విజయం కోసం ప్రణాళిక అవసరం

జీవితంలో విజయం కోసం దైర్యం కోల్పోకుండా పోరాడాల్సిందే..జీవితంలో భారీ విజయం సాధించడానికి ఈఒక్క చిన్న మాట కూడా పెద్ద సాయం అవుతుంది. ధైర్యం ఉంటే ప్రతి కష్టమూ తేలిక వుతుంది. జీవితంలో గొప్ప విజయాల చరిత్రను లిఖించి న వారందరిలో ధైర్యం పెద్ద పాత్ర పోషించింది. జీవితం అనేది ఒక పోరాటం.. జీవిం చడం కోసం.. విజయం సాధించడం కోసం ప్రతి క్షణం పోరాడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడు వేయకుండా పోరాడాలి.. జీవించడా నికి ప్రతి క్షణం ధైర్యంగా ముందడుగు వేయాలి. కర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు..కొన్నిసార్లు ప్రయాణం తేలికగా సాగుతుంది. కొన్నిసార్లు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచి సమయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కోలుకోవడానికి,మీ ధైర్యం లేదా సాహసం ఉపయోగ పడుతుంది.ధైర్యం అనేది ఒక పదం, అది విన్నప్పుడు, వ్యక్తిలో ఉత్సాహం మొదలవు తుంది.ఒక వ్యక్తి జీవితంలో భారీ విజయం సాధించడానికి ఈ ఒక్క చిన్న మాట కూడా పెద్ద సాయం అవుతుంది. ధైర్యం ఉంటే ప్రతి కష్ట మూ తేలికవు తుంది. జీవితంలో గొప్ప విజయాల చరిత్రను లిఖించిన వారందరిలో ధైర్యం పెద్ద పాత్ర పోషించింది. ఒక వ్యక్తి ఎప్పుడూ యుద్ధంలో ఓడిపోని ధైర్యానికి సంబంధించిన 5 అమూల్యమైన పాఠాల గురించి తెలుసుకుందాం..!(డాక్టర్‌.దేవులపల్లి పద్మజ)
జీవితంలో ఏవ్యక్తికైనా ధైర్యం అంటే ముందుకు వెళ్లడానికి ఒక శక్తి..ఎవరైనా సరే శక్తి లేకపోయినా పరిస్థితులను చక్క బెట్టుకుంటూ ముందుకు సాగడాన్నే ధైర్యం అంటారు. జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి పరిస్థి తుల్లో నైనా ఎవరు చెప్పిన మాటలను వినడానికి ఎంత ధైర్యం అవసరమో..వాటిని అంగీకరించ డానికి అంతే ధైర్యంకావాలి.జీవితంలో అన్నీ కోల్పో యిన తర్వాత కూడా..మీరు ఇంకా ఏదైనా చేయ గల శక్తినిచ్చేది దైర్యంకలిగి ఉన్నవారికి మాత్రమే.. ధైర్యం కలిగి ఉన్నవారు..తాము జీవితం లో కోల్పో యింది ఏమీ లేదని..ముందు తాము తప్పని సరిగా ఏదోసాధిస్తామని ఖచ్చితంగా ఊహించుకుంటూ ముందుకు సాగుతారు. సగానికి పైగా ప్రజలు జీవితంలో ఏదొక సందర్భంలో విఫలమవు తారు. ఎందుకంటే సరైన సమయంలో ధైర్యాన్ని కోల్పో తారు. భయంతో వెనక్కి అడుగు వేస్తారు.మీరు ఏదైనా చేయగలరని మీకు నమ్మకంకలిగి ఉంటే.. ఆక్షణంలో మీరు సగం విజయాన్ని సొంతం చేసు కున్నట్లే..
లక్ష్యసాధన కోసం సరైన ప్రణాళిక అవసరం
ఇంతకు ముందు మనము చాలా సార్లు చెప్పుకున్న విషయమే అయినా సందర్భం మరియు ప్రస్తుతం ట్రెండ్‌ ని బట్టి చెప్పాల్సి వస్తోంది. మనిషి అన్నాక అదో ఒక లక్ష్యం తోనే బ్రతుకు సాగిస్తాడు. మన ఆకాంక్ష లేదా ద్యేయమే లక్ష్యం అని అనవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. మరి కొందరు బహుళ లక్ష్యాలను కలిగి ఉంటారు. కోరుకున్న లేదా ఎంచుకున్న ఫలితాన్ని చేరుకోవడానికి, సొం తం చేసుకోవడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ఒక క్రమ పద్ధతి ప్రకారం అభివృద్ధిని సాధిస్తూ లక్ష్యం లోని చివరి స్థానానికి చేరుకోవ డానికి విజయం పొందటానికి ప్రతి ఒక్కరు ప్రయ త్నిస్తారు. అయితే అందరూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. వ్యక్తి నిర్ణీత సమయానికి తమ లక్ష్యాన్ని చేదించనంత మాత్రాన వారికి దృఢ నిశ్చ యం లేదని వారిలో పట్టుదల తక్కువ అంచనా వేయకూడదు. అలాగే ఆ వ్యక్తి కూడా తన సామర్ధ్యం గురించి తక్కువగా ఆలోచించకూడదు.. ఈ సారి అందలేదు అంటే అందుకు గల కారణాలను అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలాంటి విష యంలో చరిత్రలో జరిగిన ఒక సంఘటన గుర్తించు కోవాలి. గజనీ మహమ్మద్‌ 18సార్లు దండెత్తి చివరికి విజయాన్ని సాధించాడు. ఇక్కడ ఆ 17 సార్లలో ఒకసారైనా తనవల్ల ఇకకాదు అని విసుగు చెంది నిరాశ పడిఉంటే విజయం దక్కేదా…ఎన్ని సార్లు ఓడిపోయినా చివరికి దక్కే విజయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది..నలుగురిలో మిమ్మల్ని గొప్పగా నిలబడుతుంది. అందుకే ధ్యేయం యొక్క ఉద్దేశం ఎపుడు స్థిరంగా ఉండాలి చివరి వరకు ప్రయత్నించాలి. ప్రయాణించే మార్గంలో అనుకూల తలతో పాటుగా ప్రతి చర్యలు కూడా ఎదురవు తాయి. కానీ అన్నిటినీ అధిగమించాలి. నిబద్దతతో ముందుకు సాగితే విజయం మిమ్మల్ని వరిస్తుంది. అంతే కానీ ఏ ప్రణాళిక అందుకు తగిన ప్రయత్నం లేకపోతే ఎందులోనూ విజయాన్ని సాధించలేరు ప్రతి వ్యక్తి తాను తలపెట్టే పని విజయ వంతం కావాలనే సంకల్పం చేసుకుని మొదలు పెడతాడు. కానీ విజయం అనేది అంగట్లో లభించే వస్తువు కాదు.విజయం వెనుక,శ్రమ,కృషి, పట్టు దల,ఓర్పు అంతిమంగా అదృష్టం కలిస్తే..విజయం సాధించగలం.ఎంతో శ్రమకోర్చి మానసిక దృఢ త్వంతో ప్రతీ అడుగు పధ్ధతి ప్రకారం వేస్తే విజయం తనంతట తానుగా వర్తిస్తుంది. అపజయాలకి భయ పడకుండా,కృంగిపోకుండా విజయసాధన మార్గా లు అన్వేషించాలి.ఈ గమనంలో అపజయాలు కలిగిన నిరుత్సాహపడకుండా మరల మరల ప్రయ త్నించాలి…ముందు మనం చేసే పనిపై అవ గాహనఉండాలి.లక్ష్యం సరైనదై ఉండాలి. ప్రణాళిక ప్రకారం సాగుతూ ఎదురయ్యే సవాళ్ళను కూడా అంచనా వేసుకోవాలి.సంకల్పబలం పెంచు కోవాలి.విజయం ఎపుడూ ఎవరికీ శాశ్వతం కాదు, తమవద్దే నిక్షిప్తమైపోవడానికి స్థిరమైనదీ కాదు.. మహాభారత యుద్ధంలో అర్జునుడు ధనుర్భాలను జారవిడచి వెనుకంజ వేసినపుడు శ్రీ కృష్ణుడు గీతా బోధన చేసి ధైర్యం కలిగించి యుధ్ధంలో విజయం సంప్రాప్తించేలా చేసిన విషయం మనం తెలుసు కున్నాం. ఆ సమయంలో మార్గనిర్దేశం చేసి అర్జును నకు విజయమార్గం చూపాడు.భర్తృహరి సుభాషితం ఈ విషయంలో మనకి మస్తిష్కంలో మెదలాలి.
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్న విహితా విరమన్తి మధ్యాః
విఘ్నైర్ముహుర్ముహు రపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధ ముత్తమగుణా న పరిత్యజన్తి.
అనుమతులు విఘ్నములు సంభవించిన కార్యము నారంభింపరు.మధ్యములు ఆరంభించి విఘ్నములు వచ్చినపుడు విడిచివేయుదురు.ధీరులెన్ని విఘ్న ములు ఎదురైనప్పటికి విజయము చేపట్టు వరకూ కార్యమును విడువదు. మనము కూడా ఇదే విధ ముగా ఉత్తమ గుణసంపన్నులను అనుసరిం చవ లెను.ఇదే విధంగా అమృతభాండమునకు క్షీరసాగర మధనము జరుగు సందర్భంలో దేవతలు ముం దుగా వచ్చిన అశ్వము,గజము వంటి వాటికి విసుగు చెందలేదు. తరువాత వచ్చిన రత్న లాభము లకు తృప్తి చెంది విరమించలేదు.తుదకు అమృత భాండము లభించువరకూ వస్తున్న చంద్రుడు, రంభ,ఊర్వశి,మేనక,కామధేనువు,కల్పవృక్షం, పారిజాత వృక్షం,కౌస్తుభమణి, శంఖుచక్రాలు, మొద లైన అపురూపమైన వాటితో సంతృప్తి పడి లక్ష్యం మార్చుకోలేదు.. అమృతం లభించువరకూ కృషిచేసి విజయం చేపట్టారు. న్యాయమార్గం వీడక, సత్బుధ్ధితో ఎవరైతే గమనం సాగిస్తారో వారికి విజయము తద్యము.
ఇదేవిధంగా మరొక ఉదాహరణగా శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని తిరిగి పొంద టానికి పడిన కష్టాలు, హనుమంతుడు సీతమ్మ ఆచూకీ కనుగొనుటకు చేసిన కృషి, శ్రమ, వానరులు వారధి బంధన చేయుటలో పడిన భక్తి పూర్వక సేవ,వారి పరిశ్రమ అంతిమంగా విజయానికి దగ్గర చేసింది.ధర్మమార్గమును వీడక పాండవులు వన వాస కాలములోనూ, అ్ఞతవాస కాలంలోను పడిన కష్టం వెనుక వారికి విజయలక్ష్మి ధరించిన విషయం మనం గమనించవచ్చు. ధర్మ పోరాటానికి జయభేరి మ్రోగుతుంది.విద్యార్థులు చదువు విషయంలో వారు నిర్దేశించుకున్న లక్ష్యంకొరకు నిరంతరం ప్రయత్నం చేస్తూ గమ్యం చేరుకోవాలి. ఫలితాలపై ఆకస్మిక నిర్ణయాలు జీవితానికి భంగం కాకూడదు.. సహనముతో సమన్వయం తో జీవితాన్ని చక్కదిద్దు కోవాలి. మనకు స్వాతంత్య్రం అందించిన మహాత్ము డు పడిన,శ్రమ,ఉద్యమస్ఫూర్తి,మరువరానిది. క్రియాశీల కార్యక్రమాలతో,భారతీయులందరినీ ఐక్య మత్యంతో కలిపి ఒక త్రాటిపైకి తెచ్చి,కర్మ సిద్ధాం తాన్ని,ఆచరించడం వలన విజయం సాధించింది. నీతి నియమాలు ఆచరిస్తున్నంత కాలము, ధర్మ మార్గమును,వీడనంతవరకూ అపజయాలకు వెరపు చెందవలసిన పనిలేదు.నీతిపై ఆధారపడినపుడే జీవితంలో అభివృద్ధి గోచరిస్తుంది.నరికివేసిన వృక్షం మరల చిగురిస్తుంది. క్షీణతనొందిన చంద్రు డు తిరిగి ఎదిగి ఎదిగి సంపూర్ణ వెన్నెలను మనకు వెదజల్లుతున్నాడు. ధృడత కలిగిన వ్యక్తికి మేరు పర్వతం చిన్న రాతివలె,సింహము జింకవలె, అగ్ని జలమువలె, విషము అమృతం వలె గోచరి స్తుంది. గురితప్పని ఏకాగ్రత లక్ష్యాన్ని చేధిస్తుంది. కష్టమైన పనికూడా ఇష్టంతో చేస్తే నమ్మకం పెరుగుతుంది. అపనమ్మకం,అయిష్టతతో పనులు ప్రారంభించే కంటే చేయకపోవడం ఉత్తమం. విజ్ఞానం, వివేకం తో ధర్మ వృక్షాన్ని రెండు చేతులారా కాపాడినట్లైతే విజయం వరిస్తుంది అని అంటాడు శ్రీకృష్ణుడు అర్జనునితో.అది మనకు,మన భావితరాలకు ఆచరించమనే హెచ్చరిక.మనం ధైర్యంతో,విశ్వా సంతో,నియమ,నిబద్ధతతో ధర్మసమ్మతంగా,జీవనం సాగించి,చైతన్య వంతమైన విజయాలు చేసుకుం దాం.‘సాధనమున పనులు సమకూరు ధరలోన’అను వేమన పలుకులు స్మరిద్దాం.ప్రపంచవ్యాప్తంగా స్వాస్థ్యసంక్షోభం నుంచి త్వరలో..కోరుకుని సుసం పన్నమైన విశ్వశాంతిని పొందగలము. నిరంతర పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు విజయం లభించి, త్వరలో నేటి సమాజానికి అవసరమైన ఔషధం ఆవిష్కరింపబడాలని కోరుకుందాము. అదే నిస్వార్థమైన సేవ. జయిభవ..విజయీభవ.- , వ్యాసకర్త : ప్రముఖ రచయిత్రి,విశ్వశ్రీ, సాహిత్యశ్రీ విశాఖపట్టణం
ఫోను. 9849692414