భారత రాజ్యాంగం లౌకిక స్వభావం

భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసంలౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వా సాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణా మాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే.లౌకిక రాజ్యమంటే ప్రజలు,ప్రభుత్వానికి మధ్య సంబంధాలు,పరిపా లన..మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతికప్రపంచం గురించి ఆలోచిం చడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం,పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించిఊహించి చెప్పేప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతా బ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్‌ హోలియోక్‌ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్‌ భాషలోని ూవషబశ్రీబఎ (సెక్యులమ్‌) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్‌)అని దీనిఅర్థం. ఆ తర్వాత వాడు కలో ప్రభుత్వాన్ని,పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం..పాలనచట్టం, రాజ్యాం గం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి.
లౌకిక భావన, వివిధ పార్శ్వాలు
లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించి నప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ.పూర్వ కాలం లో ప్రజల అన్ని విషయాలను మతం,మతాచార్యు లే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు.సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు.
భారతీయ భావన భిన్నం
పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణా మాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు,విశ్వాసాలు,జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యా లుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం,రెండోది భిన్నమతాల మధ్య సామర స్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధా కృష్ణన్‌ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు.విశ్వ వ్యాప్త మైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’.
లక్షణాలు
ా ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు.
ా అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు.
ా మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం.
ా న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం.
ా మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి.
ా రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం
ా లౌకికతత్వం (సెక్యులర్‌) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది.
లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు
రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కు లలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమా లలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరు డు కలిగి ఉండాలని కోరడం,లౌకికతత్వానికి మచ్చు తునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు.
ప్రవేశిక – లౌకిక భావన
భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన,విశ్వాసం,నమ్మకం అనే అం శాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు.రాజ్యాంగం మూడో భాగం లో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి.(వ్యాసకర్త:డెరైక్టర్‌, క్లాస్‌-వన్‌ స్టడీ సర్కిల్‌)
లౌకిక రాజ్యాంగానికి విఘాతం కల్గించవద్దూ..
ప్రస్తుత బి.జె.పి ప్రభుత్వం ఆర్‌.ఎస్‌. ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తన రాజకీయ ప్రాబ ల్యాన్ని కొనసాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగు తుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు,కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యా యులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి. భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చి 72 ఏళ్లు పూర్తి చేసుకుని 73వ సంవత్సరంలో అడుగు పెడు తున్నది. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌. అంబేద్కర్‌ నాయకత్వాన ముసాయిదా కమిటీ అరవైకి పైగా రాజ్యాంగాలను తులనాత్మక అధ్యయనం చేసి భారతీయ భిన్నత్వానికి, బహుళత్వానికి అనుగుణం గా రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగలక్ష్యాలను,ఆశయాలను పొందుపరచారు.గిరిజన ప్రాంతాలకు5,6షెడ్యూళ్ల ద్వారా ప్రత్యేక హక్కులుకల్పించారు. జమ్ము-కాశ్మీర్‌ ఆనాడు ప్రత్యేక పరిస్థితులలో ఇండియన్‌ యూని యన్‌లో చేరటంతో370వ నిబంధన ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారు. తరతరాలుగా అణచి వేతకు గురైన షెడ్యూల్‌ కులాలు,షెడ్యూల్‌ తెగలు, వెనుక బడిన తరగతుల ప్రజల కోసం రాజ్యాంగం 16వ భాగంలో రిజర్వేషన్లతోపాటు కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పించారు.
భారతీయ ఉమ్మడి సంస్కృతి
భారతీయ సంస్కృతి ఉమ్మడి సంస్కృతి అని రాజ్యాంగంలోని51(ఎ)నిబంధనలో పేర్కొ న్నారు.భారతదేశం భిన్నమతాలకు, సాంప్రదా యాలకు, సంస్కృతులకు, ఆచారాలకు నెలవుగా ఉన్నది. దేశంలోహిందూ మతం, ఇస్లాం, క్రైస్తవం, జైనం,బౌద్ధం,పార్సీ,సిక్కు మతాలతో కూడిన సం స్కృతీ సాంప్రదాయలు ఉమ్మడి సంస్కృతిగా రూపు దిద్దుకున్నాయి. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులు ‘’విభ జించు-పాలించు’’సూత్రంలో భాగంగా హిందు వులు-ముస్లింల మధ్య మతతత్వ భావనలు రెచ్చ గొట్టారు. ఫలితంగానే జాతీయోద్యమ కాలంలో ముస్లిం లీగ్‌,హిందూ మహాసభ,రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్న్‌ వంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. మత తత్వ ధోరణులకు కొనసాగింపుగానే1947లో దేశ విభజన జరిగింది. సమకాలీన భారతదేశంలో మతతత్వ ధోరణులను, మతోన్మాదాన్ని రెచ్చగొట్ట టానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలను మతపరంగా చీల్చటానికి సంఘ పరివార్‌, బిజెపి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటన్నింటిని ఎదు ర్కొని భారతీయ ఉమ్మడి సంస్కృతిని రాజ్యాంగంలో చెప్పిన విధంగా పరిరక్షించుకోవాలి.
రాజ్యాంగంలో లౌకిక విధానాలు
భారత రాజ్యాంగం దేశాన్ని లౌకిక రాజ్యంగా ప్రకటించింది. ఈమేరకు పీఠికలో చేర్చారు. ప్రాథమిక హక్కులలో 25నుండి 28 వరకు గల నిబంధనలు ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించాయి. ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని ‘’స్వీకరించటానికి,ఆచరించటానికి,ప్రచారం చేసు కోవటానికి’’ హక్కు కలిగి ఉన్నాడు. మతపరమైన సంస్థలను నిర్వహించుకోవటానికి, సేవా కార్యక్ర మాలు నిర్వహించటానికి రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. వ్యక్తిగతమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చని చెప్పింది. ప్రాథమిక హక్కులలో విద్యా,సాంస్కృతికహక్కులను29,30 నిబంధనలలో పేర్కొని వాటి ద్వారా మైనారిటీలు తమ భాషను, సంస్కృతిని,విద్యను అభివృద్ధి చేసుకోవటానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చని రాజ్యాంగం పేర్కొన్నది. రాజ్యాంగనిర్మాతల ప్రధానలక్ష్యం భారతదేశంలోని భిన్నమతాల ప్రజలు లౌకిక విధా నాలతో జీవిస్తూ సహజీవనం చేయాలని భావిం చారు. లౌకిక విధానాల ద్వారానే దేశ సమైక్యత, సమగ్రత కొనసాగుతుందని భావించారు.
బిజెపి మతతత్వ విధానాలు
దేశంలో హిందూత్వ విధానాలను అమ లు చేయటంతో పాటు హిందూ రాజ్యం ఏర్ప డాలని, హిందూ ఆధిక్యత కొనసాగాలని ఆర్‌.ఎస్‌. ఎస్‌ సిద్ధాంత భావజాలంలో స్పష్టంగా పేర్కొన్నది. ఈ భావజాలాన్ని అమలు చేయటానికి సంఘ పరివార్‌తో పాటు రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఆలంబనగా చేసుకున్నది.2014లో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం గత8ఏళ్లగా మతోన్మాదాన్ని, మత తత్వాన్ని రెచ్చగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావ జాలంతోహిందూత్వ శక్తులు విజృంభిస్తు న్నాయి. మత విద్వేషాలను రెచ్చగొడుతూ మైనా రిటీల పైన, దళితుల పైన దాడులు చేస్తున్నారు. భారత దేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరిస్తూ అఖండ భారత్‌ స్థాపన కోసం ప్రజలు ముందుకు రావాలని రెచ్చగొడుతున్నారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేప థ్యంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రసం గాలు చేస్తు న్నారు. ఇటీవల హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్‌ సమావేశాలలో హిందూత్వ శక్తులు మైనారిటీలను ఊచకోత కోయాలని ప్రసంగాలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో నరేంద్ర మోడీ-యోగిల ద్వయం చేపడు తున్న చర్యలు మైనారిటీలలో భయానక వాతావర ణాన్ని సృష్టించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశాలలో భారతీయ జనతా పార్టీ మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చ గొట్టటానికి, మతపరమైన చీలికలు తేవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నది. జనవరి 26న జరగబోయే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో బిజెపి అనుకూల రాష్ట్రాల శకటాలను అనుమతించి,బెంగాల్‌, తమి ళనాడు,కేరళ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మొద లగు రాష్ట్రాల శకటాలను అను మతించక పోవటం వివక్షతలో భాగమే. 2019లో నరేంద్ర మోడీ రెండవసారి అధికారం లోకి వచ్చినప్పటి నుండి గత మూడే ళ్లుగా చేస్తున్న నిర్ణయాల ద్వారా ప్రజల మధ్య మత పరమైన అగాధాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేస్తున్నారు. జమ్ము-కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370వ నిబంధనను రద్దు చేయటమేకాక, కాశ్మీర్‌ రాష్ట్ర ప్రతిపత్తిని కూడా రద్దు చేయటం దీనిలో భాగమే (ఇప్పుడు కార్పొరేట్లు కాశ్మీర్‌లో భూముల కోసం ఎగబడుతున్నారు).అంతేకాకుండా పౌరసత్వ అంశాన్ని ముందుకు తెచ్చి పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) చేయడం, నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పిఆర్‌) మొదలగు వాటిని ప్రతిపాదించటం మతపరమైన భావాలను రెచ్చగొట్టడంలో భాగమే. పైఅంశాలన్నీ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
ఎ.పిలో మతతత్వ శక్తుల కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మతోన్మాదాన్ని రెచ్చగొట్టటానికి మతతత్వ శక్తులు ప్రయత్నిస్తు న్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో భజన సంఘాలు,పండగలు,ఉత్సవాల పేరుతో తమ భావజాలవ్యాప్తికి ఉపయోగించుకుం టున్నా రు. ఇటీవల గుంటూరులో జిన్నా టవర్‌ పేరు మార్చాలని, కూల్చివేయాలని ప్రచారం ప్రారంభిం చారు. హిందూ ఐక్యవేదిక పేరుతో ప్రదర్శనకు పిలుపు ఇచ్చారు. విశాఖపట్నంలో కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌ పేరు మార్చాలని పిలుపు ఇచ్చారు. ఆత్మకూరులో మసీదు అంశాన్ని బిజెపి నాయకులు వివాదంగా మార్చి ఘర్షణకు దిగారు. కడప జిల్లా లో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ప్రతిష్టాపనకు వ్యతిరే కంగా క్యాంపెయిన్‌ చేశారు. శ్రీశైలంలో దుకా ణాలు పెట్టుకున్న ముస్లింలపై దాడులు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బిజెపి ప్రభుత్వం అన్యా యం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విభజన చట్ట హామీలు అమలు జరపలేదు. విశాఖ పట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణకు పూను కున్నది. ప్రజలలో వీటిపై చర్చ లేకుండా మతో న్మాద భావల వైపు మళ్లించాలన్నది బి.జె.పి ఆలోచనా విధానం. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీగాని, ప్రతిపక్ష పార్టీ లైన తెలుగుదేశం, జనసేన గాని బి.జె.పిమతోన్మాద విధానాలను ఖండిరచటం లేదు.
ప్రస్తుత బి.జె.పిప్రభుత్వం ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావాలను అమలు చేయటమే కాక, మత విభజన ద్వారా ప్రజలలో తనరాజకీయ ప్రాబల్యాన్ని కొన సాగించటానికి ప్రయత్నిస్తున్నది. దీనివలన లౌకిక రాజ్యాంగ ఆశయాలు,లక్ష్యాలు దెబ్బ తింటాయి. లౌకిక రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది. దేశంలోని ప్రజలు, మేధావులు, ప్రగతిశీల శక్తులు, కార్మికులు,ఉద్యోగులు ఉపాధ్యాయులలో విస్తృతంగా ప్రచారం చేసి మతోన్మాద, మతతత్వ శక్తులను ఏకాకులను చేయాలి.
వ్యాసకర్త :శాసనమండలి సభ్యులు,లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్‌- (బి.కృష్ణారెడ్డి/కె.యస్‌. లక్ష్మణరావు)