అడవి తల్లి బిడ్డలం..ఆదివాసులం..

అడవే మా ఊరు..అడవే మాజీవితం…అడవితల్లే మాతల్లి.ప్రకృతిని పరిరక్షిస్తూ, కొండలుకోనలు, వాగులు వంకలతో మమేకమై తరతరాలుగా జీవిస్తున్నాం. అడవిపై హక్కు కోసం కాదు..అడవితో కలిసి బతికే హక్కు కోసం మా పోరాటం.జల, జంగల్, జమీన్‌నే మాజీవనాధారం అభివృద్ధి పేరుతో మానేల,మావనరులు,మా సంస్కృతి దూరమవుతున్న వేళ..అస్తిత్వాన్నికాపాడుకునేందుకు ఆదివాసీసమాజం చేస్తుపోరాటమే ఈ కథనం.- (డాక్టర్.సాగబోయిన పాపారావు)

అడవి తల్లి ఒడిలో ప్రకృతి దైవంగా జీవనాన్ని కొనసాగిస్తున్న వారే ఈదేశ మూలవాసులు అనే మాట కేవలం ఒకనినాదం కాదు.ఇది తరతరాలుగా అడవులు,కొండలు,వాగులు,నదులు,భూములతో సహ జీవనం చేస్తూ వచ్చిన ఆదివాసీ సమాజం యొక్క అస్తిత్వ ప్రకటన. ప్రకృతిని కాపాడుతూ,ప్రకృతితో కలిసి జీవిస్తూ,తమ ప్రత్యేక సంస్కృతి, భాష,ఆచారాలు,సంప్రదాయాలను తరతరాలకు అందించిన సమాజ మే ఆదివాసీ సమాజం.‘ఆదివాసి’ అనే పదం సాధారణంగా ఒకప్రాం తానికి చారిత్రకంగా మూలవాసులుగా ఉన్న ఆదివాసి సమా జాలను సూచిస్తుంది.భారత రాజ్యాంగంలో వీరిలో అనేక సమూహాలు షెడ్యూ ల్డ్ ట్రైబ్స్ (ST)గా గుర్తించ బడ్డాయి.తెలంగాణలో కోయ,గోండ్,కొండ రెడ్డి,నాయక్‌పోడ్, కొలాం,పర్దాన్,అందు,మన్య వార్,చెంచు తదితర అనేక ఆదివాసీ సమూహాలు నివసిస్తున్నాయి. ప్రతి తెగకు ప్రత్యేకమైన భాష, యాస,జీవనవిధానం,పండుగలు,ఆచారాలు,కళలు,జానపద సం ప్రదాయాలు ఉన్నాయి.ఈవైవిధ్యమే భారతదేశ సాంస్కృతిక సంపదలో ఒక ముఖ్యమైన భాగం.
ఆదివాసుల జీవితం అడవితో విడదీయలేనిది.అడవి వారికి కేవలం చెట్లు,కలపకు సంబంధించిన ప్రాంతంకాదు.అది వారి జీవ నాధారం,ఆహారం,ఔషధం,సంస్కృతి,ఆర్థికవ్యవస్థ,ఆధ్యాత్మిక విశ్వా సాలకు ఆధారం.చిన్న వన ఉత్పత్తులు, తేనె, చింతపండు, ఇప్పపువ్వు, పారేటాకులు,పండ్లు,విత్తనాలు వంటి అనేక వనరులు ఆదివాసీ కుటుం బాల జీవనంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆదివాసీ అభివృద్ధి అంటే అడవిని నాశనంచేసి అభివృద్ధి చేయడం కాదు. అడవిని కాపా డుతూ ఆదివాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ఆదివాసి ప్రజలకు నీరు,అడవి, భూమి హక్కులు అస్తిత్వం ఆదివాసీ సమాజానికి భూమి కేవలం ఆస్తికాదు.అది వారి కుటుంబం,సంస్కృతి,జీవన విధానం, భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది.ఈమధ్యకాలంలో ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరుల చొరబాటు అధికమై భూస్వామ్య సమ స్యలు, అక్రమ ఆక్రమణలు, బినామీ లావాదేవీలు,అభివృద్ధి ప్రాజెక్టులవల్ల నిర్వాసితులవడం వంటి సమస్యలు అనేక ప్రాంతాల్లో ఆదివాసీ కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భూమిహక్కులు,అటవీ హక్కులు,సంప్రదాయ జీవనాధారాల రక్షణ అత్యంత ప్రాధాన్యమైన అంశాలకు ప్రమాదం పొంచి ఉంది.అనేకమంది ఆదివాసి పోరాట యోధులు ఆదివాసి ప్రజల రక్షణ కోసం ఉద్యమాలు,పోరాటాలు ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా మొట్టమొదటి భారత స్వాతంత్ర సమరయోధుడు బిర్సాముండా స్ఫూర్తితో జైపాల్ సింగ్ ముండా ఆదివాసులకు రాజ్యాంగంలో ప్రత్యేకంగా 5,6వ షెడ్యూల్డ్‌లను రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆదివాసీ సమాజం ప్రత్యేక పరిస్థితులను గుర్తించి ప్రత్యేక రక్షణలను కల్పించింది. ఆర్టికల్ 244ద్వారా 5వ మరియు 6వ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు రాజ్యాంగపరమైన వ్యవస్థను కల్పించారు. తెలంగాణలోని షెడ్యూల్డ్ ఏరియాలు 5వ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయి.5వ షెడ్యూల్ ఉద్దేశం కేవలం పరిపాలన కాదు. ఆదివాసీ భూములు, సంప్రదాయ జీవన విధానం, సామాజిక ప్రయోజనాలు మరియు ప్రత్యేక హక్కులను రక్షించడం కూడా దాని ప్రధాన లక్ష్యాలలో ఒకటి.భూ బదలాయింపు చట్టం1/70యాక్ట్, PజుSA చట్టం1996,అటవీ హక్కుల చట్టం`2006 వంటి చట్టాలు కూడా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గ్రామసభలకు మరియు అటవీ ఆధారిత ఆదివాసీ సమాజాలకు ముఖ్యమైన హక్కులను కల్పించారు. ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు చట్టాలు ఉన్న వివిధ కారణాల చేత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ…ఆదివాసులకు దక్కవలసిన విద్య, ఉద్యోగ,ఉపాధి,రాజకీయ అవకాశాలను వలసవాదులు గెద్దల్ల తన్నుకు పోతున్నారు.అడవి బిడ్డలు ఆదివాసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మా హక్కులు అమలు చేయండి. మా బిడ్డ లకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి.మా భూములు రక్షిం చండి. మా జీవనం విధ్వంసం చేయకండి అని ఆదివాసుల ఆర్తనాదాలు ఆలకించే వారే లేరు. ఆదివాసీ సమాజం అభివృద్ధికి విద్య అత్యంత కీలకం. గ్రామీణ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో నాణ్యమైన పాఠశాలలు,ఉపాధ్యాయులు,వసతిగృహాలు,ఆశ్రమ పాఠశాలలు,ఇంటర్మీడియట్,డిగ్రీ,సాంకేతిక మరియు ఉన్నత విద్యా అవకాశాలు మరింత బలోపేతం కావాలి.“విద్య హక్క… విద్య అమ్మకపు వస్తువు కాదు.”ఆదివాసీ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నిరంతర విద్యను పొందేలా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా బాలికల విద్య,హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు,ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు,పోటీపరీక్షల శిక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత అవసరం.ఏజెన్సీ ఆదివాసి ప్రజల కనీస ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు ఏర్పాటుచేసిన ITణAలు ఉన్నా లేనట్లుగానే ప్రాజెక్టు అధికారుల పనితీరు కనిపిస్తుంది. ఉద్యోగ,ఉపాధి ద్వారానే యువత భవిష్యత్తు విద్యావంతులైన ఆదివాసీ యువతకు తగిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించకపోతే సామాజిక అభివృద్ధి అసంపూర్ణంగా ఉంటుంది.షెడ్యూల్డ్ ఏరియాల్లో రాజ్యాంగం, చట్టాలు మరియు ప్రభుత్వ విధానాల ప్రకారం స్థానిక ఆదివాసీ యువతకు లభించాల్సిన అవకాశాలు సమర్థవంతంగా అమలు కావాలి.ఉద్యోగ నియామకాల్లో చట్టపరమైన నిబంధనలు స్పష్టంగా ఉండాలి.నోటిఫికేషన్లలో గందరగోళానికి అవకాశం లేకుండా స్థానిక హక్కులు,రిజర్వేషన్లు,రోస్టర్ విధానం స్పష్టంగా ప్రకటించాలి.ఆదివాసులకు ఉన్న హక్కులు,చట్టాలను అమలు చేయకుండా ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 100% రిజర్వేషన్ సాకుతో ఉన్న జీవో :3ని గిరిజనేతరుల కుట్రల వల్ల సుప్రీంకోర్టు కొట్టి వేసిందనే సాకుతో తెలంగాణ ప్రజా ప్రభుత్వం 2026 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్లు స్థానిక ఆదివాసి నిరుద్యోగులకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో (సివిల్) కానిస్టేబుల్ కు 75%రిజర్వేషన్ అమలు చేయాలని జీవో: 109 స్పష్టం చేసిన రేవంత్ సర్కార్ పెడచెవిన పెట్టింది. అన్నీ ఉన్నా ఆదివాసులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్త వం.ఆదివాసీ సమాజం యొక్క గొప్ప సంపద వారి సంస్కృతి.గుస్సాడి, కోయ నృత్యాలు,జానపద గీతాలు, సంప్రదాయ వాద్యాలు,వేల్పుల జాతరలు, (సీజనల్) భూమి,కొత్తలు,పెద్దలు, ఇప్పపువ్వుల పండుగలు,వైద్యం,ఆహారసంస్కృతి, సంప్రదాయ జ్ఞానంఇవన్నీ తరత రాలు గా పూర్వీకుల నుండి వస్తున్న అమూ ల్య వారసత్వం.ఆధునికతను స్వీకరిం చడం అవసరమే.కానీ ఆధునికత పేరు తో భాషను,సంస్కృతిని,ఆచారాలను, సంప్రదాయ జ్ఞానాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు.ఆదివాసీ పిల్లలకు ఆధు నిక విద్యతో పాటు వారి మాతృభాష, చరిత్ర,సంస్కృతి గురించి కూడా అవగా హన కల్పించాలి.ఇప్పటి వరకు ఈ ప్రయత్నం అటు ప్రభుత్వాలుగానీ ఇటు ఐటిడిఏలుగాని చెయ్యకపోవడం సూచ నీయం.కేంద్ర,రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మాత్రం ఆదివాసుల అభివృద్ధి కోసం సంస్కృతి,సాంప్రదాయా లను ముందుకు తీసుకపోవడంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కాగితాల మీద లెక్కలు చూపిస్తున్నారు.ఆదివాసీ సమాజంలో మహిళల పాత్ర అత్యంత కీలకం.కుటుంబ ఆర్థికవ్యవస్థ నుంచి వ్యవసాయం,అటవీ ఆధారిత జీవనో పాధి,పిల్లల సంరక్షణ,సాంస్కృతిక పరంపర కొనసాగింపు వరకు వారు కీలక పాత్ర పోషి స్తున్నారు.ఆదివాసీ మహిళలకు విద్య,ఆరోగ్యం,ఉపాధి, స్వయం ఉపాధి,భద్రత నిర్ణయాధి కారంలో మరింత అవకాశాలు కల్పిం చాలి.ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధి అంటే రోడ్లు,విద్యుత్,తాగునీరు,ఆసు పత్రులు,పాఠశాలలు,ఇంటర్నెట్,రవాణా వంటి మౌలిక సదుపాయాలు అవసరం. కానీ అభివృద్ధి పేరుతో ఆదివాసులను వారి భూమి,అడవి,జీవనాధారాల నుంచి దూరం చేయడం అభివృద్ధి కాదు.‘ఆదివాసుల కోసం అభివృద్ధి కావాలి; ఆదివాసులను తొలగించే అభివృద్ధి కాదు.’అభివృద్ధి ప్రణాళి కల్లో స్థానిక ఆదివాసి ప్రజల అభిప్రా యానికి,గ్రామసభల పాత్రకు,రాజ్యాంగ రక్షణలకు ప్రాధాన్యత ఉండాలి.కానీ అందుకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంతాలలో రాజ్యాధికారం వలసవాదుల కబంధ హస్తాల్లో బందీ అయి ఉంది.అందుకే ఆదివాసులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. నేటి ఆదివాసీ సమాజం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.భూమి మరియు అటవీ హక్కుల సమస్యలు,విద్యా వెనుక బాటుతనం,పిల్లల డ్రాపౌట్లు,నిరుద్యోగం, ఆరోగ్య సదుపాయాల కొరత,పోషకాహార సమస్యలు,గిరిజనేతరల వలసలు,మౌలిక వసతుల కొరత,మాతృ భాషల పరిరక్షణ సమస్య,సంస్కృతి,సంప్రదాయాలపై పెరుగు తున్న ప్రభావాలుప్రభుత్వ పథకాల అమ లులో లోపాలు షెడ్యూల్డ్ ఏరియా హక్కు లు,చట్టాల అమలులో సమస్యలు ప్రభు త్వాలు ఈసమస్యలను ఒక్కోఅంశంగా కాకుండా సమగ్ర ఆదివాసీ అభివృద్ధి విధా నం ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉం ది. ఆదివాసీ హక్కుల కోసం పోరాటం అంటే ఇతర సమాజాలకు వ్యతిరేకంగా పోరాటం కాదు. ఇదిరాజ్యాంగం కల్పిం చిన హక్కుల అమలు కోసం ప్రజాస్వా మ్య పోరాటం.ఆదివాసి ప్రజాసంఘాలు, ఉద్యో గులు,యువకులు,విద్యావంతులు, హక్కు లు,చట్టాలను,రాజ్యాంగం గురించి తెలుసు కుని,తమ హక్కులను ప్రజాస్వా మ్య పద్ధతుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరం ఆదివాసి జెన్ జీ యువకులు, విద్యార్థుల పైన ఉంది.సమాజంలో ఐక్యత,విద్య, చైతన్యం,ఆత్మగౌరవం పెం పొందించాలి. అడవిని కాపాడిన వారసులం.భూమిని తల్లిగా భావించిన వారసులం.ప్రకృతిని దేవతగా ఆరాధిం చిన వారసులం.మన సంస్కృతిని తరతరాలకు అందించిన వారసులం. మనకు దానం అవసరం లేదు. రాజ్యాంగ హక్కులు అమలు కావాలి. మనపై కనికరం అవసరం లేదు.మనకు సమాన గౌరవం కావాలి.మన సంస్కృ తిని చెరిపివేయడం కాదు.మన సంస్కృ తిని గౌరవించాలి.మన భూములను కోల్పో వడం కాదు.మన భూమి,అడవి, జీవనాధా రాలను రక్షించాలి.మన యువతకు హామీలు కాదు.నాణ్యమైన విద్య,ఉపాధి,అవకాశాల కోసం ఆదివాసి యువత ఉద్యమించాలి.
వ్యాసకర్త : ఆదివాసి స్టూడెంట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ.సెల్ నెంబర్ :9441288991