బి.ఆర్‌.అంబేద్కర్‌ మహోన్నత వ్యక్తి

దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీ య న్యాయాన్ని చేరువ చేసే సదాశయంతో లిఖించు కున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి నిన్నటికి డెబ్భై ఏళ్లు దాటాయి.! నిబంధనలు,విధినిషేధాలు, దిశా నిర్దేశాలు,ఆశయాలు,ఆదర్శాలు,హితోక్తుల సమా హారమైన రాజ్యాంగం చూపిన బాటలో ఏడు దశా బ్దాల భారతావని ప్రస్థానాన్ని సమీక్షించు కోవడం నేటి అవసరం. ఒక దేశంగా ఏడు పదుల భారతా వని ప్రస్థానంలో విజయాలను, వైఫల్యాలను,కీలక మైలురాళ్లను,పాఠాలను,గుణపాఠాలను తరచి చూసుకోవడం తప్పనిసరి.రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలు,ఆకాంక్షల నేపథ్యంలో రాజ్యాంగ పని తీరు మదింపు కీలకం. భారతరాజ్యాంగం ఎదు ర్కొన్న టువంటి సమస్యలు,సవాళ్లుబహుశా ప్రపం చంలో మరేదేశరాజ్యాంగానికీ ఎదురెఉండవు. అమల్లోకి వచ్చిన తొలిఏడాదే రాజ్యాం గానికి సవరణలు అవసరపడ్డాయి. ఆ తరవాత క్రమంగా వందకుపైగా సవరణలతో రాజ్యాంగాన్ని ఎప్పటి కప్పుడు మార్చుకుంటూ వచ్చారు. భూసంస్క రణలు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీక రణ ప్రాంతీయ అసమానతలను సరి దిద్దడంబీ ఆదేశిక సూత్రాల్లో ప్రవచించిన లక్ష్యాలను సాకారం చేసు కోవడం,కొన్నిరాష్ట్రాల్లో రాష్ట్రపతిపాలన విధిం చడం, ఎస్సీ,ఎస్టీ,బీసీ జాతీయ కమిషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడం, ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితానుంచి తొలగించి దానిని చట్టబద్ధ హక్కుగా గుర్తించడం, పౌరుల ప్రాథమిక విధులకు సంబం ధించి కొత్త అధ్యాయాన్ని జతపరచడం, ఫిరాయిం పుల నిరోధకచట్టం,జాతీయ జుడిషియల్‌ నియా మక కమిషన్‌ ఏర్పాటు, జీఎస్‌టీ అమలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వే షన్లు కల్పించడం వంటి అనేక కీలక సవరణలకు కాలానుగుణంగా రాజ్యాం గం వేదికగా మారింది.
అంబేడ్కర్‌ సూచనలు శిరోధార్యం
రాజకీయ ప్రజాస్వామ్య సాధనకోసం మాత్రమే కాకుండా సామాజిక ప్రజాస్వామిక సంస్కృతిని పాదుకొల్పడం కోసం కృషి చేయాలనిబీ వ్యక్తి పూజ కు తిలోదకాలు వదలాలని1949, నవంబరు 25న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పిలుపిచ్చారు. దేశ పురోగతి సాధనలో అసమాన త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం సహేతుకమే అయినప్పటికీ- ఆ ఆరాధన ఒక స్థాయిని దాటితే మూఢభక్తిగా పరిణమించే ప్రమాదం ఉంది. దాని వల్ల అంతిమంగా వ్యవస్థలు పతనమై నియం తృత్వం కోరసాచే ప్రమాదం కొట్టిపారేయలేనిది. సామాజిక ప్రజాస్వామ్యమే పునాదిగా రాజకీయ ప్రజాస్వామ్యం శాఖోపశాఖలుగా విచ్చుకోవాలని ఆయన అభిలషించారు. కులాలు అన్న భావనే జాతి వ్యతిరేకమని స్పష్టం చేసిన అంబేడ్కర్‌, అంత రాలను అధిగమిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ భారతావని ఒక పరిపూర్ణ దేశంగా రూపుదాల్చాల్సి ఉందని ఆకాంక్షించారు. ఆ మహనీయుడి పలుకులే శిరోధార్యంగా భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దు కోవాల్సి ఉంది. గడచిన ఏడు దశాబ్దాల రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజకీయనేతలు అప్పు డప్పుడూ కట్టుతప్పిన ఉదాహరణలు కనిపిస్తాయి. ఏడో దశాబ్దం తొలినాళ్లనుంచి దేశంలో రాజకీయ నాయకత్వం అడపాదడపా నియంతృత్వం బాట తొక్కిన ఆనవాళ్లు పొడగడతాయి. గోలక్‌నాథ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (1967) కేసులో పార్ల మెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్ల మెంటు సమున్నతాధికారాన్ని చాటిచెప్పేందుకు (1971లో తీసుకువచ్చిన 24వరాజ్యాంగ సవరణ) ప్రయత్నించింది. అయితే మెజారిటీ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ధర్మాసనం ఒకవైపు ఆరాజ్యాంగ సవరణకు మద్దతు పలుకుతూనే మరోవంక రాజ్యాం గ మౌలిక స్వరూపం, ప్రాథమిక హక్కులపై రాజ్యాంగ సవరణల ప్రభావం ఉండబోదని విస్ప ష్టంగా తేల్చిచెప్పింది. ఫలితంగా 1973నుంచీ తలపెట్టిన ఏరాజ్యాంగ సవరణకైనా ‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదు’ అన్న సూత్రమే ప్రాతిపదికగా నిలుస్తోంది. ప్రధానమంత్రితోపాటు రాజ్యాంగ బద్ధ పదవుల్లోని వ్యక్తుల ఎన్నికలను న్యాయ సమీక్షకు అతీతంగా తీర్మానిస్తూ 39వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. ఇందిరాగాంధీ వర్సెస్‌ రాజ్‌ నారాయణ్‌ (1975) కేసులో న్యాయ స్థానం ఆ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉందని, స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే వాతావరణాన్నిదెబ్బతీస్తోందని వ్యాఖ్యానించి దాన్ని కొట్టివేసింది. 42వ సవరణ ద్వారా కీలక మైన ప్రాథమిక విధులకు చేటు కల్పించడంతో పాటు, చట్టాల రూపకల్పనలో ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే అధికప్రాధాన్యం ఇవ్వ డం, సామ్యవాద, లౌకికవాద పదాలను చేరు స్తూ రాజ్యాంగ పీఠికను సవరించడం వంటి మార్పు లు తీసుకువచ్చారు.
జనతా ప్రభుత్వ జమానాలో 43,44 రాజ్యాంగ సవరణల రూపంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకువచ్చిన కొన్ని నిబంధనలు సవరించారు. మినర్వా మిల్స్‌ వర్సెస్‌ భారత ప్రభు త్వం(1980)కేసులో రాజ్యాంగాన్ని సవరించ డానికి పార్లమెంటుకు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయని తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు- ప్రాథమిక హక్కులు,ఆదేశిక సూత్రాల మధ్య సామ రస్యాన్ని రాజ్యాంగ మౌలిక స్వభావంగా వ్యాఖ్యా నించింది. మనేకా గాంధీ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో న్యాయస్థానం పౌర స్వేచ్ఛకు మరింత విశాలమైన పరిధులు గీస్తూ తీర్పు చెప్పింది. దేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత నిర్మాణాత్మకంగా తీర్చిదిద్ది సహకార సమాఖ్య విధా నానికి పెద్దపీట వేసే క్రమంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు లాకులెత్తుతూ 101వ రాజ్యాంగ సవ రణ తీసుకువచ్చారు. 103వ సవరణ ద్వారా ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేష న్లు తెరపైకి తీసుకువచ్చారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని ఎత్తివేయ డంతోపాటు- లద్దాఖ్‌, జమ్ము కశ్మీర్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారుస్తూ రాజ్యాంగాన్ని సవరించడం ఇటీవలి పరిణామం.
కదలాలిక క్రియాశీలకంగా…
భారత రాజ్యాంగానికి ఏడు దశాబ్దాల కాలంలో వందకుపైగా సవరణలు జరిగాయి. అమెరికన్‌ రాజ్యాంగాన్ని 1789నుంచి ఇప్పటివరకు కేవలం 27 సందర్భాల్లో మాత్రమే సవరించారు. మరోవంక 1900సంవత్సరంలో అమలులోకొచ్చిన ఆస్ట్రేలియా రాజ్యాంగానికి ఇప్పటివరకూ ఎనిమిది సవరణలు జరిగాయి. మనదేశ రాజ్యాంగానికి మాత్రమే ఎందుకిన్ని సవరణలు తీసుకువచ్చారు అన్న ప్రశ్నకు జవాబు వెదకడం అంత సులభం కాదు. చైతన్య భరితమైన రాజ్యాంగ స్వభావానికి ఈ సవరణలు దర్పణం పడుతున్నాయా లేక రాజకీయ అవసరాల మేరకు దఖలుపడిన అనివార్యతలకు ఇవి సూచికలా అన్న విషయంలో లోతైన చర్చ తప్ప నిసరి. దేశ ప్రజాస్వామ్య గమనాన్ని, పాలన వ్యవ స్థలను కాలానుగుణంగా తీర్చిదిద్దుకునే క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ చేయాల్సిన మార్పు చేర్పులు మరెన్నో ఉన్నాయి. పార్టీఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రభావశీలంగా మార్చడంబీ సంకీర్ణ ప్రభుత్వాల ప్రక్రియను కట్టుదిట్టంగా రూపు దిద్దడం, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కట్ట బెట్టడం, ఆదేశిక సూత్రాలకు అగ్రాసనమేస్తూ ఉమ్మడి పౌరస్మృతిని సాకారం చేయడం, న్యాయ వ్యవస్థకు జవాబుదారీతనాన్ని మప్పే నిబంధనలకు బాటలు పరవడం,అవినీతి కట్టడికి పటుతర వ్యవస్థలను రూపొందించడం వంటి క్రియాశీల చర్యలన్నీ రాజ్యాంగం ప్రాతిపదికగా అమలులోకి రావాల్సి ఉంది. రాజ్యాంగానికి మేలిమి భాష్యాలు చెబుతూ చురుకైన పాత్ర నిర్వహించడం ద్వారా న్యాయస్థానాలు ఈఏడు దశాబ్దాల కాలంలో క్రియా శీలకంగా వ్యవహరించాయి. రాజ్యాంగ మౌలిక స్వభావం అనే భావనను వెలుగులోకి తీసుకు రావడం, రాష్ట్రపతిపాలన దుర్వినియోగం కాకుం డా నియంత్రణలు విధించడం, సహజ వనరులను విచ్చలవిడిగా తవ్వితీయకుండా గనుల లైసెన్సుల విషయంలో పకడ్బందీగా వ్యవహరించడం, మానవహక్కుల ఉల్లంఘనలను సాధ్యమైనంత మేర అడ్డుకోవడం వంటివన్నీ మన దేశంలో న్యాయ వ్యవస్థ చైతన్యవంతమైన చొరవకు దాఖలాలుగా ప్రస్తావించుకోవచ్ఛు ఏడు దశాబ్దాలనాటితో పోలిస్తే నేడు సమాజం మరింతగా చీలికలు పేలికలై ఉంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబే డ్కర్‌ పరితపించిన సమానత్వం,సౌభ్రాతృత్వ సిద్ధాం తాలు ఆచరణలో కనుమరుగవుతున్న చేదు వాస్త వాలు ఎల్లెడలా దర్శనమిస్తున్నాయి. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కేందుకుపాలకులే నిర్లజ్జగా సిద్ధపడుతున్న తరుణమిది. దీర్ఘకాలంలో దేశ గమనాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పరిణామాలివి.‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు సమర్థు లు, నిజాయతీపరులైతే రాజ్యాంగంలో లోపాలు ఉన్నప్పటికీ వారి చర్యలవల్ల మెరుగైన ఫలితాలే సాకారమవుతాయి. కానీ పాలకులు సమర్థులు కాక పోతే రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఉపయోగమే లేదు’-డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ వ్యాఖ్యలివి. జాతి గమనాన్ని శాసించే పాలకులు ఈ మాటలను ప్రతిక్షణం మననం చేసుకొంటూ అడుగు ముందుకు వేసినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి ఆచరణలో ప్రతిఫలి స్తుంది.
రాజ్యాంగ విలువలు – శాస్త్రియ దృక్పథం
అఖండ భారతదేశంలోకోట్లాది ప్రజల అధిశాసన గ్రంథంగా‘భాÛరతరాజ్యాంగం’ అమల్లోక ిరావడంతో సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించడం జరిగింది. రాజ్యాంగం అనే గ్రంథంలో భారతీయ పరిపాలన వ్యవస్థను స్పష్టం గా లిఖింపచేసి స్వేచ్ఛ, సమాన త్వం,సోదరభావం అనే గొప్పవిలువలను భారతీయ పౌరులకు అందిం చడం జరిగింది. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్క ర్గారు రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షులుగా వ్యవహ రించి ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయ నంచేసి భారతీయుల ఆర్థిక,సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ మైన విలువల కలయికతో రాయడం జరిగింది. ప్రజాస్వామ్య దేశాలలో భారత రాజ్యాంగం వైవిధ్య మైన వ్యవస్థల సమాహారంతో విశిష్టలక్షణాల కలయికతో ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాం గంగా గ్రంథస్థం కాబడిన ఒకసమున్నత గ్రంథం. రాజ్యాంగం అనేగ్రంథం చారిత్రకంగా సృష్టించిన మానవ నిర్మిత అడ్డుగోడలైన కుల, మత, భాష, ప్రాంతం మరియు లింగ బేధాలను కూకటివేళ్ళతో పెకలించి కోట్లాది ప్రజలకు విముక్తి కల్పించింది. దేశతలరాతనుమార్చే ‘ఓటుహక్కు’అనే ఆయుధం ద్వారా దేశంలోని పౌరు లందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలతోపాటు దేశ సంపదను సమానంగా పంచాలని ఆదేశిస్తూ, హక్కులను, బాధ్యతలను సమపాళ్ళలో పంచిన సమున్నత గ్రంథం. పార్లమెంటరీ వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థల మధ్య అధికార విభజనతో భారత రాజ్యాంగాన్ని నిర్మిం చడం జరిగినది.తద్వారా రాజ్యాంగంఅనే గ్రంథం ‘‘నవమాసాలు మోసిన తల్లి ప్రసవించిన వెంటనే మనల్ని నమోదుచేసుకుని 90ఏళ్లపాటు తన భుజాలకెత్తుకొని రక్షణకల్పిస్తున్న అదిశాసన గ్రం థం’’గా వ్యవహరించడం జరుగుతుంది.
42వ రాజ్యాంగ సవరణ-1976 ద్వారా చేర్చిన పదాలు
ా సార్వభౌమాధికారం : భారతదేశం ఏఇతర దేశానికి లొబడి ఉండదు. ఎవరి ఆజ్ఞలను పాటించదు,అంటే దేశం యొక్క నిర్ణయాలు దేశం మాత్రమే తీసుకొంటుంది. భారత దేశంలో ఉన్న సంస్దలు మీద, పౌరులమీద భారత దేశానికికి మాత్రమే హక్కు ఉంటుంది.భూభాగాన్ని ఏవిదేశీ రాజ్యానికైనా ఇవ్వవచ్చు. వదులుకోవచ్చు..ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకోవడాన్ని సార్వభౌ మాధికారం అంటారు.
ా సామ్యవాదం : భారత దేశంలో ఉన్న వనరులు అన్నీ ఉత్పత్తి, పంపిణీ అన్నీ కూడా రాజ్యమే చేపట్టడం., అంటే ప్రయివేటీజేషన్‌ ఉండదు. అంతా ప్రభుత్వమే చేపడుతుంది కానీ భారత దేశం అనుసరించేది ప్రజా సామ్య సామ్యవాదాన్ని అనుసరిస్తుంది. ఇందులో ప్రభుత్వం మరియు ప్రయివేటు కూడా ఉంటాయి. దీనికి కారణం ఆర్ధిక సంస్కరణలు రావడం.
ా లౌకిక వాదం : భారతదేశం ఏ అధికార మతం కలిగి లేకపోవడం, అన్ని మతాలకు సమాన ఆధారణ ఇస్తుంది ఏమతానికి ప్రత్యేకమైన విలువ ఇవ్వదు,అన్ని మతాలూ సమానంగా అనుసరిస్తుంది.
ా ప్రజాస్వామ్యం : భారతదేశం ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అనుసరి స్తుంది. ప్రాతిధ్యం అంటే ప్రజలు ప్రత్యక్షంగా ప్రతినిధులను ఎన్నుకొంటారు, వారు పార్లమెంటులో ఉంటూ వారు శాసనాలు చేసి మనల్ని పరిపాలిస్తారు. ఇందులో మనం ఎన్నికల్లో పాల్గొంటాం ఓట్లు వేస్తాము. మనం కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాము.దీన్నేప్రజాస్వామ్యం అంటారు.
ా గణతంత్ర రాజ్యము : చాలా దేశాల్లో రాజ్యానికి రాజులు కానీ రాణులు కానీ ఉంటారు, వీరు వంశ పారంపర్యంగా కొనసాగుతారు. కానీ మన దేశంలో మనమే రాజ్యా అధ్యక్షుడుని ఎన్నుకుంటాము. అంటే మనం ప్రతినిధులను ఎన్నుకుంటాము, మన ప్రతినిధులు రాజ్య అధ్యక్షుడుని ఎన్నుకుంటారు అలా ప్రజలే రాజ్యాధ్యక్షుడుని ఎన్నుకొంటే ఆరాజ్యాన్ని గణతంత్ర రాజ్యము అంటారు.
ా సాంఘికన్యాయం: కులం,మతం,జాతి,జన్మ లింగవివక్షత లేకుండా ఉండడం, రాజ్యాంగం ముందు అందరూ సమానులే కానీ కొన్ని ప్రత్యేక సదుపాయాలు కొన్ని వర్గాలకు కేటాయించడం ద్వారా వారిని మిగతా వారితో సమానంగా తీసుకు రావడా నికి ప్రోత్సాహకాలను ఇస్తుంది, ఇది కూడా సామాజిక న్యాయం కిందికి వస్తుంది. అలాగే రాజకీయ న్యాయం అంటే భారతదేశ పౌరులు అందరూ రాజకీయంలో పాల్గొన డం,ఓట్లు వేయడం18సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కును కలిగి ఉంటారు. ఇది అంతా రాజకీయ న్యాయ కిందకు వస్తుంది. అంతస్తుల్లోను అవకాశాల్లోను సమాన హక్కులు కల్పించారు ఆలోచన, భావప్రకటన,విస్వాసం,ధర్మం,ఆరాధన ఇవి అన్నీ కూడా స్వేచ్ఛను పొంపొందిస్తాయి. వీటన్నిటిని భారత రాజ్యంగంలో హక్కులుగా కల్పించారు.స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రా త్రుత్వం అనే భావనలు ఫ్రాన్సు దేశం నుండి గ్రహించారు. అలాగే స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉన్నాయి. జాతీయ సమగ్రత సమైక్యతా అంటే మనం ఒకచోట గమనించవచ్చు, మన అందరికి ఒకటే సిటిజన్‌ షిప్‌ ఉంటుంది. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వేరుగా ఉండదు. అంటే భారత దేశంలోఉన్న పౌరులు అందరికి ఒకే గుర్తింపు ఉంటుంది, ఇదే భారతదేశ సమైక్యత అనవచ్చు .
ా సౌబ్రాత్రత్వం : సౌబ్రాత్రత్వం అంటే పౌరుల మధ్యసోదరభావాన్ని పెంపొందిం చడం.భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ సోదరి భావంతో మెలగాలి
భారత రాజ్యాంగం – ముఖ్య లక్షణాలు
భారత రాజ్యాంగ పరిషత్‌ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది.1949 నవంబర్‌ 16న ఆమో దం పొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మా ణంలో రాజ్యాంగ నిర్మాతలు ఆధునిక ప్రపంచం లోని తాత్విక పునాదులను అనుసరించారు. ఉదారవాదం, ప్రజాస్వామ్య సామ్యవాదం, లౌకిక వాదం, గాంధీవాదం మొదలైన మూల సూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. సమన్యాయ పాలన, ప్రాథమిక స్వేచ్ఛలు ప్రజలకు ఉండాలని భావించారు. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించారు. వీటన్నింటి ఆధారంగా రాజ్యాంగ మౌలిక లక్షణా లు రూపొందాయి, కానీ అవి నేడు దేశభక్తి పేరుతో పెను ప్రమాదంలో చిక్కు కున్నాయి. ప్రపంచంలో భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగ రచనకు రెండు సంవ త్సరాల 11 నెలల 18 రోజుల పాటు తీసుకుంది. భారతదేశంలోని భిన్నత్వం, అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించాలనే దక్పథం రాజ్యాంగంలో కనిపిస్తుంది. భారత రాజ్యాంగ లక్ష్యాలను పీఠికలో పొందుపర్చారు. పీఠికలో ‘సర్వసత్తాక, ప్రజా స్వామ్య, గణతంత్ర రాజ్యంగా’ పేర్కొన్నారు. 1976లో42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్య వాద,లౌకిక, సమగ్రత అనే పదాలను నూత నంగా చేర్చారు. దీంతో పీఠిక ‘సర్వసత్తాక, సామ్య వాద, లౌకిక,ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా’ రూపొం దింది. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది. ప్రజ లకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ప్రజలకు సమానత్వం కల్పించ డానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందు పర్చారు. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకో బడట ంతో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొం దింది. పౌరులకు మత స్వేచ్ఛను కల్పించ డంతో లౌకిక రాజ్యంగా ఉంది. భారతదేశంలో అధికా రానికి మూలాధారం ప్రజలు అని పీఠిక తెలిపింది. భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూ పం గురించి పేర్కొనలేదు. కానీ 1973లో కేశవా నంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించి, దాన్ని కాపాడుకోవాలని చెప్పింది. వివిధ కేసుల్లో జస్టిస్‌ సిక్రి, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ హెగ్డే మొదలైనవారి తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలు తెలుస్తాయి.
రాజ్యాంగ ఆధిక్యత, ప్రజా స్వామ్య, సమాఖ్య విధానం,లౌకిక విధానం, సమ న్యాయం ,సార్వభౌమాధికారం మొదలైనవాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొన్నారు. మినర్వామిల్స్‌ కేసు (1980), వామన్‌రావ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1981)కేసుల్లోనూ సుప్రీంకోర్టు రాజ్యాం గ మౌలికస్వరూప ప్రాధాన్యతను తెలి పింది. రాజ్యాంగం మూడో భాగంలో 12 నుంచి 35 వరకూ ఉన్న నిబంధనల్లో ప్రాథమిక హక్కులను పొందుపర్చారు. భారత పౌరులకు స్వేచ్ఛ కల్పిం చడానికి ఈహక్కులు దోహదపడతాయి. సుప్రీంకోర్టు 32వ నిబంధన ద్వారా హైకోర్టు 226వ నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఐదురకాల రిట్‌లు జారీ చేస్తాయి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎనిబంధన చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపర్చారు.అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులు తాత్కా లికంగా సస్పెండ్‌ అవుతాయి. రాజ్యాంగం నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకూ ఉన్న నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను పొందుపర్చారు. ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి తోడ్పడ తాయి. భారత ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన ప్ర మాణాలు పెంపొందిం చడానికి ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిం చింది. వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు. సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపర్చారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు, తమ రాజకీయ సిద్ధాం తాలతో నిమిత్తం లేకుండా ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజ్యాం గంలో 11ప్రాథమిక విధులు న్నాయి. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవిం చడం, హింసను విడనాడటం, ప్రభు త్వ ఆస్తులను కాపాడడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెం పొందించు కోవడం వంటి అంశాలు ప్రాథమిక విధు ల్లో ఉన్నాయి. భారత పౌరుల్లో బాధ్యతాయిత ప్రవర్తనను పెంపొందించే ఆశయంతో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు. భారత రాజ్యాం గం దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పార్ల మెంటరీ తరహా ప్రభుత్వం కొనసాగుతుంది. సమిష్టి బాధ్యత, కార్యానిర్వాహక వర్గం,శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించడం పార్లమెంటరీ విధానం ముఖ్య లక్షణాలు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాష్ట్రాల హక్కులను హరించి జమ్మూ కాశ్మీర్‌ ప్రజల, రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకో కుండానే ఆరాష్ట్ర ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. భారత రాజ్యాంగం దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయవ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఐదు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థ క్రియాశీలకంగా కొనసాగుతోంది.
దేశంలో పౌరుల ప్రాథమిక హక్కుల ను కాపాడడంలో న్యాయవ్యవస్థ క్రియా శీలక పాత్ర వహిస్తోంది. ఇటీవల కాలంలో ప్రజా ప్రయో జనాల వ్యాజ్యం ప్రాధాన్యత తగ్గిపోయింది. కొన్ని తీర్పులను అధికారవర్గాలు ప్రభావితం చేస్తున్నాయన్న అభిప్రాయాలకు ప్రజలు రాక తప్పడంలేదు. డాక్టర్‌ బిఆర్‌అంబేద్కర్‌ భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో పనిచేస్తున్న సమాఖ్య రాజ్యంగా వర్ణించారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి.వేర్‌ భారతదేశాన్ని ‘అర్ధసమాఖ్య’ అనివర్ణించాడు. ఏకకేంద్ర లక్షణాలైన ఒకే పౌరత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, అఖిలభారత సర్వీసుల పాత్ర, కేంద్ర ఆధిక్యత మొదలైనవి కూడా రాజ్యాంగంలోఉన్నాయి.
భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వ జనీన ఓటు హక్కు ప్రసాదించింది. స్త్రీ, పురుషులందరికీకుల,మత,వర్గ,లింగ,జాతి బేధాలు లేకుండా1988లో61వ రాజ్యాంగ సవరణద్వారా ఓటు హక్కు వయస్సును21 నుంచి18 ఏండ్లకు తగ్గించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్యపాత్ర పోషిం స్తుంది అని, రాజ్యాంగ నిర్మాతలు ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధి కారంకొనసాగుతుందని విశ్వసించారు.
కానీ డబ్బున్న వారే రాజ్యాన్ని చేజిక్కిం చుకొని తమ పెట్టుబడులను విస్తరించు కుంటూ ప్రజలు నిరు ద్యోగులుగా, పేదవారిగా..ఉపాధి కోసం, ఎన్నికల సమయంలో నాయకులు విసిరే ఎంగిలి మెతుకుల కోసం అమలు కాకపోయినా ఉచిత హామీల కోసం ఎదురు చూసే నిర్భాగ్యులుగా మార్చివేయబడ్డారు. రైతు గిట్టుబాటు కోసం కాకుండా,నిరుద్యోగి ఉపాధి కోసం కాకుండా, కార్మి కుడు కనీస వేతనం కోసం కాకుండా అణిచివేయ బడ్డ వర్గ ఆత్మగౌరవం కోసం కాకుండా ఎన్నికల సమయంలో అభ్యర్థులు పంచే నోట్ల కోసం ఎదురు చూసే దుస్థితి ఏర్పడిరది. గతంలో లేనంతగా భారత్‌లో ప్రజాస్వామ్య విలువలు పతనమ య్యాయి. నిరసన ప్రదర్శనలపై కాల్పులు, లాఠీ ఛార్జీలు, పోలీసుల అక్రమ అరెస్టులు సర్వసాధారణ మయ్యాయి. -(జి.ఆనంద్‌ సునీల్‌ కుమార్‌ )