జీవ వైవిద్యానికి జరిగే నష్టత అరికట్టబడుతుంది.
    ఎందుకంటే అంతరించి పోయిన వృక్ష, జంతు జాలాన్ని ఎప్పటికీ పునరుద్ధరించుకోలేం. ఏ జీవి అయినా తనకు తానుగా స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. తప్పనిసరిగా ఇతర జీవుల మీద ఆధారపడాల్సిందే.ఈసత్యాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించి ఇప్పటికైనా పరిరక్షణ దిశగా అడుగులు వేయగలిగితే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము.దీనివలన ప్రస్తుత తరం వారమైన మనం ప్రయోజనం పొందటమే కాకుం డా రాబోయేతరాల వారి ప్రయోజనాలను కాపాడే దిశగా కొనసాగించే అభివృద్ధికి అవకాశం అందించిన వారం అవుతాం.

    1 2 3 75