స్వాతంత్య్ర ఉద్యమ సమిధ`భరత్‌సింగ్‌

ఉద్యమం అతని ఊపిరి. దేశభక్తి అతని హృదయం. స్వాతంత్య్రం అతని లక్ష్యం. పట్టుదల -శ్రమ అతని నేత్రాలు. నిస్వార్థం అతని రక్తం. ఫలితం ఉరి తీత.భగత్‌ సింగ్‌ పంజాబ్‌లోని లాయల్‌ పూర్‌ జిల్లా,బంగా సమీపంలోని ఖత్కర్‌ కలాన్‌ అను గ్రామంలో విద్యావతీ, సర్దార్‌ కిషన్‌ సింగ్‌ దంపతులకు జన్మించిన సంధూరaాట్‌ కుటింబీకుడు. ‘‘భక్తుడు’’ అనే పదమునకు పంజాబీలో భగత్‌ అనే పదంతో వాడతారు. ఆతల్లిదండ్రులకు కూడా దేశభక్తి ఎక్కువగా గల సిక్కుల కుటుం బంలోనివారు. స్వాతంత్య్రోద్య మంలోను, మరికొందరు మహారాజా రంజిత్‌ సింగ్‌ సైన్యంలోను పనిచేయడం వలన దేశభక్తి వారి కుటుంబాల్లో కలసిపోయి వారి సంతానానికి ‘‘భక్తుడు’’గా చెప్పబడే భగత్‌ నామకరణం పెట్టడం జరిగింది.
భగత్‌ సింగునకు మూడేళ్ల వయస్సులో తండ్రి కిషన్‌ సింగ్‌ ఎత్తుకుని అతని స్నేహితుడు నంద కిషోర్‌ మెహతాపాటుగా కొత్తగా మొక్కలు వేస్తున్న తోటలోనికి వెళ్ళడం జరిగింది.అక్కడే ఆడుకుంటున్న భగత్‌ సింగ్‌ మట్టిలో చిన్న చిన్న గడ్డిపరకలను నాటటం మొదలుపెట్టాడు. అతనిని తండ్రి ఏమి చేస్తున్నావు భగత్‌ అని ప్రశ్నిస్తే భగత్‌ ఇచ్చిన సమాధానానికి వారు అవాక్కయినారు. అతన నోట తుపాకులు నాటుతున్నా అని పలికేడు. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విధ్యార్థి దశలో భవిష్యత్తుకు బాల్యమే మొలక అని తెలియచేసాడు. విధ్యార్థి దశలో ఆట పాటలలో చుకుకుగా ఉంటూ అందరితో స్నేహంగా ఉండేవాడు. భగత్‌ బాబాయి అజిత్‌ సింగ్‌ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో,కంటనీరు పెట్టుకొన్న చిన్నమ్మ హర్నామ్‌ కౌర్‌ ను చూసి నాలుగేళ్ళ భగత్‌ సింగ్‌ పిన్నీ ఏడవద్దు,నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసాడు. స్వామీ దయానంద సరస్వతి అనుచరుడైన సింగ్‌ తాత అర్జున్‌ సింగ్‌ హిందూ సంస్కరణ ఉద్య మం ఆర్యసమాడంలో భాగం కావడం కూడా ఆయనపై విపరీతమైన ప్రభావం పడిరది. అపరిష్కృత కేసుల కారణంగా బ్రిటిష్‌ వారు అజిత్‌ సింగి పెర్సియాకు పారిపోగా కరోరి రైలు దోపిడీ నేరం మోపి సింగ్‌ బాబాయిని 1927 డిశంబర్‌ 19న ఉరితీసిన వైనం భగత్‌ మనో ఫలకంపై ముద్రపడి, ఈ దాస్యశృంఖలాల నుండి భారతదేశమును విడిపించాలనే కోరిక బలంగా నాటుకొనిపోయింది.13 ఏళ్ళ వయస్సులోనే గాంధీజీ తలపెట్టిన సహాయ నిరాకరణోద్యమానికి ప్రభావితు డయ్యాడు. బ్రిటిష్‌ దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్దాంతాలను అనుసరిం చాడు.1923లో పంజాబ్‌ హిందీ సాహిత్య సమ్మేళన్‌ నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్‌ విజయం సాధించాడు. ఆవయస్సులో ప్రముఖ పంజాబీ సాహిత్యానిన ఉటంకించడమే కాకుండా పంజాబ్‌ సమస్యలను తన సాహి త్యంలో ప్రస్థావించాడు.భగత్‌ లాహోర్‌లోని నేషనల్‌ కళాశాలో విధ్యాభ్యాసం చేశాడు. ఇంటిలోని పెద్దలు పెళ్ళి ప్రస్థావన తేగానే ఇష్టంలేని భగత్‌ఇల్లు వదలి పారిపోయి నౌజవాన్‌ భారత్‌ సభ (దానిని భారత యువ జన సంఘము అని కూడా అంటారు)లో చేరి, సహ విప్లవకారుల సహాయంతో యువతను ఆకట్టుకున్నాడు. ఫ్రొఫెసర్‌ విధ్యాలంకౌర్‌ విజ్ఞప్తి మేరక,అప్పట్లో రామ్‌ ప్రసాద్‌ బిస్మిత్‌, అఫ్పా ఖుల్లా ఖాన్‌ నాయకత్వం వహిస్తున్న హిందూ స్తాన్‌ గణతంత్ర సంఘంలోనూ చేరి విప్లవాత్మక సాహిత్యం ఉర్థూ,పంజాబీ వార్తాపత్రికలలో వార్తలు వ్రాసేవాడు, పర్యవేక్షించేవాడు. 1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేకమంది విప్లవకారులు కీర్తి కిసాన్‌ పార్టీ పేరుతో ఢల్లీిలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. విప్లవకారు లను నాటి బ్రిటిష్‌ ప్రభుత్వ నిరంకుశ పాలనలో ఉరితీయడం, కఠిన కారాగార శిక్షలు వేయడం తెలిసిన విషయమే. కటకటాల వెనకాల భగత్‌ సింగ్‌ ఒక అధ్యయన శీలిగా కాలాన్ని గడిపాడు.రాజనీతి,అర్థ శాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలను ప్రభోధించే అనేక గ్రంథాలను ఆయన అధ్యయనం చేసాడు. పుస్తకాలు చదువుతూ,చదువుతూ సింగ్‌కు ఇష్టమైనపాట,రామ్‌ ప్రసాద్‌ భిస్మిల్లాగారు వ్రాసిన పాటను మేరా రంగ్‌ దే బసంతీ చోలా పాడుకుంటారు. సింగ్‌ మంచి సాహితీవేత్త కూడా.ఉత్తమ సాహితీ వ్యసాలు,ఉద్యమ వార్తలు వ్రాయటంలో దిట్ట. అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టి యువతను చైతన్యపరుస్తూ కర్తవ్యబోధ చేసే వాడు.30అక్టోబర్‌ 1928న బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌ ‘‘సర్‌ జాన్‌ సైమన్‌’’ నాయకత్వంలో ఏర్పడిరది.ఆ సమయంలో ఆ కమీషన్‌లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో భారతీయ రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి.ఫలితంగా, దేశ వ్యాప్తంగా పలు నిరసనలు వెల్లవెత్తా యి.30 అక్టోబర్‌ 1928న కమీషన్‌ లాహోర్‌ సందర్శించినపుడు సైమన్‌ కమీషన్‌కు వ్యతి రేకంగా లాలాలజపతిరాయ్‌ నేతృత్వంలో నిశ్శబ్ధ అహింసా పద్దతిలోఒకనిరసన కార్యక్రమం జరిగింది.అయితే అక్కడ హింసను రేకెత్తించటానికి పోలీసులే కారణమయ్యారు. ప్రశాంతంగా నిరసన చేసుకుంటున్న వారిపై లాఠీ చార్జి జరిపారు.లాలాలజపతిరాయ్‌ ఛాతీపై బలంగా కొట్టడంతో వారికి బలమైన గాయాలు తగిలాయి. తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కళ్ళార చూసిన యువకుడు భగత్‌ సింగ్‌ ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష బలంగా హృదయంలో స్థిరపడిరది. పోలీసు అధికారి స్కాట్‌ ను హతమార్చడానికి విప్లవ కారులు శివరామ్‌ రాజ్‌ గురు,జై గోపాల్‌, సుఖదేవ్‌ ధాపర్లలోతో చేతులు కలిపాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్‌ హతమయ్యాడు. పొరపాటు గుర్తింపు కారణంగా మరియు డి.ఎస్పీ జె.పి.సాండర్స్‌ కనిపించినపుడు సింగుకు జైపాల్‌ తప్పుగా సంకేతమిచ్చాడు.ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్‌ను హతమార్చడం జరిగింది. ఈ కారణంగా పోలీసులనుంచి దూరంగా లాహోరు పారిపోయాడు భగత్‌.విప్లవకారుల చర్యలను అణచివేసే దిశగా భారత రక్షణ చట్టమును తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటిషు ప్రభుత్వం మరిన్ని ప్రత్యేక అధికారాలు కల్పించింది.భగత్‌ సింగ్‌ వంటి దేశభక్తి ఉద్యమ కారులను అణచివేయడం ఈచట్టం యొక్క ముఖ్య ఉధ్దేశ్యము. ఆతరువాత ఈచట్టం ప్రజాహితం కోసమే అటూ ప్రత్యేక శాసనం క్రింద ఈచట్టాన్ని ఆమోదించారు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ఆమోదం కానున్న సమయంలో కేంద్ర శాసనసభపై బాంబు పేలుడుకు హిందూస్థాన్‌ వాద గణతంత్ర సంఘం వ్యూహరచన చేసింది.దీనికి భగత్‌ సింగ్‌ ను కాకుండా మరొక విప్లవకారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ అడ్డుపడ్డాడు.అయితే సింగు ఆశయాలను గౌరవించే మరికొందరు పార్టీ సభ్యులు ఆయనపై వత్తిడి తీసుకొచ్చారు. దాని ఫలితంగా 8ఏప్రిల్‌ 1929 భగత్‌ సింగు మరి యొక విప్లవకారుడు కలసి అసెంబ్లీ వసారాలపై బాంబు విసిరి,‘‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ రిమం బర్డు-డైలీ టైమ్స్‌ పాకిస్థానీని తరువాత వినికిడి శక్తి కోల్పోయేలా గొంతెత్తి అరుస్తామని ముద్రించబడిన పలు కలపత్రాలనువెదజల్లారు. కేంద్ర అసెంబ్లీ ఆవరణలో కరపత్రం విసిరివేత, బాంబు దాడివల్ల ఏఒక్కరు మరణించడంగాని, గాయపడడంగాని జరుగలేదు.తమ వ్యూహంలో భాగంగానే ఉద్ధేశ్యపూర్వకంగానే జాగ్రత్తలతో కూడినదాడి చేసినట్లు భగత్‌ సింగ్‌,దత్‌లు అంగీకరించారు. బాంబు గాయపరచేంత శక్తివంతమైనది కాదని, బ్రిటిష్‌ ఫోరెన్సిక్‌ విచారణాధికారులు కూడా తేల్చిచెప్పారు.12 జూన్‌1929న సింగ్‌,దత్‌లు దేశ బహిష్కరణకు గురయ్యారు.అసెంబ్లీ పేలుడుపై విచారణ నేపద్యంలో జె.పి.సాండర్స్‌ హత్య వెనుక భగత్‌ సింగ్‌,రాజ్‌ గురు,సుఖదేవ్‌లపై అభియోగాలు మోపారు.భారతదేశంలో స్వాతంత్య్ర సమర యోధుడు,విప్లవకారుడు,రచయిత, ప్రారంభ మార్సిస్టు,ఇప్పుడుపాకిస్థాన్‌ లాహోర్‌లో జన్మిం చిన ధైర్యశాలి.భారత్‌, బ్రిటిన్‌ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండు చేస్తూ జైలులో 64రోజులు నిరా హార దీక్షను చేపట్టడం ద్వార సింగ్‌ విపరీ తమైన మద్దతును కూడ గట్టుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు లాలాలజపతి రాయ్‌ని ఒకపోలిసు అధికారి హత్య నేరంపై ఉరితీసిన సంఘటన భగత్‌ సింగ్‌లో అగ్ని జ్వాలలు రేపాయి.ప్రతీకార వాంఛ పెరిగింది. మన మాతృదేశంపై పరాయి పెత్తనం సహించ లేకపోయేవాడు.ఆయన ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్య్రసిద్ధికి పోరాడేలా యువతను ప్రేరేపించింది.అంతేకాక భారత్‌లో సామ్య వాద వ్యాప్తి మరింత పుంజుకుంది.భగత్‌ సింగ్‌ లో అరాజకవాదం (అనార్కిజం),సామ్యవాదం (కమ్యూనిజం)అనే భావనలు జీర్ణించుకున్నాడు. బకునిన్‌,మార్క్స లెనిన్‌ రచనలను ఎక్కువ చదివేవాడు.1928 మే నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో అరాజకత్వంపై పంజాబీ వార్తాపత్రిక కీర్తిలో వరుసగా అనేక కథనాలు ప్రచురిం చాడు.అరాచక తత్త్వాన్ని ప్రజలు సరిగా అర్థం చేసుకోవటం లేదని చింతిస్తూ ఉండేవాడు. ‘‘అరాజకత్వం అనే పదానికి ప్రజలు భయపడుతున్నారు’’ అని ఆయన పేర్కొన్నాడు. భారత్‌లో విశ్వజనీన సహోదరత్వం అంటే సంస్కృతంలో చెప్పినట్టుగా వసుధైక కుటుంబకం మొదలైనవి రావాలని ఆకాంక్షించేవాడు. అరాజకత్వం సిద్ధాంతం గురించి విస్తృతంగా ప్రచారం చేసిన తొలి వ్యక్తి ఫ్రౌధన్‌.అందువలనే అరాజకత్వ వ్యవస్థాపకుడని పిలుస్తారు. 1931 లో జైల్లో ఉండగా నాస్తికవాద తత్త్వాన్ని వివరి స్తూ ‘‘నేను ఎందుకు నాస్తికుడిని’’ అంటూ ఒక వ్యాసం వ్రాసాడు.జైలులోఉండగా,మతం, దేవుడిపట్ల విశ్వాసం లేనివ్యక్తిగా సహచర విప్లవకారులు తనని విమర్శించిన కారణంగా ఈ వ్యాసం వ్రాయటం జరిగింది. తనను అహంకారిగా కూడా చిత్రీకరించుకున్న అరుదైన వ్యక్తిత్వం భగత్‌ సింగ్‌ది. స్వంత విశ్వాసా లను గౌరవించే సింగ్‌ సర్వశక్తి సంపన్నుడి పట్ల ధృడ విశ్వాసినని చెప్పేవాడు. అయితే ఇతరుల హృద యాలకు దగ్గరగా ఉండే కల్పిత గాథలు,విశ్వా సాలను నమ్మే స్థాయికి తాను దిగజారబోనని స్పష్టం చేసాడు. మతం చావును సులభతరం చేస్తుందనే వాస్తవాన్ని గుర్తించాలని అనేవాడు. డైరీ వ్రాసే అలవాటు వున్న భగత్‌ సింగ్‌ 404 పుటలను నింపాడు.తాను సమర్థించే పలు ప్రముఖుల ఉల్లేఖనాలు, వారి గొప్ప వాక్యాలను వ్రాసుకున్నాడు.భగత్‌ సింగ్‌ డైరీలోని పలు వ్యాఖ్యలు ఆయన విశిష్టమైన దార్శినిక అవగాహనకు అద్ధం పడుతుంది. 23 మార్చి, 1931న భగత్‌ సింత్‌ తోపాటు ఆయన సహచరులు,రాజ్‌ గురు,సుఖ్‌ దేవ్లను లాహోరులో ఉరితీసారు. సింగు ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న మద్ధతు దారులు ఆయనను ఆక్షణమే ‘‘షహీద్‌’’ అంటే అమరవీరుడుగా ప్రకటించారు. అప్పటి సూపరింటెండెంటు ఆఫ్‌ పోలీసు వి.ఎన్‌.స్మిత్‌ ఆజ్ఞ ప్రకారం సింగును ముందుగానే ఉరితీ సారు.సాధారణంగా ఉదయం 8గంటలకు తీసే ఉరిని, ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగా ఉరి తీయాలని నిర్ణయించుకున్నారు. సుమారు రాత్రి 7గంటల సమయంలో జైలు లోపలనుంచి ‘‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’’ అంటూ నినాదాలు మిన్నుముట్టాయి. సింగు జీవితానికి చివరగా తెర దించబోతున్నారన్న విషయంలో అది సంకేతమైంది. సట్లెజ్‌ నది ఒడ్డున ఉన్న హుస్సేనీవాలా వద్ద ఒక వీరుని దహనం జరిగింది.భగత్‌ సింగ్‌ స్మారక చిహ్నం నేడు భారత స్వాతంత్య్ర సమర యోధులను గుర్తుకు తెస్తుంది.
ఆఖరి కోరిక
తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలోనే తలవెండ్రుకలు, గడ్డం తీసివేయటం జరిగింది.‘‘దేశసేవ కోసంమే అదంతా తన సహచరుడు సిక్కు రూపాన్ని కూర్చుకునే విధంగా ఒత్తిడి చేసారు.’’
భగత్‌ సింగ్‌ కు సంబంధించి ప్రత్యేకించి ప్రము ఖులు ఆయన మరణం చుట్టూ నెలకొన్న సంఘ టనల వెనుక పన్నాగ సిద్దాంతాలు ఉన్నాయను కుంటారు.-ఆచార్య. దేవులపల్లి పద్మజ

నాలుగున్నరేళ్లలో సంక్షేమ ఫలాలెన్నో..

సంక్షేమం పథకాలు అందరికీ అందాలి..కులం, మతం, ప్రాంతం, పార్టీలు,రాజకీయాలకుతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు చేరాలి..పార్టీలకతీతంగా ప్రతి పేద వాడూ ధైర్యంగా బతికే అవినీతి రహిత,స్వచ్ఛమైన పరిపాలన తీసుకు వస్తాం..` సీఎం.జగన్‌
అభివృద్ధి,సంక్షేమం ఈ రెండిరటి ఫార్ములానే ప్రామాణికంగా తీసు కుని జగన్‌ పాలన కొనసాగుతోంది. తండ్రి నుంచి రాజకీయ వార సత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్‌..వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బాటలోనే అడుగులు వేస్తున్నారు.ఎన్నికల ముందు ఆచరణ సాధ్యమయ్యే హామీలనే జగన్‌ ఇచ్చారు. ఇప్పుడు వాటిలో చాలా వరకు అమలు చేయడం సులు వైందని అంటున్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి కేబినెట్లోనే 14 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అంటే 56శాతం వారికే అవకాశమిచ్చారు.2022 ఏప్రిల్‌ 11న మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో ఈశాతాన్ని ఏకంగా 70కిపెంచారు. కేబినెట్‌ నుంచే సామాజిక న్యాయాన్ని మొదలు పెట్టారు.అటు రాజ్యసభకు 8సీట్లలో నాలుగింటిని బీసీలకే ఇచ్చారు. నాలుగేళ్లన్నర పాలనలో సీఎంజగన్‌ ఏపీలో చాలా సమస్యలకు పరిష్కారం చూపారం టున్నారు. నిషేధిత జాబితా భూముల సమస్యను సులువుగా పరిష్కరించారు.3లక్షల ఎకరాలను ఆజాబితాను తొలగించారు.చుక్కల భూములు,షరతులుగల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారుజగన్‌. పారిశ్రామికంగానూ ముందడుగు వేశామని వైసీపీ నేతలు అంటు న్నారు.ఇందుకు నిదర్శనం కొత్తగా 4పోర్టులు, 10ఫిషింగ్‌హార్బర్లు,6 ఫిషింగ్‌ ల్యాండ్‌లు, 3ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టామని గుర్తు చేస్తున్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌తో పెట్టుబడులను ఆకర్షించగలిగారు. పౌర సేవల్ని ఏఊరికి ఆ ఊళ్లోనే అందించడానికి 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటయ్యాయి.వీటిలో 1.34లక్షల మంది యువత ప్రభుత్వోద్యోగులుగా చేరారు. ప్రభుత్వ సేవల్ని ఇంటింటికీ నేరుగా అందించడానికి 2.65లక్షల మందితో వాలంటీర్లను ఏర్పాటు చేశారు.10,592 గ్రామ,పట్టణ హెల్త్‌ క్లినిక్‌లు పెట్టించారు. పేదలకు రేషన్‌ సరుకులు ఇంటి ముందుకే వస్తున్నాయి.దీనికోసం 9,260 డెలివరీ వ్యాన్‌లు పనిచేస్తున్నాయి.ఏపీ మోడల్‌ అన్న చర్చ తీసుకురావడానికి కారణం పాలనలో సీఎం తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలే. సచివాలయ వ్యవస్థ నుంచి ఆర్‌బీకే,రేషన్‌ డోర్‌డెలివరీ,వాలంటీర్‌ వ్యవస్థ..ఇలా అన్నిటినీ కొన్ని రాష్ట్రాలు స్టడీ చేశాయి. 2014ఎన్నికల్లో అధికారంలోకి వస్తారని ఆశించినా..అప్పుడు అపోజిషన్‌ కే పరిమితం అయ్యారు జగన్‌. ఓ వైపు కోర్టు కేసులు, మరోవైపు సుదీర్ఘ పాదయాత్ర ఇలా చాలా ఆటుపోట్ల తర్వాత 2019లో ప్రజావిశ్వాసం పొందారు. ప్రజల నమ్మకం పొందడమే రాజకీయ నాయకులకు ముఖ్యం. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి అదో జడ్జిమెంట్‌గా మారుతుంది. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు జగన్‌. పేదలందరికి ఇళ్లు,అమ్మఒడి,పెన్షన్లపెంపు,ఫీజురీఇంబర్స్‌ మెంట్స్‌, వైఎస్‌ఆర్‌ చేయూత,వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ ఆసరా వంటి పలు హామీలను ఎన్నికల సమయంలో ఇచ్చిన జగన్‌..అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అమలు చేసే ప్రయ త్నం చేశారు. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలద్వారా దాదాపు రెండులక్షల పదివేలకోట్ల రూపాయలను డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ ఫర్‌ విధానం ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే సర్కార్‌ జమచేసింది. ఇదే అంశాన్ని వచ్చే ఎన్నికల్లో వైసీపీ తమ అస్త్రంగా వినియోగించుకోనుంది.
2019 మేలో జగన్‌ అధికారం చేపట్టగా.. ఏడాదిలోపే 2020 మార్చ్‌ నుంచి కరోనా ప్రపంచంపై తీవ్రమైన ఎఫెక్ట్‌ చూపించింది. అది ఏపీ ఆర్థిక, ఆరోగ్య రంగాలపై ప్రభావం చూపింది. ఒకదశలో ఏపీనుంచి హైదరా బాద్‌కు రోగులు క్యూ కట్టారు.అప్పుడు రాక పోకలు నిలిచిపోవడంతో చాలాఇబ్బందులు ఎదురయ్యాయి.అలాంటి పరిస్థితులనుంచి ఏపీని ఆరోగ్యరంగంలో ముందుకెళ్లే దిశగా సీఎం చర్యలు చేపట్టారు. ఒకదశలో దేశంలోనే ఎక్కువ కరోనా టెస్టులు చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతి కల్పించారు. జిల్లాకు ఒకమె డికల్‌ కాలేజీ నిర్మించాలని నిర్ణయిం చారు.ఇప్పుడు ఉన్న మెడికల్‌ కాలేజీలకు అదనంగా 17మెడికల్‌ కాలేజీల ఏర్పాటు చేయలని జగన్‌ డిసైడ్‌ అయ్యారు. వీటిలో కొన్నింటికి కేంద్రం నుంచి అనుమతులు రాగా కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ను సైతం తీసుకొచ్చారు జగన్‌. ఫ్యామిలీ ఫిజీషియన్‌ డాక్టర్‌ విధానంలో డయాబెటిక్‌, హైపర్‌ టెన్షన్‌తో పాటు పలు అసాంక్రమిక వ్యాధులను గుర్తించి వైద్యం చేస్తున్నారు. ప్రతి పీహెచ్సీకి ఇద్దరు డాక్టర్లను నియమించారు. మండలానికో 104,108 వాహనాలను పెట్టిం చారు. దేశంలోనే ఏరాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా గ్రామ/వార్డు సచివాలయవ్యవస్థ ద్వారా సేవల్లో కొత్తపంథా తెరపైకి వచ్చింది. సామాన్య జనానికి సులువుగా సేవలు అందే పరిస్థితి వచ్చింది. సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా పాలన సాగుతోంది. ప్రతి తల్లీ తన బిడ్డను బడికి పంపితే అమ్మఒడి కింద 15వేల రూపాయలు అందిస్తున్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌,వసతి దీవెనకు నేరుగా సొమ్ములిస్తున్నారు. విదేశీ విద్యాదీవెన ద్వారా విద్యార్థులకు చేయూత అందిస్తున్నారు. అటు రైతులకూ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం,వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు,ఇన్‌ పుట్‌ సబ్సిడీ, డ్రిప్‌,స్ప్రింక్లర్ల అందజేత,విత్తన సబ్సిడీ ఇవన్నీ అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను నగదు బదిలీ ప్రక్రియ ద్వారా అమలు చేయడంవల్ల అవినీతికి,అక్రమాలకు తావు లేకుండా పోయిందని,రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే సహాయం ప్రజానీకానికి ఇంత సాఫీగా అందడం ఇదే సర్కార్‌ హయాంలో తొలిసారి అని అంటున్నారు.
వైద్యవిద్యలో నవశకం..
రాష్ట్ర చరిత్రలోతొలిసారిగా 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను సీఎం జగన్‌ ప్రారం భించారు. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని తన చేతుల మీదుగా ప్రారంభించిన సీఎం..అనంతరం వర్చువల్‌ విధానంలో రాజమహేంద్రవరం,ఏలూరు,మచిలీ­పట్నం, నంద్యాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రారంభించారు. అంతేకాకుండా విజయనగరం మెడికల్‌ కాలేజీలో ఫొటో ఎగ్జిబిషన్‌నుతిలకించారు. కాలేజీ భవనంలోని వివిధ విభాగాలకు సంబంధించిన గదులను పరిశీలించి ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు.
17మెడికల్‌ కాలేజీల కోసం రూ.8,480కోట్లు
స్వాతంత్య్రం వచ్చాక మన ఏపీలో కేవలం 11మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, ఈ నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం 17మెడకల్‌ కాలేజీలు ప్రారంభించేందుకు ప్రణాళిక చేశామని,అందుకోసం రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా ఐదు కాలేజీలు ప్రారంభించటం సంతోషంగా ఉందని, వచ్చే ఏడాది మరో 5కాలేజీలను ప్రారంభిస్తామని,ఆమరుసటి ఏడాది మరో 7కాలేజీలు ప్రారంభించడానికి సీఎం ప్రతిసాదించారు. ఇప్పటి వరకు ఉన్న మెడికల్‌ కాలేజీలలో 2,185 సిట్లు కేటాయించగా, కొత్త కాలేజీల రాకతో 4,735కి సీట్ల సంఖ్య చేరింది. అంతేకా కుండా మలో18 నర్సింగ్‌ కాలేజీలను కూడా అందుబాటుకి తీసుకువస్తున్నట్లు సీఎం వెల్లడిరచారు. అంతేకాకుండా ఈకాలేజీల ద్వారా పీజీ మెడికల్‌ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచను న్నారు. మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరిచేందుకే పని చేస్తున్నామని ప్రతి విద్యార్ధి ఈ ఆవకాశాన్ని ఉపయోగించుకుని ఈ సమాజంలో ఒక మంచి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుని సేవ చేయా లనదే సీఎం జగన్‌ ఆకాంక్ష!
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు
నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ చేశారు.ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకాలు కోసం ప్రత్యేకంగా రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌ కూడా ఏర్పాటు చేశారు. రూ.16,852 కోట్లతో 17కొత్త వైద్య కళాశా లలు,వివిధ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వా­లు చేశారు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు చేశామని, 12రకాల వైద్య సేవలు,14రకాలపరీక్షలు,105రకాల మందు లతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌ అమలు చేస్తున్న ప్రభుత్వం మనదే!. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు వెళ్తారని దీని ద్వారా రానున్న 6నెలల్లో పేదలకు మంచి వైద్యం అందించి ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారనునా గ్రామస్థాయిలో ఆశా వర్కర్ల ద్వారా సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు.వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా3,257కి పెంచారు.40లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8వేలకోట్ల వెచ్చించామని చెప్పారు.తాజాగాఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి పేద వాడికి రూ.1ఖర్చు లేకుండా పరీక్షలు చేసి చికిత్స అందిస్తుండటం విశేషం. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లిస్తున్నారు. ఇప్పటివరకూ 17.25లక్షల మందికి రూ.1,074.69 కోట్లు ప్రభుత్వం అందించింది.108,104 వాహనాలు సంఖ్యను కూడా పెంచారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
నాలున్నర ఏళ్లలో విద్యారంగంలో అనేక రకాల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొ చ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్‌ సిటిజన్స్‌గా తీర్చిది ద్దేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మరిన్ని చర్యలు ప్రారంభించారు. ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా,మారు తున్న టెక్నాలజీరంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేశారు. భవిష్యత్తు టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వవిద్యార్థులను తీర్చిదిద్ది వారికి హైఎండ్‌ టెక్నాలజీ రంగంలో ఉన్నత ఉద్యో గాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఈతరం పిల్లలకు గ్లోబల్‌ చదువులు
దీనికోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారు లు,గ్లోబల్‌టెక్‌ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారు. అమ్మఒడి,విద్యాకానుక, వసతిదీవెన, విద్యా దీవెన లాంటి పథకాలను అమలు చేయడమే కాకుండా పాఠ్యప్రణాళిక పరంగా,మౌలిక సదుపాయాల పరంగా ఎన్నెన్నో మార్పులు తీసుకువస్తున్నారు.
నవశకంలో తెచ్చిన మార్పులివే..
దీంట్లో భాగంగా 2019-20 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని 41 లక్షలమంది విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం చదువులు అందుతు న్నాయి. జాతీయస్థాయి, ప్రపంచస్థాయి విద్యా ర్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశా లలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ వచ్చేలా 2022-23లో ప్రభుత్వం చర్యలు ప్రారం భించింది. ప్రపంచస్థాయిలో ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులు పోటీపడాలంటే ఇంగ్లిషులో ప్రావీణ్యం చాలా కీలకం.పాఠ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాలు,మాన వవన రులు, లెర్నింగ్‌ కంటెంట్‌,ల్యాబులు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండా లన్న దానిపై ఈ వర్కింగ్‌ గ్రూపు ఖరారు చేయనుంది.
‘అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే ధ్యేయంగా..ఖాతాల్లోకి రూ.1,353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్‌ అందజేసింది.నిజమైన వ్యాపార వేత్తలుగా మార్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం అమలు విజయవంతంగా సాగుతోంది. మన ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా,వారి జీవనోపాధి మెరుగుపరుస్తూ..బహుళ జాతి,దిగ్గజ కంపెనీలు,బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం, వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్‌ బాటలు వేశారు.ఈప్రభుత్వం చొరవతో బ్యాంకుల లోవడ్డీ రేట్లు తగ్గింపజేయడంతో అక్కచెల్లె మ్మలపై ఏకంగా రూ.1,224కోట్ల మేర వడ్డీ భారం తగ్గింది. ప్రభుత్వ సహకారంతో పశువుల కొనుగోలు,కిరాణా దుకాణాలు,వస్త్ర వ్యాపారాల వంటి వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న 16,44,029 మంది అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.7వేల నుంచి 10వేల వరకు అదనపు ఆదాయం పెరిగింది. అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్‌ పాలపై రూ.20వరకు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. – గునపర్తి సైమన్‌

పాలకులకు పట్టని ప్రాధామిక విధులు

రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి నిధులు, రాజకీయ అధికారాలున్న ప్రధాన మంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైన వారు మత, భాష, ప్రాంత మొదలైన విభజనలకు అతీతంగా సామరస్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంచాలి. దీనిని నిజాయితీగా చేయాలి. సంకుచితంగా ఆలోచిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలో ఏదో ఒక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర మతాల పట్ల సమాన భావాన్ని కనబరచని వారు ప్రజలకు స్ఫూర్తినివ్వరు. పంచాయితీ నుండి పార్లమెంటు వరుకు ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ ప్రాథమిక విధులను ఒక బాధ్యతగా ప్రచారం చేయాలి, పాటించాలి.
ద్వేష భావజాలం భారత దేశాన్ని మింగేస్తుంది’.మహాత్మాగాంధీ 75వవర్థంతి సంద ర్భంగా ఆయన ముని మనవడు తుషార్‌ గాంధీ చేసిన వ్యాఖ్య ఇది.ద్వేష భావజాలం భారతదేశం లో ఎందుకు పెరుగుతున్నదో దేశ రాజకీ యాలను చూచాయగా పరిశీలించే వారికి సైతం తెలుస్తుంది. ద్వేష భావజాలాన్ని పెంచటంలో, వ్యాప్తి చేయటం లో రాజకీయ నాయకులు, పాలకుల పాత్ర ఎంత వున్నది? రాజ్యాంగం వారికి చెప్పిందేమిటి? వారు చేస్తున్నదేమిటో చర్చించటమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. ఈ క్రమంలో ప్రాథమిక విధుల గురించి తెలుసు కోవటం అవసరం.
ప్రాథమిక విధులు – చరిత్ర
రాజ్యాంగం ఆమోదించినపుడు ప్రాథ మిక విధులు అందులో భాగం కాదు. నాటి రాజ్యాం గ నిర్మాతలు అప్పుడున్న సామాజిక, నైతిక పరిస్థి తులను దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక విధులు అవసరం లేదని భావించి ఉండవచ్చు.కాని 1976 లో స్వరణ్‌ సింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు 42వ సవరణ ద్వారా వాటిని రాజ్యాంగంలో పొందు పరిచారు.
ప్రాథమిక విధులను ఎందుకు చేర్చారు ?
‘కాలం గడిచే కొలది నైతిక విలువలు … ముఖ్యంగా ప్రజా జీవితంలో విలువల పతనం స్పష్టమైన కారణంగా ప్రాథమిక విధులను ప్రత్యేకం గా రూపొందించటం అవసరమని దేశం భావిం చింది.’’ అని జస్టిస్‌ జె.ఎస్‌. వర్మ కమిటీ పేర్కొంది.
ప్రాథమిక విధులు – స్వభావం
51ఏ అధికరణంలో మొత్తం 11 ప్రాథ మిక విధులుంటాయి. వాటిలో 51(ఎ)(ఇ)లో ఉన్న ప్రాథమిక విధిని మాత్రమే ఈవ్యాసంలో చర్చిం చాం. కొన్ని విధులు నైతిక నియమావళిలాగా, మరికొన్ని పౌర నియమావళిలాగా ఉంటాయి.
అధికరణం 51(ఎ)ఇలో ఏముంది ?
ఈ అధికరణంలో రెండు భాగాలున్నా యి. మొదటి భాగం భారత ప్రజలందరి మధ్య కుల,మత,భాషా,ప్రాంతలేదా ఏ ఇతర విభజనలతో వైవిధ్యాలతో వైవిధ్యాలతో సంబంధం లేకుండా ప్రజలందరి మధ్య సామరస్యం,సోదరభావాన్ని పెంపొందించాలని ఆదేశిస్తుంది. రెండవ భాగం స్త్రీలను అగౌరవ పరిచే అన్ని అంశాలను, విధానా లను విడనాడాలని ఆదేశిస్తుంది.
ఎవరు పాటించాలి ?
51వ అధికరణం ప్రారంభంలో ఇది ప్రతి పౌరుని యొక్క విధి అనే వాక్యం ఉన్నది.దీని అర్థం.. ప్రభు త్వానికి, పాలకులకు, అధికార గణానికి, రాజకీయ నాయకులకు వర్తించదా అనేది ప్రశ్న? ఈ ప్రశ్నకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ సమాధానం చెప్పారు. ప్రాథమిక విధులపై 1999లో ఆయన నేతృత్వంలో వేసిన కమిటి అనేక సిఫార్సులు చేసింది.
జస్టిస్‌ జె.యస్‌.వర్మ సిఫార్సులు
రాజకీయ నాయకులు ఈ విధుల గురించి మాట్లాడేటప్పుడు ఇవి ప్రజలు పాటించ వలసినవిగా తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా చెబుతారు. కాని వాస్తవంలో వారే ఈ విధులను పాటించవలసిన బాధ్యత ఉంది. నైతిక విలువల వ్యాప్తిలో ఆదర్శనీయులుగా ఉండే వ్యక్తుల పాత్ర చాలా ప్రముఖమైనది.కేవలం చట్టపరమైన నిబం ధనల ద్వారా ఈ విలువల వ్యాప్తి జరగదు. విలువ లు పాటించటం ద్వారా ఆదర్శప్రాయులుగా మార టం ద్వారా,సామాజిక ఆంక్షలద్వారా ఈ విలువలు వ్యాప్తి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజకీయ నాయకులు,ప్రజా ప్రతి నిధు లు,రాజకీయ అధికారాలున్న ప్రధానమంత్రి, రాష్ట్రా ల ముఖ్యమంత్రులు, మంత్రులు,ఎంపీలు,ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు మొదలైన వారు మత,భాష, ప్రాంత మొదలైన విభజనలకు అతీతంగా సామర స్యాన్ని ఉమ్మడి సోదర భావాన్ని పెంచాలి. దీనిని నిజాయితీగా చేయాలి. సంకుచితంగా ఆలోచిస్తూ ఎన్నికల ప్రయోజనాల కోసం సమాజంలో ఏదో ఒక తరగతికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇతర మతాల పట్ల సమాన భావాన్ని కనబరచని వారు ప్రజలకు స్ఫూర్తినివ్వరు.పంచాయితీ నుండి పార్లమెంటు వరు కు ఉన్న ప్రజా ప్రతినిధులు ఈ ప్రాథమిక విధులను ఒక బాధ్యతగా ప్రచారం చేయాలి,పాటించాలి.
ప్రభుత్వ ఉద్యోగులు, కార్యాలయాలు
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉండే అధిపతులు ప్రాథమిక విధులు ఆచరించి, వ్యాప్తి చేయాలనే బాధ్యతకల్గి ఉన్నారు.వారికి ఇది అదనపు విధి.సిబ్బంది అందరి ముందు ప్రతి సంవత్సరం ప్రాథమిక విధులను ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేయాలని జస్టిస్‌జె.యస్‌.వర్మ సూచించారు.అవినీతి లేకుండా, ప్రజలకు సన్నిహితంగా ఉంటూ స్నేహపూర్వకమైన విధానంతో విధులు నిర్వర్తించాలని పారదర్శకత చూపాలని సిపార్సు చేశారు. ప్రతి అధికారికి రెండు రకాలైన బాధ్యతలు (వ్యక్తిగతంగా,అధికారయుతం గానూ) ఉంటాయని ఆరెండిరటి సందర్భంగా కూడా విధులు పాటించాలని ఆయన సూచిం చారు. ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వ కార్యాల యాల మీద ఆధిపత్యం ఉన్న వారు ఎవరైనా… రాజకీయ,పరిపాలనా,విద్య,ఇతర ఏ ప్రజా సేవలకు సంబంధించినదయినా…వారు తమ అధికార పరిధి ఉన్నంతవరకు పౌరులను ప్రాథమిక విధుల విషయంలో మార్గదర్శకంగా నిలుస్తూ ప్రచారం చేయాలి. ప్రతి సంవత్సరం జనవరి మూడవ తేదీని ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటించాలి.పై సిఫార్సులను పరిశీలించినప్పుడు ప్రధానంగా రాజకీ య నాయకులు, ఎన్నికలలో పాల్గొనేవారు, ప్రభుత్వ అధికారులు అత్యంత నిజాయితీగా ఉండాలి. ముఖ్యంగా సోదరభావాన్ని పెంపొందించటంలో ప్రముఖ పాత్ర పోషించాలని అర్థమవుతుంది.
ఆచరణ ఎలా ఉంది ?
2014 నుంచి 2018 మధ్య 4సంవ త్సరాల కాలంలో ప్రముఖ రాజకీయ నాయకుల విద్వేష ప్రసంగాలు 5 వందల శాతం పెరిగాయని ఎన్‌డిటివి పరిశోధనలో తేలింది. అలాగే కర్ణాటక లో బిజెపి ప్రభుత్వం 2019 నుండి 2023 ప్రాం తం మధ్యలో 7ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా 182 మత హింస, విద్వేష ప్రసంగాలు, గోరక్షణ నేరాలకు సంబంధించిన కేసులను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఫలితంగా ఈ నేరాలలోనిందితులుగా ఉన్న వందలాది మంది శిక్షల నుంచి బయటపడ్డారు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. అంటే వందల మంది రాజకీయ నాయకులు ప్రాథమిక విధులకు విరు ద్ధంగా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారని అర్థమవు తుంది.అలాగే 2017లో హిందూస్థాన్‌ టైమ్స్‌ చేసిన సర్వే ప్రకారం ఎన్నిక కాబడిన, అధికారాలు పొం దిన వారిలో 50మందిపై మత హింస, ద్వేష ప్రసంగాలకు సంబంధించిన నేరాలు నమోదయ్యా యి.2018-2019మధ్య కాలంలో అసత్యపు వార్తలను,వాట్సాప్‌ వార్తలు నిజమని నమ్మి 31 మంది చనిపోయారని బిబిసి పరిశోధనలో తెలి పింది. ఇతర మతాలపై ద్వేషపూరిత, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా గల్ఫ్‌ దేశాలు, ముస్లిం దేశాలు తమ అసమ్మతిని తెలియజేయటం మనం గమనించాం. మణిపూర్‌, హర్యానా, ఇతర ప్రాంతాలలో జరుగుతున్న హింసాత్మక ఘర్షణలు …ఇటీవలి కాలంలో పెరుగుతున్న విద్వేష ప్రచార ఫలితాలే.
సుప్రీంకోర్టు తీర్పులు
ప్రాథమిక విధులను క్షేత్ర స్థాయి నుంచి ప్రచారం చేయాలన్న జస్టిస్‌ వర్మ కమిటి సిఫార్సుల ను వెంటనే అమలు చేయాలని 2003లో జస్టిస్‌ రంగనాథ్‌మిశ్రా పిటిషనర్‌గా భావించబడిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. స్కూలు స్థాయి నుంచి అన్ని విద్యా స్థాయిల వరకు సమాజంలోని అన్ని విభాగాలలోను ఈ విధులను ప్రచారం చేయాలని, సోదరభావం,మతాలపట్ల సమభావం పెరిగేం దుకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.20 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ద్వేషభావాన్ని తీవ్రస్థాయికి చేర్చిన రాజకీయ నాయ కులు, పాలకులు సమాధానం చెప్పుకోవాలి. ద్వేష ప్రసంగాల విషయంలో వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ బెంచ్‌ ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేపథ్యం లో ప్రచారం చేయవలసిన, పాటించ వలసిన ప్రాథమిక విధులు,నైతిక విలువ లను పక్కనబెట్టి మతపరమైన విషయాలను ప్రచా రంచేస్తామని, అవగాహన కల్పిస్తామనిఎ.పి మంత్రి వర్యులొకరు ప్రకటించటం విపరీతం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి భారతదేశ సంస్కృతి సాంప్ర దాయ మైన…పరమత సహనం,సహోదర భావంతో పాటు ఇతర అన్ని ప్రాథమిక విధులను పాటించి ప్రచారం చేయాలని ఆశిద్దాం. (వ్యాసకర్త :ఎ.పి.సి. ఎల్‌.ఎ ప్రధాన కార్యదర్శి,సుప్రీంకోర్టు న్యాయవాది) – (పొత్తూరి సురేష్‌ కుమార్‌)

నాడే చెప్పిన బాబా సాహేబ్‌

మణిపూర్‌లో జరుగుతున్న అత్యాచారాలు,మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘట్టాల మీద ప్రధాని మోదీ 80 రోజులు నోరు విప్పకపోవడానికి కారణమేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.ఈ అఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్వారా ప్రపంచమంతా వీక్షించింది.ఈ ఘటనలో ముఖ్యపాత్ర వహించిన మణిపూర్‌ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని,మణిపూర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ను ఆగస్టు 7న స్వయంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ మార్గంలోనే దళితుల, ఆదివాసీల,స్త్రీల రక్షణ కోసం ప్రజాస్వామ్య లౌకికవాద సోషలిస్టు భావజాలంతో ఉన్నవారందరం కలసి ఏక కంఠంతో పోరాటం చేయాలి.
మణిపూర్‌లోజరుగుతున్న అత్యాచా రాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘట్టాల మీద ప్రధాని మోదీ 80 రోజులు నోరు విప్పక పోవడానికి కారణమేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తు న్నాయి. ఈ అఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియోద్వారా ప్రపంచమంతా వీక్షించింది. ఈ ఘటనలో ముఖ్యపాత్ర వహించిన మణిపూర్‌ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, మణిపూర్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ను ఆగస్టు 7న స్వయంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగి న తర్వాత కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేయడంలో ఎందుకు జాప్యం చేశారని సుప్రీం కోర్టు అడిగింది. సుప్రీంకోర్టు ఇటీవల అనేక విష యాల్లో రాజ్యాంగేతరశక్తిగా ప్రభుత్వం నడుస్తు న్నదని హెచ్చరిస్తూ వస్తున్నది. ఈ ఘటన మీద హోంమంత్రి అమిత్‌ షా చేసిన ప్రకటన అనేక అనుమానాలకు దారి తీస్తుంది. గుజరాత్‌లో ఒక వర్గానికి 2022లో బుద్ధి చెప్పిన తర్వాత అక్కడ మతఘర్షణలు ఆగిపోయాయని హోంమంత్రి అంటున్నారు.2022 నుంచి హిందువులకు భయ పడి ముస్లింలు అక్కడ జీవిస్తున్నారని అర్థం. కుకీల అటవీ భూములను మొయితీలకు కట్టబెట్టి అడవిపై ఆధిపత్యం వహించాలనేది మణిపూర్‌లో పన్నిన వ్యూహం. ముఖ్యంగా కుకీలు అడవి సంపదనంతా రక్షిస్తూ వచ్చారు. అడవి సంపదలో ప్రధానంగా గ్రానైట్‌, ప్లాటినం మెటల్స్‌,ఎలిమెంట్స్‌,నికిల్‌, కాపర్‌, బొగ్గు, పెట్రోలియం ఇంకా ఎంతో విలువైన ఖనిజ సంపదను వారు భారతదేశానికి ఒక ఘన నిక్షేపంగా కాపాడుతూ వచ్చారు.దానికి కారణం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు చట్టపరమైన, రాజ్యాంగపర మైన హక్కులున్నాయి. ఈ హక్కుల ప్రకారం అక్కడ మైనింగ్‌ను దోపిడీ చేయడానికి కార్పొరేట్లకు అవ కాశం లేదు.అందుకే వాళ్లు విధ్వంసానికి పూను కున్నారు. ఈరోజున ఈశాన్య రాష్ట్రాలు భారత దేశానికి ఆయువులు. ఈశాన్య రాష్ట్రాల్లో భారత ఉపఖండం మూలాలున్నాయి. ఈ భారతదేశాన్ని జయించిన ఆర్యులు, కుషానులు, అరబ్బులు, తురు ష్కులు ఎవరూ కూడా ఈశాన్యాన్ని ముట్టుకోలేక పోయారు. తాకట్టులోకి భారతదేశం వెళ్తున్నప్పుడు కూడా ఈశాన్యం తనను తాను కాపాడుకుంది. గిరిజనుల పోరాటాల వల్ల సంపదను కాపాడు తుంది.మణిపూర్‌లో భారత రాజ్యాంగాన్ని ఉల్లం ఘించడానికి, క్రైస్తవులపైదాడి చేయడానికి వెనకా డటం లేదు. అది ప్రపంచమంతా అర్థం చేసు కుంది. ముస్లింల మీద, క్రైస్తవుల మీద, బౌద్ధుల మీద, జైనుల మీద చేస్తున్న దాడులు వెనక మొత్తం భారతదేశాన్ని గుప్పెట్లో తీసుకోవాలని, భారతదేశ వనరులన్నీ కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేసి తద్వారా మిగిలిన జాతులన్నింటిని ధ్వంసం చేయాలనే భావన మనకు కనిపిస్తుంది. నిజానికి గిరిజనులు అక్కడ ఎందుకు క్రైస్తవులైనారు. వారు క్రైస్తవులు అవ్వడం వల్ల వారికి కలిగిన లాభమే మిటి? అక్కడ గిరిజన పిల్లలు ఎక్కువ మంది ఈ రోజు అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో చదవగలుగు తున్నారంటే ఇంగ్లీషు విద్యను చదవడానికి క్రైస్తవ మతాన్ని వారు ఆశ్రయించారు.
మణిపూర్‌ హింస గురించి బీజేపీలోనే వ్యతిరేకత పెల్లుబుకింది. బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌ లాల్‌ హోకిప్‌ మహిళలను నగ్నంగా ఊరేగించడం మీద తీవ్రఆక్షేపణ తెలిపారు. మణిపూర్‌లో చెలరే గుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీనివెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్‌ హోకిప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల నగ్న వీడియో బయటకు రాకుంటే ప్రధానమంత్రి మోదీ అసలు మాట్లాడేవారే కాదన్నారు. హింస మొదలైన ప్పుడే సమస్యను చెప్పుకొనేందుకు ప్రధాని అపా యింట్‌మెంట్‌ అడిగామని, ఇప్పటికీ కలిసేం దుకు ఆయన అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హింసకు మైతే మిలిషియాతో పాటు పోలీసులూ కారణమని విమర్శించారు.
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గిరిజన రచయితలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు.26 రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 86 మంది గిరిజన రచయితలు ఈలేఖపై సంతకాలు చేశారు. ‘సువిశాల మైన, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన దేశా నికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రాష్ట్రం లో శాంతిని నెలకొల్పేం దుకు సహాయం చేయాలి’ అని దేశంలోని కోట్లాది మంది గిరిజనుల తరపున ‘ఆల్‌ ఇండియా ఫస్ట్‌ నేషన్స్‌’ (స్వదేశీ,ఆదివాసీ) రచయితల సదస్సు సభ్యులు లేఖలో విజ్ఞప్తి చేశారు.
గత రెండు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు, తాము దిగ్భ్రాంతి చెందామనీ, విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇద్దరు కుకీ, గిరిజన మహిళలను బందీలుగా చేసి, క్రూరంగా హింసిం చడం ఇది భారతదేశంలోని 700కు పైగా గిరిజన సంఘాలను మాత్రమే కాకుండా మొత్తం పౌర సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. దేశంలోని ఆదివాసీ సాహితీవేత్తలమైన తాము ఈ హీనమైన,అమానుష చర్యను తీవ్రంగా ఖండిస్తు న్నామని పేర్కొన్నారు. గిరిజన మహిళలపై క్రూర మైన దాడికి పాల్పడిన ప్రత్యక్ష, పరోక్ష నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
మణిపూర్‌ విషయాన్ని కొందరు లౌకికవాదులు ఇలా విశ్లేషిస్తున్నారు. మణిపూర్‌ విషాదం జాతి సంహారం లేదా జాతి ప్రక్షాళనకు ఆరంభమే. అవును, సందేహం లేదు జాతి ప్రక్షాళన (ఎథ్నిక్‌ క్లీన్సింగ్‌) ఒక భయానక పదబంధం ఇప్పు డది భారత్‌ను వెన్నాడుతోంది, పీడిస్తున్నది. జాతిప రంగా ఒకసజాతీయ భౌగోళిక ప్రాంతాన్ని నెల కొల్పేందుకు అవాంఛిత ఉపజాతి సభ్యులను (దేశ బహిష్కృతులను చేయడం, స్థాన చలనం కలిగించ డం లేదా మూకుమ్మడిగా హతమార్చడం ద్వారా) సంపూర్ణంగా వదిలించుకోవడమే జాతి ప్రక్షాళన అని హిస్టరీ.కామ్‌ వెబ్‌సైట్‌ ఎడిటర్స్‌ నిర్వచిం చారు. ఎథ్నిక్‌ క్లీన్సింగ్‌కు ఉదాహరణలుగా మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఆర్మేనియన్ల ఊచకోత, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో 60లక్షల మంది యూరోపి యన్‌ యూదుల మారణహోమాన్ని చరిత్రకారులు పేర్కొంటారు. ఐరోపాలో సెర్బియా, కొన్ని ఆఫ్రికన్‌ దేశాలు కూడా జాతి ప్రక్షాళనను చవిచూశాయి. స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజ్యాంగం గుర్తిం చింది. మూడు ప్రధాన జాతుల వారికి మణిపూర్‌ నెలవు. తమ నాగరికత కొన్ని వేల ఏండ్ల నాటిదని గొప్పలు చెప్పుకొనే ఈ దేశంలో ఈ ఆదిమవాసులు నేటికీ ప్రాచీన కాలంనాటి దుర్భర అనాగరిక పరిస్థితి లోనే నివసిస్తున్నారంటే ఏమనాలి?కానీ,ఇది మాత్రం నగ్నసత్యం. ఇన్ని వేల ఏండ్లుగా ఈ దుర దృష్టవంతులు నాగరికులు కాలేకపోవడం ఒక్కటే కాక ఇందులో కొందరు దుష్టవృత్తులను అవలం బించే దుస్థితికి దిగజారి నేరస్త జాతులు (క్రిమి నల్స్‌)గా పరిగణించబడుతున్నారు. కోటి ముప్పై లక్షల మంది, నాగరికత మధ్య బతుకుతూ అనాగ రిక ఘోర దుస్థితిలో ఉండిపోవడం! పైగా వంశ పరంపరగా నేరస్థులుగా బతుకడం! దీనికి పాలకు లు సిగ్గయినా పడకపోవడం! ప్రపంచంలో ఎక్కడా లేని విచిత్ర పరిస్థితి ఇది.ఈ లజ్జాకరమైన పరిస్థితికి ఏమిటి కారణం?ఈ ఆదిమవాసులను నాగరికు లుగా మార్చడానికి,గౌరవప్రదమైన వృత్తులు చేపట్టేలాగ చేయడానికి అసలు ప్రయత్నమే జరగ లేదు.ఎందువల్ల?
బహుశా,వాళ్ల అనాగరికస్థితికి జన్మ సిద్ధమైన బుద్ధిమాంద్యమే కారణమని చెప్పడానికి ప్రయత్నించవచ్చు. ఆదిమవాసులు తరతరాలుగా అనాగరికులుగానే ఉండిపోవడానికి కారణం తామేననీ ఒప్పుకోకపోవచ్చు. వాళ్లకు నాగరికత నేర్పడానికిగాని,వైద్య సహాయం మొదలైన వాటి ద్వారా వాళ్లను సరిదిద్దడానికిగాని,వాళ్లను సంస్క రించి మంచి పౌరులుగా తయారుచేయడానికి గాని తాము ఏమాత్రమూ ప్రయత్నించకపోవడమే ఆదిమవాసుల అనాగరిక స్థితికి కారణమని పాల కులు అంగీకరించకపోవచ్చు.ఆదిమవాసులను నాగరికులను చేయడమంటే వాళ్లను నీవాళ్లుగా భావించడం. వాళ్ల మధ్య నివసించడం, వాళ్లలో ఒక సహానుభూతిని పెంపొందించడం, క్లుప్తంగా చెప్పాలంటే,వాళ్లను ప్రేమించడం.
(వ్యాసకర్త: మహాకవి, దళిత ఉద్యమనేత), – (డాక్టర్‌ కత్తి పద్మారావు)

సంక్షేమంతో..సుపరిపాలన

తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవు తుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సీ.ఆర్‌.మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. సుపరి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం అనే అంశంపై స్టేట్‌ అవర్‌ లీడర్‌ వైఎస్సార్‌ ఇంటెక్ట్యువల్‌ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆయన పర్యటించారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి మేథావులు,విద్యావేత్తలతో ఈ అంశంపై సమాలోచనలు చేసి సీఎం జగన్‌ అమలపరుస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు సుపరిపాలన అందుతుందా లేదా అనేదానిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు..’
ఇందులో భాగంగా విశాఖలో జరిగిన సభలో కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగిం చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటు న్నాయని కొనియాడారు. ఆగష్టు 21న అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడర్‌లో భాగంగా ‘‘సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం’’ అనే అంశంపై జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం కూడా అమలు చేసేందుకు సిద్దమైందన్నారు. వలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోం దన్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నారనడానికి ఇవి ఉదాహరణ లన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాద్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆయన తెలిపారు. పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టగా తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమపిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలను నెరవేర్చిం దన్నారు. గ్రామసచివాలయ వ్యవస్థలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 50వేల కార్యాలయాలను ఏర్పాటుచేసి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. గతంలో ఏముఖ్యమంత్రీ చేపట్టని సంస్కరణలు, సంక్షేమానికి జగన్‌ శ్రీకారం చుట్టారని కొనియాడారు. విద్యకు వృత్తిపరమైన నైపుణ్యాన్ని జోడిరచడం ద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచిందన్నారు. ఆర్ధికపరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్ని ఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకు ప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు. ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోకరంగా,ఉపయుక్తంగా ఉండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు.సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్శిటీ రిటైర్డ్‌ వీసీ వి.బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ,ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రీకి మించిన తనయుడు సీఎం జగన్‌ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యాకానుక, విద్యాదీవెన,విదేశీయ విద్యాదీవెనలకు సంబంధించి కొనియాడారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శాంత మూర్తి మాట్లాడుతూ తమ సంస్థలో 700మంది సభ్యులు ఉన్నారని ,వీరిలో డాక్టర్లు,లాయర్లు, ఇంజనీర్లు, ఇంటలిజెన్స్‌ అధికారులు,వైస్‌ ఛాన్సలర్లు,ఐఎఎస్‌ అధికారులు ఉన్నారని తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమస్యలను గుర్తించిన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నార న్నారు.ప్రజల వద్దకు సంక్షేమ ఫలాలను తీసుకెళ్లే లక్ష్యంతో ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థను తమిళనాడు ప్రభుత్వం అనులు చేసేందుకు సిద్ధమైందని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను మెచ్చుకున్న కేరళ ప్రభుత్వం,ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థనే తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే తమ పిల్లలను అంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారని చెప్పారు.విద్య, వైద్యానికి కీ.శే రాజశేఖర్‌ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని, నేడు జగన్మోహన్‌ రెడ్డి మరింత బలోపేతం చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. తీరప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు వక్తలు సమాధానమిచ్చారు.
కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే ప్రభుత్వ లక్ష్యం
ఉద్దానంలో మహమ్మరిలా వ్యాపిస్తున్న కిడ్నీ వ్యాధి మూలాలు కనుగొనడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. కాశీబుగ్గలో కిడ్నీ పరిశోధన కేంద్రం, 200 పడకల ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు.కిడ్నీ రోగులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. అంతకుముందు పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.పి ఇన్నోవేషన్‌ సొసైటీ లావణ్య, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వెంకటరావు, 28వార్డు కార్పొరేటర్‌ పల్లా దుర్గారావు,యాక్సిస్‌ సెవెన్‌ ఇకోస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పాల్‌ బాస్కర్‌,ఆంధ్రా యానివర్సిటీ ప్రొఫెసర్‌ తిమ్మారెడ్డి, పాతపట్నం,టెక్కలి,రాజాం ప్రభుత్వ డిగ్రీకళాశాలల ప్రిన్సిపాళ్లు కె.శ్రీరాములు,గోవిందమ్మ, స్వప్న హైందవి, గాయత్రి విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌ పులఖండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.– జి ఎన్ వి సతీష్ 

జమిలి ఎన్నికలు

కేంద్ర,రాష్ట్రచట్టసభలకు,ఇంకా అవస రమైతే స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలు నిర్వహిం చాలన్న ఆలోచన పైకి మంచిగానే కనబడుతున్న ప్పటికీ, లోతుగా విశ్లేషిస్తే, ప్రజాస్వామ్య విలువలు, సమాఖ్యస్ఫూర్తికి పమాదం వాటిల్లే అవకాశాలు ఉన్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘ఐదేండ్ల కాలానికి ఎన్నికైన ఏదైనా ప్రభుత్వం మధ్యలో కూలిపోతే ఏమిటి చేయడం? అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కొత్త ప్రభుత్వం ఐదేండ్ల కాలానికి అధికారం చేపడుతుంది. అప్పుడు ఉమ్మడి ఎన్నికల వ్యవస్థ (జమిలి) లక్ష్యం దెబ్బతిం టుంది.ఇలా జరుగకుండా ఉండాలంటే, కొత్త ప్రభుత్వం కాల పరిమితిని కుదించాల్సి ఉంటుంది. ఇది పజాతీర్పుకు, సమాఖ్యస్ఫూర్తికి, ప్రజా స్వామ్య విలువలకు గొడ్డలి పెట్టులాంటిదే’ అని వాళ్లు వాదిస్తున్నారు.
లా కమిషన్‌ సిఫారసు అలా..
రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన కచ్చితత్వంతో లేదు. లోక్‌సభ విధివిధా నాల్లోని198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువమంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్ట వచ్చని నిబంధనలు చెబుతున్నాయి.అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సిఉంటుంది. ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేన ప్పుడు సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరు పడమే మార్గం. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏంచేయాలి? దీనిపై 1999లో లా కమిషన్‌ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం.. జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు. అంటే, ప్రభుత్వం పై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి.ఈరెండు తీర్మానాలను సభ ఆమో దించిన తర్వాత అధ్యక్షుడు కొత్త చాన్సలర్‌ను నియ మిస్తారు. ప్రభుత్వాలు మారినా ఐదేండ్లపాటు సభ కొనసాగుతుంది. అయితే, జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉన్నది.మనది ప్రజాస్వామ్య దేశం. దీంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు. అవిశ్వాస తీర్మానం తో రాష్ట్రప్రభుత్వాలు కూలిపోతే, జమిలి ఎన్నికల నెపంతో రాష్ట్రపతి పాలన విధించే అవకాశమూలేక పోలేదని..పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఏకకాలంలో ఎలక్షన్స్‌ నిర్వహించాలంటే ఏయే ప్రొసీడిరగ్స్‌ అనుసరించాలి..?
జమిలి ఎన్నికల అంశాన్ని మోదీ సర్కారు విడిచిపెట్టడం లేదు. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిం చాలని బీజేపీ ఏండ్లుగా ప్రతిపాదిస్తూనే ఉన్నది. అయితే, ఇప్పటికే రెండు మూడుసార్లు దీనికి సంబం ధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, కార్య రూపం మాత్రం దాల్చలేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు)సాధ్యాసాధ్యాల పరిశీలన నిమిత్తం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓకమిటీని ఏర్పాటు చేయడం గమనా ర్హం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏయే ప్రొసీడిరగ్స్‌ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ లకు, లోక్‌ సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించ డమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
గతంలో జరిగినా.. ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్ని కల నిర్వహణ కొత్తదేమీ కాదు.1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని,1967 వరకు లోక్‌సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకే సారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలం లో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
ప్రక్రియ చాలా పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడగిం చాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధిం చిన బిల్లు తొలుత పార్లమెంట్‌ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదా పు ఐదు రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని 2018లో లా కమిషన్‌ అభిప్రాయపడిరది. ఆర్టికల్‌ 356,ఆర్టికల్‌324,ఆర్టికల్‌ 83(2),ఆర్టికల్‌ 172 (1),ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలకు సూచించింది.
ఆమోదం లభించడం సులభమేమీ కాదు
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు కనీసం 67శాతం సానుకూల ఓట్ల తో ఆమోదించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యం లో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థిం చాలి. దీనికి తోడు కనీసం 14రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది.
ఏ ఆర్టికల్‌/నిబంధన ఏం చెబుతున్నది?
ఆర్టికల్‌ 356: రాష్ట్రాల అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉన్నది. రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది.ఒకవేళ, వేరే సందర్భంలో చట్ట సభ రద్దుకు నిర్ణయిస్తే,అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది.
ఆర్టికల్‌ 172 (1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాలవ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటినుంచి కాలపరిమితి మొదలౌతుంది.
ఆర్టికల్‌ 324: రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,లోక్‌సభ, రాజ్యసభ,శాసనసభ,శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమ యానుసారం,రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి.పార్లమెంట్‌,శాసనసభ ఎన్ని కలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది.
ఆర్టికల్‌ 83(2): ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్‌ సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు.
ఆర్టికల్‌ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబం ధించి ఆర్టికల్‌ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2,3చాప్టర్స్‌, పార్ట్‌-15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.
దేశంలో జమిలి ఎన్నికలు సాగాయిలా..
2019 15 శాతం
1967 67 శాతం
1951-52 90 శాతం
1957 76 శాతం
ఉభయ సభల్లో ఎన్డీయే బలాబలాలు
ó లోక్‌సభలో ఎన్డీయే బలం 61శాతం
ó జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 శాతం
ó రాజ్యసభలో ఎన్డీయే బలం 38శాతం
ó జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 శాతం
ó ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలు 16శాతం
ó బిల్లు ఆమోదానికి ఎన్ని రాష్ట్రాల ఆమోదం అవసరం 14శాతం
సమైక్య వ్యూహంతో ‘ఇండియా’- జమిలి ఆత్రంలో మోడీ
బిజెపి మత రాజకీయాలనూ కేంద్రం నిరంకుశత్వాన్ని ఓడిరచడానికి మరింత సమిష్టి గానూ సమర్థంగానూ సత్వర వ్యూహాలు రూపొం దించుకోవాలని ప్రతిపక్షాల నాయకులు గుర్తిం చారు. కీలక నేతలందరూ హాజరైనారు కూడా. దేశంలోని 450నియోజక వర్గాలలో బిజెపికి వ్యతి రేకంగా ఒకేఅభ్యర్థిని నిలబెట్టి ఓడిరచాలని అందుకే తొలి అంశంగా నిర్ణయించుకున్నారు. అయితే ఇది విశాల ప్రతిపక్ష వేదిక మాత్రమే గనక వీలైనంత వరకూ కలసి పోటీ చేస్తామని ప్రకటించాయి. అందుకే జాతీయస్థాయి సమావేశంలో గాక రాష్ట్రా ల స్థాయిలోనే సమన్వయ కమిటీల ద్వారా ఎవరు ఎలా పోటీ చేయాలన్నది ఖరారు చేయాలని నిర్ణయించారు.ఆనిర్ణయం వాస్తవికతను ప్రతిబింబి స్తుంది.
కోవింద్‌ కమిటీ గురించి ప్రహ్లాద్‌ చెప్ప డమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువ రించలేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధికార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్లమెంటుకు మాత్రమే వుంది.గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కర ణలకై జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత… సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు.
2023 జులైలో బెంగళూరులో ప్రతి పక్షాల కూటమి సమావేశమై ‘ఇండియా’గా ముందు కు వస్తున్న తరుణంలోనే కేంద్ర పాలక పక్షమైన బిజెపి హడావుడిగా ఎన్‌డిఎను పునరుద్ధరించి విస్తరించి ఢల్లీిలో సమావేశపర్చింది.26 పార్టీలు ఇక్కడ కలుస్తుంటే అక్కడ ఏకంగా 38పార్టీలు హాజ రైనాయి గాని వాటి సీట్లబలం నామకార్థమని మీడి యా విశ్లేషించింది. తాజాగా ముంబయిలో ఇండి యా సమావేశమవుతుందంటే ఎన్‌డిఎ సమావేశం కాకుండా ఏకంగా పార్లమెంటు ప్రత్యేక సమావే శాలనే పిలవాలని మోడీ ప్రభుత్వం నిర్ణయిం చింది.లౌకిక ప్రతిపక్షాల ఐక్యవేదిక ఏర్పాటు పట్ల ప్రధాని మోడీ ఎంతగా ఉలిక్కిపడుతున్నారో దీన్ని బట్టే చెప్పొచ్చు. నవంబరు, డిసెంబరులో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలలో తన పరిస్థితి ప్రతికూలంగా వుంటుందని భయపడుతున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం ముందస్తు ఎన్నికలకు వెళ్ల వచ్చుననే సంకేతాలు గతం నుంచి వున్నాయి. కానీ ముంబయి సమావేశ సన్నాహాలు, ప్రతిపక్షాల వ్యూ హాల ఉధృతి చూసిన తర్వాత కేంద్రం దాదాపు ముందస్తును మరింత ముందుకు జరపాలని నిర్ణయించుకోవలసి వచ్చిందని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకూ లోక్‌సభ అమృతోత్సవ్‌ ప్రత్యేక సమావేశాలు జరిపి కీలకమైన బిల్లులు, సవరణలు ఆమోదింప చేసు కోవాలని మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు జాతీయ మీడియా ఏకకంఠంతో చెబుతున్నది. ఇందుకు తగినట్టే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నాయకత్వంలో జమిలి ఎన్నికల గురించి అధ్యయ నం చేసేందుకు ఒక కమిటీనే నియమించారు. 2018లో కోవింద్‌ ఆపదవిలో వున్నప్పుడు ఉభ య సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో లోక్‌ సభకూ శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిగితే మంచిదన్న సూచన చేశారు. అంటే కేంద్రం ఆలోచ నను వినిపించారు. ఆయన నాయకత్వంలో కమిటీ ఇక ఏమి చెబుతుందో ఊహించడం కష్టమేమీ కాదు. అసలు రాజ్యాంగ అధినేతగా పనిచేసిన ఒక మాజీ రాష్ట్రపతికి ఈ విధంగా రాజకీయ బాధ్యత అప్పగించడం దేశ రాజకీయాలలో ఇదే తొలిసారి కావచ్చు.
కోవింద్‌ కమిటీ, కోటి కౌటిల్యాలు
ఏమైనా ఈ సమావేశ ప్రభావం అప్పుడే బిజెపిపై పడిరదని సీతారాం ఏచూరి చేసిన వ్యాఖ్య అర్థవంతమైంది. ముంబయి సమావేశం ఒకవైపున ఇంకా జరుగుతుండగానే ఏకకాల ఎన్నికల ముచ్చట ఊపందుకోవడంలో అది కనిపిస్తుంది. పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ను కలిశారు. ‘ఇండియా’ అనే పేరు మార్చి భారత్‌నే వాడాలని భగవత్‌ రెండు చోట్ల వేర్వేరు సమావేశాల్లో ప్రవచించారు. ఈ దేశం హిందూ రాష్ట్రమేనని, భారతీయు లందరూ హిందువులేనని మత భాష్యాన్ని మరింత తీవ్రంగా వినిపించారు. రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా కొంత కాలం కిందట భగవత్‌తో సమావేశమైనారని ఇక్కడ గుర్తు చేయాలి. అంటే మోడీ అమిత్‌ షా ఒకవైపు ఎన్‌డిఎ విస్తరణ కోసం తంటాలు పడు తుంటే మరోవైపు మోహన్‌ భగవత్‌ హిందూత్వ మతతత్వ సిద్ధాంతం వ్యాప్తి బీజాలు వేస్తున్నారన్న మాట. కోవింద్‌ కమిటీ గురించి ప్రహ్లాద్‌ చెప్పడమే గాని ఇంతవరకూ అధికారిక ప్రకటన వెలువరించ లేదు. పైగా రాజ్యాంగం గురించిన చర్చను అనధి కార కమిటీ ఎలా చేస్తుంది? ఆ అధికారం పార్ల మెంటుకు మాత్రమే వుంది. గతంలో వాజ్‌పేయి హయాంలోనూ రాజ్యాంగ సంస్కరణలకై జస్టిస్‌ వెంకటాచలయ్య కమిటీని ఇలాగే ఏర్పాటు చేసి తర్వాత…సూచనల కోసం అని వెనక్కు తగ్గారు. ఇప్పుడైనా ఏకపక్షంగా రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం చెల్లదు. ఆ అంశాన్ని తెరపైకి తేవడం, ప్రజల్లో అనుకూలత పెంచడం లక్ష్యంగా పెట్టుకు న్నట్టు కనిపిస్తుంది. పార్టీలు, వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలతో ఈ కమిటీ సంప్రదిస్తుందంటున్నారు. కానీ ఇతర పార్టీలు, ప్రభుత్వాలు ఒక అనధికార కమిటీకి సహకరిస్తాయని చెప్పడం కష్టం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా పదవీ విరమణ తర్వాత మామూలు పౌరుడేనని ఇటీవల జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ స్పష్టంగా చెప్పారు. అధికార లాంఛనాలు కొన్ని వుండవచ్చు గాని మాజీ రాష్ట్రపతి అయినా ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి ఏమీ వుండదు. ఈ కమిటీ సిఫార్సులు చేసినా వాటిని కేంద్ర క్యాబినెట్‌ తీర్మానం ముందుకు తెస్తారన్న మాట. ఎన్నికల సంఘం కూడా కేంద్రం ఒత్తిడితో గతంలోనే దీనిపై స్పందించింది. ఒకేసారి ఎన్నిక లు జరపగల సత్తావుందని, కాకపోతే అదనంగా సహాయం అవసరమని వెల్లడిరచింది.తన వంతుగా అయిదు సూచనలు చేసింది.1.కొత్త లోక్‌సభ ప్రారంభానికి తేదీ నిర్ణయించాలి.2.అవిశ్వాస తీర్మానం తెచ్చేవారు ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి నాయకత్వం వహించే వ్యక్తి పేరు అందులో సూచించాలి. 3.పదవీ కాలం కొద్దిగానే మిగిలి వుండగా ప్రభుత్వం పడిపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎక్కువ వుంటేనే ఎన్నికలు. 4.శాసనసభల విషయంలోనూ ఇదే జరగాలి.5.లేదంటే అన్ని ఎన్నికలకూ నిర్ణీత తేదీలలో జరిగేలా నిర్ణయిం చాలి.
రాజ్యాంగానికే ఎసరు, దేశానికే ప్రమాదం
భారత రాజ్యాంగం ఏకకాల ఎన్నికలు జరగాలని చెప్పడం లేదు. లోక్‌సభ, శాసనసభల నియమ నిబంధనలు కాలపరిమితి అన్నీ వేర్వేరుగా వున్నాయి. మొదటి మూడు ఎన్నికలు కలిసే జరిగా యంటే కాంగ్రెస్‌ గుత్తాధిపత్యమే కారణం, 1967 నుంచి క్రమంగా ఈ పరిస్థితి మారుతూ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, రద్దు చేయడం, పడిపోవడం చాలా చూశాం. కేంద్రంలోనూ కనీసం మూడు సార్లు ప్రభుత్వాలు ముందే పడిపోయాయి. వాటిపై ఏవో కొత్త షరతులు రుద్దాలనేది ఇక్కడ ఆంతర్యం. అంటే పదవీ కాలం ముగిసినా కొనసా గించడం లేక ఇంకా వున్నా ఎన్నికలకు వెళ్లకుండా పరోక్ష పాలన సాగించడం వంటివి రాజ్యాంగ నిర్దేశానికి విరుద్ధం. అప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అనే మౌలిక సూత్రమే మంటగలిసి పోతుంది. ఎమర్జన్సీలో రాష్ట్రాల శాసనసభల కాల పరిమితిని ఆరేళ్లకు పెంచితే తర్వాత కత్తిరించాల్సి వచ్చింది. వాస్తవానికి శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి చోట్ల కూడా గతంలో నిరంకుశ ప్రభుత్వాలు పాలనా వ్యవస్థను ఇష్టానుసారం మార్చినా తర్వాత అవి నిలబడలేదు. వి.పి.సింగ్‌ ప్రభుత్వ కూల్చివేత తర్వాత అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్‌ జాతీయ ప్రభుత్వం అంటూ ఒక ప్రహసనం నడిపించి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. బిజెపి ఎప్పుడూ అధ్యక్ష తరహా పాలన కోరుకుంటుంది. దేశంలో రాజకీయ సామాజిక బహుళత్వం కారణంగా అది చేయలేక పోయింది. మోడీ హయాంలో దాదాపు ప్రధాని కేంద్రంగా చేయడం అధ్యక్ష తరహా ప్రతిబింబమే. నోట్ల రద్దుతో సహా కీలక నిర్ణయాలు మోడీ ఒక్కరే తీసుకున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిని కూడా ఎవరితో చర్చించలేదు. ఈ నిర్ణయాలు సుప్రీం కోర్టు సమీక్షలో వుండటమే గాక తీవ్ర ప్రశ్నలకు కారణమవుతున్నాయి. లోక్‌సభ పదవీ కాలానికి సంబంధించిన 83వ అధికరణం రద్దుకు సంబంధించిన 85 అధికరణం, అసెంబ్లీల పదవీ కాలానికి సంబంధించిన 172 రద్దు పైన 174,రాష్ట్రపతి పాలనపై 356 అయిదు రాజ్యాం గ సవరణలు చేయవలసి వుంటుంది. శాశ్వత మార్పులైతే సగం శాసనసభల ఆమోదం కూడా అవసరమవుతుంది.లక్షల కోట్లు బడాబాబుల పరం చేయడమే గాక రాయితీల రూపంలో మరిన్ని లక్షల కోట్లు కట్టబెడుతున్న ఈసర్కారు ఎన్నికల ఖర్చు తగ్గించాలని పొదుపు కబుర్లు చెప్పడం హాస్యా స్పదం. ఇది వాస్తవానికి అధికార దాహం, అప్రజా స్వామిక రాజ్యాంగ కుట్ర. మోహన్‌ భగవత్‌, మోడీల మాటల వెనక వున్న రాజకీయ దురుద్దే శాలు, మతతత్వ వ్యూహాల పట్ల ప్రజల అప్రమత్తత చాలా అవసరం. దురదృష్టమేమంటే తెలుగు రాష్ట్రాలలో రెండు పాలక పార్టీలైన వైసిపి, బిఆర్‌ ఎస్‌, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఏవీ ఈ పోరాటం లో పాలుపంచుకోవడం లేదు, బిజెపికి వత్తాసుగా నిలవడానికే పోటీ పడుతున్నాయి. ‘ఇండియా’ ఈ నిరంకుశత్వాన్ని నిలవరించేందుకు పోరాడటమే గాక ఎన్నికలలోనూ బిజెపి కూటమిని ఓడిరచడం ద్వారా ఆకుటిల ప్రయత్నాలు శాశ్వతంగా అడ్డు కోవడం మరింత ముఖ్యం.
(వ్యాసకర్త : సీనియర్‌ పాత్రికేయులు,న్యూఢల్లీి)-(ఢల్లీి నుంచి ప్రకాశ్‌ యాదవ్‌)

ఐక్యరాజ్యసమితి పేదరికపు అంచనాలు

మనం ఇంతవరకూ గ్రామీణ పేదరికం గురించి చర్చించాం. కరోనా మహమ్మారి విరుచుకు పడకముందు 2019-20లో మన దేశంలో నిరుద్యోగం అప్పటికి 45 ఏళ్ళకు పూర్వం ఏనాడూ లేనంత ఎక్కువ స్థాయికిచేరు కుంది. దీనిని బట్టి మన దేశంలో పేదరికం తగ్గలే దని స్పష్టంగా చెప్పవచ్చు. వాస్తవానికి అది మరింత పెరిగింది.కాని యుఎన్‌డిపి లెక్కలు దాని కి భిన్నంగా చెప్తున్నాయి.కేంద్ర ప్లానింగ్‌ మంత్రి రావుఇంద్రజిత్‌ సింగ్‌రాజ్యసభలో మాట్లాడుతూ ‘మన దేశంలోపేదరికాన్ని అంచనా వేయడానికి 2011-12తర్వాత ఏవిధమైన గణాంకాలూ అందు బాటులో లేవు’అని ప్రకటించారు. అందుచేత ఆ ఏడాది తర్వాత ఎంతమంది పేదరికస్థాయి నుండి బైట పడ్డారో చెప్పలేమని అన్నారు. అయితే ఐక్యరాజ్య సమితికి (ఐరాస) చెందిన యుఎన్‌డిపి (యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) జులై 18న ఒక ప్రకటన చేసింది. దాని ప్రకారం 2005 నుండి 2019 మధ్య కాలంలో భారతదేశంలో 41 కోట్ల 50లక్షల మంది పేదరికపు స్థాయిని అధిగమిం చారు. కరోనా అనంతర కాలపు పరిస్థితి గురించిన అంచనాలను యుఎన్‌డిపి చెప్పలేదు. కాని అంతకు ముందరి కాలానికి సంబంధించి యుఎన్‌డిపి చెప్పినది విపరీతంగా ప్రచారం అయ్యింది. గొప్పలు చెప్పుకోడానికి అదిదారి తీసింది.కాని, ఇక్కడ గమనించని వాస్తవం ఏమంటే యుఎన్‌డిపి పేదరి కానికి సంబంధించి అంచనాలు వేసే పద్ధతి, అది తీసుకున్న కొలబద్దలు వేరు, మన దేశంలో పేదరి కాన్ని అధ్యయనం చేయడానికి తీసుకునే కొలబద్దలు వేరు. యుఎన్‌డిపి అంచనాలు సైద్ధాం తికంగా సమర్ధించుకోగలిగినవి కావు.ఆ అంచనా లకు రావ డానికి అది ఉపయోగించిన గణాంకాలు కూడా సరైనవి కావు.
మన దేశంలో పేదరికాన్ని అంచనా వేయడానికి ఒక ప్రధానమైన కొలబద్ద పౌష్టికా హారం.అది అందనివారు పేదలుగా పరిగణింప బడతారు.అంతే కాదు. మన జాతీయ శాంపిల్‌ సర్వే చాలా పెద్దది. ఆ సర్వే చాలా పెద్ద సంఖ్యలో ప్రజలను కలిసి వివరాలు సేకరిస్తుంది. ఐతే 2011-12 తర్వాత మన ప్రభుత్వం దగ్గర ఏ గణాంక వివరాలూ లేవని ఎందుకు ప్రకటించారు? ఆ తర్వాత 2017-18 సంవత్సరంలో చేసిన సర్వేలో బైటపడ్డ చేదు వాస్తవాలను వెల్లడిరచే సాహసం కేంద్ర ప్రభుత్వానికి లేకుండాపోయింది. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం ఎటువంటి సర్వేనూ చేపట్టనే లేదు.అందుచేత తమ వద్ద 2011-12 తర్వాత వివరాలు లేవంటూ బుకాయిస్తున్నారు.
ఇక యుఎన్‌డిపి సర్వే విధానం చూస్తే అది పూర్తిగా భిన్నమైనది. పేదరికపు అంచనాల కోసం అది తీసుకునే సూచికలు కొన్ని ఉన్నాయి. వాటన్నింటినీ బట్టి ఒకఅంచనాకి వస్తారు. ఉదాహ రణకి: ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఉన్నాడు అన్నది కొలిచి దానివర్గాన్ని లెక్కిస్తారు.అలా వచ్చిన అంకెను 18.5తో గుణిస్తారు. అప్పుడు వచ్చిన అంకె కన్నా ఆ వ్యక్తి తక్కువ కిలోల బరువు ఉంటే అతడు పేదవాడిగాలెక్క (ఉదా: ఎత్తు 1.5 మీటర్లు అయితే దాని వర్గం 2.25.దానిని 18.5తో గుణిస్తే 41. 625 కిలోలు వస్తుంది. ఆ వ్యక్తి బరువు అంతకన్నా తక్కువ ఉంటేనే అతడిని పేదవాడుగా గుర్తిస్తారు). ఇంకొక కొలబద్ద: ఆ ఇంట్లో గత ఐదేళ్ళలో 18 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు ఎవరైనా మరణించారా? అన్నది. ఇంకొకటి: ఆఇంట్లో 12 ఏళ్ళ వయస్సుకు పైబడిన పిల్లలు ఉంటే వారు కనీసం 6సంవత్సరాల స్కూలు చదువు పూర్తి చేశా రా? లేదా? అన్నది. స్కూలుకు పోయే వయస్సు ఉన్న పిల్లల్లో 8వ తరగతి వరకూ చదవకుండా మధ్యలోనే ఆపివేశారా? అన్నది ఇంకొకటి.
‘ఆధునిక’ సమాజాలుగా పరివర్తన జరు గుతున్న ఏసమాజంలోనైనా పైన తెలిపిన కొల బద్దల ప్రాతిపదికన చూస్తే అభివృద్ధి తప్పనిసరిగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఉదాహరణకి: 18ఏళ్ళ లోపు వయస్సు ఉండే పిల్లల్లో మరణాల రేటు ఆ సమాజాల్లో తగ్గుతూనే వుంటుంది. అదేమాదిరిగా స్కూలుకి పోయే పిల్లల సంఖ్య పెరుగుతూనే వుం టుంది. ముఖ్యంగా మంచి చదువు ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నభావన అప్పో,సప్పో చేసై నా పిల్లల్ని చదివించాలనే తాపత్రయం ఉండే తల్లిదండ్రులు పెరుగుతున్నకొద్దీ స్కూళ్ళకి పోయే పిల్లల సంఖ్య పెరుగుతుంది. మధ్యాహ్న భోజన పథకం వంటివి కూడా స్కూలు హాజరు రేటును మెరుగుపరుస్తాయి. ఐతే, ఆకుటుంబపు ఆదాయం తగ్గిపోతున్నా,ఈ కొలబద్దలన్నీ అందుకోవచ్చు. ఆకు టుంబం ఇతరత్రా వినియోగించే సరుకుల మొత్తం అంతకంతకూ తగ్గించుకుంటూ బిడ్డల్ని చదివించు కోవడం జరుగుతుంది.అంటే ఆకుటుంబంలో ఒకవైపు పేదరికం పెరుగుతున్నా, యుఎన్‌డిపి కొల బద్దలను బట్టి చూస్తే, ఆ కుటుంబం పేదరికంలో లేనట్టే లెక్క.యుఎన్‌డిపి తన కొలబద్దలు పేదరి కాన్ని బహుముఖంగా పరిశీలించడానికి తోడ్పడతా యని చెప్తుంది. ఈ బహుముఖపు పేదరికం అంటే ఏమిటి?ఈపెట్టుబడిదారీ వ్యవస్థ సమాజపు ఆధునీకరణ ఏవిధంగా జరగాలని కోరుకుం టుం దో ఆదిశకు అనుగుణంగా ఇది ఉంటుంది. మరి ఈ ఆధునీకరణ జరగడానికి మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు? శ్రామిక ప్రజలా? లేక సంపన్నులా? యుఎన్‌డిపికి ఈప్రశ్న అసలు ఉదయించదు. ఆధు నీకరణ జరిగిందా లేదా అన్నదే దానికి ముఖ్యం (వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగి కూలీలకు పనులు దక్కకుండా పోయినా అది అభివృద్ధికిందే లెక్క. రెగ్యులర్‌ కార్మికుల స్థానంలో కాంట్రాక్టు కార్మికులను పెట్టుకుని నడిపే పరిశ్ర మలు పెరిగితే అదీ అభివృద్ధి కిందే లెక్క). ఇప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మన దేశంలో ఈ తరహా ఆధునీకరణ వేగంగా జరుగుతోంది. అందుకే యుఎన్‌డిపి లెక్కల్లో మనదేశంలో పేదరికం తగ్గి నట్టు కనిపిస్తోంది.కాని ఈ ఆధునీకరణకు మూల్యం చెల్లిస్తున్నది శ్రామిక ప్రజలే. వారి వినిమయ శక్తి (లేదా కొనుగోలు శక్తి) పడిపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబం చేసే ఖర్చులలో ప్రాధాన్యతలు కూడా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆహారం కోసం చేసే ఖర్చు తగ్గుతోంది. అందువల్ల పేదరికాన్ని అంచనా వేయడానికి ఆ యా కుటుం బాల ఆహారపు పౌష్టిక విలువలను (ఎన్ని క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు అన్నది) ప్రాతిపదికగా తీసుకోవడం అవసరం. పేదరికపు తీరు తెన్నులకు అద్దం పట్టే ప్రమాణం ఇదే. అంతే కాదు, కుటుంబపు వాస్తవ ఆదాయం పెరుగుతోం దా లేక తగ్గుతోందా అన్నది కూడా ఈ ప్రమాణాన్ని బట్టి నిర్ధారించగలుగుతాం.రూపాయి లెక్కల్లో ఆదాయం పెరిగినట్టు కనిపించినా, ఆ రూపాయి విలువ నిగ్గు తేల్చేది ఒకానొక కుటుంబం పౌష్టికా హారాన్ని పొందగలుగుతోందా లేదా అన్న పరి శీలనే.ఇటువంటి ముఖ్యమైన కొలబద్ద-పౌష్టికా హారం పొందగలగడం-యుఎన్‌డిపి పెట్టుకున్న ప్రమాణాలలో ఆరో వంతు ప్రాధాన్యత మాత్రమే కలిగివుంది. పైగా పౌష్టికాహార లభ్యతకు వాళ్ళు ఇచ్చే నిర్వచనమే వేరుగా ఉంది. శరీరానికి తగ్గట్టు బరువు ఉందా లేదా అన్నది (బాడీ-మాస్‌ ఇం డెక్స్‌),వారి ప్రమాణం. పౌష్టికాహారం పొందలే నప్పుడే బరువు తగ్గుతుంది. ఒక్కోసారి బరువులో తేడా కనిపించకపోవచ్చు కాని రోగాలబారిన పడే అవకాశాలు పెరుగుతాయి.అంటే శరీరపు బరువును బట్టి పేదరికాన్ని లెక్క వేయడం శాస్త్రీ యం కాదు. నిజానికి పౌష్టికాహారం తీసుకోలేకపోతే ఆ వెంటనే శరీరపు బరువు తగ్గిపోదు. దానికి కొంత కాలం పడుతుంది. అందుచేత యుఎన్‌డిపి పెట్టుకున్న కొలబద్దలకు వాస్తవ పౌష్టికాహార సమస్య దొరకదు. పైగా దీనికి ఆరో వంతు ప్రాధాన్యత మాత్రమే ఇవ్వడంబట్టి యుఎన్‌డిపి దృక్కోణం ఏమిటో తెలుస్తూనే వుంది.యుఎన్‌డిపి ప్రమాణా లకు, మన జాతీయ శాంపిల్‌ సర్వే ప్రమాణాలకు ఎంత తేడా ఉందో తెలియాలంటే ఈ ఉదాహరణ చూడాలి: 2005-2006 నాటికి భారతదేశంలో 64 కోట్ల 50లక్షల మంది పేదలు ఉన్నారని, 2015-16నాటికి ఈ సంఖ్య 37 కోట్లకు పడిపో యిందని యుఎన్‌డిపి లెక్కలు తెలుపుతున్నాయి. అంటే అప్పటికి 27కోట్ల 50లక్షల మంది పేదరికం నుండి బైటపడినట్లు ఔతుంది. అదే జాతీయ శాంపిల్‌ సర్వే 75వ రౌండ్‌ సర్వేలో (2017-18)గ్రామీణ ప్రాంతంలో ప్రజల వినియోగం (అన్ని సరుకుల, సేవలనూ కలుపుకుని) 9శాతం పడిపోయిందని తేల్చింది.(ఈ నిర్ధారణ మోడీ ప్రభుత్వాన్ని ఎంత వణికించిందంటే ఆ గణాంకా లను విడుదల చేసిన కొద్ది గంటలలోపే వాటిని తొలగించివేసి,ప్రజానీకానికి దొరక్కుండా దాచి పెట్టింది. ఆకొద్ది గంటల వ్యవధి లోపలనే కొందరు వ్యక్తుల ఆ గణాంకాలను వీలైన మేరకు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.అప్పటి మీడియాలో కూడా ఆ గణాం కాల ఆధారంగా కొంత చర్చ జరిగింది.) భారత ప్రణాళికా సంఘం మొదట్లో గ్రామీణ ప్రజలకు కనీసం 2200 క్యాలరీల శక్తి రోజుకు ఒక్కొక్కరికి అందాలన్నది ప్రమాణంగా నిర్ణయించింది. ఆ లెక్క చూస్తే 1993-94లో కనీస పౌష్టికాహారం పొంద లేని గ్రామీణులు 58శాతం ఉన్నారు. 2011-12నాటికి వాళ్ళు 68 శాతానికి పెరిగారు. 2017-18 నాటికి వాళ్ళు అమాంతం 77శాతానికి పెరి గారు! కాని యుఎన్‌డిపి లెక్కల్లో మన దేశంలో కోట్లాది మంది పేదరికం లోంచి బైటపడ్డారు!
మనం ఇంతవరకూ గ్రామీణ పేదరికం గురించి చర్చించాం. కరోనా మహమ్మారి విరుచుకు పడకముందు 2019-20లో మన దేశంలో నిరుద్యోగం అప్పటికి 45 ఏళ్ళకు పూర్వం ఏనాడూ లేనంత ఎక్కువ స్థాయికి చేరుకుంది. దీనిని బట్టి మన దేశంలో పేదరికం తగ్గలేదని స్పష్టంగా చెప్ప వచ్చు. వాస్తవానికి అది మరింత పెరిగింది. కాని యుఎన్‌డిపి లెక్కలు దానికి భిన్నంగా చెప్తున్నాయి. యుఎన్‌డిపి పెట్టుకున్న కొలబద్దలను ఇక్కడ మనం విమర్శించడం ప్రధానాంశం కాదు. ఆ కొలబద్దల ఆధారంగా పేదరికం పెరిగిందా లేక తగ్గిందా అన్న నిర్ధారణకు రావడాన్ని మనం విమర్శిస్తున్నాం. దేశంలో పేదరికంపై జరుగుతున్న చర్చ కాస్తా యుఎన్‌డిపి గణాంకాలతో పూర్తిగా దారి తప్పింది. మన దేశం పెట్టుకున్న కొలబద్దలకు, యుఎన్‌డిపి కొలబద్దలకు మధ్య తేడాను గమనించకపోతే చర్చను మళ్ళీ గాడిలో పెట్టడం సాధ్యం కాదు. మొత్తం 121దేశాలకుగాను ప్రపంచ ఆకలి సూచి కలో 107 వస్థానానికి దిగజారిన మన దేశంలో మరోవైపు కోట్లాదిమంది ప్రజలు పేదరిక స్థాయి నుండి బైట పడ్డారని చెప్పుకుంటే దానిని ఏ విధం గా ప్రజలు విశ్వసిస్తారు?.
గ్రామీణ పేదరికం తగ్గుతుంది, కానీ జీవనశైలి సమస్యలు తలెత్తుతున్నాయి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పైకి చూస్తోంది, అయితే మాదకద్రవ్యాల దుర్వినియోగం, సోషల్‌ మీడియాకు వ్యసనం మరియు వ్యర్థాల తొలగింపు ఆందోళన కలిగించే అంశాలు ఆయోగ్‌ భారతదేశం కోసం నవీకరించబడిన మల్టీడైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌ ని విడుదల చేసింది. ఇది దేశం యొక్క పురోగతిని మూడు సమానమైన పరిమాణాలలో సంగ్రహి స్తుంది-ఆరోగ్యం, విద్య మరియు జీవన ప్రమాణం.పబ్లిక్‌ పాలసీ థింక్‌ ట్యాంక్‌ యొక్క ప్రోగ్రెస్‌ రివ్యూ2023 2015-16 మరియు 2019-21 మధ్య బహుమితీయ పేదరికంలో జనాభా నిష్పత్తిలో 24.85శాతం నుండి 14.96 శాతానికి బాగా తగ్గుముఖం పట్టింది. అంటే 2015-16 మరియు 2019-21 మధ్య దాదాపు 135.5 మిలియన్ల మంది పేదరికం నుండి బయటపడ్డారు.అదే సమ యంలో పేదరికం తీవ్రత (సాధారణ పరిభాషలో విపరీతమైన పేదరికం) కూడా47.14 శాతం నుంచి 44.39 శాతానికి తగ్గింది. ఇది స్వాగతించే వార్త. ఇతర వాటాదా రులతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న వివిధ లక్ష్య అభివృద్ధి కార్యక్ర మాలకు ఆపాదించ బడవచ్చు.
గ్రామీణ ప్రాంతాల్లో ‘పక్కా’ లేదా సెమీ పక్కా ఇళ్ల సంఖ్య అనేక రెట్లు పెరిగింది.
దాదాపు ప్రతి ఒక్కరి దగ్గర సెల్‌ఫోన్‌ ఉంటుంది, ఎక్కువగా స్మార్ట్‌ ఫోన్లు ఉంటాయి. మోటారుబైక్‌, మరియు సైకిల్‌ కాదు, అత్యంత సాధారణ రవాణా సాధనం.విలేజ్‌ షాపులు వివిధ బ్రాండ్ల వినియోగ వస్తువులతో బాగా నిల్వ చేయ బడతాయి.బాలికలు పాఠశాలలకు వెళుతున్నారు .వ్యవస్థలు మరియు వీడియోగ్రఫీ లేకుండా వివా హాలు జరగవు.ఈ దృశ్యాలు ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ ఖండ్‌ ప్రాం తంలోని ఆకాంక్ష గ్రామాల నుండి వచ్చాయి. నిస్సం దేహంగా,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్రమంగా మెరుగు పడటం వల్ల ప్రజల జీవితాల్లో మార్పు వస్తుంది.ఈ మార్పులు స్వాగతించదగినవి మరియు 2015-16 మరియు 2019-21 మధ్య గ్రామీణ ప్రాం తాల్లో పేదరికం సంభవం 32.59 శాతం నుండి 19.28 శాతానికి తగ్గిందని సమీక్షలో ఎత్తిచూపిన వాస్తవాలను ధృవీ కరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, వృద్ధి కథనానికి సంబంధించిన ఈ టెల్‌-టేల్‌ సంకే తాలతోపాటు, చర్చలు అవసరమయ్యే కొన్ని ఆందోళ నలు కూడా ఉన్నాయి.
తాళం వేసిన ఇళ్లు
మొదటిది,గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ/అర్బన్‌ ప్రాంతాలకు వలసలు.గ్రామాల చుట్టూ తిరిగితే ఎక్కువ సంఖ్యలో ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు తెలుస్తుంది.కార్మికుల కొరత తీవ్రంగా ఉంది కొన్నిసార్లు వ్యవసాయం, ముఖ్యంగా కూరగాయల సాగు దెబ్బతింటుంది.రైతులు వ్యవ సాయంపై ఆసక్తిని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది మరియు ఎక్కువ భూమి ‘లీజు’ అమరిక క్రిందకు వస్తోంది,ఇది తరచుగా తక్కువ పెట్టుబడిని మరియు తక్కువ ఉత్పాదకతను కలిగిస్తుంది. రెండవది, పొగాకు/గుట్కా/మద్యానికి వ్యసనం పెరుగుతోంది.దురదృష్టవశాత్తు, చట్ట బద్ధంగా లేదా చట్టవిరుద్ధంగా మద్యం అందు బాటులో లేని గ్రామాలు ఏవీ లేవు.ఇది ప్రజల పని సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం చూపు తోంది.
మూడవది, ‘ఫోన్‌’కి వ్యసనం.
అన్ని వయసుల వారు తమ రోజులో ఎక్కువ భాగాన్ని వివిధ సోషల్‌ మీడియా యాప్‌ లలో గడుపుతున్నారు. ఇది గ్రామీణ ప్రజల శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీ స్తోంది, గ్రామాల్లో సామాజిక నిర్మాణాన్ని దెబ్బతీ స్తుంది మరియు మహిళలు మరియు షెడ్యూల్డ్‌ కులాలపై నేరాలకు దారి తీస్తోంది.ఇది వివిధ తప్పుడు ప్రచారాలకు మరియు కొన్ని సమయాల్లో ‘అఫ్వా’ వ్యాప్తికి దారి తీస్తోంది.
మరొక ప్రధాన సమస్య పరిశుభ్రత మరియు పరిశుభ్రత.స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఫలితం గా ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి, అయితే గ్రామాల్లోని సాధారణ ప్రాంతాలలో అపరిశుభ్రత మరియు అపరిశుభ్రత సమస్యగా కొనసాగుతోంది. గ్రామాల్లో చెత్తాచెదారం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.గ్రామాలకు సమీపంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు, పొగాకు ఉత్పత్తులు మరియు మద్యం లభ్యతను అరికట్టడం, ఇంటర్నెట్‌లో ఎక్కువ సమ యం గడపడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగా హన ప్రచారాలు మరియు గ్రామ స్థాయిలో వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించి స్వచ్ఛ అభియాన్‌ 2.0 ప్రారంభించడం మార్గం. ముందుకు.
ఆయోగ్‌ అనేది ఈ సమస్యలను పరిష్క రించడానికి క్రియాశీల వాటాదారుల సంప్రదింపు లతో బ్లూప్రింట్‌ను రూపొందించడానికి అవసరమైన ‘ఏజెన్సీ’. సామాజికంగా కూడా ముం దుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది మరియు ఆర్థిక పురోభివృద్ధిని మరింత ఆరోగ్యవంతంగా మరియు అర్థవంతంగా చేయడానికి ప్రజల వ్యక్తిగత జీవనశైలి అంశాలపై పని చేయాలి. (స్వేచ్చా Ûనుసరణ).

రాజకీయాలు`దళితుల దుస్థితి

స్వయం సేవకుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ఎస్‌, దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరుచుకున్నది.దళితుల్ని హిందువులుగాను,ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో,హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది.ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది.
‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ (అంద రినీ కలుపుకొని అందరి అభివృద్ధి) అని భారతీయ జనతా పార్టీ నినాదమిస్తుంది కానీ సమాజంలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి రోజురోజుకూ మరింతగా దిగజారుతున్నది. మెజార్టీ మతవాద రాజకీయాలకు ముస్లింలు ప్రధాన లక్ష్యంగా ఉం డగా,దళితులను అణచివేయడం కూడా అంతే సమానమైన ప్రధాన అంశం.ఓవైపు దళితుల సామా జిక,ఆర్థికపరిస్థితులు దిగజారుతుండడం, మరోవైపు దళితులకు బిజెపి,ఎన్నికలపరంగా దగ్గరవుతున్న విడ్డూర పరిస్థితులు పెరుగుతుండడం చూస్తున్నాం. ఈ ఆధిపత్య రాజకీయాలకు మూల విరాట్టుగా దళితుల్ని హిందూ జాతీయవాద స్రవంతిలోకి చేర్చుకోవాలనిచెప్పే రాష్ట్రీయస్వయం సేవక్‌ సంఫ్న్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ప్రభావం కూడా పెరుగుతున్నది. పందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో హిందూ మతంలో అణచివేతకు గురైన ప్రజల విద్య, ఇతర హక్కుల కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే ‘దళితుడు’ అనే పదాన్ని రూపొందించాడు. స్వామి వివేకానంద ‘’భారతదేశ భవిష్యత్తు’పై చేసిన ప్రసంగంలో ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ వర్గాల ప్రజలు చాలామంది కులవ్యవస్థ అణచి వేత కారణంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారని ఆయనన్నారు.సామాజిక సమానత్వం,ఆర్థిక న్యా యం, అందరికీ తాగునీటి బావుల అనుమతి, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం బి.ఆర్‌. అంబేద్కర్‌ చేపట్టిన అనేక అవిశ్రాంత పోరాటాల ద్వారా,ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ(1935) స్థాపన ద్వారా కొద్దిగా సానుకూల ఫలితాలు లభిం చాయి. విద్య, ఉద్యోగాలు, ఎన్నిక ల రంగంలో దళితులకు రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు కల్పించే నిర్ణయా త్మక చర్యల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దళితుల జీవితాల్లో దీనివల్ల కలిగిన ప్రభావం, కొద్ది మేరకు సంభవించిన మార్పులు నత్తనడకన సాగాయి. గడిచిన కొన్ని దశాబ్దాలలో దళితుల పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారాయి. వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ సూచికలు ఈ క్షీణిం చిన పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి.‘నేషనల్‌ కొయలేషన్‌ ఆఫ్‌ స్ట్రెందెనింగ్‌ ఎస్సీస్‌ అండ్‌ ఎస్టీస్‌’ నివేదిక ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల వారిపై నేరాలు 2021లో1.2 శాతం పెరిగాయి. అదే సంవత్స రంలో ఉత్తరప్రదేశ్‌లో ఎస్సీలపై అత్యాచారాలు అత్యధికంగా 25.8శాతం నమోదుకాగా,రాజ స్థాన్‌ 14.7శాతం, మధ్యప్రదేశ్‌ 14.1శాతంతో ఆ తరువాతి స్థానాల్ని ఆక్రమించాయి. బిజెపి హిం దూత్వ ఎజెండాతో సమాజాన్ని రెండుగా విభజించ డానికి, అట్టడుగు వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన మైన సమస్యల్ని పక్క దోవపట్టించేందుకు అస్థిత్వ సమస్యల్ని లేవనెత్తుతున్నది. గోరక్షక దళాలు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని, మూకదాడులతో మనుషుల ప్రాణాలు తీయడం నిత్యకృత్యమై పోయింది. ఈ ప్రచారాలతో రెచ్చిపోయిన మూకల ఆగ్రహానికి ప్రధానంగా బలవుతున్నది ముస్లిములై నప్పటికీ దళితులు సైతం పెద్ద సంఖ్యలో హత్యగా వించ బడుతున్నారు. ఉనా లో జరిగిన భయానక ఘటన వాస్తవంగా ఏం జరుగుతున్నదో మనకు తెలియచేస్తున్నది. చారిత్రక తప్పిదాలను సరిదిద్ద డానికి దళితులకు రిజర్వేషన్ల కల్పన ఒక సాధ నంగా వున్నమాట నిజమే కానీ, బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి ఇది కూడా దెబ్బతింటున్నది. ఆర్థిక ప్రాతిపదికపై రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం ద్వారా వాటి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగు తున్నది. కేవలం 5 శాతం శ్రామిక దళిత జనాభా మాత్రమే రిజర్వేషన్ల నుండి ప్రయోజనం పొందు తున్నారని సామాజిక శాస్త్రవేత్త, సుఖ్‌దేవ్‌ థోరట్‌ అభిప్రాయపడ్డాడు. అస్పష్టమైన ఆర్థిక ప్రాతిపదికతో దళితేతరులకు రిజర్వేషన్ల కల్పించడంకూడా వారి అవకాశాల అందుబాటును కుదించేస్తుంది. ‘క్రీమీ లేయర్‌’ (మెరుగైన దొంతర)ను ప్రవేశపెట్టడం, కుటుంబాలలో వ్యక్తుల ఆదాయాల్ని కలగాలపు లగం చేయడం రిజర్వేషన్లకు ఒక వర్గాన్ని దూరం చేయడానికి దారి తీస్తుంది. 2018లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి),అన్ని కళాశాలల్లో 700 ఖాళీలు ఉన్నాయని ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ సర్క్యులర్‌లో దళిత అభ్యర్థులకు కేవలం 2.5 శాతం పోస్టులు కేటాయించగా, ఎస్టీ అభ్యర్థులకు అసలు ఎలాంటి పోస్ట్‌లు రిజర్వ్‌ కాలేదు. ఇలాంటి చర్యలే ఈవర్గాలను మరింత దుస్థితిలోకి నెడు తున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళిక
భారతీయ జనతా పార్టీ ప్రతీ సందర్భం లోను దళితుల హక్కులు, నిబంధనలను నిర్వీర్యం చేసేందకు ప్రయత్నిస్తున్నదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది అర్థం కావాలంటే బిజెపి మాతృసంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రను,అది ఏ పరిస్థితుల్లో స్థాపించ బడిరదో క్లుప్తంగా తెలుసుకోవాలి. వలస పాలనా కాలంలో భారతదేశంలో సామాజిక సంస్కరణల ప్రక్రియ పుంజుకోవడం, దళితుల్లో విద్యను ప్రోత్స హించడానికి జ్యోతిరావు ఫూలే చేసిన ప్రయత్నాలు, ఆ తరువాత సామాజిక సమానత్వం కోసం అంబే ద్కర్‌ చూపిన చొరవ దళితుల్లో మరింత సామాజిక అవగాహనకు, స్పృహకు దారితీసింది. ఈ అవగా హనే 1920లలో మహారాష్ట్రలోని విదర్భలో’ బ్రాహ్మణేతర ఉద్యమానికి’’బాట వేసింది, ఈ విధమైన మార్పులను అగ్రకులాలకు చెందిన వారికి మింగుడుపడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపనకు దారితీ సిన కారణాలలో అదీ ఒకటి. హిందూ రాష్ట్ర ఎజెండా ఓవైపు ముస్లింలను, క్రైస్తవులను ‘విదేశీ యులుగా’ పేర్కొంటూనే, మరోవైపున దళితులను బానిసలుగా పరిగణించిన మనుస్మృతి చట్టాల గురించి అదే పనిగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. సమాజంలో సమానత్వం కోసం జరిగిన ప్రతి ఉద్యమాన్నీ అగ్రకులాలకు చెందిన వారు వ్యతి రేకించారు.భారత రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌,దాని మద్దతుదార్లు రిజర్వేషన్ల నిబంధ నలను తీవ్రంగా వ్యతిరేకించారు.రిజర్వేషన్ల అమలు చేయడం, ప్రభుత్వ రంగంలో విస్త్రతంగా ఉద్యో గాలు కల్పించడంవల్ల దళితులు సామాజిక రంగం లోకి రావడం మొదలైంది.1980లో దళిత సమా జం, సమానత్వం వైపు సాగించిన యాత్రను వ్యతి రేకించడంతోపాటు అహ్మదాబాద్‌లోదళిత వ్యతిరేక హింస కూడా చోటుచేసుకుంది. 1990లో మండల్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయడంతో రథ యాత్రకు భారీ ఊపు లభించి,1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసింది. వీటన్నిటి ద్వారా బిజెపికి పెద్దఎత్తున ఎన్నికల్లో పైచేయి సాధించ డానికి మార్గం తెరుచుకుంది. అదే సమయంలో బిజెపి ఆధిపత్య రాజకీయాలు,ఓవైపు దళిత సమా జాన్ని తొక్కిపడుతూనే వారిని సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థాయిలో ఆకర్షించేందుకు పనిచేశాయి. దళితులలో పని చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‘సామా జిక సామరస్య వేదిక’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ కుల వ్యవస్థను దెబ్బ తినకుండా ఆ పరిధిలోనే ‘’హిందూ ఐక్యత’’ కాపాడుకోవాలనే సందేశాన్ని చ్చింది. అంబేద్కర్‌ ‘’కుల నిర్మూలనకు’’ విరుద్ధంగా ఈ సంస్థ భిన్న కులాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దళితుల్లో పని చేసింది. సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా దళిత సమాజంలో కొంత భాగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తిప్పుకోగలిగింది. దళితుల్ని మంచి చేసుకోవడానికి యు.పిలో సుహే ల్‌దేవ్‌ లాంటి ముఖ్యమైన దళిత వ్యక్తులను తీసుకొచ్చి, ముస్లిం వ్యతిరేకతను కూడా ఎక్కించడం మొదలు పెట్టింది. ఇది ఒక దెబ్బకు రెండు పిట్టలు వ్యవహారమే. దళితులను ప్రసన్నం చేసుకునేందుకు వారి ఇళ్ళలో బిజెపి భోజనాల తంతుతో,వారిలో ఒక వర్గాన్ని ఆకట్టుకుంది. ‘’సంస్కృతీకరణ’’ అనబడే ఈ తతంగం బాగా ప్రచారమైంది. స్వయం సేవ కుల (కార్యకర్తలు) విస్తారమైన నెట్‌వర్క్‌తో ఆర్‌ఎస్‌ ఎస్‌,దళిత సమాజంలో ఎన్నికల పునాదిని ఏర్పరు చుకున్నది. దళితుల్ని హిందువులుగాను, ఇతర పార్టీలు ముస్లింలను బుజ్జగించేవిగాను ఎన్నికలకు ముందు ‘ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం’ ప్రచారం చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇదే జరిగింది. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో, హిందువుల ప్రయోజనాలు కాపాడే పార్టీ, ముస్లింలను సంతృప్తిపరచని పార్టీ బిజెపి మాత్రమేనని దళితుల్లో ప్రచారం సాగింది. ఈ వ్యూహం ద్వారా ఎస్సీలకు రిజర్వ్‌ అయిన స్థానాల్లో విజయం సాధించింది. ఇలాంటి వ్యూహాలతో బిజెపి 2014 సాధారణ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లోని మొత్తం84 సీట్లకు గాను 44 సీట్లను గెలుచు కుంది.
దళిత ముస్లిం సమస్య
ఇస్లాం మతాన్ని స్వీకరించిన దళితు లకు, రిజర్వేషన్లు కల్పించాలా,వద్దా అన్న మరో చర్చ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ‘’దళిత ముస్లింలు’’ రెండు రకాల ఆగ్రహాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది.ముస్లింలుగా వారు మతపరమైన హింసను ఎదుర్కొంటున్నారు.దళితులుగా రిజర్వేషన్ల ప్రయో జనాలు పొందలేకపోతున్నారు. ‘ఇస్లాంలో కుల వ్యవస్థ ఉండదు, అందరూ సమానమే అని విశ్వసి స్తారు కాబట్టి వారికి రిజర్వేషన్లను ఎందుకు కల్పిం చాల’ని అనేకమంది దళిత రచయితలు, మేథావులు వాదిస్తున్నారు. ఖురాన్‌లో కుల వ్యవస్థను అనుమ తించలేదని కూడా వారు అంటున్నారు. ప్రముఖ దళిత మేథావులైన దిలీప్‌ మండల్‌, సూరజ్‌ యెంగ్డేలు ముస్లిం దళితులకు రిజర్వేషన్లను వ్యతిరేకి స్తున్నారు. ఇస్లాం పవిత్ర గ్రంథాల ప్రకారం, ఇస్లాం లో కుల వ్యవస్థ లేదు కాబట్టి రిజర్వేషన్ల వర్తింపులో దళిత ముస్లింలను పరిగణలోకి తీసుకోకూడదని వారు వాదిస్తున్నారు. మత గ్రంథాలు చదవడం ద్వారా సమాజాలు నడవవు. సమాజంలోని ఉన్న త వర్గాలు అనేక కారణాలతో అణగారిన వర్గాల స్థితిని నిర్ధారిస్తాయి.ఆవాస్తవం గుర్తించలేక పోవడ మే వారి వాదనలో ఉన్న లోపం. దక్షిణాసియా సమాజాలలో కులం అనేది అన్నిటినీ మించిన వాస్తవం. దీనికి ముస్లింలు కూడా మినహాయింపు కాదు.ముస్లింలకు ఆధునిక విద్యనందించే ఉద్దే శ్యంతో ప్రయత్నాలు ప్రారంభిం చినపుడు కూడా, అందులోని నిమ్న కులాల వృత్తికి ఎలాంటి ఆధునిక విద్య అవసరం లేదనే వాదన వచ్చింది. ఆవాదన తోనే ఆధునిక విద్యను అందిం చడంలో వారిని పరిగణలోకి తీసుకోలేదు.
కనుక మిగిలిన దళితులెంత దళితులో ముస్లిం దళితులు కూడా అంతే. నిర్ణయాత్మకమైన కనీస సానుకూల చర్యల నుండి దళిత ముస్లింలను దూరం చేయడమంటే జనాభాలో ఒక పెద్ద వర్గానికి అన్యాయం చేసినట్టే. అసలు సమస్య ఏమంటే, కేకును ఎక్కువ మంది అడిగినప్పుడు, దాన్ని మరింత పెద్దదిగా చేయాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ, ఎస్సీ రిజర్వేషన్లను గణనీయంగా తగ్గిస్తున్నది, కాబట్టి సమస్య ఇక్కడే ఉంది. ముస్లింల ఎన్నికల రిజర్వేషన్లు సంబంధించినంతవరకు, ఎన్నికల రంగంలో ముస్లింల ప్రాతినిధ్యం ఇప్పటికే చాలా తక్కువ స్థాయికి, అంటే జనాభాలో వారి ప్రాతినిధ్యం కంటే చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు, ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లపై ప్రభావం చూపుతాయని, వారి ఎన్నికల నిబంధనల అవసరాల్ని కూడా పెంచుతాయని కొందరు మేథావులు వాదిస్తున్నారు. దళిత ముస్లింలకు రిజర్వేషన్లు విస్తరించే సందర్భంలో ఎన్నికలకు సంబంధించిన ఈ వాదనను పరిగణలోకి తీసుకోకూడదు.
(వ్యాసకర్త ఐఐటి మాజీ ప్రొఫెసర్‌, సామాజిక కార్యకర్త)(‘ద వైర్‌’ సౌజన్యంతో),- (రామ్‌ పునియానీ)

నిగ్గు తేలని..లేట్‌రైట్‌ క్వారీ అక్రమాలు

అనకాపల్లి,కాకినాడ జిల్లాల సరిహద్దు లను ఆనుకుని నాతవరం మండలం భమిడికలోద్దు లో121హెక్టార్ల విస్తీర్ణంలో లేట్‌రైట్‌ క్వారీ ఉంది. ఈక్వారీ అనుమతుల నుంచి నిర్వహణ వరకు అన్నీ ఉల్లంగనలు చోటు చేసుకున్నట్లు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌(ఎన్‌జీటీ)కు ఉమ్మడి విశాఖ జిల్లా దళిత ప్రగతి సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కొండ్రు మరిడియ్య ఏడాదిన్నర క్రితమే ఫిర్యాదు చేశారు.
ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చినా వారి తలరాత మాత్రం మారడం లేదు. పచ్చని అడవులను నాశనం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా అడవుల్లో ఉన్న అపారమైన లేట్‌రైట్‌ మైనిం గ్‌పైన మాఫియా కన్ను పడిరది.ఈ విలువైన ఖని జాన్ని తవ్వేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతు న్నాయి. గిరిజనుల పేరు మీదుగా అనుమతులు పొంది లబ్ధి పొందాలని చూస్తున్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు పంచాయితీ పరిధిలో లేట్‌ రైట్‌ ఖనిజం అపారం గా ఉంది. ఈ భూములపై చట్ట పరమైనహక్కులు, రాజ్యాగ పరమైన రక్షణలు ఈపంచాయితీలో నివసించే గిరిజనులకే ఉన్నాయి.ఇక్కడవున్న లేట్‌రైట్‌ తవ్వేందుకే తప్పా గిరిజన చట్టాలఅమలు,వారి సంక్షేమం ఏప్రభుత్వనికి పట్టడం లేదు.అసలు ఈతవ్వకపు అనుమతులు పొందాలంటే పిసా చట్టం ప్రకారం గ్రామసభ అనుమతి,అటవి హక్కుల చట్టం గ్రామ కమిటి అమోదం తప్పని సరిగా ఉండాలి.కానీ, కాంట్రాక్టర్లు అవేమీ పట్టించు కోకుండా బినామీల పేరు మీదుగా ఈ మైనింగ్‌ను తవ్వి ఖజనా నింపుకోవాలని చూస్తున్నారు. అభి వృద్ధి మాటే ఎరుగని గిరిజనులకు మైనింగ్‌ మాఫి యా చుక్కలు చూపిస్తున్నారు. ఎలాంటి అనుమతు లు లేకుండా అడవిని నాశనం చేసే మైనింగ్‌ తవ్వ కాలు జరిపితే తాము ఊరుకోమని ఆదివాసులు తెగేసి చెప్తున్నారు.
నాతవరం మండలం సుందరకోట పంచాయతీ పరిధి భమిడికలొద్దిలో121హెక్టార్ల విస్తీర్ణంలోఏటా10లక్షల క్యూబిక్‌ మీటర్ల లేటరైట్‌ను 15 ఏళ్లపాటు తవ్వుకునేందుకు జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడికి రెండు నెలల క్రితం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాలుష్య నియంత్రణ మండలి అంతకు ముందే ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. తరువాత కేంద్ర అటవీ,పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేయగా అక్కడ నుంచి అనుమ తులు వచ్చాయి.ఈ మేరకు ఆఘమేఘాలపై లేట రైట్‌ తవ్వకాలు ప్రారంభించారు. అధికారుల లెక్కల మేరకు ఇప్పటివరకు 8,500క్యూబిక్‌ మీటర్ల మేర ఖనిజాన్ని తవ్వి తరలించారు. మైనింగ్‌లో అను భవం వున్న ఒకనిపుణుడిని స్వయంగా లీజుదారుడే నియమించుకున్నారు.అతని పర్యవేక్షణలో లేటరైట్‌ తవ్వకాలు చేస్తున్నారు.ఖనిజాన్ని పక్కనే వున్న కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో జల్దాం వద్ద డంపింగ్‌ యార్డుకు ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి ఇతర వాహనాల్లోకి లోడిరగ్‌ చేసి,తూకం వేసిన అనంతరం గమ్యస్థానాలకు రవాణా చేసే వారు.
అత్యాశే కొంప ముంచిందా..!
భమిడికలొద్దిలో జరుగుతున్న లైట్‌రైట్‌ తవ్వాకలను తరలించడానికి మాఫియా మరింత వేగాన్ని పెంచాలని ఆలోచించింది.దీనికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు,సంబంధిత ఉన్నతాధికారు లను సంప్రదించి వారి కోరికున్నంత ముడిపులు చెల్లించేసింది.భమిడికలొద్దిలో జరుగుతున్న లేటరైట్‌ తవ్వకాలను గనులశాఖ అధికారులుగానీ, ఫారెస్టు, రెవెన్యూశాఖల అధికారులు గానీ ఇక్కడ తవ్వే లైట్‌రైట్‌ ఖనిజాలు ఏశాఖ పరిధిలోకి వస్తాయి.. ఏజిల్లా పరిధిలో ఉంది అనే అంశాలను పరిగణన లోకి తీసుకోలేదు సరికదా మచ్చు కైనా పర్యవేక్షించ లేదు. దీంతో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోయి అత్యా శకు పోయింది.అడిగే నాధుడు,ప్రశ్నించే మేథావులు లేక అటూ కాకినాడ జిల్లా,ఇటు అనకాపల్లి జిల్లా సరిహద్దుల్లో ఉన్న దట్టమైన అటవీప్రాంతం మద్య లో నుంచి మైనింగ్‌ మాఫియా విశాలమైన రహ దారి నిర్మాణానికి ఉపక్రమించింది. లైట్‌రైట్‌ తరలింపునకు భమిడికలొద్దు నుంచి కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంక వరకు 28 కిలో మీటర్ల రోడ్డు 30అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మా ణానికి పూనుకున్నారు.రోడ్డు నిర్మాణంలో వేలాది వందేళ్లు వయస్సుగల పచ్చని వృక్షాలు నరికేశారు. అనే పచ్చనిచెట్లు,వనకుమూలకులు నేలమట్టం చేశారు.ఫలితంగా పర్యావరణానికి తీవ్రమైన విఘాతంకలిగించారు.అడ్డొచ్చుని జంతవులు, జీవ రాశులను హతమార్చారు.అంతే కాకుండా రోడ్డు నిర్మాణానికి కాకినాడ జిల్లా ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.60లక్షలు ఖర్చు చేశారు. పైగా గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిస్తు న్నామని,సాగునీటి వనరులను కప్పేశారు. భారీ వాహనాల రాకపోకలతో జీవజాతులు ప్రాణాలకు ముప్పుతెచ్చారు.తాగునీటికి ఆధారమైన ఊటగెడ్డ లను కలుషితం చేశారు. స్థానికులకు అధికార పార్టీనేతల ద్వారా తాయిలాలు ఆశ చూపించి క్వారీ నిర్వహణకు ఆటంకం లేకుండా చేసుకు న్నారు. ఈ లేట్‌రైట్‌ తవ్వకాలపై అప్పట్లోనే కొందరు స్థానికులు అధికారులకు ఫిరార్యదు చేసినా పట్టించు కోలేదు.దీంతో జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ను ఆశ్ర యించాల్సి వచ్చింది. గతేడాది కాలంగా విచరణ కొనసాగుతుంది.సంయుక్త కమిటీ నివేదిక ఆధా రంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈనెల 24న ఎన్జీటీలో ఈ కేసు మరలా విచారణకు రానుంది. అప్పటిలోగా కమిటీ నివేదిక అందజేయ డానికి అధికారులు సన్నద్దమవుతున్నారు.
– గునపర్తి సైమన్‌

సమత..గిరిజనులకు చేయూత

ఎకో టూరిజంపై గిరిజన యువతకు శిక్షణ
స్వయం ఉపాధి సాధన దశగా సమత కృషి
సత్‌ ఫలితలిస్తున్న సమత శిక్షణ తరగతులు

గిరిజన ప్రాంతాల్లో పర్యాటక రంగం గణనీయంగా పెరుగు తుంది.గిరిజన ప్రజల్లో కూడా వారి జీవనశైలి,జీనోపాధిలోను మార్పులు సంభ విస్తున్నాయి.ఈనేపథ్యంలో సమత మరో ముందుడు వేసింది.పర్యాటక ప్రదేశాల్లో నివసిస్తూ నిరుద్యోగులుగా ఉంటున్న యువతీ, యవకులకు స్వయం ఉపాధి సాధన దశగా గిరిజన యువతను తీర్చిదిద్దాలని సంకల్పంచింది.అటవీ ప్రాంతాల్లో స్థాని కంగా లభించే వనరులు,అటవీ ఉత్పత్తులను సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు అవసరమైన శిక్షణలు,నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి,అరకు,చింతపల్లి,పాడేరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా బుర్రాగుహలు, కటికి,సిరియా వంటి జలపాతాలున్న ప్రదేశాలవద్ద గిరిజన ఉత్పత్తులు,వారు తయారు చేసే వస్తువులు,రుచికరమైన వంటకాలను పర్యాటకులకు విక్రయిస్తూ మెరుగైన జీవనోపాధిని పొందడానికి వివిధ రంగాల్లో నిపుణులతో గిరిజన యువతకు శిక్షణ ఇస్తూన్నారు. దీనిపై నైపుణ్యాభివృద్ధి సాధనకు మెరుగైన శిక్షణలు ఇవ్వడానికి సమత కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంది. గిరిజన యువత ఆర్థికాభివృద్ధి సాధించాలి ` సమత రవి
గిరిజన యువతలో మార్పు రావాలి.అర్హతలకు తగ్గా ఉద్యోగాలు లభించకపోయినా,అటవీప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులు,పంటలను సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధి సాధించేలా వివిధ రంగాల్లో నిష్టాతులైన నిపుణులతో శిక్షణలు ఇప్పిస్తూగిరిజన యువతకు వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపడుతున్నట్లు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రెబ్బాప్రగడ రవి తెలిపారు. ఇప్పటికే కటికి పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ యువతకి డ్రైవింగ్‌ స్కూల్లో చేర్పించి నెలరోజులపాటు శిక్షణ ఇప్పించాం.వారికి అవసరమైన డ్రైవింగ్‌ లైస్సెన్సులు సైతం ఇప్పించడం జరిగింది.గిరిజన యువతకు సమత అందిస్తున్న నైపుణ్యాభివృద్ధిశిక్షణలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధిని సాధించా లన్నారు.అంతేకాకుండాపర్యాటక ప్రదేశాల్లో ఎకోటూరిజం అభివృద్ధి,పర్యా వరణ పరిరక్షణ,యువత స్వయం అభివృద్ధిపట్ల ఆదివాసీ యువతకి సమత ఇచ్చిన శిక్షణ తరగతులు సద్వినియోగపర్చుకోవాలన్నారు.యువత వివిధ రంగాల్లో నేర్చుకున్న నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకుని పర్యాటక ప్రాంతాల్లో మార్కెటింగ్‌ చేయాలన్నారు. అలాగే పెరుగుతున్న సోషల్‌ మీడియా రంగం ద్వారా ఇక్కడ ప్రదేశాలు,మీరు తయారు చేసిన అటవీ ఉత్పత్తులు, రుచికరమైన వంటకాలను యూట్యూబ్‌ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు.
సత్ఫ్‌లితాలిచ్చిన సమత శిక్షణలు
ఆదివాసీ పర్యాటక ప్రాంతమైన బుర్రాగుహలు, కటికి జల పాతం ప్రాంతాల గిరిజన యువతకి కటికి గ్రామంలో సమత వారం రోజుల పాటు యువత స్వయంఉపాధి ఏర్పాటు చేసుకొని,వారి కుటుంబాలు ఆర్ధికంగా అభివృద్ధి చెండడానికి ఉపయోగపడే వివిధ రకాల అంశాలుపై ఈశిక్షణలు పొందారు.సమత కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌ సమన్వయ కర్తగా వ్యవ హరించారు. హాస్పటాలిటీ మేనేజమెంట్‌ పేరుతో పర్యాటకులకు రుచి కరమైన పౌష్టికాహరాలు తయారీ,(వెదురుబొంగు,నాన్‌ వెజ్‌,వెజ్‌ బిరి యాని,బొంగు చికెన్‌,స్థానికంగా లభించే రాగి,జొన్న,కొర్రలు,సోమలు మొక్కజొన్నలతో రుచి కరమైన స్నేక్స్‌ తయారు చేయడం నేర్పించారు.అలాగే అడవిలో సేకరించే అటవీ ఉత్పత్తులతో (వెదురు,గృహాపకారణాలు,సెల్‌ఫోన్ల కవర్లు,అల్లికలు వంటి అంశాలపై నేర్పించారు. తయారు చేసిన వస్తువులను మార్కెటింగ్‌ చేసేందుకు నైపుణ్యాల అభివృద్ధి పట్ల కూడా బెంగళూర్‌ నుంచి వచ్చిన నిపుణులు ద్వారా ఈ శిక్షణలు ఇప్పించారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని మెరుగైన జీవలోపాధి సాదించకోవడానికి ఈశిక్షణలు దోహద పడతాయని శిక్షణా నిపుణులు గోపి కృష్ణ తెలిపారు.ముఖ్యంగా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతలో ఎకో టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణకు యువత పర్యాట కులను చైతన్య వంతులు కావాలని కోరారు. శిక్షణ కార్యక్రమంలో సమత కో-ఆర్డినేటర్లు కే.సతీష్‌ కుమార్‌,గునపర్తి సైమన్‌, కటికి జలపాతం కమిటీ అధ్యక్షులు మోహన్‌, ట్రైనింగ్‌ టీమ్‌ లీడర్స్‌ గోపి కృష్ణ,బొర్రా పంచాయతీ సర్పంచ్‌ జన్ని అప్పారావు, ఎంపీటీసీ అరుణ నవీన్‌,పెసా కమిటీ ఛైర్మెన్‌ దేవ కుమార్‌,సెక్రటరీ డొనేరు డేనియల్‌రాజకు మార్గే మ్మేలా చిన్నాయ్య అడ్వకేట్‌ సోమేలా రాం బాబు తదితరులు పాల్గొన్నారు. – గునపర్తి సైమన్‌

1 2