లాక్‌డౌన్‌ వేల శ్రామిక జీవులపై కరోనా పంజా

లాక్‌డౌన్‌ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో కన్నా పట్టణ ప్రాంతాలలోనే అర్ధాకలి పస్తులు పెరిగాయన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ కార్డులు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉండడం మొదటి కారణం. అందువలన వారికి ప్రజా పంపిణీ ద్వారా ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని కొంతవరకూ ఆదుకుంది. అటువంటి పథకం ఏదీ పట్టణ ప్రాంతా లకు లేదు. పట్టణ పేదలను ఈ కష్టకాలంలో ఆదుకునే ప్రత్యామ్నాయం ఏదీ లేకుండా పోయింది. ఇది రెండవ కారణం.

దేశంలో వేలాది మంది ప్రాణాలు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన కరోనావైరస్‌ మహమ్మారి ఇంకా తన విజృంభణ ఆపలేదు. భారత్‌ కరోనావైరస్‌తో జీవనం కొనసాగిస్తుంది. ఇప్పుడు దాని తో పాటు ఆకలి ఒకపెద్ద సమస్యగా మిగిలిపోయింది. కరోనావ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌ డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆకలితో ఉన్నారు. రోజువారి అవస రాలను తీర్చడానికి కష్టపడుతున్నారు.అంగన్‌వాడీ కేంద్రాలు,పాఠశాలలు మూసివేయడం వల్ల హైద రాబాద్‌లో వేలాదిమంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.మార్చిలో లాక్‌ డౌన్‌ విధించినప్పటి నుంచి తెలంగాణలో అన్నిప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. దీనివల్ల నిరుపేద పిల్లలకు మధ్యాహ్నం భోజనం లేకపోవడం. మధ్యాహ్నం భోజనం లేకపోవడంతో,పిల్లలు పోషకాహార లోపానికి గురయ్యారు. ఈ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి లాక్‌ డౌన్‌ను అస్త్రంగా వాడితే ఆకలి అనేమరో పెద్ద విపత్తు ప్రజల నడ్డి విరిచింది. కరోనాచావులుతోపాటు ఆకలి మరణాలు కూడా సంభవిస్తాయని ప్రభుత్వాలు మారాయి.
2020 మార్చి 24న మరో నాలుగు గంటల్లో దేశంమంతటా లాక్‌డౌన్‌ అమలు జరగనున్నట్టు నరేంద్రమోడీ ప్రకటించారు. ఆలాక్‌డౌన్‌ మే నెలాఖరు వరకూ కొనసాగింది. ఆతర్వాత కూడా స్థానికంగా అక్కడక్కడా లాక్‌డౌన్‌లు కొనసాగినా, దేశం మొత్తంమీద లాక్‌డౌన్‌ మళ్ళీ విధించలేదు. ఆలాక్‌డౌన్‌ పేద శ్రామికులకు ఎక్కడా లేని కష్టాలను తెచ్చిపెట్టింది. వారిలో ముఖ్యంగా వలస కార్మికులు పడిన పాట్లు మొత్తం ప్రపంచం దృష్టిలో సైతం పడ్డాయి. తక్కిన దేశాలలో లాక్‌డౌన్‌కి, మన భారతదేశంలో లాక్‌డౌన్‌కి ఒకతేడా ఉంది. ట్రంప్‌ హయాంలోని అమెరికాతో సహా తక్కిన దేశాల్లో లాక్‌డౌన్‌ కార ణంగా ఆదాయాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చారు. మనదేశంలో మాత్రం అటువంటిదేమీ లేదు (ఎక్కడో కొద్ది మంది ఎంపిక చేసుకున్నవారికి చాలా స్వల్ప మొత్తాలు ఇచ్చారు. అంతే). లాక్‌డౌన్‌ కారణంగా ఏంతోమంది పేద శ్రామికులు ఆదాయాలు కోల్పోయి నిరాధారంగా,ఆకలి బాధతో బతకవలసిన స్థితికి నెట్టబడ్డారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసి కొన్ని నెలలు గడిచినా, వారాస్థితి నుండి ఇంకా కోలుకోనేలేదు. కొన్ని పౌరసంస్థలుకలిసి ‘హంగర్‌వాచ్‌’ అనేపేర ఒకసర్వే నిర్వహించారు. గత అక్టోబర్‌ నెలలో ఈ సర్వే జరిగింది. ఈసర్వేలో కలిసిన వారినుండి ఆదాయాల,వ్యయాల లెక్కలు,గణాంకాలు సేకరించడం కాకుండా వారికి కలిగిన అభిప్రాయాలను యథాతథంగా సేకరించారు. సర్వేలో వెల్లడైన విషయాలు చేదు వాస్తవాలను బైటపెట్టాయి. సర్వే చేసినవారు దాదాపు 4000మందిని కలిశారు. వారిలో 53.5 శాతం-అంటే సగం కన్నా ఎక్కువమంది-కుటుం బాలు మార్చి 2020లో వాడిన గోధుమ లేదా బియ్యం కన్నా అక్టోబర్‌లో వాడినది తగ్గింది. ఇక పప్పుధాన్యాలు,ఆకుకూరలు,గుడ్లు,మాంసం వంటి దినుసుల వినియోగం తగ్గిపోయిన కుటుంబాల శాతం అంతకన్నా ఎక్కువగానే ఉంది. 62శాతం కుటుంబాల ఆదాయం లాక్‌డౌన్‌ కన్నా ముందు ఉన్నస్థాయితో పోల్చితే అక్టోబర్‌ నాటికి తగ్గి పోయింది. లాక్‌డౌన్‌కు పూర్వం పనులకు పోయిన వారికన్నా ఆ తర్వాత కాలంలో పనులకు పోతున్న వారి సంఖ్య పెరిగింది. కుటుంబ ఆదాయాలు తగ్గిపోతున్నందున,ఎక్కువమంది పనులకు పోవ లసిన అగత్యం ఏర్పడిరది.సర్వే పరిమితంగానే జరిగి వుండొచ్చు. కాని జరిగిన మేరకైనా చూసి నప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా కొంతమందికైనా కడుపులు నిండనిస్థితి ఏర్పడిరదని స్పష్టం అవు తోంది. హంగర్‌ వాచ్‌ సర్వే ప్రత్యేకించి బలహీన వర్గాలపైన,తరగతుల పైన కేంద్రీకరించిందిన్నది ఇక్కడ గమనంలో ఉండాలి.
గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాం తాలలో ఆహార దినుసుల వినియోగం తగ్గిపోయిన కుటుంబాలు (కరోనా పూర్వపు కాలంతో పోల్చి నప్పుడు) ఎక్కువశాతం ఉన్నాయని హంగర్‌ వాచ్‌ అధ్యయనంలో తేలిన అంశం మరింత ఆశ్చర్యాన్ని గొలుపుతోంది. ఇది ముందు ఊహించినదానికి భిన్నంగా ఉంది. సాధారణంగా అర్ధాకలి పస్తులు, పోషకాహారలేమి వంటివి పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణప్రాంతాల్లోనే ఎక్కువ.పోషకాహారం పొంద గలుగుతున్న వారెందరన్న కొలబద్దతో పేదరి కాన్ని అంచనా వేసినప్పుడు గ్రామీణ ప్రాంతాలలోనే పేద రికం ఎక్కువగా ఉందని ప్రతిసారీ మన అధ్య యనాలు వెల్లడి చేస్తున్నాయి. అందుచేత లాక్‌డౌన్‌ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో కన్నా పట్టణ ప్రాంతాలలోనే అర్ధాకలి పస్తులు పెరిగాయన్న సంగతి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇలా పెరగడానికి రెండు కారణాలు ఉన్నా యని చెప్పవచ్చు. పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ కార్డులు లేనివారి సంఖ్య ఎక్కువగా ఉండడం మొదటి కారణం. అందువలన వారికిప్రజా పంపిణీ ద్వారా ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ కరోనా కష్టకాలంలో ఉపాధిహామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని కొంత వరకూ ఆదుకుంది. అటువంటి పథకం ఏదీ పట్టణ ప్రాంతాలకు లేదు. పట్టణ పేదలను ఈ కష్టకాలంలో ఆదుకునే ప్రత్యామ్నాయం ఏదీ లేకుం డా పోయింది. ఇది రెండవ కారణం. హంగర్‌ వాచ్‌ నివేదిక నుండి కొన్ని ముఖ్యమైన నిర్ధారణలకు రావచ్చు. లాక్‌డౌన్‌ కాలంలో ఎటువంటి తోడ్పా టూ అందకపోవడం కారణంగా పేదరికం, అర్ధాకలి పెరగడం, నిరాధారంగా మిగిలిపోయిన వారు పెరగడం సంభవించింది. ఇది అనివార్యం. ఐతే,ఈ పరిస్థితి అంతే తీవ్రంగా లాక్‌డౌన్‌ అనం తర కాలంలో కూడా కొనసాగడం కొట్టవచ్చినట్టు కనపడే విషయం. సాధారణంగా లాక్‌డౌన్‌ కాలం లో ఉత్పత్తి నిలిచిపోతుందని, ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఉత్పత్తి యథాతథంగా తిరిగి ప్రారంభ మౌతుందని అందరమూ భావిస్తాం. కాని లాక్‌డౌన్‌ కాలంలో శ్రామిక ప్రజలకు ఇతరత్రా ఆర్థిక తోడ్పా టు అందినట్టైతే ఈ విధంగా జరిగే వీలుంటుంది. అదే, మన దేశంలో మాదిరిగా ఎటువంటి ఆర్థిక తోడ్పాటూ అందకుండా ఉన్నట్టైతే యథాతథ స్థితి మొదలుకాదు.
లాక్‌డౌన్‌ కాలంలో శ్రామిక ప్రజల ఆదా యాలు పడిపోకుండా నిలబెట్టగలిగితే ఆహార దినుసులను, ఇతర వినిమయ వస్తువులను వారు అదే స్థాయిలో కొనుగోలు చేయగలుగుతారు. అదే విధంగావారి ఋణభారం అదనంగా పెరిగి పోదు. ఉత్పత్తి లాక్‌డౌన్‌ కాలంలో నిలిచిపోతుంది గనుక, శ్రామిక ప్రజల అవసరాలను తీర్చడానికి వ్యాపా రులు వారివద్దనుండే సరుకుల నిలవలను కరిగి స్తారు. ఒకసారి లాక్‌డౌన్‌ ఎత్తివేశాక ఉత్పత్తి తిరిగి ప్రారంభం అవుతుంది. కార్మికులకు ఆదాయాలు రావడం తిరిగి మొదలౌతుంది. వారి వినిమయం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. వ్యాపా రులు తమ వద్ద నిల్వలను తిరిగి పెంచుకోవలసి వుంది గనుక మామూలు స్థాయికన్నా ఎక్కువగా ఉత్పత్తి ని చేయవలసిన స్థితి వస్తుంది.
అదే లాక్‌డౌన్‌ కాలంలో శ్రామికులకు ఎటు వంటి ఆర్థిక తోడ్పాటూ అందకపోతే వారి ఆదా యం ఏమీ ఉండదు గనుక వారి వినిమయం బాగా తగ్గుతుంది. అలా తగ్గించుకున్నా, అందు కోసం వారు అప్పులు చేయవలసి వస్తుంది. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఉత్పత్తి యథాతథంగా పూర్వపు స్థాయిని చేరుకుందనుకున్నా శ్రామిక ప్రజల వినిమయం మాత్రం యథాతథ స్దితికి రాదు. ఎందుకంటే వారు లాక్‌డౌన్‌ కాలంలో చేసిన అప్పులు తీర్చడానికి తమకు వచ్చిన ఆదా యాల్లో నుండి కొంతభాగం కేటాయించవలసి వుంటుంది. ఆఅప్పులు పూర్తిగా తీరిపోయే వరకూ వారి వినిమయం పూర్వపు స్థాయికి చేరుకోదు. వినిమయం బట్టి ఉత్పత్తి ఉంటుంది. వినిమయం తగ్గింది గనుక ఉత్పత్తి కూడా పూర్వపు స్థాయికి చేరుకోదు. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, విని మయం-రెండూ కరోనా పూర్వపు స్థితికి చేరుకోవు. అందుచేత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కూడా అరకొరగానే జరుగుతుంది. అందుచేత ఆర్థిక వ్యవస్థ మామూలు స్థాయికి తిరిగి కోలుకోవాలన్నా, శ్రామిక ప్రజలు దుర్భర దారిద్య్ర పరిస్థితి నుండి బైట పడాలన్నా వారి ఆదాయాల స్థాయి లాక్‌డౌన్‌ కాలంలో పడిపోకుండా ఆర్థిక తోడ్పాటు అందిం చడం అవసరం. తెలివిమాలిన మోడీ ప్రభుత్వం ఈ పని చేయలేదు. శ్రామిక ప్రజలలో చాలా మంది ఆదాయాలను దాదాపు సున్నా కి తీసుకొ చ్చింది. దీని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో హంగర్‌ వాచ్‌ వెలుగులోకి తెచ్చింది.
మధ్యంతరంగా సగంలో నిలిచిపోయిన మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్రం ఖర్చు చేయనున్నదని, దానితో ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి కావలసిన ప్రేరణ లభిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అందు కోసం ఎంత మోతాదులో ఖర్చు చేయనున్నారన్నది అసలు ప్రశ్న. లాక్‌డౌన్‌ కు మునుపు ఏ స్థాయిలో ఖర్చు చేశారో,అదే స్థాయిలో ఇప్పుడూ చేస్తే, శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి ఏమీ అదనంగా పెరగదు. లాక్‌డౌన్‌ కాలంలో చేసిన అప్పులకు వాయిదాలు కట్టడానికి కొంత భాగం పోతే తక్కిన భాగంతోటే వారు ఏ కొనుగోలు అయినా చేయగలు గుతారు. అందువల్ల మొత్తం డిమాండ్‌ లాక్‌డౌన్‌ అనంతర కాలంలో కూడా పూర్వపు స్థాయికి తిరిగి చేరుకోదు. అంటే ఆర్థిక వ్యవస్థ మామూలు స్థాయికి తిరిగి కోలుకోవడం జరగదు. అలా కోలుకో వాలం టే మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెట్టే ఖర్చు లాక్‌డౌన్‌ పూర్వపు కాలంలో చేసిన ఖర్చు కన్నా చాలాఎక్కువ మోతాదులో పెంచాలి. పడిపోయిన శ్రామిక ప్రజల కొనుగోలు శక్తి వలన డిమాండ్‌లో ఏర్పడే తరుగుదలను అదిభర్తీ చేయ గలిగేంతగా ఉండాలి.
ఇలా పరోక్షంగా మౌలిక వసతుల కల్పనపై ఎక్కువ ఖర్చు చేయడం కన్నా నేరుగా ఆ శ్రామిక ప్రజలకు నగదు చెల్లించడం ద్వారా వారి కొను గోలు శక్తిని నిలబెట్టడమే మెరుగు. లాక్‌డౌన్‌ అనం తరం కూడా ఆవిధంగా నగదు చెల్లింపులను కొనసాగించవచ్చు. లాక్‌డౌన్‌ అనంతరం కొంత తగ్గిన ఉత్పత్తి స్థాయి,తగ్గిన ఆదాయాల వలన ఏర్పడిక కొరతను భర్తీచేయగలిగే మేరకు ఈ నగదు చెల్లింపులు జరగాలి. అప్పుడు మాత్రమే పూర్వపు స్థాయికి వినిమయం పెరుగుతుంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇటువంటి చెల్లింపులేవీ చేయనందున దాని ప్రభావం లాక్‌డౌన్‌ అనంతర కాలంలో కూడా పడుతోంది. దానివలన ఆర్థిక వ్యవస్థ కోలు కోవడం కూడా సాధ్యం కావడంలేదు.
నేరుగా శ్రామిక ప్రజలకు నగదు చెల్లింపులు చేస్తే వారి దారిద్య్రం ఉపశమించడమే గాక, వారు ఆసొమ్ముతో కొనుగోలుచేసే సరుకులన్నీ దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఎక్కువగా ఉంటాయి. దిగుమతి చేసుకోవలసినవి పెద్దగా ఉండవు. అందువలన ప్రభుత్వం చేసే ఖర్చు దేశీయ డిమాండ్‌ ఎక్కువగా పెరగడానికి తోడ్పడుతుంది. అందువలన దేశంలో ఉపాధి అవకాశాలు మరింత పెరగడానికి దోహ దం చేస్తుంది. శ్రామిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార ధాన్యాలను ఇక్కడ ప్రభుత్వం చేసే నగదు చెల్లింపులలో భాగంగా పరిగణించకూడదు. ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం మంచిది. అవసరం కూడా. కాని దానివలన ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఎటువంటి ప్రేరణా కలగదు. అది కేవలం భారతీయ ఆహారసంస్థ వద్ద పేరుకు పోయిన నిల్వలను కొంత తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దానితోబాటు నేరుగా నగదు చెల్లింపులు చేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి తగిన ఊపు లభిస్తుంది. ఇప్పుడు ఉపాధి లేని ప్రతీ కుటుంబానికీ నెలకు రు.6000 కనీసం చెల్లిం చాలని ప్రధానికి ప్రతిపక్ష నాయకులు లేఖ రాశారు. ఆవిధంగా ప్రతీఇంటికీ మూడు నెలల పాటు నగదు చెల్లించినా,అందుకయ్యే ఖర్చు మన జిడిపిలో కేవలం 2 శాతమే. ఆమాత్రం లోటును తేలికగా సర్దుకో వచ్చు.కాని మోడీ ప్రభుత్వానికి తెలివి తక్కువ తనంతోబాటు పిరికితనం కూడా ఉంది. అందుకే ప్రజలు ఇంత దుర్భర పేదరికంతో నలిగిపో తున్నా, ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నా ధైర్యం చేయలేకపోతోంది. అంత ర్జాతీయ ద్రవ్య పెట్టుబడి నిర్దేశించిన పరిమితులను దాటుకుని వ్యవహరించ లేకపోతోంది.