భారత రాజ్యాంగం లౌకిక స్వభావం

భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసంలౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వా సాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణా మాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే.లౌకిక రాజ్యమంటే ప్రజలు,ప్రభుత్వానికి మధ్య సంబంధాలు,పరిపా లన..మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతికప్రపంచం గురించి ఆలోచిం చడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం,పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించిఊహించి చెప్పేప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతా బ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్‌ హోలియోక్‌ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్‌ భాషలోని ూవషబశ్రీబఎ (సెక్యులమ్‌) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్‌)అని దీనిఅర్థం. ఆ తర్వాత వాడు కలో ప్రభుత్వాన్ని,పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం..పాలనచట్టం, రాజ్యాం గం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి.
లౌకిక భావన, వివిధ పార్శ్వాలు
లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించి నప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ.పూర్వ కాలం లో ప్రజల అన్ని విషయాలను మతం,మతాచార్యు లే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు.సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు.
భారతీయ భావన భిన్నం
పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణా మాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు,విశ్వాసాలు,జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యా లుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం,రెండోది భిన్నమతాల మధ్య సామర స్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు.విశ్వ వ్యాప్త మైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’.
లక్షణాలు
ా ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు.
ా అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు.
ా మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం.
ా న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం.
ా మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
ా రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం
ా లౌకికతత్వం (సెక్యులర్‌) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది.
లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు
రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కు లలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమా లలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరు డు కలిగి ఉండాలని కోరడం,లౌకికతత్వానికి మచ్చు తునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు.
ప్రవేశిక – లౌకిక భావన
భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన,విశ్వాసం,నమ్మకం అనే అం శాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు.రాజ్యాంగం మూడో భాగం లో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి.(వ్యాసకర్త:డెరైక్టర్‌, క్లాస్‌-వన్‌ స్టడీ సర్కిల్‌)
లౌకిక రాజ్యాంగానికి విఘాతం కల్గించవద్దూ..
ప్రస్తుత బి.జె.పి ప్రభుత్వం ఆర్‌.ఎస్‌. ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తన రాజకీయ ప్రాబ ల్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగు తుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు,కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యా యులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి. భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో అడుగు పెడు తున్నది. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ అరవైకి పైగా రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారతీయ భిన్నత్వానికి, బహుళత్వానికి అనుగుణం గా రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగలక్ష్యాలను,ఆశయాలను పొందుపరచారు.గిరిజన ప్రాంతాలకు5,6షెడ్యూళ్ల ద్వారా ప్రత్యేక హక్కులుకల్పించారు. జమ్ము-కాశ్మీర్‌ ఆనాడు ప్రత్యేక పరిస్థితులలో ఇండియన్‌ యూని యన్‌లో చేరటంతో370వ నిబంధన ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. తరతరాలుగా అణచి వేతకు గురైన షెడ్యూల్‌ కులాలు,షెడ్యూల్‌ తెగలు, వెనుక బడిన తరగతుల ప్రజల కోసం రాజ్యాంగం 16వ భాగంలో రిజర్వేషన్లతోపాటు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు.
భారతీయ ఉమ్మడి సంస్కృతి
భారతీయ సంస్కృతి ఉమ్మడి సంస్కృతి అని రాజ్యాంగంలోని51(ఎ)నిబంధనలో పేర్కొ న్నారు.భారతదేశం భిన్నమతాలకు, సాంప్రదా యాలకు, సంస్కృతులకు, ఆచారాలకు నెలవుగా ఉన్నది. దేశంలోహిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, జైనం,బౌద్ధం,పార్సీ,సిక్కు మతాలతో కూడిన సం స్కృతీ సాంప్రదాయలు ఉమ్మడి సంస్కృతిగా రూపు దిద్దుకున్నాయి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు ‘’విభ జించు-పాలించు’’సూత్రంలో భాగంగా హిందు వులు-ముస్లింల మధ్య మతతత్వ భావనలు రెచ్చ గొట్టారు. ఫలితంగానే జాతీయోద్యమ కాలంలో ముస్లిం లీగ్‌,హిందూ మహాసభ,రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్న్‌ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. మత తత్వ ధోరణులకు కొనసాగింపుగానే1947లో దేశ విభజన జరిగింది. సమకాలీన భారతదేశంలో మతతత్వ ధోరణులను, మతోన్మాదాన్ని రెచ్చగొట్ట టానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలను మతపరంగా చీల్చటానికి సంఘ పరివార్‌, బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నింటిని ఎదు ర్కొని భారతీయ ఉమ్మడి సంస్కృతిని రాజ్యాంగంలో చెప్పిన విధంగా పరిరక్షించుకోవాలి.
రాజ్యాంగంలో లౌకిక విధానాలు
భారత రాజ్యాంగం దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. ఈమేరకు పీఠికలో చేర్చారు. ప్రాథమిక హక్కులలో 25నుండి 28 వరకు గల నిబంధనలు ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించాయి. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని ‘’స్వీకరించటానికి,ఆచరించటానికి,ప్రచారం చేసు కోవటానికి’’ హక్కు కలిగి ఉన్నాడు. మతపరమైన సంస్థలను నిర్వహించుకోవటానికి, సేవా కార్యక్ర మాలు నిర్వహించటానికి రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. వ్యక్తిగతమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చని చెప్పింది. ప్రాథమిక హక్కులలో విద్యా,సాంస్కృతికహక్కులను29,30 నిబంధనలలో పేర్కొని వాటి ద్వారా మైనారిటీలు తమ భాషను, సంస్కృతిని,విద్యను అభివృద్ధి చేసుకోవటానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం పేర్కొన్నది. రాజ్యాంగనిర్మాతల ప్రధానలక్ష్యం భారతదేశంలోని భిన్నమతాల ప్రజలు లౌకిక విధా నాలతో జీవిస్తూ సహజీవనం చేయాలని భావిం చారు. లౌకిక విధానాల ద్వారానే దేశ సమైక్యత, సమగ్రత కొనసాగుతుందని భావించారు.
బిజెపి మతతత్వ విధానాలు
దేశంలో హిందూత్వ విధానాలను అమ లు చేయటంతో పాటు హిందూ రాజ్యం ఏర్ప డాలని, హిందూ ఆధిక్యత కొనసాగాలని ఆర్‌.ఎస్‌. ఎస్‌ సిద్ధాంత భావజాలంలో స్పష్టంగా పేర్కొన్నది. ఈ భావజాలాన్ని అమలు చేయటానికి సంఘ పరివార్‌తో పాటు రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఆలంబనగా చేసుకున్నది.2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత8ఏళ్లగా మతోన్మాదాన్ని, మత తత్వాన్ని రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావ జాలంతోహిందూత్వ శక్తులు విజృంభిస్తు న్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతూ మైనా రిటీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారు. భారత దేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరిస్తూ అఖండ భారత్‌ స్థాపన కోసం ప్రజలు ముందుకు రావాలని రెచ్చగొడుతున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేప థ్యంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రసం గాలు చేస్తు న్నారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌ సమావేశాలలో హిందూత్వ శక్తులు మైనారిటీలను ఊచకోత కోయాలని ప్రసంగాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో నరేంద్ర మోడీ-యోగిల ద్వయం చేపడు తున్న చర్యలు మైనారిటీలలో భయానక వాతావర ణాన్ని సృష్టించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశాలలో భారతీయ జనతా పార్టీ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చ గొట్టటానికి, మతపరమైన చీలికలు తేవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది. జనవరి 26న జరగబోయే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బిజెపి అనుకూల రాష్ట్రాల శకటాలను అనుమతించి,బెంగాల్‌, తమి ళనాడు,కేరళ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మొద లగు రాష్ట్రాల శకటాలను అను మతించక పోవటం వివక్షతలో భాగమే. 2019లో నరేంద్ర మోడీ రెండవసారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి గత మూడే ళ్లుగా చేస్తున్న నిర్ణయాల ద్వారా ప్రజల మధ్య మత పరమైన అగాధాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నారు. జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ నిబంధనను రద్దు చేయటమేకాక, కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా రద్దు చేయటం దీనిలో భాగమే (ఇప్పుడు కార్పొరేట్లు కాశ్మీర్‌లో భూముల కోసం ఎగబడుతున్నారు).అంతేకాకుండా పౌరసత్వ అంశాన్ని ముందుకు తెచ్చి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చేయడం, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మొదలగు వాటిని ప్రతిపాదించటం మతపరమైన భావాలను రెచ్చగొట్టడంలో భాగమే. పైఅంశాలన్నీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
ఎ.పిలో మతతత్వ శక్తుల కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి మతతత్వ శక్తులు ప్రయత్నిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో భజన సంఘాలు,పండగలు,ఉత్సవాల పేరుతో తమ భావజాలవ్యాప్తికి ఉపయోగించుకుం టున్నా రు. ఇటీవల గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చాలని, కూల్చివేయాలని ప్రచారం ప్రారంభిం చారు. హిందూ ఐక్యవేదిక పేరుతో ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంలో కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ పేరు మార్చాలని పిలుపు ఇచ్చారు. ఆత్మకూరులో మసీదు అంశాన్ని బిజెపి నాయకులు వివాదంగా మార్చి ఘర్షణకు దిగారు. కడప జిల్లా లో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ప్రతిష్టాపనకు వ్యతిరే కంగా క్యాంపెయిన్‌ చేశారు. శ్రీశైలంలో దుకా ణాలు పెట్టుకున్న ముస్లింలపై దాడులు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిజెపి ప్రభుత్వం అన్యా యం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్ట హామీలు అమలు జరపలేదు. విశాఖ పట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణకు పూను కున్నది. ప్రజలలో వీటిపై చర్చ లేకుండా మతో న్మాద భావల వైపు మళ్లించాలన్నది బి.జె.పి ఆలోచనా విధానం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీగాని, ప్రతిపక్ష పార్టీ లైన తెలుగుదేశం, జనసేన గాని బి.జె.పిమతోన్మాద విధానాలను ఖండిరచటం లేదు.
ప్రస్తుత బి.జె.పిప్రభుత్వం ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తనరాజకీయ ప్రాబల్యాన్ని కొన సాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు,లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యాయులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి.
వ్యాసకర్త :శాసనమండలి సభ్యులు,లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌- (బి.కృష్ణారెడ్డి/కె.యస్‌. లక్ష్మణరావు)

అరకులోయలో ఆదివాసీల అంతరంగం

“చూసే కళ్ళకు మనసుంటే-ఆ మనసుకు కూడా కళ్ళుంటే’పనిమట్లు, విత్తనాలు, ధింసా ఆటలు, గిరిజనుల జీవితం చిత్రించే బొమ్మల కొలువులు.. ఇవి అరకులోయ మ్యూజియంలో. చుట్టూ కాఫీ తోటలు, జలపాతాలు, బొర్రా గుహలు,బొంగుచికెన్‌ వంట కాలు కనిపిస్తాయి. కాని తెలుసు కుంటే కాని తెలియనివి,పల్లెలలో ఏడాది పొడుగునా గిరిజనులు చేసుకునే పనిపాట్లు,కట్టుబాట్లు,రాజులు/ప్రభు త్వాలు, ప్రజల మధ్యసంబంధాలు, పండుగలు, మొక్కులు, వంటలు, కష్టసుఖాలు.వాటిలో రాగం,తానం, లయలవలె అల్లుకుపోయిన ఆటపాటలు,కధలు,సామెతలు సాహిత్యం,లెక్కలు,ఆశయాలు ఆదర్శాలు….! అరకు,ఒడియా గిరిజన మాండలికం మాట్లాడే బగతలు, కొటియాలు,కొండదొరలుబీ తమ,తమ భాషలుగల కోదు(సామంత),పోర్జా/జోడియా వగైరా తెగలు నివసించే అరకులోయ బహుభాషల ప్రాంతం.”
అరకులోయలో జీవితకాలం గిరిజనాభివృద్ధికి పనిచేసిన కెనడా దేశీయుడు గుస్తాఫ్‌, ఆదివాసీ ఒడియా,తెలుగు అనువాదంతో తయారుచేసిన ‘ఆదివాసీ పండుగలు’ను 1976 లో పాడేరు గిరిజనాభివృద్ధి సంస్థ ప్రచురించింది. 76-82 మధ్య శక్తి శివరామకృష్ణ సేకరించిన తెలుగు గిరిజన గీతాలు’ మీద, 1991లో సమత రవి ఏర్పాటుచేసిన ప్రసంగాన్ని విన్న, నాటి ప్రాజెక్ట్‌ అధికారి సోమేశ్‌ కుమార్‌, 200 కాపీలు కొని ఉపాధ్యాయులకు పంచిపెట్టారు. దాన్ని పరివర్ధిత ముద్రణగా తెచ్చే ప్రయత్నంలో 2002లో పాడేరు చుట్టూ తిరుగుతున్నప్పుడు, అప్పుడు Aష్‌ఱశీఅ ఎయిడ్‌లో, ఇప్పుడు అజిత్‌ ప్రేమ్‌జీ (Ajaఎ ూతీవఎjఱ) ఫౌండేషన్‌లో పని చేస్తున్న మిత్రుడు రఘు దగ్గర ఈగుస్తాఫ్‌ పుస్తకం దొరికింది.
ఇదేకాక తెలుగేతర తెగఅయిన కొంధులమీద ప్రముఖ భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి 1960 లో అధ్యయనం చేసారు. 65లో ఈ తెగలన్నిటిమీద జనగణన,ఎథ్నోగ్రాఫిక్‌ నోట్స్‌ తో పాటు,కొండిబా,లంప్తాపుట్టు, జెర్రిల, అన్నవరం గ్రామాలమీద మోనోగ్రాఫ్‌లు ప్రచు రించింది. కొండదొరలమీద రాఘవరావు 75 లో ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి డాక్టరేట్‌ పొందారు.1863,1907లో వచ్చిన విశాఖ డిస్త్రిక్‌ గజెటిర్‌లోగల అన్నిరంగాల చరిత్ర వీటన్నిటికి పునాది.నేటి అనంతగిరి,అరకు, డుంబ్రిగూడ,పెదబయలు,ముంచెంగిపుట్‌ మండలాలు,హుకుం పేట మండలంలో పెదగరువుదాకా,కొండదొరలు పాలించిన ఒక నాటి ఒడిశా జేపోర్‌ సంస్థానంలో పాడువా తాలూకాలోనివి. స్వతంత్రం తరువాత ఈ తాలూకాలో ఈమండలాలు ఆంధ్రప్రదేశ్‌ లో కలిసిపోయాయి. ఆ సంస్థానం ఆఖరి పాల కుడు విక్రమదేవవర్మ ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రోచాన్సెలర్‌. వారి బంధువులు కురుపాం, మేరంగి,సాలూరు,ఆంద్ర,పాచిపెంట పాలకులు, తమ రాజ్యాలను ప్రగతి పధంలో నడిపిస్తూ, దిగువనున్న విజయనగరం,బొబ్బిలి సంస్థా నాలకు పోటీగా,విశాఖనగరం అభివృద్ధి చేసారు. ఇక్కడి ఒకనాటి కాశీపట్నం జమిందారీలోది,ఘాటీ ఎక్కుతుంటే వచ్చే, అనంతగిరి మండలంలో పుణ్యగిరి తీర్ధం/ధారల గంగమ్మ. అక్కడ గూగుల్‌ ఎర్త్‌ మ్యాప్‌లో ‘విరాట పర్వతం’అని ఎవరో నోట్‌ చేసారు. నిజమే. ఈ ప్రాంతం 14శతాబ్దివరకు వడ్డాది రాజధానిగా పాలించిన మత్స్యరాజుల విరాట రాజ్యం. వారూ ,జేపోర్‌ వారు బంధువులు. విరాటరాజ్యంలో అజ్ఞాత వాసం గడుపుతున్న పాండవులుగా గిరిజనులు తమను పోల్చుకుంటూ ‘పంచ పాండవుల పంట-దుర్యోధనుడి వంట’ అంటూ భారతకదను తమకు అనువుగా మార్చుకుని పిప్పలి, పసుపు,చిక్కుళ్ళు,అల్లం,అనాస వగైరా తము ప్రత్యేకంగా పండిరచే పంటల దోపిడిని ‘నందిపదం’లో పాడుకుంటారు.ఆసియా అంతా, పాండవులు, వ్యవసాయ సంస్కృతితో ముడిపడి ఉన్నారు.అలాగే ధారల గంగమ్మ, అటువంటి క్షేత్రమే పాడేరు మండలంలో మత్స్యగుండం. ఈ నీటి వనరులు ప్రపంచ మంతా జలకన్యలవి, (ఙఱతీస్త్రఱఅం, అవఎజూష్ట్రం, ఎవతీఎaఱసం), క్రూరజంతువులతో నిండిన అడవులు కొండ రాజులు/దేవతలవిగా భావించి మొక్కే, మన ఆచారాల మూలాలు,గిరిజన సంస్కృతిలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ‘తెలుగు గిరిజన గీతాలు’(91),పరివర్ధిత ముద్రణ ‘కొండకోనల్లో తెలుగు గిరిజ నులు’ (2007) తెలుగు తెగల ఈ వారసత్వాన్ని, నందిపదం వంటి వారిసాహిత్యంలో వ్యవసాయ విజ్ఞానం, సంస్కృతిని సమగ్రంగా తెలియచేస్తూ అరకులోయ సంస్కృతినికూడా అర్ధం చేసుకోటానికి సహకరిస్తుంది. తెలుగు గిరిజనుల నుడికారం తెలిస్తేనే,ఇతర తెగల భాషలు మనకు బాగా తెలుస్తాయి అంటారు భద్రిరాజు కృష్ణమూర్తి.. ఇక గుస్తాఫ్‌ పుస్తకం గిరిజన జీవితాన్ని నెలలవారీగా వర్ణిస్తూ, మనకు తెలియని గిరిజనుల ప్రపంచానికి తలుపులు తెరుస్తుంది. సహజ వ్యవసాయ విధానం అమలు చేస్తున్న మితృలకోసం ఇక్కడి వ్యవసాయ సంస్కృతిని పరిచయం చేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్న గిరిజనులకోసం,ఈ పుస్తకాన్ని ముందు సంక్షిప్తంగా పరిచయం చేసి, క్రమంగా మిగిలిన పరిశోధనలను జోడిరచటం కొన సాగుతుంది..
చైత్రం/ఏప్రిల్‌-మే
‘విరాటరాజు దేశం ఇటికె పండుగలు, కాశివారి దేశం గంగ పండుగలు’ అని నందిపదం’లో పాడుకునే, ఈ నెలలో చేసే ఇటుకల/వేటల పండుగ గిరిజనులకు పెద్ద పండుగ .ఈ నెలలో ఆడవాళ్లదే రాజ్యం.ప్రతి ఇంటి మగ వాడు, తెల్లవారగానే ఆడవాళ్లు ఊగటానికి ఉయ్యాల కడతాడు.మగవారిని వేటకోసం కొండకు తరిమాక,ఆడవారు పాటలు పాడుతూ ఉయ్యాలలూగుతారు. ఈ పండుగకుముందు, కొండమామిడికాయలు తినరు.ఫాల్గుణం/పొగు నులో హోలీ కాల్చిన రోజునుండి పాడే సంగడి ఆటపాటలు ఈ నెలతో ముగుస్తాయి.ఆటకు రానివారిదగ్గర ఆడవారు పన్ను(పెజోర్‌) వసూలు చేస్తారు.మఖ,కృత్తిక,చిత్త.స్వాతిు-ఇలా ఎవరికి ఏ నక్షత్రం అనుకూలమో చూసి విత్తనాలు వేసుకుంటారు.
వైశాఖం మే-జూన్‌
ఈ నెల వేసగిలో వర్షాలు వడగండ్లతో పడతాయట.పెళ్ళిళ్ళ కాలం.ప్రకృతి అంతా పెండ్లిలో అయిరేని/బోయ్‌ కుండలలాగా రంగురంగులతో నిండి ఉంటుంది.వేటలు ముగుస్తాయి. గొట్న పండుగ చేసి,తోపహల్వా వండి, గౌడు పశువులకాపు మొదలు పెడ తాడు.గొట్న అంటే భోజనంకుండ. ఈ పండుగ తరువాతే పొలంపనిచేసే వారికి భోజనం తీసుకెళ్లటం మొదలు పెడతారు. పుష్య మాసం లో నియమించుకున్న పని వాళ్ళందరికీ ఆయా పొలాలు కేటాయిస్తారు.ఇటుకల పండుగలో వసూలు చేసిన పన్ను డబ్బులతో ఆడవారు పిట్టు వండుకుంటారు.
లండిజేట్‌/జ్యేష్టం
లండి/సామ పొట్టిజడలు వేస్తుంది.ఈనెలలో పొర్ణమి అయ్యాక సామలుచల్లరు.మెట్టుధాన్యం, చోడిలాంటి కొద్దిరోజుల పంటలు చల్లుతారు. ఆషాఢంబీమేఘాలు కమ్మి వర్షాలు కురుస్తాయి. గింజలు నూర్చేటప్పుడు పంట దిగుబడి ఎక్కువ గా ఉండాలని జన్ని పండుగ చేస్తారు. అడవి జంతువుల బారిన పడకుండా వచ్చిన పశువులకు నైవేద్యం పడతాడు.సామ పంటతో పూజారి నైవేద్యం పెడతాడు.
భాద్రపదం/బందపని
జాకరిమెట్టలో కొర్రపంటకు కొత్తల పండుగ చేసారు. కొత్తకుండ,కొత్తజిబ్బి,కొత్త తెడ్డులతో, తరగాయ్‌ దుంపలు,గుమ్మడికూర,కొత్త చింత కాయజాకరికి పెడతారు.’లోల్లోసే అన్నవారికి లోపలొక పిల్ల,సైలోరే అన్నవారికి చంకనొక పి ల్ల’లోల్లోసి/సైలోరి పాటలు మొదలుపెడతారు.
ఓస/ఆశ్వయుజం
పెద్ద పెద్ద వర్షాలు కురుస్తాయి.కొత్తధాన్యం అందుతుంది. పాలకులలో ఇసుకపోసి విత్తనాలు వేసి,పసుపునీళ్ళతో పెంచి మొలకె త్తాక ఆ పువ్వులను బల్లి/లక్ష్మి పువ్వులు అంటారు.ఆ పూలతో నేస్తం కట్టుకుంటారు. బల్లిపాటలు పాడతారు.ఈ నెలనుండి చలి మొదలవుతుంది. పంటలు నేలకొరిగి పరుచు కుని పోతాయి.ఓస అంటే ఒడియాలో పరుచు కొనుట అని అర్ధం .
దసరా
దసరాలో దుర్గ/మెరియా పడుతుందని నమ్మకం.జంతువులు కూడేనెల.నెలపొడిచి పదిరోజులయ్యాక (దశమి)దసరా పండుగ చేస్తారు.
దీపావళి
పంటలన్నీ పచ్చగా పండుతుంటాయి. జల కన్యల ప్రతినిధి కప్పదేవతకు పండుగ చేస్తారు. దీపావళి నాలుగురోజులు అన్నంపప్పు మాత్రమే తింటారు.
మార్గశిర
మంచు ముద్దలు ముద్దలుగా పడుతుంది.ఇళ్ళు, వాకిళ్ళు అలకటం తలంటి పోసుకోటం,లక్ష్మి దిగుతుంది. మూడురోజులు బల్లి పండుగ చేస్తారు.బల్లి నాటకాలు అడతారు.’బంగరాల బల్లి,బాలగొంతెమ్మ’ అంటూ పాండవుల తల్లి కుంతిని పిలుచుకుంటారు తెలుగు గిరిజనులు
పుష్యం/సంక్రాంతి
దీపావళికి తలస్నానం చేసినప్పటినుంచి మొదలైన దిమ్సా ఆటలు,పాల్గుణ పుష్య మాసాలలో ముగుస్తాయి.డప్పు,ఢంకా,కిరిడి, సన్నాయి,పిల్లనగ్రోవి,జోడుకొమ్ములు వాయిద్యాల కనుగుణంగా14 గతులలో గిరిజన జీవితాన్ని అభినయించేదే ధింసా ఆట..ఆడ వాళ్ళవి సైలోరిపాటలు,మగవాళ్ళది కోలాటం.
మాఘం
‘మాఘంలో మేఘం ఫాల్గుణంలో వర్షం’. పుట్టమట్టితో ఒకనంది/ఎద్దును, దుంపలతో ఒక నందిని తయారుచేసి వాటికీ పెళ్లి చేస్తారు. బస్కి పూలతో నేస్తాలు కట్టుకుంటారు.
ఫాల్గుణం /పొగును.
దీపావళిలో మొదలైన చలి పొగును మంటలో కాలిపోతుంది.నందిపండుగలో ఇచ్చిన విత్త నాలను హోలీ బూడిదలో వేస్తారు.హోలీ పాటలు పాడతారు.దుక్కులు మొదలు పెడతారు.
వ్యవసాయ వారసత్వం సమత టీంలో, దేవుళ్ళు సంజీవని సంస్థ,1990 నుండి రాష్ట్రమంతటినుండి విత్తనాల జాబితా పోగుచేయిస్తున్న డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ స్పూర్తితో డుంబ్రిగూడ మండలంలో ప్రారం భించిన విత్తనాలసేకరణ, పండుగలు చేయ టం,కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందింది.ఈ సొసైటీ కృషిలో సహకరించిన కామేశ్వర శర్మ, రవి విశ్వవిద్యాలయాలలో పర్యావరణ,వృక్ష శాస్త్రవేత్తలు. ఇతర శాస్త్రవేత్తలు,సంస్థలు తమ పక్కనే ఉంటూ చేసినకృషిని,అందరు శాస్త్రవేత్త లలాగే వీరుకూడా పట్టించుకోలేదు భద్రిరాజు కృష్ణమూర్తి నాయకత్వంలో 1960లోనే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రైతులనుండి సేకరించిన పదసంపదతో కూర్చిన వ్యవసాయ మాండలిక వృత్తి పదకోశంలో,427 వడ్లరకాలు,100 రకాల జొన్న,18 రాగి,ఆరికలు 5,కొర్ర 37, ఉలవలు 13,బొబ్బర 8,సెనగలు 8,నువ్వు 19,ఆముదాలు 7,చెరకు 2,పత్తి 12,పొగాకు 15,మిరప 10,కొబ్బరి 51,అరటి 15,నిమ్మ 8 రకాలు పేర్కొన్నారు. అయితే ఈ పదకోశంలో గిరిజనప్రాంతాల వివరాలు లేవు. దేవుళ్ళు వగైరాలు తయారు చేసిన విత్తనాల జాబితా ఈలోటును పూరిస్తుంది.భద్రిరాజు కృష్ణమూర్తి గారి ఇల్లు,నేడు వ్యవసాయరంగంలో పనిచేస్తున్న ‘వాసన్‌’ వగైరాల మాతృసంస్థ Aష్‌ఱశీఅ టశీతీ షశీతీశ్రీస ంశీశ్రీఱసaతీఱ్‌వ పక్కనే ఉండేది.కానీ ఆయన వ్యవసాయపదకోశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ పదకోశాల నిర్మాణంలో పాల్గొన్న చేకూరి రామారావు,బూదరాజు రాధాకృష్ణ పత్రికా రంగంమీద విశేష కృషి చేసారు.కాని వారు ఈ రైతుల పదసంపదను పత్రికలకు గుర్తుచేయ లేదు.Rబతీaశ్రీ సవఙశీశ్రీశీజూఎవఅ్‌,ూబ్‌్‌ఱఅస్త్ర శ్రీaర్‌ ్‌ష్ట్రఱఅస్త్రం టఱతీర్‌(83)బీఖీaతీఎవతీం ఖీఱతీర్‌(89) పుస్తకాలు రాసి, రైతును గూర్చి ముందు తెలుసుకోవాలని ఉద్బోధిస్తూ ూRAవిధానాలను ప్రచారం చేసిన రాబర్ట్‌ చాంబర్స్‌తో పనిచేసిన శాస్త్ర వేత్త సంఘి ( మేనేజ్‌) ఈ సంస్థలతో సన్నిహితంగా పనిచేసేవారు.అప్పట్లో పెర్మా కల్చర్‌ బిల్‌ మోలిసన్‌తో వీరందరూ ఒక కార్య శాల నిర్వహించారు.తూర్పు కనుమలలో చెద పురుగుల సమస్యగూర్చి అడిగినపుడు,చెదలున్న భూముల్లో చింత,పనసలు బాగా వస్తాయి. అవికూడా పంటలే.ప్రకృతికి ఎదురీదవద్దు అని, బిల్‌, హెచ్చరించారు. క్రమంగా ఈ ప్రాధా న్యతలు, పద్ధతులు మారిపోయాయి. అత్యధిక వర్షపాతం పొందే ఈప్రాంతంలో కొండ వాగులు,జోరెలగర్భంలో మళ్ళు కట్టి వరి పండిస్తారు.ఈ జోరెలలోనే నీటిమొక్కలు టవతీఅ, షవషaసలు అనాదిగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు, కొండప్రాంతాలలో తీవ్రసమస్య భూమికోతను అరికడుతున్నాయి. వ్యవసాయం పెరిగినకొద్దీ నరికి వేయటంతో ఇవి అంత రించాయి. .హైదరాబాద్‌లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నాగరత్నం నాయుడు, ఇటువంటి షవషaసలను, అడవులలో దొరికే aతీషష్ట్రఱస పూలను పెంచి అంతర్జాతీయ మార్కెట్‌ లో అమ్ముతున్నారు. జీలుగుకొమ్మలను పోలిన ఈ టవతీఅను గిరిజనులు ‘కన్నెజీలుగు’ (జలకన్యల),నీటిమీద పరుగెత్తే జూశీఅస ంసa్‌వతీ ను ‘గన్నికల పురుగు’ అంటారు. వారి మనో ప్రపంచంలో కప్ప,చేప,ఎండ్రిక మొదలైన జల చరాలు జలకన్యల ప్రతినిధులు.విశాఖ మన్యం లో అత్యున్నత శిఖరంపేరు ‘ఎండ్రిక’ పర్వతం. విశాఖ గజేటిర్‌, జేపోర్‌ రాజులు వారణాసి నుండి మాలీలను రప్పించిపూలు,పొందరల చేత కూరగాయలు ,వ్యవసాయానికి అవసరమైన ఇతర వృత్తులు ప్రోత్సహించారు అని తెలియ చేస్తుంది.. జేపోర్‌, అత్యధిక వరివంగడాలుగల ప్రాంతంగా శాస్త్రవేత్త రిచారియా 1970 లలోనే ప్రపంచానికి చాటారు. హరితవిప్లవం వ్యాప్తిలో పడి నిర్లక్ష్యం చేసిన,ఈ జన్యు సంప దను, ఆ విప్లవ పితామహుడు స్వామినాథన్‌ ఫౌండేషన్‌, ఇక్కడి 340 వరిరకాలు,వాటిలో 24 సువాసన కలవి,27 వరద,2 నిలవ నీళ్ళను,1 కరువును తట్టుకునేవి.8 రకాలు చిరు ధాన్యాలు,9 రకాల పప్పులు,5 నూనె గింజలు,3 పిచు చెట్లు,7 రకాల కూరగాయలు జాబితా ఇంతవరకు తయారు చేసింది.. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఖీAూ), భారతదేశంలోగల మూడుప్రదేశాలలో ఒకటిగా,జేపోర్‌ వ్యవ సాయ వారసత్వాన్నిగుర్తించింది.దశాబ్దాలుగా ఈ అరకులోయలో నేచర్‌,వికాస మొదలైన స్వచ్చంద సంస్థలు నాబార్డ్‌ మొదలైన సంస్థల విధానాలబట్టి వ్యవసాయాభివృద్ధి చేస్తూ , రైతు సంఘాలు నడిపిస్తున్నారు.మారుమూల ఉన్న సొవ్వ పంచాయితీలో పండే కూరగాయలను విశాఖలో అమ్మించటంలో దేవుళ్ళు విశేషమైన కృషి చేస్తున్నారు కాని,రవాణా ఖర్చులు పోగా మిగిలేది తక్కువ అని గిరిజనులు వాపోతు న్నారు. కేరళలో ఈ మాత్రంకూడా భూములు లేని గిరిజనులు ఇంటిచుట్టూ మిరియం పండిర చుకుని గడిస్తున్నారు. ఇక్కడ భూమికంటే అడవి ఎక్కువ.కాబట్టి అటవీ హక్కులగుర్తింపు ద్వారా అడవి కాపాడుతూ లాభం పొందే ప్రయత్నం చేయాలి, ఇందుకోసం గతంలో ధింసా గిరిజన సమాఖ్య 27 పంచాయతిలలోగల 217 అవాసాల సంప్ర దాయ వనరులపటాలు తయారుచేసింది. పోడు భూముల కొలతలు తక్కువగా చూపి నందుకు ఆందోళన జరి గింది.. ఆ కృషిని కొనసాగించాలి.ఆ ప్రయత్నం గ్రామసభలకు ప్రాణం పోస్తుంది. సరిjైున భూమి హక్కుల నమోదు,ఆ పధకాలకు ఇచ్చే రాయితీలను పొందటంలో న్యాయం చేస్తుంది. ‘వాసన్‌’ సొవ్వ పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసి నిధులకోసం ప్రయత్నిస్తున్నది. గ్రామసభలతో సంబధం లేకుండా తామే లభ్దిదారులను ఎంచుకొని,వారి ఖాతాలో ఇంటర్‌ నెట్‌ ద్వారా పధకాల తాలూకు సొమ్ము జమచేయటం,అవి దక్కించుకోటంలో అవకతవకలు, పడేపాట్లు,లోపాలను ‘నగదు బదిలీ సఫలమా,విఫలమా’ వ్యాసంలో (ఆంధ్రజ్యోతి) లో లిటేక్‌ చక్రధర్‌ ఎత్తిచూపారు. సహజ వ్యవసాయం ప్రకారం పేడపానకం వగైరా తయారుచేయటం గిరిజనులు నేర్చు కుంటుంటే , ఇదే సమయంలో కంపనీలు తయారు చేసిన ఈ పోషకాలనుకూడా అధి కారులు పంచుతున్నారు.సహజ వ్యవసాయం వల్ల పెట్టుబడులు తగ్గాయి కాబట్టి దిగుబడి తక్కువైనా పరవాలేదు అని గిరిజనులు అనుకుంటున్నారు.. గిరిజన సంక్షేమశాఖలో పనిచేసిన అధికారులు ప్రభుత్వకార్యక్రమాలలో తమ అనుభవాలతో అనేక రచనలు చేసారు. కాని వారి రచనలలో గిరిజన సంస్కృతిగూర్చి పొడి మాటలు మించి ఏమీ ఉండదు. అటు వంటి అధికారుల అధ్వర్యంలో నడిచే IుణA పాఠశాలలో చదివి ఉపాధ్యాయుడైన, సవర రచయిత మల్లిపురం జగదీశ్‌ ‘స్వతంత్రం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాలలో,నాలుగు దశాబ్దాల గిరిజనాభివృద్ధి సంస్థల పాలనలో గిరిజనుడి పరాయీకరణ ముమ్మరమైంది. చట్టాల అమలు ప్రశ్నార్ధకమైంది.అతడు లబ్దిదారుగా మారి, దరఖాస్తు దారుగా క్యూలో నుంచున్నాడు. గిరిజనసాహిత్యం అంటే ఉద్యమసాహిత్యం అనే పేరు పడిపోయింది. గిరిజన విద్యాలయాలనుండి, తన సంస్కృతి గురించి చెప్పుకోగల గిరిజన రచయిత ఎందుకు రాలేదు? (‘బహుళ’.పెర్స్పెక్టివ్స్‌ ప్రచు రణ 2019) అని నిలదీస్తున్నాడు.ఇలా.. ప్రజల జ్ఞానాన్ని, సంస్కృతిని పట్టించుకోకుండా, శాస్త్ర వేత్తలు,అధికారులు,సంస్థలు, ఎవరిదారిది వారుగా‘అభివృద్ధి’చేస్తూ జనాన్ని ముష్టివాళ్ళుగా మార్చారు. వీరంతా, ఇటువంటి ప్రశ్నలే వేసుకుని, ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సహజవ్యవసాయం ప్రచారం చేసే ప్రవక్తలు, సంస్కృతి అధ్యాత్మికతలంటూ పెద్ద పెద్ద ఉపదేశాలిస్తారు. వారిలో ఒకరు, వికారా బాదులో ఈ వ్యవసాయంచేసే విజయ రాంగారు, గత సంచికలో తెలియచేసినట్లు, అక్కడ చిరకాలంగా పనిచేసేణణూవలెనే,అక్కడి ప్రజలు పాడుకునే పాటలు,పండుగలు తెలుసు కునే ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రసంగా లలో అక్కడి గ్రామీణులు తలుచుకునే పాండ వులు,పర్వతాల,అనుముల బ్రహ్మారెడ్డివంటి కధలు,కార్తెలు,దుక్కులు,సామెతలేవీ నిపించవు. కొత్త పరిభాషను,పదజాలాన్ని,పండుగలు, యాత్రలను అలవాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నతాధికారి వీరభద్రుడు తన ‘నేను నడిచిన దారులు’లో, అరకులో అభివృద్ధిని అధ్యయనం చేయటానికి వచ్చిన విద్యార్ధి బృందానికి,పైన చెప్పినట్లు, చుట్టూ కనిపించే విషయాలు వివరిస్తారు. గుస్తాఫ్‌ చేసే అభివృద్ధిని స్కేల్‌ అప్‌ చేయాల్సిన అవసరం బోధిస్తారు. కాని గుస్తాఫ్‌ గ్రంధస్తం చేసిన సంస్కృతి ప్రసక్తి తేలేదు..దేవుళ్ళు క్లాస్‌ మేట్‌,నేడు కాకినాడలో పశుసంవర్ధక శాఖ అధికారి సత్యనారాయణగారు,తన కుమార్తె అభివృద్ధి (ణవఙశీశ్రీశీజూఎవఅ్‌ ూ్‌బసఱవం) విద్యార్ధి వైష్ణవితో, అరకులోయలోని సొవ్వలో, అనకాపల్లి వ్యవసాయశాఖవారు,పోషక సామగ్రి,పనిముట్ల పంపిణికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు వారిద్దరితో సంస్కృతిలో ఈ కనిపించని విషయాలు,చరిత్ర గుర్తు చేసే వీలు దొరికింది.విశాఖలో డుంబ్రి గూడ మండలం సర్పంచ్‌లతో వాసన్‌ నిర్వ హించిన సమావేశాలు,చొరవ తీసుకుని అరకు లోయలో చేసిన పర్యటనలో చూసిన పరిశీల నలు,60ఏళ్ల అభివృద్ధి చరిత్ర నేప ధ్యాన్ని కాగి తం మీద పెట్టటానికి తొందర పెట్టాయి.- (రచయిత : శక్తి స్వచ్ఛంద సంస్థ
వ్యవస్థాపకులు,శివ రామకృష్ణ

కొత్త జిల్లాల ఏర్పాటు సుపరిపాలనకు దారితీస్తుందా?

రాజ్యాంగంలో పొందుపరిచిన వారిహక్కులను ప్రభుత్వాలే కాలరాస్తున్నాయి. అన్నిరంగాల్లో అన్ని రకాలుగా ఆదివాసీలు ఏడుశతాబ్దాలుగా అస్తిత్వం,ఆత్మగౌరవం,స్వయంప్రతిపత్తి కోసం మనుగడ కోసం నిరంతరంవారుపోరాటంచేస్తున్నారు. ఈనాటికి వారికి న్యాయం దొరకడం లేదు. ప్రజలముంగిటికిపాలన అనేమాట1984లో మొదట వినిపించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సరిగ్గా ఈనినాదంతోనే ఒక శతాబ్దానికిపైగా చరిత్రఉన్న విశాల తాలూకాలను విడదీసి మండళ్లను ఏర్పాటు చేశారు. తాలూకాల నుంచి మండలాలు విభజనలో నేపథ్యంలో ఉమ్మిడి ఏపీలో సుమారు 800 గిరిజన గ్రామాలకు చాలా అన్యా యానికి గురయ్యఆరు. దాంట్లో తూర్పుగోదావరి జిల్లా సబ్‌ప్లాన్‌ ఏరియా పెదమల్లాపురానికి ఆనుకొని ఉన్న 56 గిరిజన గ్రామాల గిరిజనులు రాజ్యాంగం కల్పించిన హక్కులకు దూరమయ్యారు. అలాగే విశాఖజిల్లా కొయ్యూరు తాలూక పరిదిలో ఉండే సరుగుడు, కేవీశరభవరం,చమ్మచింత తదితర నాలుగు పంచాయితీలను మైదానప్రాంతమైన నాతవరం మండలంలో విలీనం చేయడంవల్ల ఆప్రాంతగిరిజనులంతా అభివృద్ధికి నోచుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,1984లో షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న 800కుపైగా గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో కలపాలనే ప్రతిపాదన చేసినా దాన్ని రాష్ట్రప్రభుత్వం సక్రమంగా అమలు పర్చలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నియోజవర్గ పునర్విభజనలో భాగంగా అరకు లోక్‌సభనియోజకవర్గం అన్యాయానికి గురైంది. 25లోక్‌సభ నియోజక వర్గంలో 7అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దానిస్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్‌ చేయబడిరది. ఈనియోజకవర్గం 4జిల్లాలలో విస్తరించి ఉంది.విశాఖపట్నం,విజయనగరం,శ్రీకాకుళంజిల్లాలలోని భాగాలతోపాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈలోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇదిచాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది. పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్త రించి ఉన్న ఈనియోజకవర్గం ఆచివరి నుండి ఈచివరికి 250కిలోమీటర్ల పైగానే దూరం ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకుగాను 6 సెగ్మెంట్లు ఎస్టీలకీ ఇంకా 1సెగ్మెంట్‌ ఎస్సీలకీ రిజర్వ్‌ చేయబడ్డాయి.
2014`2015మధ్య రాష్ట్ర విభజనలో రాష్ట్ర విభజన జరిగింది. ఈసమయంలో కూడా ఆదివాసీలు సామాజిక, ఆర్ధిక, రాజకీయ,సాంస్కృతి,సాంప్రదాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మరోకసారి ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్రపటం మారిపోతోంది. అంతే కాకుండా ఇటీవల నగరీకరణలో భాగంగా విశాఖపట్నం మెట్రోపాలిటిన్‌ రీజయన్‌ డవలప్‌మెంట్‌ అధార్టీ(వీఎంఆర్‌డీఏ) సరుగుడు ఏరియా గిరిజన పంచాయితీలను విలీనం చేసి ఆ ప్రాంత గిరిజనులకు చారిత్రీక అన్యాయానికి గురిచేశారు.అదే విధంగా విజయనగరం జిల్లా గిరిజనాభివృద్ధికి చేరువలో ఉన్న పార్వతీపురం ఐటిడీఏను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇది కూడా తీరని అన్యాయమే అవుతుంది. ప్రభుత్వ అనాలోచిత విధానాలు కారణంగా గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, సంస్కృతి సంప్రాదాయలు కనుమరుగయ్యే అవకాశం అధికంగా కన్పిస్తోంది. షెడ్యూల్‌ ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతం మధ్యలో నుంచి రాజమండ్రి నుంచి విజయనగరం వరకు 516వ జాతీయ రహదారిని406కిలోమీటర్ల పొడవునా నిర్మాణపనులు వేగంగా జరుగు తున్నాయి. దీనివల్ల గిరిజనుల భూములు,వారి జీవన విధానం దెబ్బతింటోంది. ఆదివాసుల కల్చరల్‌ దెబ్బతింటోంది.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాబినెట్‌ ఆమోదించిన అనంతరం దీని పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత, ఎప్పుడో బ్రిటిష్‌ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లాల సరిహద్దులను చెరిపేసి చిన్నజిల్లాలను సృష్టిస్తున్నారు. ఇది సుపరిపాలనకు దారితీ స్తుందా? లేక పాలనా వ్యవస్థని ఇంకా బలహీనంచేసి పాలనా యంత్రాంగాన్ని ఇంకా శక్తివంతులను చేస్తుందా అనేది ప్రశ్న. పాలన వికేంద్రీకరణ నిజం కావాలంటే అధికారాల వికేంద్రీకరణ జరిగితీరాలి. స్థానిక గిరిసజనుల మనోభవాలు పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగావారి సాంస్కృతి,సాంప్రదాయాలు,కట్టుబాట్లు దెబ్బతినకుండా గిరిజనులకు ప్రయోజకరకంగా ఉండేలా విభజన వ్యవహారాన్ని కొనసాగించాల్సిన అవశ్యకత ఉంది.!– రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్‌

1 2