లౌకిక సౌభ్రాతృత్వం విలువలు తిరిగి వికసించాలి..!

మహాత్మాగాంధీ,నెహ్రూ,భగత్‌సింగ్‌,ఆజాద్‌ వంటి ఎందరో వీరుల నాయకత్వాన సాధించిన స్వాతం త్య్ర ప్రసాదాన్ని అందుకోవడానికి 75ఏండ్ల కింద ప్రారం భమైన పండుగ 1947 ఆగస్టు 15 స్వాతం త్య్ర దినోత్స వం. ఏటా ప్రజా విజయాన్ని, ప్రజాస్వా మ్యాన్ని కీర్తించి నీరాజనాలు ఎత్తుతూ జరుపుకొనే పండుగగా వర్ధిల్లుతూ వస్తున్నది. మూడు వందల ఏండ్లు బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం, నిరంకుశత్వం కింద దారిద్య్రం, దైన్యా లతో ప్రజలు జీవిం చారు. ఆంగ్లే యులు మన దేశాన్ని జయించడానికి, సుదీర్ఘకాలం పాలించడానికి మన జాతి నైతిక పతనం ప్రధాన కారణం. నైతిక పతనం ఎంత సులువో, దాన్ని తిరిగి నెలకొల్పడం చాలా కష్టం. మన దేశంలో మహమ్మా రిలా వ్యాపించి వ్యవస్థీకృతమైన మత మౌఢ్యాలు,ప్రజలను చీలికలు పేలికలుగా చేసిన కుల,వర్ణ వ్యవస్థలు,సాంఘిక దురాచారాలు,నీచ స్వార్థాలతో సింథియా,హోల్కర్లు వంటి కొందరి రాజుల,ఆర్కాట్‌ వంటి నవాబులు అరా చక, భోగ లాలస,వ్యక్తిగత అహంకారాల వల్ల యావత్‌ ఉపఖండం దాస్యంలోకి వెళ్లిపోయింది.
దేశ దాస్యాన్ని అనివార్యం చేసిన నైతిక పతనంలో కూడా అప్పుడప్పుడు తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.1757ప్ల్లాసీ,ఆంగ్లో-మైసూర్‌ యుద్ధా లు,1800 ఆరంభంలో హిందూ సాధువులు సంప్ర దాయ ఆయుధాలతో నిర్వహించిన సన్యాసి తిరుగు బాటు (ఈ ఉద్యమం ఇతివృత్తంగా బంకించంద్ర ఛటర్జీ‘ఆనందమఠం’అనే నవల రాశారు), 1857లో ప్రజ్వలించిన ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం వీటిలో భాగమే.ఈ యుద్ధాల్లో మన ప్రజలనే సైన్యంగా మలచుకొని మన డబ్బుతొనే,మన పాలకులలో కొందరి ధనలోభం, అధికార వ్యామోహం, స్వామి ద్రోహంతో ఆంగ్లేయులు ఈ దేశభక్తియుత యుద్ధా లలో విజయం సాధించారు. ఇవి జాతిలో తీవ్ర నైరాశ్యం, నిస్పృహలను కలిగించాయి. 1900 నుం చి స్వాతంత్య్ర సమరఆకాంక్ష మళ్లీ మొగ్గ తొడి గింది. దీనికి పునాదులు వేసిన వారు సామాజిక సంస్కర్తలు,కవులు,కళాకారులు.వీరి విశేష కృషితో భారతజాతి నైతిక పునరుత్తేజం పొందింది. ఆంగ్లే యుల ఆధిపత్యంలో బానిసలుగా ఉండటం సిగ్గు చేటనే భావన ప్రబలింది. 1880 నుంచి గెలుపోట ములతో నిమిత్తం లేకుండా అలలు అలలుగా, ఉప్పెనగా కొనసాగిన1905,1917,1921,19 29,1942,1947వరకు ప్రజావెల్లువలతో స్వాతంత్య్రం సాకారమైంది.
స్వాతంత్య్ర పాలన తొలినాళ్ళలో వైజ్ఞాని కవేత్త,సోషలిస్ట్‌ నెహ్రూ,సామాజిక విప్లవ నేత అంబే ద్కర్‌ల నేతృత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనువైన రాజ్యాంగాన్ని రూపొందించారు. పీడిత ప్రజాకోటి వికాసానికి అనేక రక్షణలు కల్పించారు. ప్రజల మౌలిక ప్రగతికి తోడ్పడే విద్య, వైద్యం,రవాణా, గనులు,శక్తి రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉం చారు.చెల్లా చెదురైన దేశానికి నిర్దిష్ట రూపం తెచ్చా రు.విద్య,పాలన,ఆర్థిక విషయాల్లో వేల ఏండ్లుగా భాగస్వామ్యానికి నోచుకొనివారికి చోటుదక్కింది, వ్యవసాయ వైజ్ఞానికరంగాల్లో స్వావలంబనతో పాటు అనేక విజయాలు సొంతం చేసుకున్నాం. వేల ఏండ్లుగా భారత సమాజాన్ని అంధకారంలో ఉంచి నమత మౌఢ్యం,విశ్వాసాల ప్రాతిపదికతో ప్రజల ఐక్యతను చీల్చే రాజకీయాలు పురుడు పోసు కొని ప్రస్తుతం మహా విపత్తుగా మారాయి. జాతీయో ద్యమంలో కానీ,సాంఘిక విప్లవాలతో కానీ సంబం ధం లేని శక్తుల పాలనలో ప్రస్తుత జీవన ప్రామా ణికత సూచికల్లో అన్నీఅధమస్థానాలే. సాధించుకున్న అనేక హక్కులను, రాజ్యాంగ వ్యవస్థలను, రక్షణలను బలహీనం చేస్తున్నాయి. సమాఖ్యవ్యవస్థ స్ఫూర్తిని కాలరాస్తూ అప్రజాస్వామిక నియంత ధోరణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్వాతం త్య్ర సమరంలో అశేష త్యాగాలు చేసిన లక్షలాది ప్రజల ఆకాంక్షలను తిరిగి నెలకొల్పే బాధ్యతను విద్యా వంతులు,ప్రజాస్వామికవాదులు తీసుకోవాలి. లౌకిక,సౌభ్రాతృత్వ విలువలను తిరిగి వికసింప జేయాలి.
లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్‌ను కాపాడుకుందాం
భయంకరమైన మత విభజనల పెరుగు దలతోపాటు గతంలో లేని విధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇతరులు అనా గరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు.భిన్నాభిప్రా యంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మోడీ ప్రభుత్వం ‘’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’’గా నామకరణం చేసింది. ఈ సందర్భం, దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసే దృష్టిని సారించే పెద్ద ప్రచారంగా మారింది. దీని కోసం ఖాదీ, కాటన్‌,సిల్క్‌ కానటువంటి పాలిస్టర్‌ జెండాలను కూడా అనుమతించే విధంగా భారతదేశ జెండా కోడ్‌ను డిసెంబర్‌ 2021లో సవరించారు. దేశంలో అత్యంత పెద్ద పాలిస్టర్‌ ఉత్పత్తిదారులెవరో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎంపిక చేయబడిన సన్నిహితులు భారీ లాభాలనుపొందే అవకాశాలను ఇది సమ కూర్చుతుంది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి అయ్యేంతవరకు,ఆరెస్సెస్‌,బీజేపీలు జాతీయ జెండాను ఆవిష్కరించలేదు. కాషాయ జెండాపైనే వారికి విశ్వాసం. ఆరెస్సెస్‌కు భారత స్వాతంత్య్రో ద్యమంలో ఎటువంటి భాగస్వామ్యం లేదు. ఇది చరిత్రకారులు నమోదు చేసిన, ఆనాటి బ్రిటిష్‌ ఇంటి లిజెన్స్‌ నివేదికలు ధృవీకరించిన నిజం.
మహోన్నతమైన పాత్ర
దీనికి భిన్నంగా, భారత కమ్యూనిస్ట్‌ పార్టీ (మార్క్సిస్ట్‌)కి చెందిన తొమ్మిది మంది వ్యవస్థా పక పొలిట్‌ బ్యూరో సభ్యులందరినీ బ్రిటిష్‌ ప్రభు త్వం అరెస్ట్‌ చేసింది. స్వాతంత్య్ర పోరాట కాలంలో సుదీర్ఘ కాలంపాటు వారంతా జైల్లోనే గడిపారు. అండమాన్‌లోని సెల్యులార్‌ జైల్‌ (కాలాపాని) వద్ద పాలరాతిపై చెక్కబడిన చాలాపేర్లు కమ్యూనిస్ట్‌ విప్ల వోద్యమంతో ముడిపడి ఉన్నాయి. 1947 ఆగస్ట్‌, 15 నాటికి కన్ననూర్‌ జైల్లో ఖైదీగా ఉన్న కామ్రేడ్‌ ఎ.కె.గోపాలన్‌జాతీయ జెండాను ఆవిష్క రించాడు. 1932 హోషియార్‌పూర్‌ కలెక్టరేట్‌లో యూనియన్‌ జెండాను కిందకులాగి, త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన 16 ఏళ్ల హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ను బ్రిటిష్‌ వారు అరెస్ట్‌ చేశారు. కమ్యూనిస్టులకు, సీపీఐ(ఎం)కు దేశ భక్తి, త్యాగనిరతి అనేవి భారతదేశ సోషలిస్టు పరివ ర్తన యొక్క విప్లవ దార్శనికతకు అంతర్భాగంగా ఉంటాయి.1920లో దాని పుట్టుక నుండే కమ్యూ నిస్ట్‌ పార్టీ జాతీయోద్యమ ఎజెండాను ప్రభావితం చేయడం ఆరంభించింది. 1921లో అహ్మదాబాద్‌ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమా వేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మౌ లానా హస్రత్‌ మోహాని,స్వామీ కుమారానంద బ్రిటిష్‌ వారినుంచి సంపూర్ణ స్వాతంత్య్రాన్ని డిమాం డ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ దానిని గాంధీజీ అంగీకరించలేదు (‘సంపూర్ణ స్వరాజ్యం’ పిలుపు 1929లో మాత్రమే ఇచ్చారు). తరువాత 1922లో గయ లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించిన పత్రాలను పంచింది. ఆతర్వాత జరిగిన ఏఐసీసీ సమావేశా ల్లో కూడాఇది కొనసాగింది.జాతీయోద్యమ ఎజెం డాను ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద పాత్రను పోషించారు.1940లలో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు వివిధ ప్రాంతాలలో చేపట్టిన భూపోరాటాలు స్వాతంత్య్ర సాధనలో కీలకమైనవి.కేరళ లోని పున్నప్ర వాయలార్‌, బెంగా ల్‌ లోని తెభాగపోరాటం, అస్సాంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వీటిలో ముఖ్యమైనవి.భారతదేశంలోని భాషాపరమైన భిన్న త్వాన్ని కమ్యూనిస్టులు సమర్థించారు. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారిని స్వాతంత్య్ర పోరా టంతో ఐక్యంచేయడంతో,స్వతంత్ర భారత దేశంలో భాషాపరమైన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు దారి తీసింది.లౌకికవాదంపట్ల కమ్యూనిస్టులకుండే అచం చలమైన నిబద్ధత, స్వాతంత్య్ర పోరాట కాలంలో చెలరేగిన మత ఘర్షణల్లో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పి,నిలబెట్టడంలో చాలా ప్రధాన పాత్రను పోషించింది. కమ్యూనిస్టులు నేటికీ లౌకికవాదానికి అత్యంత నిబద్ధత కలిగిన సమర్థకులుగా ఉన్నారు.
చరిత్ర వక్రీకరణ
కానీ,నేడు తమను తాము స్వాతంత్య్రో ద్యమ పోరాటంలో భాగస్వాములమని తప్పుడు ప్రచారం చేసుకోవడం ద్వారా ఆరెస్సెస్‌, బీజేపీలు చరిత్రను వక్రీకరించి,చరిత్రను తిరగ రాసే ప్రయ త్నం చేస్తున్నాయి. హిందూత్వ, ఆరెస్సెస్‌ నాయకులు స్వాతంత్య్ర సమర యోధులని చిత్రీకరిస్తూ ప్రభుత్వం ప్రచారాన్ని చేపట్టింది. ఈప్రచారంలో ఉదహరిం చబడిన వారిలో వీడీ సావర్కర్‌ ముందున్నాడు. హిందూ మతాచారంతో సంబంధం లేని రాజకీయ లక్ష్యాలు గల ‘హిందూత్వ’ అనే పదాన్ని 1923లో కనుగొన్నది వి.డి.సావర్కర్‌. ఒక ప్రత్యేక ముస్లిం దేశం కోసం మహ్మదాలీ జిన్నా పోరాటానికి నాయ కత్వం వహించడానికి రెండు సంవత్సరాల ముందే సావర్కర్‌ ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చా డు.దానిని బ్రిటిష్‌ వారు ప్రోత్సహించాడు.ఆ తర్వా త విషాదకరంగా దేశ విభజన జరిగింది. బ్రిటిష్‌ పాలకులతో సంధి కుదిరిన తరువాత సావర్కర్‌, తనరాజకీయ జీవితంలో ఎక్కు వ భాగం, కాంగ్రెస్‌, వామపక్షాల నేతృత్వం లోని ఉద్యమాలకు వ్యతిరేకం గానే ఉన్నాడు. హిందూ మహాసభ నాయకునిగా, 1942లో జరిగిన క్విట్‌ ఇండియా లాంటి ఉద్య మాలలో హిందూ మహా సభ, ఆరెస్సెస్‌ సభ్యుల భాగస్వామ్యం లేకుండా చూశాడు. వాస్తవాలన్నిటిని మరుగునపెట్టి వారు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. కమ్యూ నిస్టుల విషయం పక్కన పెట్టండి, ప్రభుత్వ ప్రచారా లలో జవహర్‌ లాల్‌ నెహ్రూ గురించి కూడా ఎక్కడా ప్రస్తావిం చడం లేదు.భారత రాజ్యాంగం, స్వాతంత్య్ర భారత దేశం ఒకఆధునిక లౌకిక ప్రజా స్వామిక రిపబ్లిక్‌గా రూపొందేందుకు దారి తీసిన అనేక చర్చలు, తీర్మా నాలకు దారి చూపిన వ్యక్తి నెహ్రూ. ఈ విషయాన్ని మరుగుపరిచి బీజేపీ తన ఫాసిస్ట్‌ హిందూత్వ రాజ్యం ఆలోచనను నిజం చేసే చర్యలను ముందుకు తీసు కొనిపోతోంది.
భారత రాజ్యాంగంపై దాడి
ఈఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతం కావాలంటే, మన రాజ్యాంగం కల్పించిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక ప్రజాస్వామిక లక్షణం పైన దాడి చేసి, బలహీనపరచి, నాశనం చేయాల్సి ఉంది. తదనుగుణంగానే 2019లో మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుండి…మన రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సామాజిక న్యాయం, ఆర్థిక సార్వభౌమత్వాలు తీవ్రమైన దాడికి గురవు తున్నాయి. చర్చలులేని తీరుతో పార్లమెంట్‌ సాంప్ర దాయాలను తుంగలో తొక్కుతున్నారు. ఏ విధమైన చర్చలు లేకుండానే కేవలం మంద బలంతో చట్టా లను ఆమోదింపజేసు కుంటున్నారు. ప్రస్తుత పార్ల మెంట్‌ సమావేశాల్లో, ఆకాశాన్నంటే ధరలు, పెరిగి పోతున్న నిరుద్యోగం లాంటి ప్రజలెదుర్కొం టున్న సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్‌ చేసిన నేరా నికి గతంలో ఏనాడూలేని విధంగా27మంది ఎంపీలను సస్పెండ్‌ చేశారు. పని చేయని పార్ల మెంట్‌ చాలా ప్రమాదకరం.అంటే భారత రాజ్యాం గం యొక్క ప్రాముఖ్యత, ప్రజల సార్వభౌ మత్వం, ప్రజలకు జవాబుదారీగా ఉండే ఎంపీల అధికారం, పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం లేకుండాపోవడం.పార్లమెంట్‌ను బలహీనపర్చ డమంటే, ప్రజల సార్వభౌమత్వాన్ని రద్దు చేయడం, ప్రభుత్వం జవాబుదారీతనం నుండి తప్పించుకొని, ఫాసిస్ట్‌ విధానాలను అవలంబిస్తూ నిరంకుశత్వం వైపు వెళ్లడం.దాదాపు మూడేళ్లుగా ఆర్టికల్‌ 370,ఆర్టికల్‌ 35ఏ రద్దు సవాళ్లు, సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం),రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికలబాండ్లు మనరాజ్యాంగాన్ని ఉల్లం ఘించే అంశాలుగా మారాయి. ఇవేవీ సుప్రీం కోర్టుకు వినిపించవు. న్యాయ వ్యవస్థ యొక్క నిష్పా క్షికత,స్వతంత్రత తీవ్రంగా రాజీ పడినప్పుడు, రాజ్యాంగ నిబంధనల అమలు,ప్రజాస్వామిక హక్కు ల హామీలు,పౌర హక్కులపై విచారణ ఉనికిలో లేకుండా నిలిచిపోతుంది.అదేవిధంగా,ఒక ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తూ, స్వేచ్ఛాయుత వాతావర ణంలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిష న్‌ స్వతంత్రత, నిష్పాక్షికత చాలా ముఖ్యమైనవి. ఇది రాజీ పడినప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకే మాత్రం ప్రజల తీర్పును, ప్రజాస్వామిక అభిప్రాయా లను ప్రతిబింబించవు. సీబీఐ,ఇ.డిమోడీ ప్రభుత్వ రాజ కీయ ఎజెండాను అమలు చేయడానికి సాధనా లుగా మారిన తీరును దేశమంతా గమనిస్తున్నది. ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడం, ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరచడం,ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైన ప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడానికి గల హామీకై పార్టీ ఫిరాయింపుల కోసం ఒత్తిడి చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, దానిని నాశనం చేస్తున్నారు.
తీవ్రమైన మత విభజనలు
ఇలా భారీగా రాజ్యాంగ క్రమాన్ని నాశ నం చేయడంతో పాటు భారతరిపబ్లిక్‌ లౌకిక ప్రజా స్వామిక లక్షణాన్ని నాశనం చేయడానికి విషపూరిత మైనద్వేషం,భయాల వ్యాప్తిపై ఆధారపడి క్రూరమైన రీతిలో మత విభజనల ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ‘బుల్డోజర్‌ రాజకీయాల’ వ్యూహ రచన, కొన్ని రాష్ట్రాల్లో హింసకు దారితీసే రీతిలో మైనా రిటీలను లక్ష్యంగా చేసుకోవడం, పార్లమెంట్‌ నూతన భవనంపైన జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించే సంద ర్భంలో హిందూ మతాచారాలను ఆచరించడం లాంటి చర్యలు భారతరాజ్యాన్ని,ప్రభుత్వాన్ని హిం దూత్వతో గుర్తిస్తున్నారు కానీ భారత రాజ్యాంగంతో కాదని స్పష్టం చేస్తున్నాయి.ఇలాంటి భయంకరమైన మత విభ జనల పెరుగుదలతో పాటు గతంలోలేని విధంగా ప్రజల పౌరహక్కులు,ప్రజాస్వామిక హక్కు లపై దాడులు జరుగుతున్నాయి.తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బంధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు…కొంతమంది జర్నలిస్టులు, ఇత రులు అనాగరిక చట్టాల కింద జైల్లో ఉన్నారు. భిన్నాభి ప్రాయంతో కూడిన ప్రతీ వ్యక్తీకరణను ‘దేశద్రోహం’ గానే పరిగణిస్తున్నారు.ఈ హిందూత్వ కథనం విజయవంతం కావాలంటే,ఈ ఫాసిస్ట్‌ ప్రాజెక్ట్‌ లోని సిద్ధాంతం కొనసాగడానికి భారతదేశ చరిత్రను తిరగ రాయా ల్సిన అవసరం ఉంటుంది. అందుకే విద్యా విధానంలో మార్పులు చేస్తున్నారు. వివేచనా రహిత ఆలోచనలను ప్రచారంచేస్తు న్నా రు.హేతుబద్ధత స్థానాన్ని మార్చేప్రయత్నం చేస్తు న్నారు.గుడ్డివిశ్వాసాలను ప్రచారం చేస్తూ, శాస్త్రీయ తను కాదని పురాణాలను ప్రచారం చేస్తు న్నారు. చరిత్రస్థానంలో హిందూ పురాణాలను, తత్వ శాస్త్రం స్థానంలో హిందూ ధర్మశాస్త్రాన్ని తీసు కొని రావడంద్వారా భారతదేశం యొక్క గొప్ప వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని నాశనం చేస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆకలి, పౌష్టికాహార లోపం లాంటి రోజువారీ సమస్యలపై ప్రజా పోరా టాలను, ప్రతిఘటనలను పెంచడం ద్వారా భారత దేశం లౌకిక ప్రజాస్వామిక రాజ్యాం గాన్ని రక్షించి, బలోపేతం చేసే బాధ్యతను తీసు కోవాలి. ప్రజా స్వామ్యం,ప్రజాస్వామిక హక్కులు,పౌర హక్కులు, లౌకికవాదాల రక్షణకై పోరాటా లను ఉధృతం చేయాలి. బలమైన ప్రజా పోరాటా లను ఉధృతం చేయడం ద్వారా సీపీఐ(ఎం) స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. వామపక్ష శక్తుల ఐక్యతను సంఘటిత పరచడం, వామపక్ష ప్రజా తంత్ర శక్తుల్ని ఏకం చేయడం, హిందూత్వ మతో న్మాదానికి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన లౌకిక శక్తులను సిద్ధం చేయడం ద్వారానే 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన లౌకిక ప్రజాస్వామిక రిపబ్లిక్‌ రాజ్యాంగాన్ని రక్షించు కోగలం.ఈలక్ష్యాన్ని నిజం చేసే మన దేశభక్తి తోనే ఆగస్ట్‌ 15న అన్ని పార్టీ కార్యాలయాల్లో జాతీ య జెండాను ఆవిష్కరించి, మనరాజ్యాంగంలోని పీఠిక పై ప్రతిజ్ఞ చేశామని గుర్తుంచుకోవాలి.ఈఉన్మాద పూరిత,ఫాసిస్టు ప్రయ త్నాల నుండి స్వేచ్ఛకోసం, మనలౌకిక ప్రజాస్వామికరిపబ్లిక్‌నుకాపాడు కోవడం కోసం జరిగే పోరాటాన్ని బలపరుచు కుందాం!
భయంకరమైన మత విభజనల పెరుగు దలతో పాటు గతంలో లేనివిధంగా ప్రజల పౌర హక్కులు,ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగు తున్నాయి. తీస్తా సెతల్వాద్‌ను అరెస్ట్‌ చేసి నిర్బం ధించిన తీరును చూశాం. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో కొనసాగుతున్న అనేక మందితో పాటు..కొంతమంది జర్నలిస్టులు,ఇతరులు అనా గరిక చట్టాలకింద జైల్లోఉన్నారు. భిన్నాబి óప్రాయం తో కూడిన ప్రతీవ్యక్తీకరణను ‘దేశద్రోహం’గానే పరిగణిస్తున్నారు. (ప్రజాశక్తి సౌజన్యంతో) –(అస్నాల శ్రీనివాస్‌ / సీతారాం ఏచూరి)

జనగణనలో ఆదివాసీల మతమేమిటీ?

ఈ దేశంలోని 12 కోట్ల మంది ఆది వాసీలకు విలక్షణ మత అస్తిత్వం ఉన్నది. వారిని హిందు వులు లేదా ఇతర ప్రధాన స్రవంతికి చెందిన ఇతర మతాల వారిగా పరిగణించడం సబబు కాదు. 2021 జనాభా గణన ప్రక్రియలో ఆదివాసీ లను వారి సొంత మతాలకు చెందినవారుగా మాత్రమే నమోదు చేయాలి. ఈదేశంలో ఆదివాసీలకు సరైన గుర్తింపు ఉందా? కొత్త సంవత్సరం (2021)లో దేశ జనాభా గణన ప్రక్రియ మొదలవనున్నది. ఆదివాసీలను ఏ మతా నికి చెందిన వారుగా నమోదు చేయనున్నారు? ఈ విషయమై ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో ఆదివాసీలకు సముచిత గుర్తింపు లభించింది. అయితే అది ఎంతో కాలం కొన సాగలేదు.
భారతదేశ జనాభాలో ఆదివాసీల సంఖ్య12 కోట్లు. వీరి మతమేమిటి?ఆదివాసీ సమూహాలు అనుసరిస్తున్న మతంపై సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతోంది. జనాభా గణనలోనూ లేదా అటువంటి ఇతర గణనల్లోనూ ఆదివాసీ మతాలలో ఒకదాన్ని ఎంపిక చేసుకునేందుకు తమకు హక్కు కల్పించాలని ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. స్వతంత్ర భారతదేశ తొలి జనాభా గణన ప్రక్రియలో ‘మతం’కాలమ్‌లో‘ట్రైబ్‌’ అనేది తొమ్మిదో గుర్తింపులో ఉండేది. ఆదివాసీలు అంద రూ తమ మతాన్ని ‘ట్రైబ్‌’గా పేర్కొనేవారు. తరువాత ఈ ఆప్షన్‌ను తొలగించారు. ఫలితంగా ఆదివాసీలు వివిధ మతాలకు చెందిన వారుగా నమోదవు తున్నారు. ఇది తమ ఆత్మగౌరవాన్ని కించపరు స్తోందని ఆదివాసీలు వాపోతున్నారు. ఇప్పుడు జనాభా గణనలో ఆరు మతాలు-హిందూ, ముస్లిం, క్రైస్తవ,బౌద్ధ,జైన,సిక్కులకు మాత్రమే గుర్తింపు ఉంది.2011కి పూర్వం ఈ ఆరు మతాలతో పాటు ‘అదర్స్‌’(ఇతరులు) అనే ఆప్షన్‌ ఉండేది. ఆదివాసీలు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకునేవారు.ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. జనాభా గణన ప్రారంభమయిన 1871 మొదలు 1931దాకా ఆదివాసీలు తమ మతాన్ని ఆదివాసీమతంగా నమోదు చేసేవారు.స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా 1961 నుంచి ఆ అవకాశం లేకుండా పోయింది. హిందువులుగా, క్రైస్తవులుగా, ఇంకా ఇతర మతాలవారుగాఆదివాసీలను నమోదు చేయ డం జరుగుతోంది.‘ఆదివాసీ మతం’ అనే ఆప్షన్‌ను తొలగించడమంటే తమను మతపరమైన బానిసలు గా పరిగణించడం కాదా అని పలువురు ఆదివా సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సువిశాల దేశంలోని ఆదివాసీలు మొత్తం83 మతా చరణలను అనుసరిస్తున్నారు. విశ్వాసాలు, ఆచారా లు, ఆరాధించే దేవతలు, ఆరాధనా పద్ధతు లు మొదలైనవి భిన్నమైనవి అయినప్పటికీ తమకు మత పరంగా ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సహజంగా ఆరాటపడుతున్నారు. ప్రధాన స్రవంతి మతాలకు చెందినవారుగా గుర్తింపు పొందడానికి వారు నిరాకరిస్తున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్‌ శాసనసభ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రస్తావించ వలసి ఉంది.ఆరాష్ట్రంలోఅత్యధిక సంఖ్యలో ఉన్న శర్ణ ఆదివాసీల మతానికిగుర్తింపు నివ్వాలని, 20 21 జనాభా గణనలో ఆ మతానికి ఒక ప్రత్యేక గుర్తింపు క్రమసంఖ్య నివ్వాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ జార్ఖండ్‌ శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.శర్ణ ఆదివాసీలకు గుర్తింపు విషయమై ఆరాష్ట్ర ముఖ్యమంత్రి హేమం త్‌ సోరేన్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ విషయమై ఆయన ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు. జార్ఖండ్‌ శాసనసభ తీర్మానం దేశవ్యా ప్తంగా ఆదివాసీల అస్తిత్వానికి జీవం పోసింద నడంలో సందేహం లేదు. మతపరంగా జాతీయ స్థాయిలో ఒక నిర్దిష్ట గుర్తింపు కోసం ఆదివాసీలు సమైక్యమయ్యేందుకు జార్ఖండ్‌ అసెంబ్లీ తీర్మానం విశేష ప్రేరణ నిచ్చిందనడంలో సందేహం లేదు. ఆదివాసీలను దశాబ్దాలుగా హిందు వులు లేదా ప్రధాన స్రవంతికి చెందిన ఇతర మతాలవారుగా ఎందుకు పరిగణిస్తున్నారు? ఇన్నేళ్లుగా ఆదివాసీలకు మతపరమైన నిర్దిష్ట గుర్తింపు లేకుండా ఎందుకు చేశారు? ఈ దేశంలో ఆదివాసీల అస్తిత్వం మూలాలు ఏమిటి? అనే దానిపై చర్చ జరగడం శ్రేయస్కరం. ఇటువంటి చర్చ జరగని పక్షంలో ఈ దేశ సామాజిక వాతావ రణంలో ఒక స్పష్టమైన మార్పు రావడం అసంభవం అనేది నేడు దేశహితులు అందరూ గుర్తించవలసిన వాస్తవం. నాగరికత ఆనవాళ్ళు అనేవి నవీన శిలా యుగంలో ప్రారంభమయ్యాయి. తమ జీవన ప్రస్థా నాన్ని ముందు తరాల వారికి తెలియజేయాలనే ఆలోచన ఈయుగ మానవులకు వచ్చింది. ఈ విష యమై వారి కార్యాచరణ అద్భుతమైనది. చిత్రాల రూపంలో బండరాయిపై చెట్లరసంతో ముదురు ఎరుపురంగు బొమ్మలు వేయడం ఆ కార్యాచరణలో భాగమే. అటువంటి బొమ్మలు నేడు ఆదివాసీలు నివసించే దట్టమైన అటవీ ప్రాంతాలలో, కొండ గుహలలో కానవస్తున్నాయి. పలువురి పరిశో ధనల్లో ఆబొమ్మలు ఆదివాసీల జీవనంలో భాగమైన పడగలలోని చిత్రలిపి, మౌఖిక సాహిత్యంలో ఉన్నవని నిర్ధారణ అయింది. నవీన శిలాయుగ మాన వులు తమ అస్తిత్వాన్ని చిత్రాల రూపంలో చాటిన మొదటి ఆదివాసీలు. ఆనాటి నుంచి నేటిదాకా ఆదివాసీల జీవనం అడవిలోనే సాగుతోందనడానికి ఇవి తిరుగులేని చారిత్రక ఆనవాళ్లు.
నవీన శిలాయుగంలోనే వ్యవసాయం అంకురించింది.ఆతర్వాత మనిషిని మరింత పరి పూర్ణంగా తీర్చిదిద్దిన నాగరికత సింధు నాగరికత. సింధు నాగరికతతో ఆదివాసీలు ఒక పరిపూర్ణ నాగరికత నిర్మించారని చెప్పవచ్చు.సింధు నాగరిక తలో ఉన్న చిత్రలిపి నేటి ఆదివాసి జీవనంలో సజీవంగా ఉంది. నేటి గోండ్వానా ప్రజల జీవన చిత్రాలు, వేషధారణ కూడా సింధు నాగరికత ఆదివాసి నాగరికతే అని దృష్టాంతీకరిస్తున్నాయి. గోండ్వానా జీవనంలో ప్రాచీన శిలాయుగంలో బండరాళ్ళపై చిత్రలిపి వేసిన ఆదివాసీలు నవీన శిలాయుగంలో దానిని పెద్ద పెద్ద వృక్షాల దారు వుపై వేశారు.సింధు నాగరికత నాటికి ఎర్రని గుడ్డపై చెట్లరసంతో బొమ్మలు వేసి పడిగెల రూపం లో వంశవృక్షాలలో జన్యుపరమైన విభజన చేసు కోవడం జరిగింది.నేటికీ ఆదివాసి ఇలవేల్పు జాతర లో తమ చరిత్రను వంశవృక్షాన్ని దైవ రూపంలో కొలుచుకుంటున్నారు. కొన్ని లక్షల సంవత్సరాలు అయినా తమ వంశవృక్షం ఏమిటి అనే దాన్ని స్పష్టంగా చిత్రలిపి రూపంలో తెలుసుకునేంత గొప్ప శాస్త్రీయ పరిజ్ఞానం ఆదివాసి సమాజంలో మాత్రమే ఉంది. మరి ప్రాక్‌చరిత్ర నుంచి నేటి వరకు ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ఆదివాసీలు హిందు వులు లేదా ఇతర మతాలకు చెందిన వారు ఎలా అవుతారు? పాక్‌చరిత్ర నుంచి నేటి వరకు ఒక్క ఆధారం కూడా ఆదివాసి హిందువు అని చూపించే తార్కాణం ఏదీ కూడా లేదనేది స్పష్టాతిస్పష్టం. ఆదివాసి పూజా విధానంలో పురోహితులు ఉం డరు.ఆదివాసీలు ప్రత్యేక ఆచారాలతో పూజ నిర్వహించుకుంటారు.వారి పూజలు పకృతితో మిళి తమై ఉంటాయి. ఆదివాసీ పండుగలు, ఆచారాలు, కట్టుబాట్లు, జంతుబలులు, ఆహార అలవాట్లు, ఇలవేలుపు జాతరలు భౌగోళిక ప్రాంతాలవారీగా ఒక విలక్షణమైన పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఈరోజు విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది. ఆదివాసీ జీవనమే ఒక శాస్త్రీయ జీవనం. విగ్రహం ఆధారం లేనిపూజలు,ఈ సృష్టిలో భూగో ళాన్ని మించిన దైవం లేదని భూమిని కొలిచే భూమి పండుగ,మనిషికి ఆహారాన్ని అందించి ఆకలి తీర్చే ఉత్పత్తికి మూలమైన విత్తనాలను దైవంగా పూజించే విత్తనాల పండుగ ఆదివాసీల విశిష్ట జీవనశైలికి దర్పణాలు.ఉత్పత్తి ప్రక్రియలను ప్రకృతిలో అంతర్భా గంగా భావించి, పండుగలు చేసుకోవడం ఆదివాసీ ల విలక్షణత.ఉత్పత్తి ప్రక్రియలకు మించిన అంశా లు ఈ ప్రకృతిలో ఏమీ లేవు. కనుకనే ప్రకృతిలో ఉత్పత్తికి సంబంధించిన ప్రతి కదలికను ఆదివాసీలు పూజిస్తారు.రేలా పాటలు, కొమ్ము, దింసా, గుస్సాడీ దండారి పాటలు, అడవిలో ఆడే నెమలి ఆటలు, ప్రకృతిలో జంతువుల నుంచి నేర్చుకున్న కళలు. బాహ్యప్రపంచంతో సంబంధం లేని,దట్టమైన అడవులలో,కొండప్రాంతాలలో కల్మషం లేని విశిష్ట సంస్కృతి ఆదివాసీలది.మరి వారిని హిందువు లుగా భావించడం సబబేనా? ఈ వాస్తవాల దృష్ట్యా భారత రాజ్యాంగంలోని ఐదు,ఆరు షెడ్యూళ్లలో పేర్కొన్న ఆదివాసీ తెగలకు మతపరంగా ఒక నిర్దిష్ట గుర్తింపునివ్వాలి. ఇందుకు 2021 జనాభా గణన ప్రక్రియతో శ్రీకారంచుట్టాలి. ఆదివాసీలపై హిందూ, క్రైస్తవ,ముస్లిం మతాల పేరిట దాడులు జరిగినా, పరాయీకరణ కార్యక్రమాలు చేపట్టినా ఇందుకు బాధ్యులైన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మోపాలి.గోండ్వానా,ఇతర గిరిజన తెగల సంస్కృ తులను సంరక్షించాలి. ప్రకృతిని సంరక్షించే ఈ అడవిబిడ్డల విలక్షణ మనుగడను కాపాడడం ప్రభు త్వాల నైతిక కర్తవ్యం.
వ్యాసకర్త : వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తుడుం దెబ్బ

గిరిజన కథల పొది..ఇప్ప పూలు

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు అందించిన ఈనెల పుస్తక పరిచయం ప్రముఖ రచయత ‘ ఐ.ఏ.ఎస్‌ అధికారి అయిన అపరమేధావి ‘‘ గూడూరు రాజేందర్రావు గారి ’’ కలం నుంచి జాలు వారిన ‘విప ్పపూలు’ -డా. అమ్మిన శ్రీనివాసరాజు


తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలది ఒక ప్రత్యేక స్థానం,గిరిజనుల సంస్కృతి సాంప్రదా యాలు ఎలాంటి విశిష్టత,ప్రత్యేకతలు,కలిగి ఉం టాయో ఆ కథలు కూడా అంతే వైవిధ్యం నింపుకొని సాగుతాయి. 1910లో తెలుగు సాహిత్యంలో కథల తలుపులు తెరుచుకుంటే 1932లో గూడూరు రాజేంద్రరావు ‘‘చెంచి’’ కథతో గిరిజన కథల ప్రవేశం మొదలైంది. ప్రారంభంలో గిరిజన జన జాతికి చేరువలో జీవనం సాగించిన, అడవిబిడ్డలపై అభిమానం గల రచయితల నుంచి అరకొరగా గిరిజన ప్రత్యేక కథలు వెలువడ్డాయి.
అనంతర కాలంలో ఆదివాసుల్లో కూడా అక్షరాస్యత దినదిన ప్రవర్తమానమై వారిలో కూడా రచయితలు ఆవిర్భవించారు. అంతకు ముందుగల వారియొక్క ‘‘నోటి సాహిత్యం’’ను అక్షరబద్దం చేసే పని ప్రస్తుతం విస్తృతంగా జరుగుతుంది. గతంలో గిరిజనుల పోరాటాలు, అన్యాయా లకు గురవుతున్న తీరు,వారికష్టాలు మాత్రమే కథా వస్తువులుగా కథలు వెలువడి అవి అన్ని ‘‘సానుభూతి కథల’’ జాబితాలో చేరిపోయాయి. అనంతరం వచ్చిన గిరిజనులే వ్రాసిన గిరిజన కథల్లో విస్తృత మార్పులు చేరి వారి సంస్కృతి సాంప్రదాయాలే కథా వస్తువులుగా గిరిజన కథలు వెలబడుతూ..‘‘స్వానుభవ కథల’’ జాబితాగా తయారయ్యాయి, కథలు అవే అయినా వస్తువుల్లో భిన్నత్వం సంతరించుకొని అటు పాఠకులకు ఇటు పరిశోధకులకు పూర్తి సంతృప్తిని అందిస్తూ తెలుగు కథా సాహిత్యంలో గిరిజన కథలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
గిరిజన జీవితాలకు సంబంధించి విశ్వవిద్యాలయ స్థాయిలో విస్తృత పరిశోధనలు జరిగిన గిరిజన కథల గురించిన పరిశోధనలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఖమ్మంకు చెందిన ప్రముఖ సీనియర్‌ రచయిత, జీవన్‌ అవిశ్రాంత సాహితీ కృషిలో భాగంగా ఆయన సంపాదకత్వంలో2009 సంవత్సరంలో 29 కథలతో ‘‘ఇప్ప పూలు’’ గిరిజన సంచార తెగల కథా సంకలనం వెలువడిరది, దానికి లభించిన అత్యధిక ఆదరణతో మరో పదకొండు అచ్చమైన గిరిజన కథలు జోడిరచి మొత్తం 40కథలతో ‘‘ఇప్పపూలు’’ మలికథా సంకలనం ఇటీవల వెలువడిరది. దీనిలో 30% సంచార జాతుల వారి జీవన దర్పణాలైనా కథలు మినహాయిస్తే అన్ని అచ్చమైన అడవి జాతి బిడ్డల కథలే…!! జయధీర్‌ తిరుమలరావు, వంశీకృష్ణ, వంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల గీటురాళ్ల వంటి ఆప్త వాక్యాలు అదనపు ఆకర్షణగల ఈ కథా సంకలనం నిజంగా తెలుగు కథ సాహిత్యంలో వెలువడ్డ తొలి గిరిజన కథా సంకలనంగా చెప్పవచ్చును. బోయ జంగయ్య వ్రాసిన ‘‘ఇప్ప పూలు’’ కథ నే శీర్షికగా ఎంచుకున్న ఈ కథా సంకలనంలోని ప్రతి కథ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. లంబాడా గిరిజన కుటుం బాలలో పేదరికం వల్ల, పుట్టిన ఆడపిల్లల సంతానాన్ని డబ్బులకు అమ్ముకుంటున్న దీన పరిస్థితులకు అక్షర రూపం అయిన ‘‘ఇప్ప పూలు’’ కథలో ఇప్ప సారా తయారు చేయడం కుటీర పరిశ్రమగా చెబుతూ పోలీసులు ఆ నెపంతో లంబాడా సామాజిక వర్గం వారిని శారీరకంగా ఆర్థికంగా ఎలా దోచు కుంటున్నారో కూడా ఈ కథలో మరో కోణం ద్వారా చూపించారు. ముందు తరం గిరిజన కథకుడు గూడూరు రాజేంద్ర రావు మొదలు నేటితరం యువ గిరిజన కథకుడు రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ వరకు 40మంది కథకుల నవ్య కథా రీతులు ఇందులో మనం చదవవచ్చు. బహు విశేషాల వేదిక అయిన ఈ కథల పందిరిలో ప్రజావాగ్గేయ కారుడు పాటల పోరు బిడ్డ వంగపండు ప్రసాదరావు వ్రాసిన కథ కూడా ఉండటం మరో విశేషం!! ‘‘వంగపండు’’ అంటే పాట గాడు గానే అందరికీ తెలుసు, కానీ అతనిలోని అద్భుతమైన కథకుడిని ఆవిష్క రించింది ఆయన వ్రాసిన ‘‘కొండ పందికొక్కు’’ కథ, అమాయకపు అడవి బిడ్డలు వ్యాపారస్తుల మోసాలకు ఎలా బలి అవుతున్నారో తెలుపుతూ తద్వారా ఉద్య మాలవైపు, సంఘాల వైపు, గిరిజనులు మొగ్గు చూపుతున్న తీరు గురించి తనదైన ఉద్యమ శైలిలో ఈ కథను వంగపండు వ్రాశారు. ఇక గిరిజన రచయితలైన మల్లి పురం జగదీష్‌,భూక్యా తిరుపతి,పద్దం అనసూయ,రమేష్‌ కార్తీక్‌ నాయక్‌,తిమ్మక రాంప్రసాద్‌, వంటి వారి కథలు ఈ సంపుటికి మరింత ప్రత్యేకతను అందించాయి ఈ ఐదు కథలు గిరిజన సంస్కృతిసాంప్రదాయాలు ప్రధాన భూమికగా చెప్పబడ్డాయి. భూక్య తిరుపతి ‘‘కాక్లా’’ కథలో లంబాడా సామాజిక వర్గంలో గల కాకుల కలయికతో ముడిబడ్డ ఒక అపనమ్మకాన్ని వారు సంప్రదాయంగా ఎలా కొనసాగిస్తున్నారో చెబుతారు.మల్లిపురం తన ‘‘దారి’’ కథలో అడవి బిడ్డల రోజువారి దినచర్యలను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తూనే ఆదివాసులు ఐక మత్యంతో తమను మోసగిం చిన తమ ప్రాంతపు అధికారిపై ఎలా ఎదురు తిరిగారో ఆవిష్కరిం చారు.ఇక చావు నేపథ్యం లో కథలు వ్రాసి తనదైన ప్రత్యేకతను చాటు కున్న ‘‘పద్దం అనసూయ’’ వ్రాసిన ‘‘మూగ బోయిన శబ్దం’’ కథలో గిరిజన జన జాతి అన్యమత ఊబిలో ఎలా కూరుకుపోతున్నదో చక్కగా వివరించారు, సంస్కృతి సాంప్రదా యాలపై అన్యమత దాడి గురించి ఈ కథలో ఆలోచనత్మకంగా చెప్పారు.
‘‘ప్రాచీన పురుడు’’ తీరు గురించి సందేశాత్మకంగా ఆవిష్కరించిన మరో గిరిజన కథారచయిత రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ రాసిన కథ ‘‘పురుడు’’,పాత్రోచితమైన సంభాషణ తీరు దీనిలో మనకు ఆవిష్కరించబడిరది ఇదే తీరుకు తార్కాణకంగా నిలిచే మరో కథ ‘‘పిన్లకర్ర’’ గిరిజన యువత పట్టణాలపై మోజుతో అక్కడకు చేరి తమ చక్కని సంస్కృతితో పాటు విలువైన ఆరోగ్యాలను ఎలా కోల్పోతున్నారో.. ఈ కథ కళ్ళకు కట్టింది.మొత్తానికి ఈ కథా సంకలనంలో 40కథలు వ్రాయబడ్డ కాలాల రీత్యా 50సంవత్సరాల నిడివి ఉంది ఈ ఐదు దశాబ్దాల నడుమ అనేక ఆధునిక మార్పులు వచ్చి చేరాయి కానీ గిరిజన జీవన విధానంలో వారి అణిచివేతలు, దోపిడి, ఆధిపత్యం, తదితర మోసాల్లో మాత్రం తేడా రాలేదు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు లోబడే వారి మీద అన్యాయాలు అక్రమాలు రూపాం తరం చెందాయి.ప్రాంతాలవారీగా విభజించ బడ్డ,ఈగిరిజన కథలసమాహారం లోని కథల తీరు గమనిస్తే,..ఆస్తులు అంతస్తులు కాదు పీడన,దోపిడి కూడా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ అదో గొలుసు వలయమై నిరంతరం కొనసాగుతుంది, కానీ దానిని ఎక్కడో ఒక చోట ఛేదించి నియం త్రించాలి, లేకపోతే భవిష్యత్తులో ఈ ఆదిమ తెగల మనుగడకు భారీ ప్రమాదం ఏర్పడి మహా ఉత్పాతం కలగవచ్చు, దాని నుంచి రక్షించే దిశగా సాగుతున్నదే ఈఅక్షర చైతన్య కథాయాత్ర. తరాలు మారిన తలరాతలు మారని గిరిజన స్త్రీల స్థితిగతులు, ఆందోళన కలిగిస్తున్న తీరును ఈ గిరిజన సంచార జాతుల కథాసంకలనం ఆవిష్కరించింది. గిరిజన హక్కులు మానవ హక్కులే అని ఎలుగెత్తి చాటిన ‘‘పోరాటశీలి’’బాలగోపాల్‌,స్మృతిగా ఈ ‘‘ఇప్ప పూలు’’ కథా సంకలనం ప్రచురించిన సంపా దకులు ప్రచురణకర్త జీవన్‌ గారికి అభినందనీయులు.అడవి బిడ్డలతో పాటు అణగారిన వర్గపు సంచార తెగల బతుకుల వెతలు కూడా ఇందులో మనం చదవవచ్చు, పెద్దింటి అశోక్‌ కుమార్‌,బిఎస్‌ రాములు, ఏ.విద్యాసాగర్‌, బోయ జంగయ్య, జాతశ్రీ, అల్లంరాజయ్య, అట్టాడ,గంటేడ వంటి లబ్దప్రతిష్టలైన వారి కథల్లోని భావ సొగసులతో పాటు వర్ధమాన కథా శీలురైన డా:జడా సుబ్బా రావు,బాల సుధాకర్‌ మౌళి,ఆప్త చైతన్య,ల ఆధునిక కథన రీతులు ఈ కథా సంకలనంలో మనం గమనించవచ్చు.బహురుచుల విందు భోజనంలా బహుముఖీయమైన కథల సమా హారం ఇది,కథ ప్రియులకే కాక పరిశోధక విద్యార్థులకు ఇది ఒక మార్గదర్శి వంటి అపురూప కథా పేటిక, ఇదో చారిత్రక దీపిక.

గిరిజన ముంగిట విద్యావనం

సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్‌, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేశారు.దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచి, ఎందరో గిరిజనుల జీవితాల్లో విద్యా కాంతులు వెలిగేలా సీఎం జగన్‌ ప్రత్యేక చొరవతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటవుతుంది.సాలూరులో మెం టాడ,దత్తిరాజేరు మండలాల్లో సుమారు రూ.834 కోట్లతో,561.88ఎకరాల్లో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి కేంద్రమంత్రి ప్రధాన్‌, సీఎం జగన్‌ ఆగష్టు 25వ తేదీన శంకు స్థాపన చేశారు. అంతకు ముందు సెంట్రల్‌ ట్క్రెబల్‌ యూనివర్సిటీ లేఅవుట్‌ నమూనాను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎంజగన్‌ మాట్లాడుతూ గిరిజన విశ్వ విద్యాలయం గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలసలో, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలో భూసేకరణ, ప్రభుత్వ భూమి కేటాయిం చడంతో పాటు, ఇప్పటికే ఆయా గ్రామాల్లో యూనివర్సిటీకి భూము లిచ్చిన రైతులకు రూ.25. 90 కోట్ల పరిహారం అందిచామని, వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు మరో రూ.28.49 కోట్లు చెల్లించి నట్లు తెలిపారు. విశాఖపట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో,భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి,విజయ నగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందు బాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేసి నట్లు వివరించారు.ఉత్తరాంధ్రకు కిరీటంగా సెంట్రల్‌ ట్రైబల్‌ వర్సిటీ ఉత్తరాంధ్రకు కిరీటంగా నిలుస్తుం దని,మన ప్రాంతం ఉన్నత చదువు లకు నెలవుగా మారుతోందని సీఎం జగన్‌ పేర్కోన్నారు.గత టీడీపీ ప్రభుత్వం విభజన హామీలో భాగమైన సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటును గాలికొదిలేస్తే, మన ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గిరిజన విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యంత అనుకూల పరిస్థితులు ఉండేలా విశాఖ పట్నం-రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్‌ లోని విజయనగరం, గజపతి నగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్లకు అందు బాటులోఉండేలా, భోగాపురం అంతర్జాతీయఎయిర్‌ పోర్టుకు సమీప ప్రాంతలో యూనివర్సిటీకి భూకేటా యింపులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే వర్సిటీకి అవసరమైన భూమి,విద్యుత్‌,నీటి సరఫరా మరియు రోడ్డు కనెక్టివిటీని సమకూర్చినట్లు వివరించారు. దీంతో పాటు వర్సిటీ నిర్మాణ పనులకు చర్యలు తీసుకోను న్నట్లు తెలిపారు.సెంట్రల్‌ ట్రైబల్‌ యూని వర్సిటీలో ప్రస్తుతం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఇంగ్లీష్‌, సోషియాలజీ,ట్రైబల్‌ స్టడీస్‌, బయో టెక్నా లజీ, కెమెస్ట్రీ,జర్నలిజం,ఎంబీఏ,ఎంఎస్‌డబ్ల్యూ, డిగ్రీ స్థాయిలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌,బోటనీ కెమిస్ట్రీ, జియాలజీ,టూరిజమ్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌ మెంట్‌,బి.కామ్‌లో ఒకేషనల్‌ తదితర 14అకాడ మిక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయని,స్కిల్‌ డెవలప్‌ మెంట్‌,ఒకేషనల్‌,జాబ్‌ ఓరియెంటెడ్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులను యూనివర్సిటీ అందిస్తోందన్నారు. 2019 నుంచి విజయనగరం జిల్లా కొండ కారకం లోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ పాత క్యాంపస్‌ భవనాల్లో నిర్వహిస్తున్న వర్సిటీలో 385 మంది విద్యార్థులు ఉన్నారు.
గిరిపుత్రుల జీవితాల్లో విద్యా కాంతులు
మన గిరిపుత్రులు రాబోయే రోజుల్లో ప్రపంచస్థాయిలో పోటీ పడే పరిస్థితి వస్తుందని సీఎం జగన్‌ తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని ఈ ప్రాం తాంలో ఎటు చూసిన కొత్త కాలేజీలు, యూనివ ర్సీటీలు కనిపిస్తున్నాయని గిరిపుత్రుల జీవీతాల్లో విద్యా కాంతులు వెలుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్ల మన పాలనలో వైద్యా, విద్యకి ప్రాధాన్యత ఇచ్చామని వాటికి సంబంధించి అనేక సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు చేపట్టా మని సీఎం జగన్‌ వివరించారు.
1.54లక్షల మంది గిరిజనులకు3.23లక్షల ఎకరాల భూములు
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన 50 నెలల్లో గిరిజన సంక్షేమం కోసం సమున్నత చర్యలు తీసుకుంటూ గిరిజన సంక్షేమం కోసం మన ప్రభుత్వం రూ. 16,805.77కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. అర్హులైన ఎస్టీ కుటుంబాలకు 2ఎకరాల భూమి అందిస్తామని ఇచ్చిన మాట ప్రకారం గిరి భూమి పోర్టల్‌ ద్వారా డిజిటలైజేషన్‌ చేసి1.54 లక్షల మంది గిరిజనులకు 3.23 లక్షల ఎకరాలను అన్ని హక్కులతో కూడిన RశీఖీRపత్రాలు పంపిణీ చేసినట్లు వివరించారు. 4.58లక్షల మంది ఎస్టీ కుటుంబాలకు జులై, 2019నుంచి రూ.410.11 కోట్ల ఖర్చుతో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు వివరించారు.పార్వతీపురం,పాడేరులో రూ.1000 కోట్లతో మెడికల్‌ కాలేజీలు, 300 మెడికల్‌ సీట్లతో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తూ.. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై పరిశోధనలకు పెద్ద పీట వస్తున్నట్లు సీఎంజగన్‌ పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ.50 కోట్లతో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, డయాలసిస్‌ యూనిట్ల నిర్మా ణం చేపట్టినట్లు వివరించారు.105.32 ఎకరాల్లో రూ.153.85కోట్లతో కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీ రింగ్‌ కళాశాల, 500 జనాభా ఉన్న ప్రతి తండా/ గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తామన్న మాటను నిలుపుకుంటూ గిరిజన ప్రాంతాల్లో 165 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని 497 సచివాల యాల్లో అన్ని ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకే 100 శాతం రిజర్వేషన్‌ కల్పించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌,రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,గిరిజన సంక్షేమశాఖ మంత్రి పి.రాజన్న,తదితరలు పాల్గొన్నారు.
ఆహ్లాదకరం..ఏపీ కేంద్రియ గిరిజన విద్యాలయం
ఆహ్లాదకరమైన వాతావరణంలో, సువి శాల భవనాల్లో ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యా లయం సాకారం కానుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2014లో కేంద్రం మన రాష్ట్రానికి 13 కేంద్రీయ విద్యా సంస్థలను మంజూరు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సీటీ యూఏపీ)ను కేటాయించింది.2019 వరకూ అధికా రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం..దీనిని పట్టించు కోలేదు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద భూమి కేటాయించినా అది ఏ మాత్రం భవనాల నిర్మాణానికి అనుకూలంగా లేని పరిస్థితి.
పూర్తిగా కొండప్రాంతం.
పరిసరాల్లో టీడీపీ నాయకుల స్థిరాస్తి వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్ప మరెందుకూ ఉపయోగపడలేదు.తమ పదవీకాలం ముగిసే వరకూ చంద్రబాబు ప్రభుత్వం తాత్సారం చేసింది. చివరకు సీటీయూఏపీ తరగతులను తప్పనిసరిగా ప్రారంభించాల్సి రావడంతో విజయనగ­రం పట్టణ శివారు కొండకరకాం వద్దనున్న ఏయూ పీజీ క్యాంపస్‌ పాత భవనంలోనే 2019ఆగస్టు 5న తరగతులు ప్రారంభమయ్యాయి.
గిరిజనులకు చేరువగా..
ఏపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ లక్ష్యం సార్థకమయ్యేలా గిరిజన ప్రాంతంలోనే దీన్ని ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక ల్పించింది. విశాఖపట్నం-రాయగడ జాతీయ రహ దారికి సమీపంలో, విశాఖ-హౌరా రైల్వేలైన్‌లోని విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వేస్టేషన్ల కు అందుబాటులో ఉండేలా భూమి కేటాయిం చింది.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా స మీ­పంలోనే ఉంటుంది. మెంటాడ మండలం చినమేడపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 224.01ఎకరాలు,దత్తిరాజేరు మండలం మర్రి వలస రెవెన్యూ గ్రామ పరిధిలో 337.87ఎక రాలు..మొత్తం561.88ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దాదాపు 480 మంది రైతులకు పరిహారం ఇవ్వాలని అధికారులు గుర్తిం చారు. ఇప్పటికే దాదాపు రూ.30.58కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
సీటీయూఏపీకి కేటాయించిన భూమిని గతేడాది కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. వర్సిటీ భవనాల నిర్మాణమంతా కేంద్ర ప్రజా పనుల విభాగం చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇందుకోసం రూ.23.60కోట్లను గతే­డాది విడు దల చేసింది. విశాఖ-రాయ్‌పూర్‌ జాతీయ రహ దారి నుంచి సీటీయూఏపీ ప్రాంగణం వరకూ రూ.16 కోట్లతో 100 అడుగు­ల వెడల్పున ఆరు లైన్ల అప్రోచ్‌ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతు న్నాయి.తాగునీటి వసతి కల్పనకు రూ.7కోట్లు, విద్యుత్‌ సౌకర్యా­నికి దాదాపు రూ.60లక్షలను ప్రభుత్వం కేటాయించింది.కాగా,విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి విద్యా కోర్సులను ప్రవేశపెట్టడంలో సీటీయూఏపీ ముందుంది. వారికి ఆసక్తి ఉన్న రంగంలోనే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా 6గ్రాడ్యుయేట్‌(యూజీ), 8 పోస్టు గ్రాడ్యుయేట్‌(పీజీ) కోర్సుల్లో బోధన జరుగుతోంది.
అంతర్జాతీయ మార్కెటింగ్‌ నైపుణ్యాల కోర్సులను ప్రవేశపెడుతున్నారు.ఇప్పటికే పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా నైపుణ్యాలను, మెలకువలను అందించేలా సాంకేతిక మాధ్యమా లనూ సీటీయూఏపీ రూపొందిస్తోంది. అందుకు సిలబస్‌ను కూర్పు చేసేందుకు కార్యాచర ణ సిద్ధం చేసింది.ఏటా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పర్యవేక్షణలో ప్రవేశపరీక్షలు నిర్వహించి.. ప్రతిభ ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నారు.- జిఎన్‌వి సతీష్‌

జయహో భారత్‌..ఇస్రోకి జేజేలు

నిరీక్షణ ఫలించింది. కోట్లాదిమంది భారతీయుల పూజలు ఫలించాయి. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్‌.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర.. విజయ తీరాలకు చేరింది. దిగ్విజయమైంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 3 జాబిల్లి మీద అడుగు మోపింది. ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన క్షణాలు ఫలించాయి. కలలు సాకారం అయ్యాయి. గతంలో ఎదురైన చేదు సంఘటనలు అధిగమించి.. మరీ జాబిల్లిని అందుకుంది.
యావత్‌ భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూస్తున్న చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటివరకు జరిగిన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసు కున్న చంద్రయాన్‌ 3..చివరి అంకానికి చేరుకుంది. తాజాగా ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన విక్రమ్‌ ల్యాండర్‌..చంద్రుడి ఫోటోలు తీసింది.వాటిని పంపించడంతో ఇస్రో ట్విటర్‌లో పంచు కుంది. ఆగస్టు 23వ తేదీ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సుమారు 70డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద విక్రమ్‌ ల్యాండర్‌ దిగనుంది.
ఆగష్టు 26 ఉదయం బెంగళూరులోని ఇస్రో నెట్‌వర్క్‌ కమాండ్‌ సెంటర్‌ చేరుకున్న ప్రధాని అక్కడ శాస్త్రవేత్తలను కలిశారు.ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్‌ అయిన విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి దిగిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తన పని ప్రారంభించడంతో ప్రధాని శాస్త్రవేత్తల నుంచి దాని సమాచారం తెలుసుకున్నారు. చంద్రయాన్‌ 3 ల్యాండిరగ్‌ ఎలా జరుగుతుందో ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకు ఎలా వస్తుందో వీడియోల ద్వారా ఇస్రో సైంటిస్టులు ఆయనకు వివరించారు.
‘‘ఆగస్ట్‌ 23న భారత్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. ఇక ఇప్పటి నుంచి, ఈ రోజుని భారత్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వ హించుకుందాం’’అని ప్రధానమంత్రి ప్రకటిం చారు. శాస్త్రవేత్తలు మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని చంద్రుడిపైకి తీసుకెళ్లారని అభినందించారు.తన ప్రసంగం మధ్యమధ్యలో ప్రధాని ఇస్రో శాస్త్రవేత్తల విజయాన్ని తలుచుకుని భావోద్వేగానికి గుర య్యారు. భారత్‌ చంద్రయాన్‌ 3మిషన్‌ భూమి ఎదుర్కుంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కూడా సాయం చేస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. మోదీ ఇస్రో కమాండ్‌ సెంటర్‌లో దాదాపు 50 నిమిషాల పాటు ప్రసంగం చేశారు. 21వ శతాబ్దంలో ప్రపం చంలోని పెద్ద పెద్ద సమస్యలను భారత్‌ పరిష్కరి స్తుందని, మన సాంకేతిక, శాస్త్రీయ ఆలోచలను ప్రపంచమంతా అంగీకరిస్తుందని మోదీ అన్నారు. చంద్రయాన్‌ మహాభియాన్‌ అనేది కేవలం భారత్‌ విజయవంతం మాత్రమే కాదని, మొత్తం మానవాళి సాధించిన విజయంగా అభివర్ణించారు. మన మిషన్‌ చేపట్టే అన్వేషణ చంద్రుడిపైకి వెళ్లేందుకు అన్ని దేశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తుం దన్నారు. కేవలం చంద్రుడి రహస్యాలు తెలుసు కోవడమే కాకుండా,భూమిపై ఉన్న సమస్యల పరి ష్కారానికి ఇది సాయం చేస్తుందని మోదీ తెలిపారు. ‘‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, ఈజ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ అనేవి అంతరిక్ష రంగంలో ఉన్నతమైన బలం. నేడు దేశ పాలనకి ముడిపడి ఉన్న ప్రతి అంశానికి స్పేస్‌ అప్లికేషన్‌ను అనుసంధానించే కార్యక్రమం పూర్త యింది. నేను ప్రధానమంత్రి అయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో, అంతరిక్ష శాస్త్ర వేత్తలతో నేను వర్క్‌షాపు నిర్వహించాను. పరి పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు స్పేస్‌ రంగాన్ని గరిష్టంగా వాడుకోవాలన్నది ఈ వర్క్‌ షాపు ఉద్దేశ్యం’’ అని మోదీ తెలిపారు.
చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఫొటోలు తీసిన చంద్ర యాన్‌-2 ఆర్బిటర్‌
చంద్రయాన్‌-3ల్యాండర్‌ను చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో విడుదల చేసిం ది.‘‘నేను నీకు గూఢచారిని!’’ అంటూ చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ చంద్రయాన్‌-3ల్యాండర్‌ను ఫొటో షూట్‌ చేసిందంటూ ఇస్రో ట్వీట్‌ చేసిం ది.చంద్ర యాన్‌-2లో ఆర్బిటర్‌ హై రెజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ఉంది.చంద్రుడి చుట్టూ ఏది ఉన్నా ఈ కెమెరా ఫొటోలు తీసి పంపుతుంది. చంద్ర యాన్‌-3 అక్కడ ల్యాండ్‌ అయిన తర్వాత, దీన్ని కూడా అది గుర్తించి, ఫొటోలు తీసింది. ‘‘ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్ర యాన్‌-3సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ సమయంలో దక్షిణా ఫ్రికాలో ఉన్నా. నా మనసంతా చంద్రయాన్‌ -3 విజయంపైనే ఉంది. విజయంపట్ల శాస్త్రవేత్త లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది అసాధా రణ విజయం. చంద్రుడిపై భారత్‌ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాం. ఇప్పుడు భారత్‌ చంద్రుడిపై ఉంది. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాం. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు ఇస్రో చేసింది చంద్రయాన్‌ -3 దిగిన ప్రదేశానికి శివశక్తి పేరు పెట్టుకుందాం. ’’ అని ప్రధాని మోదీ అన్నారు.
కక్ష్యలో సొంతంగా పరిభ్రమించి
ఆబిలాల పేర్లనుకూడా ఇస్రో వెల్లడిరచింది. ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో,హర్కేబి జే తదితర వాటి పొటోలను ల్యాం డర్‌ తీసింది.ఇందులో గియార్డనో బ్రునో జాబిల్లిపై ఇటీవలే గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఒకటి. ఇక హర్కేబి జే బిలం వ్యాసం దాదాపు 43 కి.మీలు ఉన్నట్టు తెలుస్తోంది.చంద్రడి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ జాబిల్లికి మరింత చేరువైంది. ఆగష్టు 23న చేపట్టిన డిబూస్టింగ్‌(వేగాన్ని తగ్గించే) ప్రక్రియ విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడిరచింది. ల్యాండర్‌ (విక్రమ్‌),రోవర్‌(ప్రజ్ఞాన్‌)తో కూడిన ల్యాండర్‌ మాడ్యూల్‌ ఆరోగ్యంగానే ఉందని తెలిపింది.
గురు తప్పని ప్రయోగం..
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ హరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్ర యాన్‌-3ప్రయోగం విజయవంతం అయ్యిం ది. జూలై 14,2023 చంద్రయాన్‌-3 మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రయోగించారు శాస్త్రవేత్తలు.. చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌కు విక్రమ్‌ అని పేరు పెట్టారు. దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితా మహుడు విక్రమ్‌ సారాభాయ్‌ పేరు పెట్టారు. రోవర్‌కు ‘ప్రజ్ఞాన్‌’అని పేరు పెట్టారు. దీనిని సంస్కృ తంలో జ్ఞానం అంటారు. చంద్రయాన్‌-2 సమ యంలో ల్యాండ్‌ రోవర్‌కు అదే పేరు ఉండేది. రోవర్‌ అనేది వాహనం లేదా రోబోట్‌, ఇది వివిధ ప్రదేశాల నుంచి డేటాను సేకరించి ఆర్బిటర్‌కి పంపడానికి గ్రహం ఉపరితలం చుట్టూ తిరుగు తుంది.ల్యాండర్‌ అనేది లోపల రోవర్‌ ఉన్న ఒక రకమైన క్యారియర్‌. దాని సహా యంతో రోవర్‌ ఉపరితలంపై ల్యాండ్‌ చేయబడు తుంది. రోవర్‌ను ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్‌ చేయ డానికి ల్యాండర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రోవర్‌ ల్యాండ్‌ అయిన గ్రహం చుట్టూ ఒక ఆర్బిటర్‌ తిరుగుతుంది. రోవర్‌ గ్రహం ఉపరితలం నుంచి గ్రహం చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు డేటాను పంపుతుంది. అలాగే భూమిపై ఉన్న ఇస్రో-నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఆ సమాచారాన్ని ప్రసారం చేయడానికి ఆర్బిటర్‌ పనిచేస్తుంది…
భారత్‌ గుప్పిట చిక్కిన జాబిల్లి..
ఇండియా ఈజ్‌ ఆన్‌ ది మూన్‌.. ఇదీ ఇస్రో వారి సగర్వ ప్రకటన. జాబిలి మీద కాలు మోపిన తమ చంద్రయాన్‌3 ప్రాజెక్ట్‌ సూపర్‌ సక్సెస్‌ కొట్టిందన్న వార్తను ప్రపంచానికి చాటిచెప్పుకుంది ఇస్రో. అగ్రరాజ్యాల్ని సైతం నోరెళ్లబెట్టేలా చేసిన ఈ ఘన విజయాన్ని దేశం మొత్తం ఆస్వాదిస్తోం దన్నారు ప్రధాని మోదీ. మూన్‌ మిషన్లను చాలా దేశాలు విజయవంతం చేసుకున్నాయి. కానీ.. ఇన్నాళ్లు అందని జాబిలి..
ఇప్పుడు గుప్పిట చిక్కింది. చంద్రుడి మీద ప్రయోగంలో సంపూర్ణ విజయం సాధించి మళ్లీ మీసం మెలేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రోవర్‌ని దింపిన తొలి దేశంగా అవతరించింది భారత్‌. ఇస్రో అంచ నాలు ఏమా త్రం తప్పలేదు. అంగుళమైనా పక్కకు జరగలేదు. గీసిన గీత మీద సరిగ్గా వాలింది చంద్ర యాన్‌`3. విక్రమ్‌ ల్యాండర్‌ నెలరేడుని ముద్దా డిరదన్న శుభవార్త యావత్‌ దేశాన్నీ పులకింప జేసింది.ఈ అపూర్వమైన.. సాటిలేనివిజయంతో, భారతదేశం చరిత్ర సృష్టించింది. ఇస్రో శాస్త్రవేత్త లను దేశప్రజలు అభినందిస్తూ వారి కృషిని అభినం దిస్తున్నారు.సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
దేశాల నుంచి ప్రపంచ సంస్థల దాకా ఇదే మాట
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి భారత్‌ అడుగుపెట్టగానే ప్రపంచవ్యాప్తంగా మొదలైన జయ జయధ్వానాలు ఇంకా కొనసాగుతున్నాయి. శిఖ రాగ్ర సమావేశాల కోసం కలుసుకున్న ప్రపంచ దేశాల అధినేతల సంభాషణల్లోనూ, అంతర్జాతీయ వార్తా పత్రికలు, ప్రముఖ న్యూస్‌ చానళ్ల కథనాల్లో నూ ఇదేఅంశం ప్రధానంగా కనిపించింది. చంద్రు నిపై విక్రమ్‌ ల్యాండ్‌ కాగానే క్షణాల్లో తీవ్ర ఉద్వే గానికి గురయ్యానని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ మొదలు బ్రిటన్‌ ‘బీబీసీ’ వరకు భారత్‌కు జయహోలు పలికాయి. దాయాది దేశం పాకిస్థా న్‌కు చెందిన పత్రికలు సైతం అంతరిక్ష రంగంలో భారత్‌ తిరుగులేని విజయాన్ని ప్రస్తుతించాయి. జయహో భారత్‌.. సాహో ఇస్రో..అంటూ దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. ప్రతి భారతీ యుడు సగర్వంగా తన జయహో అంటూ సంబ రాలు మొదలు పెట్టింది.భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్‌-3 ‘చంద్ర యాన్‌-3’చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయ వంతంగా ‘సాఫ్ట్‌ ల్యాండ్‌’ అయింది.
ఈఅపూర్వమైన..సాటిలేని విజయం తో,భారతదేశం చరిత్ర సృష్టించింది.భూమిసహజ ఉపగ్రహం (చంద్రుడు)ఈ భాగంలో దిగిన ప్రపం చంలో భారత దేశం మొదటి దేశంగా అవతరిం చింది. ఎందు కంటే ఇప్పటివరకు చంద్రునిపైకి వెళ్ళిన అన్ని మిషన్లు చంద్ర భూమధ్యరేఖకు ఉత్తరం లేదా దక్షిణంగా కొన్ని డిగ్రీల అక్షాంశంలో దిగాయి. భారత దేశ పతాకాన్ని ఎగురవేయడం వల్ల శాస్త్రవేత్తలలోనే కాదు, దేశంలోని సాధారణ ప్రజలలో కూడా అపారమైన ఉత్సాహం కనిపి స్తోంది.‘సాఫ్ట్‌ ల్యాండిరగ్‌’ గురించి తెలిసిన ప్రతి భారతీయుడి ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.– గునపర్తి సైమన్‌

బాలకార్మిక వ్యవస్థకు ముగింపు ఎప్పుడు?

ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి.కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ,మైనింగ్‌,నిర్మాణ రంగం,కర్మాగారాలలో,హోటల్స్‌లో, రైల్వే,బస్సుస్టేషన్‌లు,బిక్షాటన,సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారన్నారు. చిన్నారులకు సరైనవిద్యలేకపోవడంతో ఉపాధిఅవకాశాలు తగ్గిపోతున్నాయి.దీంతోపాటు పోటీతత్వంతో నిండినసమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారన్నారు.ఈనేపథ్యంలో ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం,ఆర్థిక తోడ్పాటు లేకపోవడం,నైపుణ్యలేమి వంటి కారణాలవల్లే ఇలా మారుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటిహైటెక్‌ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరివ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోందిని..!
ఐక్యరాజ్య సమితి బాల కార్మికుల సమస్యలపై వివిధ దేశాధినేతల సమక్షంలో 18సార్లు సమావేశాలను నిర్వహించింది.గరిష్ట వయస్సు,కనీస వేతనం, వైద్యపరీక్షలు, పనిచేసేచోట సౌకర్యాలు, పనిలో శిక్షణ, చదువుకోడానికి అవకాశాలు, రాత్రివేళ పని చేయించకపోవడం వంటి అనేక అంశాలపై ఈసమావేశాల్లో తీర్మానాలు చేశారు.ఇలాంటి తీర్మానాలు,సిఫార్సులు, ప్రతిపాదనలు ఎన్నివున్నా ప్రపంచ వ్యాప్తంగా సంఘటిత,అసంఘటిత రంగాల్లో బాలకార్మికులను యథేచ్ఛగా వినియోగించుకుంటున్నారు. 1948 నాటిఫ్యాక్టరీలచట్టం నుండి,1986 నాటి ‘చైల్డ్‌ లేబర్‌’ (ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) చట్టం నుండి,2016లో ‘చైల్డ్‌ లేబర్‌’ (ప్రొహిబిషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌) సవరణ బిల్లు వరకూ బాల శ్రామికులకు రక్షణ కల్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి,జరుగుతున్నాయి.చదువు మాన్పించి పనికి పంపితే-అది బాలల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తల్లిదండ్రులకు తెలియకపోవడం. గ్రామాల్లో నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల విషయంలో ఇది అధికంగా ఉంటోంది.
గ్రామీణులు పట్టణాలకు వలసపోవడంతో పిల్లలు చదువుకు దూరమైపోతున్నారు. జీవనో పాధికి వలస పోయే కుటుంబాల్లో పిల్లలను సైతం పనిలోకి పెడతారు.కనీస వయస్సు రానిదే పిల్ల లను పనులకు పంపరాదన్న విషయమై చాలా మంది తల్లిదండ్రులకు అవగాహన లేదు. కార్మిక చట్టాలను అమలు చెయ్యాలన్న ఆలోచన కర్మాగారాల యజమానులకూ వుండదు. వారికి కావలసిందల్లా- బాలల చేత ఎక్కువ పనిచేయించుకుని,తక్కువ జీతం యిచ్చి అధిక లాభాలను పొందడం. బాలకార్మి కులకు కనీస సదుపాయాలు సమకూర్చాలని,వారు బడికి వెళ్లి చదువుకోడానికి కొంత సమయం ఇవ్వాలని,5గంటలు మించి పనిచేయించ కూడదని ఎన్నో ఆంక్షలు వున్నప్పటికీ-రోజుకు10,12 గంటలు వారిచేత పనిచేయిస్తూ వుంటారు. రాత్రిళ్లు కూడా పనిచేయిస్తూ వుంటారు. వారి ఆరోగ్యానికి హానికలిగించే పనులను చేయిస్తూ వుంటారు. ఇదంతా కార్మిక శాఖ ఉద్యోగులకు తెలిసినా వారు పట్టించుకోరు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రపంచంలోని వివిధ దేశాలలో బాలకార్మికుల సంఖ్య పెరుగు తూనే ఉంది తప్ప,తగ్గడం లేదు.సమాజంలో భాగస్వాములైన మనమందరం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. బాల కార్మికులతో ఆప్యాయంగా మాట్లాడి సమీపంలోగల పాఠశాలలో, హాస్టళ్లలో చేర్పిద్దాం.అనాధలైన బాల కార్మికులను ప్రభుత్వ వసతిగహాలలో ఉండేలా ప్రవేశాలు కల్పిద్దాం. దేశ అభివద్ధికి అవరోధంగా నిలుస్తున్న బాలకార్మికవ్యవస్థను తరిమికొట్టడానికి ప్రతిఒక్కరం ముందుకు వద్దాం.బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మిద్దాం.బాల కార్మికుల పట్ల దయ,కరుణ,జాలి చూపుదాం!-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2