తెలంగాణ గిరిజనులు`భాషా సాహిత్యాలు

గిరిజన భాష అనగానే అది ఒక ఆదిమ భాష లిపిలేని మౌకిక సాహిత్యానికే పరిమి తమైన పేద భాషగా చెప్పుకుంటాం కానీ కాలానుగుణంగా వస్తున్న మార్పులు, విద్యాసాయంగా గిరిజన యువతలో పెరిగిన ఆలోచన తద్వారా గిరిజన జన జాతికి చెందినవారు విశ్వవిద్యాలయ స్థాయి విద్యలు పూర్తిచేసుకుని తమలోని పరిశోధన శక్తిని వెలికి తీసుకుని, తమ జాతి భాషా సంస్కృతుల ఉన్నతి కోసం కృషి చేస్తున్న శుభ సమయం ఇది.
దీనికి తోడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రోద యం తరువాత తెలంగాణ సాహితీ సంస్కృతుల గురించి జరుగుతున్న ప్రత్యేక అధ్యయనాలలో భాగంగా రాష్ట్రంలోని రచ యితలు,విద్యావేత్తలు,విద్యాలయాలు సంస్థలు విశ్వవిద్యాలయాలు తెలంగాణ భాషా సంస్కృతల వికాసమే లక్ష్యంగా కృషి ప్రారంభించాయి.అందులో భాగంగానే 2015లో నాటి ఆంధ్ర సారస్వర పరిషత్‌ అయిన నేటి తెలంగాణ సారస్వత పరిషత్‌ తాను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భాషా సాహిత్య వికాసం పనిలో భాగంగా‘‘తెలం గాణ గిరిజన భాషా సాహిత్యాలు’’అనే ఉపయుక్త గ్రంథం ప్రచురించింది. నాటి పది జిల్లాల తెలంగాణలో గల గిరిజన జాతులు వాటికి చెందిన ప్రజల భాషలు,వారి విశిష్ట జీవనశైలి గురించి విస్తృతంగా వివేచనాత్మకంగా చర్చించడం కోసం పరిషత్‌ ఒక సదస్సు ఏర్పాటు చేసి పరిణితి గల భాష సంస్కృతుల వికాసం కోసం సుదీర్ఘ కాలంగా కృషి చేస్తున్న భాషా సేవకులను వక్తలుగా ఆహ్వానిం చింది.వీరితోపాటు గిరిజన భాష సాహిత్యాల గురించి విభిన్నమైన కోణాల్లో పరిశోధనలు చేసిన వారు చేస్తున్నవారు ఈభాషా సదస్సులో పాల్గొని వారి వారి విలువైన అభిప్రాయాలు అనుభవాలు ప్రసంగ వ్యాసాలు ద్వారా అందించారు, వాటి అన్నిటిని అమూల్యమైన గ్రంథంగా వెలువరించారు.నాటి సంస్థ అధ్యక్షులు డా: సినారె.ప్రధాన కార్యదర్శిడా:జె.చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈపుస్తకం వెలువడిరది. తెలంగాణలోని వివిధ గిరిజనభాషల వైలక్ష్యాన్ని ఇందులో వ్యాసాలు ప్రతి భావంతంగా ఆవిష్కరించాయి అనడంలో అక్షర సత్యం ఉంది.దీనిలో మొత్తం 30 అంశాల గురించి 30మంది నిష్ణాతులైన వ్యాస రచయితలు అందించిన వ్యాసాలు ఇందులో నిక్షిప్తం చేయబడ్డాయి. తెలంగాణలోగల గిరిజనజాతి వారైనా గోండులు,ప్రధాన్‌లు,బంజారాలు, కొండరెడ్లు,ఆంధ్‌లు,కోయలు,ఎరుకల, యానాదులకు సంబంధించిన భాషలు సంస్కృతులు సామెతలు పొడుపు కథలు, జాతీయాలు,అలంకారాలు,గేయ సాహి త్యం,అంశాల గురించి కూలంకుశమైన చర్చలు విశ్లేషణలు ఈవ్యాసాల్లో మనకు కనిపిస్తాయి.ప్రాంతాలవారీగా విస్తరించి నివసిస్తున్న గిరిజన జాతుల గురించి ఆయా వ్యాసకర్తలు వివరించారు,సోయం భీంరావు,‘‘గోండి భాష సాహిత్యాలు’’అనే అంశం గురించి వ్రాసిన సుదీర్ఘ వ్యాసంలో గోండిభాష గురించిన సంపూర్ణ విశ్లేషణ చేస్తూ తరతరాలుగా అంతరించిపోతున్న గోండు భాష గురించి చెబుతూ…65 సంవత్సరాలు పైబడ్డ గోండుగిరిజనులు తమ మాతృభాషను స్వచ్ఛంగా అధికంగా మాట్లాడుతున్నారని,15-20సంవత్సరాల మధ్యవారంత తమసంభాషణల్లో ఆంగ్లం, హిందీ,తెలుగు,భాషలపదాలు కలగలిపి మాట్లాడుతూ తమదైన గోండు మాతృ భాషను నిర్వీర్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు.
అలాగే ఆధునిక పద్ధతుల్లో గోండిభాష విస్తరిస్తున్న తీరు కూడా వివరించారు. ఇంటర్నెట్లో గోండిసాహిత్యం,సంగీతం, పాటలు,పొందుపరిచి విశ్వవ్యాప్తం చేసిన వైనం గురించి కూడా పేర్కొన్నారు. వార్తా పత్రికల ప్రచురణలో గోండిభాష పాత్రను వివరించారు.
గిరిజన జాతులు అన్నిటిలోనూ ఉన్నతమైన గోండు జాతికి 17,18వశతాబ్ధాంల్లోనే లిపి ఉన్నట్టు చెబుతూ గోండు లిపి చదివిన పెందోర్‌లింగోజి,ఆత్రంరాంజీ, ఆత్రం మాన్కు,కోట్నకజంగు,ఆత్రం కమ లాబాయి,అనే మూడు తరాలకు చెందిన వ్యక్తులపేర్లు పేర్కొన్నారు.
గుండు భాషలోని పాటలు గోండిభాష మాట్లాడే ప్రాంతాలతో పాటు భాషాప రమైనవ్యాకరణం నామాచకాలు కొలతలు చెట్లు,గృహోపపకరణలు వంటి వాటికి తెలుగు అనువాదాలతో కలిపి వివరణలు ఇచ్చారు.
‘‘తెలంగాణ గిరిజనభాషా సాహిత్యాలు’’ అనే అంశం గురించి ‘‘పసుల బుచ్చయ్య’’ రాసిన మరో సుదీర్ఘ వ్యాసంలో నాయక పోడు గిరిజన తెగకు సంబంధించిన భాషా సాహిత్యాల గురించి సుదీర్ఘ వివరణ చారిత్రక ఆధారాలతో అందించబడిరది. గిరిజన తెగల్లోనే ఒక విశిష్టమైన ‘‘ఎరుకల’’జనజాతి గురించి కె.వివేక్‌ వినా యక్‌ రాసిన ఆంగ్ల వ్యాసం,పరిశోధక విద్యార్థిని బి.భీమమ్మ వ్రాసిన‘‘ఎరుకల వారి సంస్కృతి సాహిత్యం’’అనే వ్యాసం ఎరుకల సాహిత్యం భాషల గురించి తెలియజేశాయి.
ఇక కొండ రెడ్ల గురించి వారి జీవన విధానం నివాసం,ఆహారం,పండుగలు, తదితర సాధారణ విషయాలు తప్ప సాహి త్యం భాషల జోలికి పోలేదు. గోండుల తర్వాత అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తున్న వలస గిరిజన జనజాతి అయిన ‘‘బంజా రాలకు’’సంబంధించి దీనిలో అనేక విషయాలు చర్చించబడ్డాయి. బంజారా భాషలో అలంకారాలు, సామెతలు,పొడుపుకథలు,గేయసాహిత్యం, బంజారాభాషా స్వరూపం వైశిష్యం సంస్కృతి సాహిత్యం ప్రపంచీకరణలో మాయమవుతున్న బంజారా సంస్కృతి, తెలుగు బోధన భాషవల్ల బంజారా విద్యా ర్థుల సమస్యలు,తదితరాల గురించి అధిక వ్యాసాలు అగ్రస్థానంలో నిలిచాయి. వీటితోపాటు తెలంగాణ కథా సాహి త్యంలో గిరిజన స్త్రీ,తెలంగాణసాహిత్యం గిరిజనజీవితం,కొండాకోనల్లో కనిపించిన కోయ జీవితం,అనేవ్యాసాల ద్వారా తెలంగాణ తెలుగుసాహిత్యంలోగల నవలలు,కథల్లో గిరిజనులస్థానం గురించి పరిశోధనాత్మకంగావివరించడం జరిగింది. అన్ని గిరిజన జనజాతులకు సంబంధించి ఒకే ఒక సమస్య ఆభాషకు లిపి లేక పోవడం ఉన్నకొద్ది మాత్రంది కార్య క్రమంలో అంతరించిపోవడం ఈప్రధాన విషయాల గుండానే ఈ30వ్యాసాల పరిశ్రమ కొనసాగింది.
తెలంగాణ గిరిజన భాషాసాహిత్యాలపై పరిశోధన చేసే వారికి ఈగ్రంథం చక్కని దారిదీపంగా ఉంటుందని చెప్పవచ్చు మనకు గల అతితక్కువ తెలుగు గిరిజన భాషా సాహిత్య గ్రంథాలలో ఇది అత్యంత ఉన్నతమైనదిగా పేర్కొన వచ్చు.
చక్కటి పరిశోధనాత్మకమైన కృషితో సదస్సు నిర్వహించడమే కాక దాన్ని అంతటిని అక్షరబంధం చేసి గ్రంథరూపం తీసుకు రావడంలో తెలంగాణ సారసత పరిషత్‌ కృషి అభినందనీయం ఆచరణీయం, రేఖామాత్రంగా గల ఈఅంశాలు భవిష్య త్తులో మరింత కూలంకషంగా వివరణ తీసుకురావడమే కాక భాషా శాస్త్రవేత్తలు త్వరలోనే ఈఆదిమ భాషలకు లిపిని తయారు చేయడంలో సఫలీకృతులు కావాలని కోరుకుందాం.
డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)