దిశ చట్టం ఉన్నా..ఆగని అఘాయిత్యాలు

‘‘ దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడిరది. దిశ కేసుల దర్యా ప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి,విశాఖపట్నం,మంగళగిరి లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.’’

రెండు సంవత్సరాలుగా ప్రేమించి అక్టో బర్‌ నెలలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అను మానంతో విజయనగరం జిల్లాలో తగలబెట్టా డొకడు. అభం శుభం తెలియని దళిత చిన్నారిపై గుంటూరులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు వరుసకు మామ అయిన ప్రబుద్ధుడు. దిశ చట్టం అమలు గురించి ఎంతో ఆర్భాటంగా చెప్పుకునే రాష్ట్రంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున పట్టపగలు అంద రూ చూస్తుండగా ఇంజినీరింగ్‌ చదువుతున్న రమ్య అతిదారుణంగా హత్యకు గురికావడం అందరిని కలచివేసింది. నిర్భయ, దిశ,అశ్లీలతవ్యతిరేక చట్టాలు ఎన్ని వచ్చినా అమ్మాయిలపై అఘాయి త్యాలను, ప్రేమోన్మాదుల దాడులను,యాసిడ్‌,లైంగిక దాడు లను నివారించ లేక పోతున్నాయి. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గ్రహిస్తే మంచిది. రోజు రోజుకు పేట్రేగిపోతున్న అశ్లీల సినిమాలు,సాహిత్యం, ప్రకటనలను ప్రభు త్వాలు కట్టడి చేయలేక పోతు న్నాయి. కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయి తప్ప చేసిందేమీ లేదు. దిశచట్టం అమలులోకి వచ్చిన సంవత్సరంలోనే దాదాపు ఆరుగురు ఇంజి నీరింగ్‌ చదివే అమ్మా యిలు హత్యకు గురయ్యా రంటే…వార్తల కందని, నిరక్ష రాస్యులైన మహిళలు ఎందరో ?
మహిళలపై హింస అనేది సామాజిక, ఆర్థిక, అభివృద్ధి…విద్య,మానవ హక్కులు,చట్టాలు, ఆరో గ్యానికి సంబంధించిన సమస్య. మహిళలపై హిం సకు మానసిక అనారోగ్యానికి మధ్య గల సంబం ధాన్ని తగినంతగా పరిశోధించలేదు. ఇంట ర్నెట్‌ పుణ్యమా అని పోర్నోగ్రఫీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. కరోనా పుణ్యమా అని అన్ని ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న ఈ తరుణంలో సమస్య విపరీతంగా పెరిగిపోయింది.భారతదేశంలో ప్రత్యే కంగా ఏచట్టంలోనూ అసభ్యత, అశ్లీలత నిర్వ చించ బడలేదు. కానీ భారతీయ శిక్షాస్మృతి-1860, సమాచార సాంకేతిక చట్టం-2000 ప్రకారం… అశ్లీలత,అశ్లీలతతో కూడిన వాటిని ప్రచురించడం, ప్రసారం చేయడం…అసభ్యకర, అశ్లీల వస్తువులను విక్రయించడం వంటివి శిక్షార్హమైన నేరాలు. మహి ళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారా లను, లైంగిక దాడులను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం దిశ చట్టాన్ని రూపొందించింది. అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో14రోజుల్లోనే విచా రణ పూర్తి చేసే విధంగా ఈచట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం 21రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు చేసినా, చుట్టూ ఉన్న సమాజం, మనుషులలో మార్పు రానిది ప్రయోజనం లేదు. ఈ రోజు సామజిక మాధ్యమాల ద్వారా మంచి కంటే చెడును ఎక్కువ ఆకళింపు చేసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఉపాధి లేకుండా యువతను నిర్వీర్యం చేసిన ఘనత మన పాలకులది. ఇంజినీరింగ్‌ చదివిన వారిలో తొంభై ఐదుశాతం మందికి ఉద్యోగాలు లేవు. ప్రయివేటు రంగంలో పనిచేసే వారికి అరవై శాతం మందికి జీతాలులేవు. తొంభైశాతం ప్రజలు అభ ద్రతా భావంతో జీవితాన్ని నెట్టుకొస్తున్న సమయం లో ఇలాంటి దారుణాలకు కొదవ లేకుండా పో యింది. ప్రజలకు నాణ్యమైన విద్య,సంస్కృతి,మాన వ విలువలు,పర్యావరణం,మంచి ఆరోగ్య ఆహార పు అలవాట్ల గురించి చెప్పే విద్యాసంస్థలు కరువ య్యాయి. కేవలం డబ్బే పరమావధిగా కార్పొ రేట్‌ కళాశాలలు, విద్యా సంస్థలు ఏర్పడి నడుస్తు న్నాయి. వీటి మాయాజాలంలో పడిన తల్లిదండ్రులకు సమాజం గురించి పట్టడం లేదు. తమ పిల్లలకు మంచి ప్లేస్‌మెంట్‌ వచ్చి ఎక్కువ డబ్బు సంపాదిస్తే చాలు అనుకునేలా తయారవుతున్నారు. పరిస్థితులు ఈ విధంగా ఉన్నంతవరకు మహిళలపై దాడులను అరికట్టడం అంత సులభం కాదు.
మహిళల రక్షణలో ‘దిశ’ మారదు
మహిళలు, బాలికలకు రక్షణ కవచం లా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ‘దిశ’ నిర్దేశంలో మార్పులేదని మరోసారి రుజువైంది. హైదరాబాద్‌ లో దిశ ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అటు వంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం2019 డిసెంబర్‌ 13న అసెంబ్లీలో, డిసెంబర్‌ 16నమండలిలో దిశ బిల్లును ఆమో దించి 2020 జనవరి 2నచట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆబిల్లుపై కేంద్రం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చేందుకు రాజీలేని వైఖరితో ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం` 2019 (పాతబిల్లు)ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం-2020 (కొత్తబిల్లు)ని శాసనసభ, శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది.ఈ నేప థ్యంలో ఆంధ్రప్రదేశ్‌ దిశ (మహిళలు, బాలలపై జరిగే నేరాలపై విచారణకు ప్రత్యేక న్యాయ స్థానాలు)చట్టం-2020కి ప్రభుత్వం మరింత పదును పెట్టింది. అసెంబ్లీ,మండలి ఆమోద ప్రక్రి య పూర్తి కావడంతో ఈ బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 254(2)ప్రకారం గవర్నర్‌ పరిశీలన అనం తరం వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు.
ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు
ా దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ కచ్చితంగా అమలు చేయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడానికి ముందు నుంచే ఏపీలో ఈ విధానం అమల్లో ఉండటం విశేషం. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
ా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 దిశ పోలీస్‌ స్టేషన్లలో 18 కస్టమైజ్డ్‌ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లోని ప్రత్యేక పరికరాలతో సాంకేతిక సిబ్బంది నేర స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు.
ా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సత్వర సహాయం అందించేలా ఆవిష్కరించిన దిశ యాప్‌ను ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గత 8 నెలల్లో 98,380 మంది ఎస్‌ఓఎస్‌ ద్వారా పోలీసుల సహాయం కోరారు.
ా దిశ యాప్‌ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7 రోజుల్లోపే చార్జిషీట్‌ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడిరది.
ా దిశ కేసుల దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు.
ా రాష్ట్రంలో11 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 700 పోలీస్‌స్టేషన్లలో ఉమెన్‌ స్పెషల్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. దిశ బిల్లులో ప్రస్తావించిన అనేక విషయాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు వచ్చాయి.
దిశ బిల్లులో ప్రధానాంశాలు..
్చ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)- 1860,క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)- 1973లను ఉపయోగిస్తారు.
్చ ఐపీసీ సెక్షన్‌ 326ఎ,326బి,354,354ఎ, 354బి,354సి,354డి,376,376ఎ, 376బి,376ఎబి,376సి,376డి, 376డిఎ,376డిబి,376ఈ,509లతో పాటు పోక్సో యాక్ట్‌, కేంద్ర చట్టాల్లోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు.
్చ 18ఏళ్లలోపు బాలబాలికలపై లైంగిక దాడులు,అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ -పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టంపరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది.
్చ జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది.
్చ కేసుల నమోదుకు ఆన్‌లైన్‌ విధానం అమలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడే వారి వివరాలు అపరాధుల రిజిష్టర్‌ (ఆన్‌లైన్‌ విధానం)లో నమోదు చేస్తారు.
్చ వేగంగా దర్యాప్తు పూర్తి చేసేలా ప్రతి జిల్లా స్థాయిలో ఒక డీఎస్పీ నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.
్చ బాధిత మహిళకు సత్వర న్యాయం జరిగేలా, దోషులకు వేగంగా శిక్షలు అమలు చేసేలా ఈ కేసుల కోసం ప్రతి జిల్లాలో ఒకటి, అంతకంటే ఎక్కువగా ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటిలో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)ను కూడా నియమించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం- 2019
నిర్భయ (2012), ఉన్నావ్‌ (2017), దిశ (2019)..నేరాలతో దేశం ఉలిక్కిపడిరది. భవిష్యత్తులో ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా ఉండాలంటే శిక్షలను పకడ్బంధీగా అమ లుచేసే చట్టాలు ఉండాలి. ఆలస్యంగా దొరికిన న్యాయం అన్యాయంతో సమానం అంటారు. ఎందరో నేరస్తులు భారతీయ శిక్షాస్మృతిలోని లొసు గులను అవకాశాలుగా తీసుకుని దర్జాగా తప్పించు కుంటున్నారు. బాధితులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగినా న్యాయం దొరకని సంద ర్భాలు కోకొల్లలు. వీటన్నింటి దృష్ట్యా న్యాయ విచా రణ ప్రక్రియ వేగవంతం చేయాలని, నేరానికి పాల్ప డ్డ వ్యక్తులకు సత్వర శిక్షను అమలు చేసే ఉద్ధేశ్యంతో రూపొందించిందే దిశ యాక్ట్‌-2019 .
ఈ చట్టం ఎప్పుడు వచ్చిందంటే…?
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును ఏపీ శాసనసభ డిసెంబర్‌ 13,2019 ఆమోదించింది.డిసెంబర్‌ 16న శాసన మండలిలో దిశ బిల్లును ఆమోదించి.2020 జనవరి2న చట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంప డం జరిగింది.రాష్ట్రపతి ఆమోదముద్రవేస్తే ఆంధ్ర ప్రదేశ్‌ క్రిమినల్‌ లా (సవరణ)చట్టం-2019 (ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌), ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగెనెస్ట్‌ వుమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019 అమలుకు మార్గం సుగమం అవుతుంది. ఈచట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష ఖాయం.
ఈ చట్టం ఎలా వచ్చిందంటే…?
తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్‌ శివార్లలో 2019,నవంబరు 27నజరిగిన వెటర్నరీ డాక్టర్‌ దిశ గ్యాంగ్‌ రేప్‌,హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించక పోయినా..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. దిశ దుర్ఘటన వంటి నేరాలు మునుముందు జరగకూడదని, నేరం చేస్తే కఠిన శిక్ష పడుతుందనే భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుతాయని, మహిళలపై, పిల్లలపై అఘా యిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుం దని,బాధితులకు సత్వరన్యాయం చేయాలనే ఉద్ధే శ్యంతో వచ్చిందీ చట్టం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం.
ఏపీ దిశచట్టం, ప్రత్యే క కోర్టుల ఏర్పాటు చట్టాల్లోని ముఖ్యాంశాలు:
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు,మరణ దండ న శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ ‘దిశ’ చట్టం దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండునెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం4నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించి నట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడుతుంది. ఈచట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా జీరో ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. 18 ఏళ్లలోపు బాల బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్‌ 14న కేంద్రం పోక్సో యాక్ట్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ ఆఫ్‌న్సెస్‌ యాక్ట్‌ -పీఓసీఎస్‌ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభు త్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నా రులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది. జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. అంటే పిల్లలపై ఇక ఎలాంటి లైంగిక నేరాలకు పాల్పడినా జీవితాంతం జైల్లో ఉండటమో, లేక ఉరికంబం ఎక్కడమో శిక్ష అవు తుంది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. మహిళలు,చిన్నారులపై లైంగిక దాడు లు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం ఇండియన్‌ పీనల్‌ కోడ్‌(ఐపీసీ)-1860, క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీపీసీ)-1973లను ఉపయోగి స్తారు.సోషల్‌మీడియా ద్వారా మహిళలను వేధిం చడం,వారిపై అసభ్య పోస్టింగులు పెట్టడం లాం టివి చేస్తే ఐపీసీ ప్రకారం ఇప్పటివరకూ శిక్షలు నిర్దిష్టంగా లేవు. అందుకు ప్రత్యేకంగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో అదనంగా 354(ఇ),354 (ఎఫ్‌) అనే కొత్త సెక్షన్లను చేర్చారు.

  1. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354(ఇ)
    మెయిల్స్‌, సోషల్‌మీడియా, డిజిటల్‌ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఈ సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్ల జైలు, రెండోసారి తప్పుచేస్తే నాలుగేళ్ల జైలుశిక్ష
  2. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 354 (ఎఫ్‌)
    పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడితే పదేళ్ల నుంచి నుంచి 14ఏళ్ల వరకూ శిక్ష. నేరం తీవ్రతను బట్టి 14ఏళ్ల నుంచి జీవిత ఖైదువిధిస్తారు. పోస్కో చట్టం కింద ఇంతవరకూ 3 నుంచి 5ఏళ్ల వరకు జైలుశిక్ష అమలౌతుంది.ఇంతవరకూ దేశంలోని ఏ రాష్ట్రం లోనూ మహిళలు,పిల్లలపై నేరాల సత్వర విచార ణకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు లేవు. కొద్ది రాష్ట్రాల్లో మాత్రం ఈ నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. కాని, దేశ చరిత్రలోనే తొలి సారిగా మహిళలు, పిల్లలపై నేరాల విచారణకు అదికూడా వేగంగా విచారణ ముగించడానికి వీలుగా 13జిల్లాల్లో ప్రతిజిల్లాకు ఒక ప్రత్యేక కోర్టు ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి కోర్టుకూ ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ని నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్‌ స్పెషల్‌ పోలీస్‌ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అత్యాచారం, సామూ హిక అత్యాచారం, యాసిడ్‌ దాడులు, సోషల్‌ మీడియా ద్వారా అసభ్యంగా చూపించడం, వేధిం చడం వంటి నేరాలు,పోక్సో పరిధిలోకి వచ్చే అన్ని నేరాలు ఈ కోర్టు పరిధిలోకి వస్తాయి. నింది తులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా లేదా స్పష్టమైన ఆధారా లున్నా తక్షణమే మరణశిక్ష విధించేలా చట్టం చేశారు. అందుకనుగుణంగా సెక్షన్‌ 376 (రేప్‌)కి సవరణ చేశారు. జడ్జిమెంట్‌ పీరియడ్‌ను కూడా 4 నెలల నుంచి 21 రోజులకు కుదించి, విచారణ 7 రోజుల్లో,ట్రయల్‌ 14రోజుల్లో పూర్తి చేసి 21 రోజుల్లో నిందితులకు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటారు. క్రిమినల్‌ ప్రొసీజరల్‌ యాక్ట్‌ 173, 309కి మార్పులు చేశారు. చిన్నారుల మీద దాడులు,లైంగిక వేధింపుల విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు… దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవ రణ చేశారు. పోస్కో యాక్టు ప్రకారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. దానిని కూడా మార్చి జీవితఖైదు విధించేలా చట్టం చేయడం జరిగింది. ఇక ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరునెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 3 నెలలకు తగ్గించారు. మహిళలు, పిల్లలపై నేరాలను నమోదుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్‌ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్‌ పద్దతిలో డేటా బేస్‌ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తులపేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే,ఏనేరగాడు,ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. కాని, అటువంటి డిజిటిల్‌ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నేరా లకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలం దరికీ అందుబాటులోకి ఉంచడంద్వారా అఫెండర్ల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు.చట్టం ముందే కాకుండా సమాజం ముందు వారిని నిలబెడతారు.
    దిశ మొబైల్‌ యాప్‌
    మహిళా భద్రత కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం తేవడంతోపాటు దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్టమైన వ్యవస్థను రూపొందించింది. మహిళలపై వేధింపులకు పాల్పడితే దోషులను సత్వరం శిక్షించేందుకు క్రిమినల్‌ జస్టిస్‌ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చింది. దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసింది.విశాఖపట్నం,విజయవాడ, తిరు పతిల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా విపత్కర పరిస్థితులు ఎదురైతే తక్షణ పోలీసు సహాయం పొందేందుకు‘దిశ మొబైల్‌ అప్లికేషన్‌’ను ప్లే స్టోర్‌లో అందుబాటలోకి తెచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశ యాప్‌ను ఫిబ్రవరి8,2021న అధికారికంగా ప్రారంభించించారు.
    ఎందుకు?
    విద్యార్థినులు, యువతులు, మహిళలు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే.. ఎలా బయట పడాలి? ఎవరికి ఫోన్‌ చేయాలి? ఫోన్‌ చేసినప్పుడు అవతలి వారు లిఫ్ట్‌ చేయకపోతే పరిస్థితి ఏమిటి? ఆపదలో ఉన్న మహిళ కేకలు వేసినా వినిపించని నిర్జన ప్రదేశమైతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ఏపీ ప్రభుత్వం‘దిశ’యాప్‌ను ప్రారంభించింది
    డౌన్‌ లోడ్‌.. ఉపయోగించడం ఇలా..
    ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ మొబైల్‌ ఫోన్లలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌లో మొబైల్‌ నంబర్‌తో రిజిస్ట్రే షన్‌ చేసుకోవాలి.యాప్‌లోఎస్‌వోఎస్‌ బటన్‌ ఉం టుంది. ఆపదలో ఉన్నప్పుడు యాప్‌ను ఓపెన్‌ చేసి,అందులో ఉన్న ఎస్‌వోఎస్‌ (పుష్‌ బటన్‌ మెస్సే జ్‌ ఆప్షన్‌) బటన్‌ నొక్కాలి. ఆవెంటనే వారి ఫోన్‌ నంబర్‌,చిరునామా,వారు ఆ సమయంలో ఉన్న ప్రదేశం (లొకేషన్‌)తో సహా మొత్తం సమాచారం దిశ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. ఆ వెంటనే కంట్రోల్‌ రూమ్‌లోని సిబ్బంది అప్రమత్తమ వుతారు. తమకు సందేశం పంపిన వారు ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు క్షణాల్లోనే సమాచారం పంపిస్తారు. ఈఆప్షన్‌ ద్వార పోలీసు లు యాప్‌ వినియోగదారులకు ఏకకాలంలో సూచనలు,సలహాలుఅందించి, వారిని జరగ బోయే ప్రమాదాల గురించి అప్రమత్తం చేస్తారు. పోలీసు లతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు,స్నేహితు లకు కూడా సమాచారం ఇచ్చే వెసులుబాటు ఉం టుంది.విపత్కర పరిస్థితుల్లో యాప్‌ను ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే, ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు. ఆ యాప్‌ వెంటనే దిశకమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సందేశాన్ని పంపుతుంది. ప్రయాణ సమయాల్లో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ ఏర్పటు
    తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని అందులో నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్‌ ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాం డ్‌ కంట్రోల్‌ రూమ్‌కు, వారి బంధువులకు చేరవేసే రక్షణ కల్పించే వెసులుబాటు
    దిశ యాప్‌లో డయల్‌ 100. 112 నంబర్లతో పాటు పోలీసు అధికారుల నంబర్లు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, ట్రామా కేర్‌ సెంటర్లు, బ్లడ్‌ బ్యాంకులు, మందుల దుకాణాల వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఈయాప్‌లో ఉంటాయి. ఏపీ ప్రభుత్వం దిశ మొబైల్‌ యాప్‌ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు,ఎక్కువ మం దికి ఈయాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించిన వారికి రూ.10,116 ప్రోత్సాహకం కూడా అందిస్తోంది.
    ఇతర దేశాల్లో శిక్షలు ఇలా..
    అత్యాచార నిందితుల్ని నేరుగా ఉరికం బం ఎక్కిస్తారు. కొన్ని కేసుల్లో దోషుల పురు షాంగాన్ని తొలగించి నపుంసకులుగా కూడా మారు స్తారు. ఇదంతా నేరం జరిగిన రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేక పోయినా ఉరిశిక్ష విధించడం విమర్శలకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఉరి తీశాక వారు నిర్ధోషులని తేలడం గమనార్హం.
    ఇరాన్‌: అత్యాచార దోషుల్ని కాల్చి చంపుతారు. లేదంటే ఉరితీస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితు రాలు క్షమించడానికి అంగీకరిస్తే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
    ఆష్గానిస్తాన్‌: రేపిస్టులకు శిక్ష పడిన నాలుగు రోజుల్లోనే ఉరి తియ్యడమో, లేదంటే కాల్చి చంపడమో చేస్తారు.
    యూఏఈ: రేప్‌ చేసిన ఏడు రోజుల్లో ఉరికంబం ఎక్కిస్తారు.
    సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అత్యాచార నేరం రుజువైతే బహిరంగంగా తలనరికి చంపు తారు.
    నెదర్లాండ్స్‌: మహిళలపై జరిగే లైంగిక వేధింపు లన్నింటినీ అత్యాచారం కిందే పరిగణిస్తారు. అమ్మా యి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా అక్కడ నేరుగా జైలుకి పంపిస్తారు. నేర తీవ్రత ఆధారంగా 4 నుంచి 5 సంవత్సరాలు శిక్ష ఉంటుంది.
    ఫ్రాన్స్‌: అత్యాచార చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అత్యాచార కేసుల్లో 15ఏళ్లు కారాగార శిక్ష విధిస్తారు. జైల్లో ఉన్నన్ని రోజులు వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. నేర తీవ్రతని బట్టి దానిని 30 ఏళ్లకు పెంచుతారు.
    గణాంకాల ప్రకారం..
    దేశం దశ దిశలా.. నలుమూలలా.. ప్రతిరోజూ మహిళల అక్రందనలు వినిపిస్తునే ఉన్నాయి. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ తాజాగా విడుదల చేసిన (2020,సెప్టెంబర్‌ 29) గణాం కాల ప్రకారం సగటున దేశవ్యాప్తంగా రోజుకు 87 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. 2012 నిర్భయ ఘటనకు ముందు 25 వేల కంటే తక్కువ, 2013లో 33,707,2016లో 38,947 కేసులు నమోదు కాగా 6,289 కేసుల్లో శిక్షలు పడ్డాయి. 2017లో32,559,2018లో33,356, 2019లో 32,033 నమోదయ్యాయి. కానీ శిక్షలుపడ్డ దాఖ లాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఈ కేసుల్ని విచారించడానికి కోర్టుల్లో తగిన సిబ్బంది లేక పోవడంతో పెండిరగ్‌ కేసుల సంఖ్య తడిసి మోపె డవుతోంది. ఇకఅత్యాచార కేసుల్లో దోషులుగా తేలేవారి సంఖ్య కూడా అత్యంతస్వల్పంగా ఉంది. చాలా ఏళ్లపాటు 25నుంచి 30శాతం కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ 2014లో మాత్రం శిక్షల రేటు 27 నుంచి 38 శాతానికి పెరిగింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్ని 2019నాటికి దేశంలో 664 ఉంటే, అవి కూడా సరిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. మన దేశంలో ఉరి శిక్ష పడాలంటే కనీసం5ఏళ్లు పడు తుంది. ఎందుకంటే ప్రత్యేక కోర్టుల్లో శిక్ష పడితే పై కోర్టుకి వెళ్లే అవకాశం ఉంది. అక్కడి నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు.. అక్కడ శిక్ష ఖరారు చేసినీ అమలౌతుందన్న గ్యారెంటీ లేదు. మరణ శిక్ష పడిన దోషులకు రాష్ట్రపతిని క్షమాభిక్ష అడిగే హక్కు కూడా ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే సరికి కొన్ని కేసుల్లో ఉరిశిక్ష అమలుకే 20 ఏళ్లు దోషులు జైల్లో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే సత్వర న్యాయం మన దేశంలో సాధ్య పడటం లేదు. 1991 నుంచి 2017 డిసెంబర్‌ చివరి నాటికి 371మందికి ఉరిశిక్ష పడిరది. కానీ గత 15 ఏళ్లలో ఎనిమిది మందికి (నిర్భయ దోషులతో సహా) మాత్రమే ఉరిశిక్ష అమలు జరిగిందంటే న్యాయం జరగడంలో ఎంత అన్యాయం జరుగు తుందో అర్థమవుతోంది.
    ఈ పరిస్థితి మరాలంటే..
    గర్భస్థ పిండాలుగా ఉన్నప్పటి నుంచి కడ శ్వాస వరకు మహిళలపై గౌరవ భావం కలిగేలా మన సమాజానికి అవగాహన పెంచాలి. కటుంబం, బడి,పనిప్రదేశం, బహిరంగ స్థలం.. ఇలా అన్ని చోట్ల, ప్రతిస్థాయిలో వివక్ష పోవాలి. మనిషి తప్ప సృష్టిలోమరే జీవి పాల్పడని అతి హీనమైన నేరం అత్యాచారం. అది సామూహికంగా జరిగి, ఘాతు కమైన హత్యతో ముడిపడటం భూమ్మీద అతిపెద్ద నేరం. దీనికి సమాజం నుంచే పరిష్కారం లభిం చాలి. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధా లుగా,అన్ని స్థాయిల్లో సమాజం సమాయత్తం కావాలి. ఇది సమష్టి బాధ్యత.
    -డా.యం.సురేష్‌ బాబు