అరకులోయలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభం

“ గిరిజనుల ఆరోగ్యం కాపాడుటంతోపాటు వారిని అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావడం ప్రభుత్వ బాద్యత. ఆరోగ్యపరంగా,ఆర్దికంగా వారి ఉన్నతికి ప్రాధాన్యమిస్తాం.ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలకు సంజీవని కార్యక్రమం ద్వారా చెక్ పెడతామన్న నమ్మకం గిరిజన తెగల్లో వచ్చింది.సంజీవని రాష్ట్రానికి,దేశానికి ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అల్లూరి జిల్లా అరకులోయ నియోజకవర్గం గన్నెలలో సంజీవని నిర్వహించడంతోపాటు ఆరోగ్య రథాలను జెండాడ ఊపీ ప్రారంభించారు. డ్రోన్‌ల ద్వారా రక్త నమÖనాల రవాణా విధానాన్ని పరిశీలించారు. పథకం అమలులో భాగంగా ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం సంజీవని లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించారు.” మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా వైద్యం వారి దగ్గరకు రావాలన్న దే ప్రజా ప్రభుత్వం సంకల్పం అని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను రూపోందించేలా చేపట్టిన సంజీవనితో ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని సంరక్షిస్తామని సీఎం వివరించారు.ఈప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణ యించినట్లు తెలిపారు. అరకు లోయ నియోజకవర్గం గన్నెలిలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద ముఖ్యమంత్రి ప్రసంగించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రతి కుటుంబ జీవన ప్రమా ణాలు మెరుగుపడాలని, అదే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు అన్నారు. గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. సికిల్‌సెల్, తలసేమియా బాధితులకు నెలకు రూ.10వేల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో తక్కువ ధరకే మందులు అందించే జన ఔషధి కేంద్రాలు ప్రారంభి స్తామని చెప్పారు. అల్లూరి జిల్లాలో సంజీ వని కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.గతంలోనే అల్లూరి సీతారామరాజు గిరిజనులకు ఆయుర్వేద వైద్యాన్ని అందించారని గుర్తుచేశారు. అలాంటి మహనీయుడిని నిత్యం స్మరిం చుకునేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్ పోర్టుకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. థింసా నృత్యంతో గిరిజన బిడ్డలు గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడం అభినందనీయ మన్నారు.యోగా,ధ్యానం వంటి కార్యక్ర మాలను ప్రోత్సహిస్తూ ప్రజారోగ్యానికి ప్రాధా న్యత ఇస్తున్నామని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
డ్రోన్లతో అత్యవసర ఔషధాలు,వ్యాక్సీన్లు తరలింపు
ఏజెన్సీ ప్రాంతాల నుంచి రోగుల రక్త నమూనాలను డ్రోన్ల ద్వారా పెద్ద ఆసుప త్రులకు తరలించి పరీక్షలు నిర్వహించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా గర్భిణులకు సేవలందిస్తున్నామని, 104 వాహనాల ద్వారా సంచార వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇంటి వద్దే 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసర మైన మందులు అందించేలా చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గం,చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, ఇది రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ గేమ్ చేంజర్‌గా మారుతుందని అన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం అల్లూరి జిల్లాలో 150వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఉందని చెప్పారు.గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐదు సూత్రాలతో ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు తెలిపారు.‘అడవి తల్లి బాట’ పేరుతో రూ.1,000కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులు నిర్మించామని చెప్పారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా నీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్‌టాప్ లను ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉపాధి పెంచేందుకు అరకు కాఫీని మరో లక్ష ఎకరాల్లో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అరకు ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని, హోమ్‌స్టేల ద్వారా ఆతిథ్యం అందిస్తే గిరిజన కుటుంబాలకు ఆదాయం వస్తుందని చెప్పారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగాలు దక్కేలా నైపుణ్యాభివృద్ధి కల్పిస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు.- (జి.ఎ.సునీల్ కుమార్)