స్వేఛాయత వాతావరణంలో ఎన్నికలు`2024

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, విశాఖ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 2024 మే13న జరుగు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో స్వేచ్ఛా యుత వాతావరణంలో సాధారణ ఎన్నికలు జరిగేం దుకు సహకరించాలని జిల్లాఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి,నామినేషన్లు,ప్రచారం, పోలింగ్‌,కౌంటింగ్‌ తదితర ఎన్నికల ప్రక్రియపై రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో స్థానిక వుడా చిల్డ్రన్స్‌ ఎరీనాలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన మార్చి 20నవిస్తృత అవగా హన సదస్సు జరిగింది.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అనగా జూన్‌ 6వ తేదీ వరకు ఈకోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్ని కల సంఘం,రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి ఆదే శాల మేరకు జిల్లాలోని ప్రతి రాజకీయ పక్షం నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. స్వేచ్చా యుత వాతావరణంలో, పారదర్శకంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా రాజకీయ పక్షాలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన క్షణం నుంచి జిల్లాలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన విగ్రహాలకు ముసుగులు వేశామని,ఏడు వేలవరకుకటౌట్లు,జెండాలు, హోర్డింగులను తొలగించామని పేర్కొన్నారు. ప్రభుత్వ,ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు,పోస్టర్లు, బ్యానర్లను అనుమతించబో మని తేల్చిచెప్పారు. హైవేలు, ప్రధాన రహదారులు సమీపంలో ఇప్పటి వరకు ఉన్న హోర్డింగులను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు రిటర్నింగ్‌ అధికారి అనుమతితో కేటాయిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున నూతన ప్రదేశాల్లో హోర్డింగులు పెట్టు కునేందుకు అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. ఇంటి పైకప్పులపై కటౌట్లు, జెండాలు వంటివి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకోవా లన్నారు. ర్యాలీలు, పాఠశాల, కళాశాల మైదానాలు, అతిథి గృహాలు వంటివి వినియోగించుకోవాలన్నా రిటర్నింగ్‌ అధికారి అనుమతి తప్పనిసరి అని, అయితే ఇందుకోసం సువిధ యాప్‌ ఉందని, అందు లో ముందుగా 48గంటల ముందు నమోదు చేసుకున్నవారికి రాజకీయ పక్షాలపై వివక్ష లేకుండా తొలి ప్రాధాన్యతను ఇవ్వనున్నామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. పార్లమెంటు అభ్యర్ధి రూ.95 లక్షల వరకు, అసెంబ్లీ అభ్యర్ధి రూ.40లక్షల వరకు వ్యయం చేసుకునే వెసులుబాటు ఉందని, అయితే ఎన్నికల నియమావళి అమలు నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం వరకు చేసిన ఖర్చులన్నీ ఆయా పార్టీ ఖాతాల్లో నమోదు చేస్తామని, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి వ్యక్తిగత ఖాతాల్లో నమోదవుతా యని చెప్పారు. రాజకీయ పక్షాలకు చెందిన ప్రతి అభ్యర్ధిపై నిఘా ఉంటుందని,వారు ఖర్చుచేసే ప్రతి పైసాను ఎన్నికల వ్యయంలో లెక్కిస్తామని పేర్కొ న్నారు.ఆర్‌ఓ అనుమతి లేకుండా బైకు ర్యాలీ, ఇతర ర్యాలీలను నిర్వహించరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని, కోడ్‌ ఉల్లంఘనగా భావించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం,రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొనరాదని, ఒకవేళ ఎక్కడైనా పాల్గొన్నట్లు తమ దృష్టికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభు త్వ ఉద్యోగులు,ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఎన్నికల విధుల్లోతప్ప,ఇతర కార్యక్రమాల్లో పాల్గొన రాదని,అలా పాల్గొన్నారని తమ దృష్టికి వస్తే ఏమా త్రం ఉపేక్షించబోమని,అవసరమైతే కేసులు పెడతామని హెచ్చరించారు.పౌరులు కోడ్‌ ఉల్లం ఘన సంబందించి చర్యలు గుర్తించినచో సి.విజల్‌ యాప్‌ నందు తమ ఫిర్యాదులను నమోదు చేయ వచ్చని,నమోదు చేసిన 100 నిమిషాల్లో స్పందించి ఫిర్యాదుదారునికి తీసుకున్న చర్యలు గురించి తెలియజేస్తామని చెప్పారు. సి-విజిల్‌ యాప్‌ లో ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు అందాయని, వాటిపై వివరాలు తెలియజేసినట్లు కలెక్టర్‌ వివరించారు. అభ్యర్ధి, ఏజెంట్లు, అనుచరులు వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండరాదని, అలాగే వస్తు రూపేణా రూ.10వేలకు మించి ఉండరాదని,డొనేషన్స్‌ రూపేణా రూ.20వేలకు మించి స్వీకరించరాదని కలెక్టర్‌ తేల్చిచెప్పారు.లక్ష రూపాయలకు మించి నగదు బదిలీ చేసినట్లయితే నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగానికి, ఆదాయపు పన్నుశాఖ వారికి తెలుస్తుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
పెయిడ్‌ ఆర్టికల్స్‌ విషయంలో అటు అభ్యర్థులు,ఇటు మీడియా ప్రతినిధులు అప్రమ త్తంగా ఉండాలని,అటువంటి వాటిని ఎం.సి. ఎం.సి.(మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మీడియా మోన టరింగ్‌) కమిటీ పరిశీలించి తదుపరి చర్యలకై ఆర్‌.వో.కు రిఫర్‌ చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికపుడు ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రా నిక్‌ మీడియాకు అందిస్తామని తెలిపారు. ఊహాగా నాలకు తావిస్తూ ధృవీకరణ చేసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని, వార్తలను ప్రచారం చేసేముందు జిల్లాఎన్నికల అధికారి లేదా రిటర్నింగ్‌ అధికారి వద్ద నుంచి సరైన సమాచారాన్ని పొందిన తదుపరి మాత్రమే ప్రచారం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి మీడియా ప్రతినిధులకు సూచిం చారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ః జీవీఎంసీ కమిషనర్‌ నోడల్‌ అధికారి- సీ.ఎం.సాయికాంత్‌ వర్మ : రాజకీయ పార్టీ లేదా వ్యక్తులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఎన్నికల వేళ ప్రజలు నచ్చిన విధంగా ఓటు హక్కు ను వినియోగించుకునేలా చేయడం ఎన్నికల ప్రవర్త నా నియమావళి ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూ లుతో ఎం.సి.సి.అమల్లోకి వచ్చిందన్నారు. పర్య వేక్షణ నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది బృందాలను నియమించామని, జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి బృందాలు పని చేస్తున్నట్లు చెప్పారు. ఎం.సి.సి. అమల్లోకి వచ్చిన నాటి నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన హోర్డింగులు,కటౌట్లు,జెండాలను తొలగిం చామ ని,విగ్రహాలను మూసివేశామని గుర్తు చేశారు. ఇకపై రాజకీయ పక్షాలు హోర్డింగులు, జెండాల కొరకు రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతి తప్పనిసరిఅని,కరపత్రాలు,గోడపత్రికలపై ఆర్‌.ఓ. అనుమతితో పాటు ప్రచురించిన ముద్రణ సంస్థ పేరు తప్పనిసరిగా ఉండాలని తేల్చిచెప్పారు. ఏ విధంగానైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పక్షాల అభ్యర్ధులు గుర్తించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలు,ర్యాలీలు,సభల నిర్వహణ కోసం వినియోగించుకునే ప్రాంగణాల కోసం సువిధ యాప్‌ నందు దరఖాస్తు చేసుకోవాలని లేదా ూఱఅస్త్రశ్రీవ ఔఱఅసశీష జశ్రీవaతీaఅషవ జవశ్రీశ్రీ ద్వారా సంబంధిత Rూనుండి అనుమతులు తీసుకో వచ్చు ను. ముందుగా చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. 10 వాహనాలను ఒక యూనిట్‌ గా వినియోగించుకోవాలని, పది వాహనాలకు దాటితో 100అడుగులు డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేయా లని స్పష్టం చేశారు. వాహనాలు ఎవరి పేరున తీసుకున్నారో,వారు మాత్రమే వినియోగించు కోవాలని,వేరే వ్యక్తులు వినియోగించినట్లయితే కోడ్‌ ఉల్లంఘన కింద వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా సమావేశాలు, లౌడ్‌ స్పీకర్లను వినియోగించరాదన్నారు.పోలీసు అధికా రులు చెప్పిన ప్రకారం రోడ్‌ షోలు, ర్యాలీలు చేసుకో వాలని సూచించారు. ఓటర్ల స్లిప్పులను బి.ఎల్‌.ఓ లు పంపిణీ చేస్తారని, పార్టీల ప్రతినిధులు చేయాల్సి వస్తే తెల్ల కాగితంపై ఉన్న ఓటరు స్లిప్పులనే విని యోగించాలే తప్ప,ఇతర రంగులు వినియో గించ రాదని,అలా చేస్తే కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణి స్తామని పేర్కొన్నారు. పోలింగ్‌ సమయంలో హో టళ్లు, అతిథి గృహాల్లో బయట వ్యక్తులు ఉండరాదని సూచించారు. ఎటువంటి చీరలు,నగదు, వస్తువులు ఇతరులకు పంపిణీ చేయరాదని,అలా చేస్తే ఆ వాహనాన్నిసీజ్‌ చేస్తామని అన్నారు.మంత్రులు అధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించ రాదని, అధికారిక పనులను ఎన్నికలకు వినియోగిం చుకునేలా చేస్తే అటువంటి వాటిని కూడా కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణిస్తామని పేర్కొన్నారు. కుల, మతాల మధ్య గొడవలు సృష్టించరాదని,దేవాల యాలు,చర్చిలు,మసీదులను రాజకీయాలకు వినియో గించరాదని స్పష్టం చేసారు. ఓటరును ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం చేయరాదని, అలాగే అభ్యర్థుల ఇళ్ల ముందు ధర్నాలు చేయరాదన్నారు. ఒక పార్టీ సమావేశాలను ఇతర పార్టీలు ఆటంకం కలిగించేలా వ్యవహరించరాదని, ఎటువంటి ఆయు ధాలు కలిగి ఉండరాదని ఆయన రాజకీయ పక్షా లకు వివరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వ్యవహ రించాలి ః సీపీ డా.ఎ.రవిశంకర్‌ : జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా రాజకీయ పక్షాలు వ్యవహరించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించాలని పోలీస్‌ కమిషనర్‌ డా. ఎ. రవిశంకర్‌ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పక్షాలు నిర్వహించే సమావేశాలు, సభలు, ర్యాలీలు, లౌడ్‌ స్పీకర్లు వినియోగించుకునే ముందు ఆయా రిటర్నింగ్‌ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అన్నారు. ఇందుకోసం సువిధ యాప్‌ ఉందని, సువిధలో నమోదు చేయలేని వారు రిటర్నింగ్‌ అధికారి వద్ద అనుమతి పొందవచ్చ న్నారు. సమావేశాలు నిర్వహించే తేదీ, సమయం, ర్యాలీలో పాల్గొనే వ్యక్తుల సంఖ్య తదితర వివరాలు స్పష్టంగా ఉండాలని, అన్ని పార్టీల దరఖాస్తులను పరిశీలించిన పిదప అనుమతిని మంజూరు చేస్తా మని తెలిపారు.రాజకీయ పక్షాల చేసే ప్రతి పనినీ సర్వేలైన్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌,ఎం.సి.సి.,తదితర బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తాయని అన్నారు. వీటిలో పోలీసు అధికారులు ఉంటారని, అయితే ఈ బృందాలకు ఆయా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అధిపతిగా వ్యవహ రిస్తారని చెప్పారు. రాజకీయ పక్షాలు ముందుగా నమోదు చేసిన రూటులో కాకుండా వేరే మార్గాన ర్యాలీలు నిర్వహిస్తే వాటిని కోడ్‌ ఉల్లంఘనగా గుర్తిస్తూ, పంచనామా చేసి ఎంపీడీవో నివేదిక ఇస్తారన్నారు. ఆధారాలు లేకుండా ఫిర్యాదులు చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్‌ బూత్‌ లలో హాజరయ్యే వారి వివరాలు ముందుగా ఇవ్వాలని, వారి వివరాలు పరిశీలించి అనుమతి ఇస్తామని తేల్చిచెప్పారు. మతపరంగా గొడవలు, వ్యక్తిగత తగాదాలు ఉం డరాదని, ముగ్గురు వ్యక్తులతో కూడిన గ్రీవెన్స్‌ కమిటీ జిల్లాలో ఉందని,ఎన్నికలకు సంబంధించిన ఎటు వంటి ఫిర్యాదులనైనా చేయవచ్చని పేర్కొన్నారు.-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

గిరిజన ప్రగతికి చిహ్నం ఈ గిరిజన సాహిత్యం

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత ‘‘ ఆచార్య ఎం.గోనా నాయక్‌ ’’ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజన సాహిత్యం ’’ అనే పుస్తకంపై సమీక్ష -డా. అమ్మిన శ్రీనివాసరాజు
పూర్వపు గిరిజన సాహిత్యం అంతా గిరిజనేతరులు రాసిన ‘‘అనుభూతి సాహిత్యం’’ నేటి ఆధునిక కాలంలో విద్యావంతులైన గిరిజన జన జాతి రచయితల రాస్తున్న ‘అనుభవ పూర్వక సాహిత్యం’ దీనిలో మరి కాస్త ప్రామాణికత ఉంటుంది అనేది విశ్లేషకులు మాట.
అచ్చంగా ఆ కోవకు చెందింది ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే ప్రామాణిక పుస్తకం. రచయిత ఆచార్య యం.గోనా నాయక్‌ గిరిజన సామాజిక వర్గంకు చెందిన అత్యు న్నత విద్యాభ్యాసం పూర్తి చేసుకుని విశ్వ విద్యాలయ ఆచార్యునిగా వృత్తి జీవితం గడుపుతున్నారు.
ఆచార్య నాయక్‌ లక్ష్యం తమ గిరిజన సంస్కృతి భాషా సాంప్రదాయాలను ప్రామాణికంగా విశ్వవ్యాప్తం చేయాలని, అందులో భాగంగానే విశ్వవిద్యాలయ స్థాయిలో అధ్యయనం చేస్తూ, రాస్తూ, విద్యార్థుల పరిశోధనలకు చేయూతనిస్తున్నారు.
ఆయన రాసిన అనేక గిరిజన భాషా పరమైన రచనల్లో ఒకటి ఈ ‘గిరిజన సాహిత్యం’ అనే పుస్తకం.దీనిలో గిరిజన మూలాలు,గిరిజన తెగలు,గిరిజనులు సాంఘిక ఆచారాలు,గిరిజనసాహిత్యం, పొడుపు కథలు, అనే విభాగాలు ఉన్నాయి.
మానవ శాస్త్రవేత్తల్లో ప్రముఖుడైన మోర్గాన్‌ చెప్పిన సిద్ధాంతాన్ని అనుసరించి ఆది మానవుని కన్నా ముందుతరం నుంచి నాటి ఆటవిక యుగంలోనే ఆదిమ గిరిజనులు ఈ భూమి మీద నివసించారని ఆధుని కాలం నుంచి తమదైన సంస్కృతిని పరిరక్షించుకుంటూ నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో మైదాన ప్రాంతాల్లో తమదైన ప్రత్యేక జీవన శైలిలో నేటికీ వీరు జీవిస్తున్నారు.
మానవ శాస్త్రవేత్తల నిర్వచనాలను అనుసరించి గిరిజనుల నామౌచిత్యాల వివరణ చేసి వివిధ శాస్త్రవేత్తల నిర్వచనాలను క్రోడీకరించి అందులోని సారూప్యతల ఆధారంగా గిరిజనుల లక్షణాలు భాషా తదితరాలను అభివ్యక్తీకరించారు.
రెండవ విభాగంలో గిరిజన తెగల గురించిన వివరణ దేశంలోని రాష్ట్రాలు ప్రాంతాల వారీగా ఆయా తెగల వివరణలు అందించి మొత్తం 35 తెగలుగా నిర్ధారించారు. ప్రతి తెగకు సంబంధించిన ముఖ్యమైన లక్షణాలను కూడా ఇందులో సంక్షిప్తంగా తెలపడం ఉపేత్తంగా ఉంది ప్రాచుర్యమైన గిరిజన తెగతో పాటు రోనా,మూకదొర,కూలియ, మాలీలు,వంటి మరికొన్ని గిరిజన తెగల వివరాలు కూడా ఇందులో పొందు పరిచారు.దీనిలో ఆయా గిరిజనులకు సంబంధించిన వర్గీకరణ శాస్త్రీయంగా అందించారు.గిరిజనుల సాంఘిక ఆచారాల విషయానికి వస్తే గృహ నిర్మాణం మొదలుకుని వారి వేట,వేట సాధనాలు,పండుగలు,నృత్యాలు, రీతులు వివరించారు దీనిలో ఆయా గిరిజనులు చేసే నృత్యాల రకాలు సవివరంగా వ్రాశారు వీటిలో జాతావులు చేసేగజ్జల నృత్యం,గొలుసు నృత్యం,కోంధ్‌లు చేసే మయూరి నృత్యం, భగత, వాల్మీకి,తెగల వారు చేసే గుమ్మలాట నృత్య విశేషాలు గురించి ఆసక్తికరంగా వివరించారు.
నమ్మకానికి చిరునామాదారులైన ఆదివాసీల్లోని విభిన్న రకాల నమ్మకాలను క్షుణ్ణంగా సహేతుకంగా రచయిత గోనా నాయక్‌ వివరించారు
ఆదివాసీల నమ్మకాలు ఎక్కువగా ప్రాకృతిక శక్తుల నుంచి తమను తాము రక్షించు కోవ డానికి, సులభంగా వేటాడుకోవడానికి,వారి జీవనం సక్రమంగా సాగిపోవడం కోసం, ప్రకృతిలో కనబడని శక్తుల్ని పూజించటం, బలు లు ఇవ్వడం చేస్తారు.వీరిజీవితంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక నమ్మకాన్ని సూచిస్తుంది.
కలలకు సంబంధించి, ఆరోగ్య సంబంధం, గృహ సంబంధిత, వ్యవసాయ సంబంధిత,దైవ సంబంధిత, వార వస్తు, వేటకు సంబంధించిన వీరి నమ్మకాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటా యి. వీటిపూర్వకాల పద్ధతులు సంఘటనలు ముడిపడి ఉన్న సామాజిక శాస్త్రీయతలు కల గల్సి ఉంటాయి. గిరిజనుల్లో కనిపించే వైద్య విధానంలో నాటు పద్ధతులు కనిపించిన అంతర్గతంగా శాస్త్రీయత ఆగుపిస్తుంది వీరి వైద్యంలో ప్రధానంగా అనేకుల అనుభవాల సమ్మేళనం కనిపిస్తుంది వీరు ఎక్కువగా అడవుల్లో లభ్యమయ్యే వనమూలికలు,చెట్ల ఆకులు,బెరడు,అడవి జంతు వులను మందులుగా ఉపయోగిస్తారు.
పాల చెక్క పచ్చిపసుపుల మిశ్రమం నీళ్ళ విరోచనాలు తగ్గడానికి, బర్నిక చెట్టు పాలను దగ్గు తగ్గడానికి, మూర్ఛ వ్యాధి నయం కావడానికి పులి కొవ్వు, నడుం నొప్పికి ఉడు మాంసం ఒళ్ళు నొప్పులకు ఎలుగుబంటి కొవ్వు తాగించడం వంటి అనేక గిరిజన వైద్య విధానాలు ఇందులో తెలుసుకోవచ్చును.
ఇక ‘గిరిజనుల సాహిత్యం’ గురించి నాలుగో విభాగంలో వివరించారు, వీరి సాహిత్యమంతా మౌఖికంగా నృత్య గీతాలలో నిక్షిప్తం అయినట్టు ఇందులో చెప్పబడిరది.సాధారణంగా గిరిజనుల జీవన విధానం అంతా సంఫీుభావంతో ముడిపడి ఉంటుంది, వివిధ సామాజిక శాస్త్రవేత్తల నిజ నిర్ధారణ ద్వారా వీరి సంగీత నృత్య రీతులను నిర్ధారించి వివరించారు.
జానపద సంగీతం, శాస్త్రీయ సంగీతం,సృష్టి రూపాన్ని సంతరించుకోవడానికి ఎన్నో సంవత్స రాలకు ముందే ఈ గిరిజన సాహిత్యం పుట్టిం దని సంగీతానికి తొలి రూపం గిరిజనుల ఆటపాటలే అని నిర్ధారించారు.
నృత్య గీతాలు రకాలు నృత్య గీతాల అర్థ వివరణ వర్గీకరణ తదితరాలు ఇందులో క్రోడీకరించారు, దీనిలో వివిధ తెగల పాటలు అర్ధ వివరణలతో అందించడం వల్ల అందరికీ ఉపయోగంగా ఉంది.
అదేవిధంగా లంబాడాలు అని పిలవబడుతున్న బంజారాల మూలస్థానం గురించిన పూర్తి వివరణ సహేతుకంగా ఇచ్చారు.
వీరిలో కనిపించే సాంప్రదాయాల ఆధునీకరణ పద్ధతులు వారిలోని సంస్కృతి సాహిత్యాల అభివృద్ధి కారణాలు గురించి కూడా మనం ఇందులో కూలంకషంగా చదవవచ్చు.
సాహిత్యంలో భాగమైన పొడుపు కథలను చివరిదైనా ఐదవ భాగంలో ప్రస్తావించారు, గిరిజన తెగల్లో కూడా ఈ పొడుపు కథలు ప్రముఖ పాత్ర వహిస్తాయి ఇందులో వ్యవ సాయ,వివాహ,సామాజిక, పరిస్థితులకు సంబంధించిన వాటిని వర్గీకరించి వివరించారు.బంజారా భాషలోని పొడుపు కథలను తెలుగీక రించి ఇందులో రచయిత వివరించడం ఉపయుక్తదాయకం.
ఈ పుస్తకం నిడివిలో చిన్నదైన విషయ వివరణలో చాలా పెద్దది అనాలి,దీనిలో ప్రతి విషయాన్ని పరిశోధక రచయిత గోనా నాయక్‌ అత్యంత శ్రద్ధగా బాధ్యతాయుతంగా ప్రామా ణికంగా రాయడం అభినందనీయం.
నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణలో భాగంగా 2012లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణగా వెలువడ్డ ఈ పరిశోధనాత్మక పుస్తకం పరిశోధకుల పాలిట కల్పవృక్షంగా చెప్పవచ్చును. పరిశోధకులతో పాటు గిరిజన సాహిత్య అధ్యయన విద్యార్థులు, ఆసక్తిగల ప్రతి ఒక్కరూ విధిగా చదవదగ్గ విలువైన పుస్తకం ఇది.
పుస్తకం పేరు : గిరిజన సాహిత్యం, రచన : ఆచార్య యం.గోనా నాయక్‌, పేజీలు :124, వెల:30/- రూ,
ప్రతులకు : తెలుగు అకాడమీ, హిమాయత్‌ నగర్‌,హైదరాబాద్‌.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌ : 7729883223.

దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన

దేశంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయ డంలో మౌలిక సదుపాయాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ప్రాథమిక పెట్టుబడులలో కూడా ఇవే కీలకం. శ్రామిక, మూలధన రూపంలో ఉన్న విస్తారమైన వనరుల కార ణంగా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ఒకటిగా నిలిచింది.భారతదేశ ఆర్థిక వ్యవ స్థలో ఎంఈఐఎల్‌ ముఖ్యపాత్ర పోషిస్తోంది. పారిశ్రా మిక, వ్యాపార మౌలిక సదుపాయాలలో స్థిరమైన వృద్ధిని అందిస్తూ దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతోంది ఎంఈఐఎల్‌. మౌలిక సదుపాయాల్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధిని అందిస్తూ..ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక నీటి పథకాల ద్వారా సాగు, తాగు నీటిని అందిస్తోంది.భారీ విద్యుత్‌, రోడ్‌ టన్నెల్‌ ప్రాజెక్టులు చేపట్టి..వాటిని నాణ్యతా ప్రమాణా లతో పూర్తి చేస్తూ..దేశ వృద్ధిని పెంపొందిస్తోంది. దేశం లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందిస్తూ ఎంఈఐఎల్‌ తన సత్తా చాటుకుంటోంది.మౌలిక సదు పాయాలు, పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ ప్రసంగించారు..సారాంశం ఇదీ..!!
‘‘దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక సదుపాయాల అభి వృద్ధి ఒక చోదకశక్తి’ : ‘ప్రతిఒక్కరూ నూతన బాధ్య తలు,నూతన అవకాశాల విషయంలో గొప్ప నిర్ణ యాలు తీసుకోవడానికి ఇది తగిన సమయం’’ ‘భారతదేశంలో శతాబ్దాలుగా జాతీయ రహదారు లకు గల ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది’ ‘పేదరికం ఒక శాపం అనే ఆలోచనను తుడిచిపెట్ట డంలో మనం విజయం సాధించాం.‘ఇప్పుడు మనం మన వేగం పెంచాలి. మరింత దూసు కళ్ళాలి.పి.ఎం.గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ భారతదేశ మౌలికసదుపాయాలు, దాని బహుళన మూనా లాజిస్టిక్స్‌ రూపురేఖల్ని మార్చనుంది. ‘పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ప్లాన్‌ దేశ ఆర్థిక, మౌలికసదు పాయాల ప్లానింగ్‌ను అభివృద్ధితో అనుసంధానం చేస్తుంది.నాణ్యత,మల్టీమోడల్‌ మౌలికసదుపాయా లతో,మనలాజిస్టిక్‌ల ఖర్చురాగల రోజులలో మరిం త తగ్గనుంది. మౌలికసదుపాయాల బలంతో,దేశ సామాజిక మౌలిక సదుపాయాలుబలంగా ఉండ నున్నాయి.మీరు కేవలం దేశ అభివృద్ధికే కాదు, భారతదేశ పురోగతివేగం పెంచేందుకు దోహద పడుతుందన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ‘ మౌలికసదుపాయాలు,పెట్టుబడులు: పిఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ తో లాజిస్టిక్‌ సామర్ధ్యాలను మెరుగుపరచడం’ అనే అంశంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌ను నిర్వహించారు.బడ్జెట్‌ అనంతరం నిర్వహించే 12 వెబినార్‌లలో ఇది 8 వ వెబినార్‌. 2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన పలు కార్యక్ర మాలను సమర్ధంగా అమలు చేసేందుకు ప్రజల నుంచి ఆలోచనలు, సూచనలను స్వీకరించేందుకుఈ వెబినార్‌లను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా వెబి నార్‌లో పాల్గొన్న వారినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇవాల్టి వెబినార్‌లో వందలాది మంది పాల్గొంటుండడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.సుమారు 700 మంది సిఇఒలు, మేనేజింగ్‌ డ్కెరక్టర్లు ఇందులో పాలుపంచుకున్నారు.దీనిని బట్టి ఈ వెబినార్‌ ప్రాధాన్యత తెలుస్తోంది.వివిధ రంగా లకు చెందిన నిపుణులు, స్టేక్‌హోల్డర్లు ఈ వెబి నార్‌ను విజయవంతం చేశారని అన్నారు.మౌలిక సదుపాయాల రంగానికి ఈ ఏడాది బడ్జెట్‌ నూతన శక్తిని ఇస్తుందని ఆయన అన్నారు.బడ్జెట్‌కు సర్వత్రా ప్రశంసలు లభించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. బడ్జెట్‌ లో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలకు నిపుణుల నుంచి ప్రధాన మీడియా సంస్థలనుంచి ప్రశంసలు లభించాయన్నారు. భారతదేశపు కాపెక్స్‌ 2013`14 సంవత్సరంతో పోలిస్తే 5 రెట్లు పెరగిందన్నారు. ప్రభుత్వం జాతీయ మౌలికసదుపాయాల పైప్‌ల్కెన్‌ కింద 110 లక్షల కోట్లరూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ముందుకు పోతున్నదని చెప్పారు.నూతన అవకాశాలకు, నూతన బాధ్యతలకు, గొప్ప నిర్ణయాలు తీసుకోవ డానికి ఇదిఎంతో అనువైన కాలమని ప్రధానమంత్రి అన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచు కున్నప్పుడు,ఏ దేశ సుస్థిరాభివృద్ధిలో అయినా మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల చరిత్రకు సంబంధించిచన పరిజ్ఞానం కలవారికి ఈవిష యం బాగాతెలుసునని ఆయన అన్నారు. చంద్రగుప్త మౌర్యుడు ఉత్తరాపథ్‌ నిర్మించగా, అశోకుడు దానిని మరంత ముందుకు తీసుకువెళ్లారని, షేర్‌ షా సూరి దానిని అప్గ్రేడ్‌ చేశారని అన్నారు. దానిని బ్రిటిషర్లు జి.టి.రోడ్‌గామార్చారని చెప్పారు.జాతీయ రహదా రుల ప్రాధాన్యతను శతాబ్దాల క్రితమే భారత దేశంలో గుర్తించారని ప్రధానమంత్రి చెప్పారు. జలమార్గాలు,రివర్‌ ఫ్రంట్‌ల గురించి ప్రస్తా విస్తూ ప్రధానమంత్రి,బెనారస్‌ ఘాట్‌ ల గురించి ప్రస్తావిం చారు.ఈఘాట్లు జలమార్గాలద్వారా నేరుగా కల కత్తాతో అనుసంధానమై ఉండేవని చెప్పారు. తమిళనాడులోని 2000 సంవత్సరాల క్రితం నాటి కలనై డ్యామ్‌ ఇప్పటికీ నీటిని అందిస్తోందని ప్రధాన మంత్రి తెలియజేశారు. దేశ మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి పెట్టుబడుల విషయంలో గత ప్రభుత్వాలకు అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన అన్నారు.పేదరికం ఒకశాపమన్న భావనను తొల గించి,ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రస్తుతం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతు న్నట్టు ప్రధానమంత్రి తెలిపారు.మౌలిక సదు పాయాల రంగంలో పెట్టుబడులకు సంబంధించి పరిస్థితి మెరుగుపడినట్టు ప్రధానమంత్రి వివరిం చారు.2014 నాటికి ముందు ఉన్న పరిస్థితితో పోల్చినపుడు,జాతీయ రహదారుల నిర్మాణం సగ టున రెట్టింపు అయిందని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే 2014కు ముందు సంవత్సరానికి 600 రూట్‌ కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణ జరిగిం దని, అది ప్రస్తుతం సంవత్సరానికి 4000 కిలో మీటర్లకు చేరుకున్నదన తెలిపారు. అలాగే దేశంలో విమానాశ్రయాల సంఖ్య, సముద్ర పోర్టుల సామ ర్ధ్యం రెట్టింపు అయినట్టు ప్రధానమంత్రి తెలి పారు.‘‘మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా’’అని అంటూ ప్రధాన మంత్రి, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం రూపుదిద్దుకునే లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.ఇందుకు అనుగుణమైన మార్గాన్ని భారత దేశం అనుసరిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఇప్పుడు మనం వేగాన్ని మెరుగుపరచుకుని టాప్‌ గేర్లో ముందుకు పోవాలని అన్నారు. పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ అనేది,ఎంతో కీలకమైనది అని అంటూ ప్రధానమంత్రి, సమీకృత ఆర్ధిక,మౌలికక సదుపాయాల ప్రణాళికకు ఇది ముఖ్యమైనదని అన్నారు. గతి శక్తి జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ భారతదేశ మౌలిక సదుపాయాల రంగం, మల్టీ మోడల్‌ లాజిస్టి క్‌ ల ముఖచిత్రాన్ని మార్చివేయనున్నదని చెప్పారు. పి.ఎం.గతి శక్తి మాస్టర్‌ ప్లాన్‌ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.లాజిస్టక్‌ ల సమర్ధతపై ప్రభావం చూపుతున్న అంశాలను ,లోపాలను గమనించడం జరిగిందని ప్రధాన మం త్రి తెలిపారు.అందువల్ల ఈఏడాది బడ్జెట్‌లో 100 కీలక ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టి నట్టు తెలిపారు. ఇందుకు 75,000 కోట్ల రూపా యలు కేటాయించినట్టు ఆయన తెలిపారు. నాణ్యతతో కూడిన,మల్టీ మోడల్‌ మౌలిక సదు పాయాలతో,మన లాజిస్టిక్‌ ఖర్చులు రాగల రోజు లలో మరింత తగ్గనున్నాయి. ఇది భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తులపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది అనిఆయన అన్నారు.లాజిస్టిక్‌ రంగం తోపాటు సులభతర జీవనం,సులభతర వ్యాపారం విషయలోనూ పరిస్థితి మరింత మెరుగుపడనున్న దని చెప్పారు.మౌలికసదుపాయాల రంగంలో పెట్టు బడులు పెట్టాల్సిందిగా ఆయన ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించారు.రాష్ట్రాల పాత్ర గురించి వివరిస్తూ ప్రధానమంత్రి,50 సంవత్సరాల వడ్డీలేని రుణాలను మరో ఏడాది పొడిగించినట్టు తెలిపారు. ఇందుకు బడ్జెట్‌ వ్యయం 30శాతానికి పెంచినట్టు ప్రధాన మంత్రి తెలిపారు.మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధికి వివిధ మెటీరియల్స్‌ అవసరం ఉన్నం దున,ఆయా రంగాల అవసరాలకు సంబంధించి ముందస్తు అంచనాలు రూపొందించాలని ప్రధాన మంత్రి సూచించారు.భవిష్యత్‌ సుస్పష్టంగా ఉన్నందున మనం సమీకృత విధానాన్ని అనుసరిం చాలని ప్రధానమంత్రి సూచించారు. ఇందులో పి.ఎం.గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ కీలక పాత్ర పోషి స్తుందని ఆయన అన్నారు.ఈరంగంతో సర్కులర్‌ ఎకానమీని సమీకృతం చేయాల్సిన అవసరం ఉం దని ఆయన అన్నారు.కచ్‌ ప్రాంతంలో భూకం పం వచ్చినప్పడు తన అనుభవాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.సహాయ కార్యక్రమాల అనం తరం కచ్‌ ప్రాంతంలో పూర్తిగా నూతన అభివృద్ధి విధానాన్ని అనుసరించినట్టు ఆయన తెలిపారు. మౌలక సదుపాయాల అభివృద్ధి తో కూడిన అభివృ ద్ధిని ఈ ప్రాంతంలో చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు. రాజకీయంగా అవసరార్థం నిర్ణయాలు తీసుకోవడం కాకుండా కచ్‌ ప్రాంతాన్ని ఒక గొప్ప ఆర్ధిక కార్యకలాపాలక్షేత్రంగా మార్చినట్టు ప్రధాన మంత్రి తెలిపారు.దేశ సామాజిక మౌలిక సదుపా యాలను బలోపేతం చేయాలంటే,భారతదేశపు భౌతిక మౌలిక సదుపాయాలు కూడా ఎంతో ముఖ్యమైనవని ఆయన అన్నారు.బలమైన సామా జిక మౌలిక సదుపాయాలు,మరింత ప్రతిభ కలిగిన, నైపుణ్యం కలిగిన యువత దేశానికి సేవ చేయ డానికి ముందుకు రావడానికి వీలు కల్పిస్తాయని అన్నారు.నైపుణ్యాల అభివృద్ధి, ప్రాజెక్టు యాజమా న్యం,ఆర్ధిక నైపుణ్యాలు, ఎంటర్ప్రెన్యుయర్‌ షిప్‌, ఈ లక్ష్యాలు నెరవేర్చడానికి ఉపకరిస్తుందని చెప్పారు.నైపుణ్యాల కు సంబంధించిన సమాచారం అందించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకో వాలని సూచించారు.ఇది వివిధ రంగాలలోని చిన్న,పెద్ద సంస్థలకు ఉపయోగపడుతుందని చెప్పా రు.ఇది దేశమానవ వనరుల శక్తి సద్విని యోగానికి ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. ఈదిశగా ప్రభు త్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు సత్వరం కృషి చేయాలని ప్రధానమంత్రి సూచించారు.ఈ వెబి నార్‌ లోని ప్రతి స్టేక్‌ హోల్డర్‌ ఇచ్చే సూచనలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని అంటూ ప్రధాన మంత్రి,వీరు దేశ అభివృద్ధికి తోడ్పడడమే కాకుండా, భారత దేశ ప్రగతి వేగం పరుగులు పెట్టడానికి దోహదపడుతున్నారని అన్నారు.మౌలిక సదుపా యాల అభివృద్ధి రైలు, రోడ్డు, పోర్టులు, విమానాశ్ర యాలకు మాత్రమే పరిమితం కాదని,ఈ ఏడాది బడ్జెట్‌ లో భాగంగా భారీ ప్రాజెక్టులను చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు.గ్రామాలలో రైతుల పంట ను నిల్వచేసే సదుపాయాలకు సంబంధించి భారీ ప్రాజెక్టులు చేపడుతున్నట్టు చెప్పారు. నగరాలు, గ్రామాలలో వెల్‌ నెస్‌ సెంటర్లను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు.నూతన రైల్వే స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాల నిర్మాణం జరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు.ఈ వెబినార్లో వివిధ స్టేక్‌ హోల్డర్లు ఇచ్చే సూచనలు, సలహాలు, వ్యక్తం చేసిన అభిప్రాయాలు.వారి అనుభవాలు అన్నీ ఈ ఏడాది బడ్జెట్‌ వేగంగా,చురుకుగా అమలు చేయడానికి పనికి వస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించి ఒక పదాన్ని మీరు గనక తొలగించినట్లయితే అది అర్థ రహితం అవుతుంది.ఆ పదమే ‘డిజిటల్‌’బీ న్యూ ఇండియా ఆవిష్కారంలో దానికి ప్రతీకగా మారిన పదం ఇదే.ఈడిజిటల్‌ ఇండియా ఉద్యమం ఫలితం గా టెలికాం డేటా అన్నది భారతదేశం లోని మారు మూల గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటు లోకి వచ్చింది. గత నాలుగున్నర సంవత్సరాల లో టెలికమ్‌ మౌలిక సదుపాయాల కల్పన రంగం లో మునుపటి తో పోల్చితే మా ప్రభుత్వం ఆరు రెట్లు అధికం గా పెట్టుబడులను ప్రవహింపజేసి, దానిని మరింత బలోపేతం చేసింది.-జి.ఎన్‌.వి.సతీష్‌

అన్నపురాజులు ఒకచోట..ఆకలి మంటలు ఒకచోట

అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలు ఒక చోట.. అలసిన దేహాలు ఒకచోట..సంపద అంతా ఒకచోట.. గంపెడు బలగం ఒకచోట..’ అంటూ కొన్ని దశాబ్దాల క్రితం ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు అసమానతలపై ధర్మాగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. నేటికీ అవి పెచ్చుమీరుతూనే ఉన్నాయి. అనంతపురం కలెక్టరేట్‌కు సమీపంలోనే దళిత మహిళ అంజలి ఆకలితో అలమటిస్తూ.. కన్నుమూసింది. మరోవైపు భారత్‌ బ్రిటీష్‌ రాజ్‌ నుంచి బిలియనీర్‌ రాజ్‌గా మారిందని ప్రపంచ అసమానతల ల్యాబ్‌ నివేదిక ఎత్తిచూపింది.
ప్రభుత్వ ఆదాయమంతా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకే ఖర్చు చేసెస్తున్నా యని,ప్రజలను బిచ్చగాళ్లుగా చేస్తున్నారని కార్పొ రేట్‌,మీడియాలో ప్రచారం నిత్యం హోరెత్తి పోతూ నే ఉంది. మీడియాలో సింహభాగాన్ని ఆక్రమించిన గోడీ మీడియా సంగతి ఇక చెప్పనక్కరేలేదు. మద్యా నికి బానిసై వేధించుకుతినే భర్త, తిండి లేక అలమ టిస్తూ అడుక్కుంటున్న ముగ్గురు బిడ్డలు,రోజుల తరబడి ఆహారం లేక బక్కచిక్కి ఆకలితో మరణిం చిన అంజలి ఉదంతం.ఆ ప్రచారంలోనూ,నేటి సంక్షేమ పథకాల అమలులోనూ ఉన్న డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి.అంజలి, ఆమె పిల్లలకు ఆధార్‌ కార్డే లేదు. ఇంటింటికీ సంక్షేమ పథకాలంది స్తున్నా మంటున్న ప్రభుత్వాలకు, అధికారులకు, వాలంటీర్ల కు ఇల్లేలేని ఆమె కనిపించనేలేదు. కనీసం బియ్యం అందినా అంజలి ప్రాణం నిలబడేదని చెబుతున్న స్థానికుల మాటలు చేదు నిజాలను కళ్లముందుంచు తున్నాయి.77ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో..మరీ ముఖ్యంగా2000నుంచీ విపరీతంగా పెరిగి పోయి న ఆర్థిక అసమానతలు పేదల ఆకలిచావు లకు, రైతుల ఆత్మహత్యలకు కారణభూతమవుతున్నాయి. 15 కోట్ల మంది నిరుపేదలు ఒక్కపూట తిండికోసం అల్లాడుతున్నారని తాజా నివేదిక ఎత్తిచూపింది. 144 కోట్ల మంది ప్రజలు నా అక్కచెల్లెల్లు, అన్నద మ్ములు అని నిత్యం ప్రధాని మోడీ వల్లెవేస్తుండగానే ప్రపంచ ఆకలి సూచీలో 125దేశాలకుగాను అట్ట డుగున111వ స్థానానికి మనదేశం దిగజా రింది. 2015 నుంచి పురోగతి శూన్యమని గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ తేల్చిచెప్పింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లోనే 38శాతం మంది పోషకా హార లోపంతో బాధపడుతున్నారు.ఇబ్బడిము బ్బడి గా పెరుగుతున్న కార్పొరేట్ల ఆదాయం, వారి దురాశే పేదరికాన్నిరోజురోజుకూ వృద్ధి చేస్తోందని ఆక్స్‌ ఫామ్‌ తేల్చిచెప్పింది.1947నుంచి 80 వరకూ అస మానతలు తగ్గుముఖం పట్టగా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలుతో అసమానతలు పెరి గాయి. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపద కేంద్రీకరణ మరింత పెరిగి పోయింది.1951లో 11.5శాతం జాతీయాదా యం మాత్రమే వారి చేతుల్లో ఉండేది. 10 శాతం సంపన్నుల చేతిలో1951లో 36.7శాతం సంపద ఉండగా,2022నాటికి57.7శాతానికి పెరిగి పోయింది. అంతేలే పేదల గుండెలు.. అశ్రువులే నిండిన కుండలు అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు పేదలబతుకులు రోజురోజుకూ తీసికట్టుగా మారి పోతున్నాయి.దిగువన ఉన్న 50శాతం మంది ఆదాయం 1951లో20.6శాతం ఉండగా, 2022 నాటికి 15శాతానికి పడిపోయింది. జనాభాలో దాదాపు 40శాతంగా ఉన్న మధ్యతరగతి ఆదా యం కూడా 42.8 శాతం నుంచి 27.3 శాతానికి తగ్గిపోయింది.2022లో మనదేశ జాతీయాదాయం లో 22.6 శాతం, 40.10శాతం ఆస్తి ఒకశాతం సంపన్నుల చేతిలో ఉంది.1991లో ఒకే ఒక శత కోటీశ్వరుడు ఉంటే 2022 నాటికి 162కి పెరిగి పోయింది. ఆరోగ్యం, విద్య, పోషకాహారం వంటి విషయాలలోనూ ప్రభుత్వ పెట్టుబడులు సగటు భారతీయుల స్థితిగతులను మార్చేకన్నా సంపన్నులకు కట్టబెట్టేందుకు దోహదం చేస్తున్న దుస్థితిని నివేదిక ఎత్తిచూపింది.
‘ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) అనుమతిస్తే, ప్రపంచానికి ఆహార నిల్వలను అందిం చేందుకు భారత్‌ సిద్ధం’.గత ఏప్రిల్‌లో గుజరాత్‌ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆర్భా టంగా చేసిన ప్రకటన ఇది. ప్రధాని అలా చెప్పారో లేదో.. ప్రపంచానికి భారత్‌ అన్నపూర్ణగా మారి పోయిందంటూ కమలశ్రేణులు గప్పాలు కొట్టాయి. అయితే,భారత్‌లో ఆహార సంక్షోభం, పోషకాహార లోపం, శిశు మరణాల రేటు ప్రమాదకరస్థాయికి చేరిం దంటూ నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ దారుణమైన స్థితికి పడిపోయింది. ఎంతలా అంటే.. కటిక పేద దేశాలుగా పరిగణించే సూడాన్‌, రువాం డా,నైజీరియా,ఇథియోపియా,రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోతోపాటు యుద్ధంతో కకావికలమై, తినడానికి గింజలు లేక అల్లాడుతున్న ఉక్రెయిన్‌ కంటే కూడా హీనమైన ర్యాంకును నమోదు చేసింది.మోదీ 10ఏండ్ల పాలనలో ఆకలిసూచీలో భారత్‌.. ఏకం గా 52 స్థానాలను కోల్పోయింది.
దారుణమైన పరిస్థితి
వివిధ దేశాల్లో ఆకలి స్థాయులు, పోషకాహార లోపాలను సూచించే ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌-జీహెచ్‌ఐ)లో భారత్‌ స్థానం మరింతగా దిగజారింది.2022 సంవత్సరానికిగానూ మొత్తం 121దేశాలను పరిగణలోకి తీసుకొంటే 29.1 హంగర్‌ స్కోరుతో భారత్‌ 107వస్థానంలో నిలిచింది. గత కొంత కాలంగా తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న పొరుగు దేశం శ్రీలంక, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, పేద దేశాలుగా పిలిచే సూడాన్‌, రువాండా, నైజీరియా, ఇథియో పియా,రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోతో పాటు యుద్ధంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌ (36) తో పోలిస్తే భారత్‌ దారుణమైన ర్యాంకుకు పడి పోవడం గమనార్హం. ఈ మేరకు జీహెచ్‌ఐ వార్షిక నివేదికను కన్‌సర్న్‌ వరల్డ్‌వైడ్‌, వెల్త్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు శనివారం సంయుక్తంగా ప్రచురించాయి. భారత్‌లో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉన్నదని హెచ్చరించాయి. సూచీలో చైనా, కువైట్‌, టర్కీ సహా 17దేశాలు 5కంటే తక్కువ స్కోర్‌తో అగ్ర స్థానంలో నిలిచాయి.ఎంతదారుణమంటే.. దక్షిణా సియాలోని అన్ని దేశాలకంటే కూడా దిగువ స్థానా నికి భారత్‌ చేరుకొన్నది.
మోదీ నిర్వాకం ఇది
పైకి ఉత్తుత్తి మాటలు చెప్పాలంటే మోదీ ఆయన వందిమాగధ జనం ఎంత పెప్ప మన్నా చెప్తారు. కానీ..మోదీ ఆయన మంత్రిగ ణానికి ఎలాంటి దూరదృష్టి కానీ, దార్శనికత కానీ సున్నాశాతం కూడా లేదు.ముఖ్యంగా ఆహార భద్రత విషయంలో ఎంతమాత్రం ప్రణాళిక లేదు. దేశం లో ఒకవైపు ఆకలి కేకలు వినిపిస్తుంటాయి. మరో వైపు ఏరాష్ట్రంలోనైనా రైతులు కష్టపడి ధాన్యం పండిస్తే..తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలఆహారభద్రత హక్కును పణంగా పెడతారు.
పండిన ధాన్యాన్ని కొనరు. ఇదేమయ్యా అంటే.. ఓప్‌ా మాదగ్గర నాలుగేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలున్నాయని చెప్తారు. ధాన్యం బాగా పండుతున్నప్పుడు నిల్వల సామర్థ్యాన్ని పెంచవచ్చు కదా అంటీ అదీ చేయరు. ఉన్న నిల్వలను పేదలకు పంచాలి కదా..అంటే అదీ చేయరు.ధాన్యం నిల్వల నిర్వహణకు ఒక విధానమంటూ ఉండదు. బోలెడు నిల్వలు ఉన్నయనిచెప్పి నాలుగైదు నెలలైనా కాలేదు. ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వలు నిండుకున్నయి. లబోదిబోమంటూ..గోధుమలు,బియ్యం, నూకలు.. ఇలా అన్నింటి దిగుమతులపైనా నిషేధం విధిం చారు.ఓపక్క పండిరచడానికి రైతుసిద్ధంగా ఉన్న ప్పటికీ అతనికి మోదీ సర్కారు నుంచి మద్దతు కొరవడిరది సరికదా.. వ్యవసాయాన్నే దారుణంగా దెబ్బతీసే దిశగా మోదీ దుందుడుకు విధానాలు సాగుతున్నాయి. విచిత్రమేమిటంటే.. ఎగుమతులపై నిషేధం విధించటమే ఆలస్యం..దేశంలోని గోధు మల్లో సింహభాగం ముకేశ్‌ అబానీ కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి.ఇదొక్క నిదర్శనం చాల దా మోదీ దర్శనం కార్పొరేట్ల కోసమేనని చెప్ప డానికి..
ఏమిటీ సర్వే? నిర్వహించేదెవరు?
ప్రపంచదేశాల్లో నెలకొన్న ఆకలి స్థాయి లు, పిల్లల్లో పోషకాహారలోపం,శిశుమరణాలు తదితర గణాంకాలు ఆధారంగా చేసుకొని జీహె చ్‌ఐ వార్షిక నివేదికను ఐర్లాండ్‌కు చెందిన కన్‌సర్న్‌ వరల్డ్‌వైడ్‌, జర్మనీకి చెందిన వెల్త్‌ హంగర్‌ హిల్ఫ్‌ సంస్థలు ఏటా సంయుక్తంగా వెలువరిస్తాయి. ఎక్కువ స్కోర్‌ సాధించిన దేశంలో ఆకలి సంక్షోభం తీవ్ర రూపంలో ఉన్నట్టు పరిగణించాలి.
భారత్‌ ఖండిస్తుందని ముందే తెలిసి..
ఆకలి సూచీలో కిందటేడాది116 దేశా ల్లో భారత్‌ 101స్థానంలో నిలిచింది.అయితే అప్పు డు కేంద్రం ఈ నివేదికను తప్పుబట్టింది. ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉన్నదనని నివేదికను ఖండిరచింది. ఈ క్రమంలో నివేదికను వెలువరించే సమయం లోనే సదరు సంస్థలు ప్రత్యేక వివరణ ఇచ్చాయి. ప్రధాని మోదీ హయాంలో గడిచిన ఎనిమిదేండ్లలో జీహెచ్‌ఐలో భారత్‌ స్కోరు దారుణంగా పతన మైంది. చిన్నారుల్లో కనిపిస్త్తున్న పోషకాహార లోపం, ఆకలి, ఎదుగుదల లోపం, కుంగుబాటు వంటివాటి పై ప్రధాని మోదీ ఎప్పుడు స్పందిస్తారో చూడాల్సి ఉన్నది. దేశంలో 22.4కోట్ల మంది ప్రజలు పోష కాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి సూచీ లో భారత దాదాపు అట్టడుగు స్థానానికి చేరు కొన్నది.
బడా పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వా నికి మధ్య సంబంధాలు పెరిగిపోవడాన్ని,ఏక వ్యక్తి కేంద్రంగా నిరంకుశ పాలనకు దారితీస్తుందని హెచ్చరించింది. హిందూ మతతత్వ రాజకీయాలు, కార్పొరేట్‌ క్యాపిటల్‌ కలిసి దేశాన్ని లూటీ చేసిన పరిస్థితుల్లో ప్రముఖ ఆర్థిక వేత్తలు థామస్‌ పికెట్టి, లూకాస్‌ ఛాన్సెల్‌,నితిన్‌కుమార్‌ భారతి,అన్మోల్‌ సోమంచి తదితరులు రూపొందించిన ఈ నివేదిక ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టాయి. తాజాగా ఎన్నికల బాండ్ల విషయంలోనూ మోడీసర్కారుకు,కార్పొ రేట్లకు ఉన్న అనుబంధాన్ని తేటతెల్లం చేసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ, కార్పొరేట్‌ రాజ్‌ను మట్టికరిపించాలి.అందుకు ఉక్కు సంకల్పం తీసుకోవాలి.- (వ్యాసకర్త : ఇండిపెండెంట్‌ సీనియర్‌ పాత్రికేయులు`న్యూఢల్లీి)

ఆర్దిక అంతరాలకు అంతమెన్నడు.

కొంతమంది ప్రపంచ స్థాయి ఆర్థిక వేత్తల అభిప్రాయం ప్రకారం భారత్‌లో నేడు ఆర్థిక అంతరాలు బ్రిటిష్‌ పాలనలో కన్నా ఘోరంగా ఉన్నాయి. గణాంకాల ఆధారంగా వారు చెప్పిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో సంపద సృష్టి బాగానే జరుగుతున్నా, అది కొద్ది మంది చేతిలోనే కేంద్రీకృతమౌతుంది. దేశ సంపద లో 44శాతం ఒక్కశాతం ధనికుల చేతిలోఉంది. ఆఒక్క శాతం మంది జాతీయ ఆదాయంలో 22 శాతం మేరకు పొందు తున్నారు.ఏభై శాతం ప్రజలు జాతీయ ఆదాయంలో 15శాతానికి మించి పొందలేక పోతున్నారు. అంటే జాతీయ ఆదాయం ఎంత పెరిగినా జనాభాలో సగం మందికి దక్కేది అందులో 15పైసల వాటానే. ఇలా అసమానతలు పెరగడానికి ఇప్పటి ప్రభుత్వ విధానాలే కారణం. ధనికులపై విధించే పన్నులు తక్కువ. వారు పొందే రాయితీలు ఎక్కువ. పేదలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కట్టే పన్నులు ఎక్కువ. వారికి దొరికే ఊరట. ధరల నియంత్రణ ద్వారానో, మరోలానో తక్కువ. అయితే అసమానతలు తగ్గే విధానాల్ని అమలు చేస్తామని ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం. వృద్ధి వైపు దేశాన్ని పరుగులు పెట్టిస్తామని అందరూ అంటున్నారు తప్పించి, ఆ వృద్ధి ఫలాలు అందరికీ అందేలా విధానాలు రూపు దిద్దగలమని జాతీయ పక్షాలు మాట్లా డడం లేదు.బహుశా దాని వల్ల ధనికులు దూరమై, వారి విరాళాలు అందవని భయ మేమో? చూశాం కదా, ఎన్నికల బాండ్ల రూపంలో దివాళా కంపెనీలు కూడా పార్టీలకు ఎలా నిధులు ఇచ్చాయన్నది. ఇకపోతే ఆర్థిక అంతరాలు మరీ వారు చెప్పినంత ఘోరంగా లేవని వాదించవచ్చు. కానీ అసమానతలు దండిగా ఉన్న వాతావరణంలోనే ఉన్నామన్నది ఎవరూ కాదనలేరు. వేరే వేరే నివేదికల ప్రకారం 2000 సంవత్సరంలో 35 శాతం ఉన్న నిరుద్యోగిత నేడు 65 శాతం అయ్యింది. పేదరికం, పోషకాహార లేమి గణనీయంగా ఉన్నాయి. ఇప్పటికీ వైద్యం, విద్యపై పౌరులు భరించాల్సిన ఖర్చు ఎక్కువే. వాటివల్ల అప్పులు పాలయ్యే వాతావరణం. ఈ సమస్యల్ని గమనం లోకి తీసుకోకుండా వృద్ధిలో ముందంజ వేయడం సాధ్యమా? పేదలకి, అధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతికి భారమైన విద్య, వైద్యం చవకగా అందుబాటులోకి రావాలి. అప్పుడే నాణ్యమైన భవితకు, ఆర్థిక వృద్ధికి పూచీ. యువత గణనీయంగా ఉన్న భారత్‌ శక్తిమంతం కావడమే కాదు అసమానతలు లేని సమాజంగా మారాలి. ఇప్పుడున్న విధానాలతో అది సాధ్యం కాదు. మెరుగైన విధానాల కోసం, అవి ఎన్నికల్లో ప్రాధాన్యత గల అంశాలుగా మారడం కోసం నడుం కట్టాల్సింది పౌర సమాజమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశా బ్దాలు గడిచినా ప్రజల మధ్య ఆర్థిక అసమాన తలు తీవ్రస్థా యిలో ఉన్నాయి. నిత్యం పెరుగు తున్న ధరలు, ఇతర కారణాలతో కోట్ల మంది కూడు,గూడు, గుడ్డ కోసం ఇంకా బతుకు పోరా టం చేస్తుండగా..మరోవైపు ఇదే సమ యంలో సంపన్నులు పోటీపడి మరీ లగ్జరీలైఫ్‌ అనుభవిం చడంతో పాటు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ఇటీవల ముంబైలో ప్రారంభమైన యాపిల్‌ స్టోర్‌కు పలు వురు పోటెత్తడమే ఉదాహరణ.ఈ తరహా ఆర్థిక అంతరాలు దేశానికి ఎంత మాత్రం మంచిది కాదని, దేశాభివృద్ధికి ఆటంకం అని ఆర్థిక నిపుణు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అంతరాలు అధికంగా ఉన్నదేశాల జాబితాలో భారత్‌ ఉన్నదని వరల్డ్‌ ఇన్‌ఈవ్వాలిటీ ఇండెక్స్‌-2022 పేర్కొన్నది. భారత్‌లో దేశ ఆదాయంలో టాప్‌ 10శాతం లేదా 1శాతం సంపన్నుల వద్ద వరుసగా 57శాతం, 22శాతం సంపద ఉన్నద నే ఆందోళనకర విష యాన్ని వెల్లడిరచింది. ఇటీ వల యాపిల్‌ సంస్థ ముంబైలో తన తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభిం చింది. అక్కడ ఒక్కొ క్కటి రూ.లక్ష అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే విలువైన ఫోన్ల కోసం స్టోర్‌ ముందు సంపన్నులు క్యూ కట్టారు. కాగా, మునుపటి ఏడాది కంటే 2022లో భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగాయి.ఇదే సమ యంలో మధ్య తరగతి ప్రజలు వినియో గించే బైక్‌లు,దేశీయ తయారీ సంస్థ బజాజ్‌ ఆటో అమ్మకాలు 10 శాతం పడిపోయాయి. భారత్‌ను తమ వేగవం తమైన మార్కెట్‌గా భావిస్తున్న లగ్జరీ కార్ల సంస్థ మెర్సి డెస్‌ బెంజ్‌ అమ్మకాలు గణనీయంగాఉంటా యని అంచ నా వేస్తున్నది. పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా దేశంలో 63శాతం పేద,మధ్య తరగతి వినియోగ దారులు అనవసరమైన వస్తు వులు,సేవలపై ఖర్చులను పరిమితం చేసు కొంటున్నారని 2023 పీడ బ్ల్యూసీ గ్లోబల్‌ కన్జ్యూ మర్‌ ఇన్‌సైట్స్‌ పల్స్‌ సర్వే పేర్కొన్నది. తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందు తున్నామని సర్వేలో పాల్గొన్న74శాతం మంది పేర్కొ న్నారు. కలరా,తట్టు,పోలియో,మెదడు వాపు, మశూచి, సార్స్‌,ఎబోలా, ప్లేగు వంటి మహమ్మారులు సైతం వేధించి కనుమరుగయ్యాయి. కరోనా గతీ రేపు ఇంతేకాక తప్పదు. ఈలోపు అది సృష్టించే విలయం నుంచి ప్రజలను కాపాడుకోవడానికి పాలకులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దాంతోపాటు జాతిని వేధిస్తున్న మరో మహ మ్మారిపైనా వారు దృష్టి సారించాల్సిన కీలక తరుణమిది. మానవాళిని వేధిస్తూ ఎప్పటికి అంతమవుతుందో తెలియని ఆ మహమ్మారి- ‘ఆర్థిక అసమానత’!
అసమానతలకు అంతంలేదా?
కరోనా భూతంలానే వందేళ్ల క్రితం 1920లో స్పానిష్‌ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. అన్ని కాలాల్లోనూ నిరంతరాయంగా మహమ్మా రులు పీడిస్తూనే ఉన్నాయి.అసమానత అనే రుగ్మ తకు మాత్రం మందు కనుచూపు మేరలో లేదు. నిజానికి శ్రేయోరాజ్య భావన ప్రపంచంలో తొలుత 1880లో మొగ్గతొడిగింది. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత ఏర్పడిన ఆర్థిక సామా జిక కష్టాలతో దాని అవసరం మరింత ఏర్పడిరది. స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్ల అవుతున్నా ఆర్థిక అంతరాలు మాత్రం సమసిపోలేదు. శ్రేయోరాజ్య పాలన అందించే ప్రభుత్వాలు దాని మూలసూ త్రాలైన సమాన ఉపాధి అవకాశాలు, సంపద పంపిణీ వంటివాటిని విస్మరించాయి. అనవసర వ్యయాల బారినపడి అవినీతిని నిర్మూలించకుండా అమ లు చేసే పథకాలు, కార్యక్రమాలు మరింత అంతరాలకు కారణమవుతున్నాయి. దేశ ప్రజల ఆరోగ్య, ఆర్థిక సామాజిక భద్రత కోసం ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు దోహదం చేసినప్పుడే శ్రేయోరాజ్య భావన సఫలీకృత మవుతుంది. ‘ఫోర్బ్స్‌’ లెక్కల ప్రకారం దేశంలో 102 మంది, ప్రపంచం లో 2,095 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ, దేశ జనాభాతో పోలిస్తేఇది సంఖ్యాపరంగా తక్కువే కావచ్ఛు కానీ మొన్నామధ్య ప్రముఖ ఆర్థికవేత్త పద్మ భూషణ్‌ కౌశిక్‌ బసు ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదికను ఉటంకిస్తూ-73శాతం సంపద ఒక శాతం ప్రజల చేతిలో ఉందని ఓఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆర్థిక అంతరాలు ఎంతగా పెరిగి పోయాయో స్పష్టమైంది. దురదృష్ట వశాత్తు ప్రభుత్వాలు చేపను పట్టడం నేర్ప కుండా… తెచ్చి నోట్లో పెట్టినట్లు తాత్కాలిక పథకాలు, కార్యక్రమాలతో తమ అధికారాన్ని కాపాడు కోవడం కోసం యత్నిస్తున్నాయి. అధిక సంఖ్యలో ఉన్న నిర్ణాయక శక్తిని ప్రభావితం చేస్తు న్నాయి. ఫలితంగా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగు పడటం లేదు.
ఆర్థికంగా చితికిపోయింది..
బ్రిటిష్‌ పరిపాలనకు ముందు మనది స్వయం సమృద్ధ దేశం.వారి ఏలుబడిలో ఆర్థికంగా చితికిపోయింది.తదనంతర కాలంలో దేశాన్ని నిల బెట్టడం కోసం ప్రభుత్వాలు అనేక విధానా లను రూపొందించి అమలు చేశాయి. జనాభా పెరిగి అవసరాలూ మారిన తరవాత 1965లో హరిత విప్లవం దిశగా సాగి దిగుబడులు సాధించింది. 1990లో ప్రపంచీకరణకు తలు పులు తెరిచింది. అయినప్పటికీ స్వావలం బన అనేది ఇప్పటికీ ఇంకా సుదూరంలోనే ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం జీడీపీలో 23.64శాతం దిగుమతులు ఉంటే,19.74 శాతం ఎగుమతులు ఉన్నాయి. మందులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రక్షణ సామగ్రి, చమురు, సెమీకండక్టర్ల వంటివాటికి ఇప్పటికీ ఇతర దేశాలమీదే ఆధారపడుతున్నాం. అందుకే స్వావ లంబన మంత్రాన్ని జపిస్తున్నాం. కరోనా, లాక్‌ డౌన్‌, సడలింపులు వంటి వాటితో మన వైద్య, ఆర్థిక వ్యవస్థలోని డొల్లతనం బయటపడిరది. వలస కూలీల వెతలే ఇందుకు నిదర్శనం. బ్రూకింగ్స్‌ నివేదిక ప్రకారం7.30కోట్ల ప్రజలు కటిక పేదరి కాన్ని అనుభవిస్తున్నారు. ఆపైన ఉన్నవారు, మధ్యతరగతి ప్రజలు అరకొర ఆదాయాలు, చుక్క లంటుతున్న ధరలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకారం 1917-18లో 4.6శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు 2018-19లో6.3 శాతానికి 2019-20లో 7.6శాతానికి ఎగబా కింది. అసంఘటితరంగం ఆసాంతం, సంఘటిత రంగంలోని చిన్న మధ్యతరహా సంస్థలు తీవ్రం గా దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి కోసుకుపోయి, ఆదాయాలు అడుగంటినవేళ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ఉపాధి, ఆదాయం,కొనుగోలు శక్తి,ఈ మూడిరటి మధ్య సంబం ధాన్ని గుర్తించ నంత కాలం, ఉపాధిలో స్వావలం బన సాధించ నంత కాలం అంతరాలు అలాగే ఉంటాయి. అందువల్ల ఆర్థిక అంతరాలు తగ్గే విధంగా, సంపద సృష్టి సమాజంలో అందరికీ విస్తరిం చేలా ఉపాధి కల్పన పథకాలు, కార్యక్రమా లను అమలుచేసే విధంగా ప్రభుత్వాలు తమ విధానా లను మార్చుకోవాల్సిన అవసరం ప్రస్తుత కరోనా క్లిష్టకాలంలో ఎంతైనా ఉంది! `(వ్యాసకర్త : సీనియర్‌ జర్నలిస్టు, అమరావతి – (పొడిశెట్టి సత్యనారాయణ)

  

జలమే జనానికి అమూల్య సంపద

‘‘జనాల జీవితమంతా జలంతోనే ముడి పడి ఉంటుంది.నిత్యం దాని చుట్టూనే తిరుగుతుంది.నీరు లేనిదే ఏపనీ ముందుకు సాగదు.ఎండా కాలంలో నైతే బోలెడు కష్టాలెదుర్కొవాలి.చెరువులు, కుం టలు, నీటి వనరులు లేని ఊళ్లు పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊరి చెంతనే నది పరుగులిడితే కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు.రైతులకు పంటలు,పండిస్తుంది. చేపలు పట్టే వారికి ఉపానిస్తుంది.ఎన్నో పనులకు భరోసాగా ఉంటుంది.ఆ జీవనదిలో ఉన్న అనుబంధాల్ని మరిచపో వద్దని తమ బిడ్డలకు ఆతల్లి పేరునే పెట్టుకుంటారు. గోదావరికి ఒడ్డునే ఉన్న పలు గ్రామాలకు వెళ్తే అక్కడి వారికి నది ఎంత మేలు చేస్తుందో తెలుస్తుంది’’
మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే.ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే.మొత్తం భూగోళంలోని నీటి లో దాదాపు 2.7శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా,ఇందులోనూ75.2శాతం ధృవప్రాంతాలలో మంచు రూపంలో ఘనీభవించివుంటే,మరో 22.6 శాతంనీరు భూగర్భంలో వుంది.మిగతా నీరు సరస్సులు,నదులు,వాతావరణం,గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ,చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు,సరస్సులు,నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగ పడగలిగిన నీరు చాలా కొద్ది పరిమాణం మాత్రమే. ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే,పరిశుభ్రమైన నీటిలో,1శాతం కంటెకూడా తక్కువ పరిమా ణంలో, (లేదా,భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.00శాతం మాత్రమే) నీరు మానవ విని యోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ, మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం.కాని, ఇప్పటికీ, 88.4కోట్ల మంది( 884 మిలియన్ల మంది)ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.ప్రపంచవ్యాప్తంగా,ప్రతి ఏటా,1,500ఘనకిలోమీటర్ల పరిమాణంలో,వ్యర్ధ మైన నీరు వస్తుంటుంది.వ్యర్ధ పదార్ధాలను,వ్యర్ధ మైన నీటిని పునర్వినియోగ ప్రక్రియద్వారా, ఇంధనో త్పత్తికి,వ్యవసాయ అవసరాలకు వినియోగించ వచ్చు.కాని,సాధారణంగా, అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా,80శాతం వ్యర్ధాలను పున ర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తు న్నారు.పెరుగుతున్న జనాభా,పారిశ్రామిక ప్రగతి కూడా,కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతు న్నాయి.ఇదే దామాషాలో,పరిశుభ్రమైన నీటి అవస రం పెరుగుతున్నది.ఈకారణంగా,ఇటు వర్త మానంలోను,అటు భవిష్యత్తులోను మానవ ఆరో గ్యానికి,పర్యావరణ స్వచ్ఛతకు ముప్పుపొంచి వుంది.వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది.బిందెలతో బారులు తీరే జనాలు కనిపిస్తారు.మరి నీటి సమస్య అంత విస్తృతమైనది. నీరు లభించని ప్రాంతాలలో ఎదుర య్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నేల తల్లి నెర్రె లిచ్చి నీటిచుక్కకోసం ఆబగా ఎదురుచూస్తుంటే ఇక మానవమాత్రులెంత! గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. పరిశుభ్రమైన నీళ్లు దొరక్క కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితి. భూమండలంమీద లభించే నీటిలో ఉప్పు సుమద్రా ల వాటా 97శాతం. మిగిలిన దానిలో 69 శాతం హిమపాతం, మంచుగడ్డలే. భూమి మీద లభించే నీటిలో0.008శాతం మాత్రమే స్వచ్ఛమైన నీరు.క్రీశ 2025 నాటికి 48దేశాల్లో తీవ్రమైన నీటికొరత వస్తుందని చికాగోలోని జాన్‌ హాప్కిన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ హెచ్చరించింది.3.575 మిలియన్ల మంది ప్రతి సంవత్సరం నీటికి సంబం ధించిన వ్యాధులతో మరణిస్తున్నారు.నీటిమూలంగా సంభవించిన 43శాతం మరణాలకు అతిసార వ్యాధే కారణం.పైన పేర్కొన్న మరణాలలో 84 శాతంమంది 14ఏళ్ల లోపువారే.98 శాతం మర ణాలు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే సంభవి స్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులలో చికిత్సపొందుతున్న రోగులలో సగం మంది నీటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారే. భూమి మీదున్న నీటిలో ఒక్క శాతానికంటే తక్కువ మొత్తం నీళ్లు మాత్రమే మానవాళి వెనువెంటనే వాడుకు నేలా వున్నాయి.అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మురికి వాడల్లో నివసించే ఒకవ్యక్తి రోజు మొత్తం మీద ఉపయోగించే నీరు ఒక అమెరికన్‌ స్నానానికి వాడే నీటితో సమానం.లీటరు నీటికి మురికివాడల్లో నివ సించే పేదలు, అదే నగంలోని ధనికులకంటే 5-10రెట్లు అధికధర చెల్లిస్తున్నారు. ఆహారం లేకుండా మనిషి కొన్ని వారాలపాటు వుండగలడు. కానీ నీరు లేకుండా కొద్దిరోజులు మాత్రమే వుండగలడు. ప్రతి 15సెకన్లకు ఒక చిన్నారి నీటి సంబంధ వ్యాధి తో చనిపోతోంది.లక్షలాది మంది మహిళలు, పిల్ల లు రోజుమొత్తం మీద అనేక గంటల సమయాన్ని సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తేవడం కోసం వెచ్చిస్తారు.రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది.ఈ రెండు వాయు పదా ర్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయో గిస్తాం.నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గిం చే అవకాశం ఉంది. నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి.పచ్చనిచెట్లు,పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఇవేవీ లేకుండా ఎండిపోయిన మట్టి గడ్డలా ఉంటుంది భూమి. అంతటి అమూల్యమైన నీటి విలువను తెలుసు కోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తిం చాలని నిర్ణయించింది. మన భూమ్మీద నీటి గురిం చి కొన్ని నిజాలు తెలుసుకుంటే అదెంత విలువ్కెనదో అర్థం అవుతుంది. భూమి ఏర్పడినప్పుడు ఎంత నీరు ఉందో ఇప్పుడూ అంతే ఉంది.పెరగడం కానీ తరగడం కానీ కాలేదు. కానీ ఆ నీటిని వాడుకునే వారి జనాభా మాత్రం విపరీతంగా పెరిగి పోయిం ది. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నీటి కోసం కటకటలాడుతున్నారు.భూమ్మీద ఉన్న నీరు ఎండకు ఆవిరవుతూ,మేఘాలుగా మారు తూ,వర్షంగా కురుస్తూ, భూమిలో ఇంకుతూ, సముద్రంలో కలుస్తూ వేర్వేరు రూపాల్లోకి మారుతూ ఉంటుంది.భూమ్మీద మూడొంతులు నీరే ఉంది. కానీ అందులో 97శాతం ఉప్పునీరే.కేవలం 3 శాతమే మంచి నీరు. ఇందులో కూడా 2 శాతం మంచురూపంలోఉంది.మిగతా ఒక శాతం నీరులో 0.59శాతం భూగర్భంలో ఉంటే, మిగతాది నదు లు,సరస్సుల్లో ప్రవహిస్తోంది.ఉన్న మంచి నీటిని మనం పొదుపుగా వాడకపోగా కలుషితం కూడా చేస్తున్నాం. ప్రపంచంలో 500కు పైగా మంచినీటి నదులు కలుషితమైపోయాయి. ప్రపంచంలో భారీ యుద్ధాల్లో చనిపోయిన వారి కన్నా, కలుషిత నీటి వల్ల మరణించినవారే ఎక్కువ. ఏడాదికి 40 లక్షల మంది కలుషిత నీరు తాగి చనిపోతున్నారు. అమెరి కాలో ఒక వ్యక్తి తన అవసరాలకి రోజుకి 500 లీటర్ల నీటిని ఉపయోగిస్తుంటే,ఆఫ్రికాలోని గాంబి యా దేశంలో ఒకవ్యక్తి రోజుకి కేవలం 4.5 లీటర్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాడు. గాంబియా లాంటి చాలాదేశాల్లో తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు.మనమేం చేయాలి?ఎక్కడ్కెనా కొళా యిల్లోంచి నీరువృధాగా పోతున్నట్టు కనిపిస్తే వెం టనే కట్టేయండి.షవర్‌తో స్నానం చేయడం మానేసి, బకెట్‌ నీళ్లతో చేయండి.దీనివల్ల రోజులో150 లీటర్ల నీటిని కాపాడవచ్చు.పళ్లుతోముకున్నంత సేపూ సింక్‌లోని కొళాయిని వదిలి ఉంచకండి. ఇలా చేయడంవల్ల నెలకి 200 లీటర్ల నీరు వృథా అవుతుంది. టాయిలెట్‌ ఫ్లష్‌లో సుమారు 8లీటర్ల నీరు పడుతుంది.లీటర్‌ నీరుపట్టే రెండు బాటిళ్లు తీసుకుని దానిలో ఇసుక లేదా చిన్నచిన్నరాళ్లు నింపి, టాయ్‌లెట్‌ ఫ్లష్‌లో పెట్టేయండి. దీనివల్ల ఒకసారి వాడే నీటిలో రెండులీటర్ల నీళ్లు ఆదా అవుతాయి. అక్వేరియంలోని నీళ్లు పారేయకుండా మొక్కలకి పోయండి.కొళాయిలకి లీకేజీలుఉంటే దానిని అరిక ట్టండి.దీనివల్ల నెలలో 300గ్యాలన్ల నీరుఆదా అవు తాయి.ఒక వార్తాపత్రికలో వాడే కాగితం తయారీకి 300లీటర్ల నీరుఖర్చవుతుంది.గాలితరువాత జీవ రాశికి నీరుచాలా ముఖ్యం.అందువల్ల నీటి వనరు లను పొదుపుగా ఉపయోగించుకోవాలి.ఈ నీరు భూఉపరితలములో నదులు,కాలువలు, చెరువులు, కుంటలు, సరస్సులు మరియు భూగర్భజల రూపం లో ఉన్నది.
అడవుల నరికివేత వలన వర్షపాతం కూడా తగ్గిపోయింది. భారతదేశంలో సగటున ప్రతి మనిషి అన్ని అవసరాలకి కలిపి 680 క్యూబిక్‌ మీటర్ల నీటిని వాడుతున్నారు. 6గురు ఉండే ఇంటికి 250 లీ నీరు అవసరమవుతుంది మన దేశంలో నదుల్లో ప్రవహించే మూడవ వంతు నీళ్ళు సము ద్రాల్లోకి నష్టపోతున్నాం.భూగర్భ, భూఉపరితల జలాలు రెండూ కలిపి దేశంలో వాడే మొత్తం నీటిలో 84శాతంవ్యవసాయానికి,12శాతం పరిశ్ర మలకి వాడుతున్నాం.ఇంతటి విలువైన నీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పై ఉంది. ప్రస్తుతం ఉన్న వర్షా భావ పరిస్థితుల్లో ప్రతి నీటిచుక్కను ఒడిసి పట్టుకొని నిల్వ చేసుకో వాల్సిన అవసరం ఉంది. నానాటికి ఇంకిపోతున్న భూగర్భ జలాల సంరక్షణ పై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడిరది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యువత నేటితరం కోసం భావితరాల కోసం కొన్ని బాధ్యతలను విధిగా నిర్వర్తించాల్సి వుంది.నీటి సం రక్షణలో మొదటగా చేయాల్సింది నీటి వృధా అరిక ట్టడం.దైనందిన జీవితంలో మనం చాలా నీటిని వృధా చేస్తూఉంటాం.ముందుగా ప్రతి వ్యక్తి నీటి వృధాను అరికట్టే ప్రయత్నం చేయాలి.ప్రతి నీటి చుక్కా అమూల్యమైందే. మంచినీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం అందరిపై ఉంది. రోజువారీ అవసరాల్లో మనకు తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. నీటి వనరుల పర్యవేక్షణ లో యువత తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.
మరికొన్ని బాధ్యతలు :-
చెట్ల పెంపకం కార్యక్రమంపై యువత దృష్టి సారించాలి.
బీడు బావులను, జలశయాలను పునద్ధరించే చర్యలు చేపట్టడం.
ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకునేలా, నిల్వ చేసుకునేలా,భూగర్భ జలాలు పెంపొం దించేందుకు సాధ్యమైన చర్యలన్నింటినీ చేపట్టడం.
ఉపాధి పథకంలో భాగంగా కందకాల నిర్మా మం బండరాళ్ళ తొలగింపు,భూఉపరితల నీటి గుంటల నిర్మామంపట్ల దృష్టిసారించాలి.
నీటి వినియోగంపట్ల ప్రజల్లోఅవగాహన కలి గించేలా గ్రామగ్రామాన సదస్సులు నిర్వహిం చాలి.
సేద్యపు బావుల్లో పూడికతీత,కొత్తగా సేద్యపు బావుల తవ్వకం,ఎండిన బావులకు పునరు జ్జీవం కల్పించడం,చెక్‌ డ్యాంలలో పూడికతీత, చిన్న నీటి పారుదల చెరువుల చుట్టూ కందకా లు తీయడం తదితర చర్యలను చేపట్టాలి.
ఇళ్ళలో,కాలనీలలో,పాఠశాలలో,ప్రభుత్వ కార్యాలయాలలో వాననీటిని సేకరించి, దాచు కునే వ్యవస్థలను నెలకొల్పడం.
ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని వాతా వరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి.ఎల్‌నినో ప్రభావం సన్నగిల్లుతుందని,వర్షాతిరేకంవెల్లి విరుస్తుందన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్రం లో చెరువులు,కుంటల సముద్ధరణ,సంరక్షణ పై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. ఊరూ రా చెరువులు,కుంటల సంరక్షణచర్యలు చేపడి తే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందనడంలో సందేహం లేదు.జూన్‌-సెప్టెంబర్‌ మధ్య కాలంలో దేశంలో 89సెంటీమీటర్ల వర్ష పాతం కురుస్తుందని భారతవాతావరణ సంస్థ,అమెరికాలోని అంతర్జాతీయ వాతా వరణ పరిశోధన సంస్థ,దక్షిణ కొరియా సంస్థ ఏపీఈసీ వాతావరణ కేంద్రం, ‘స్కయిమెట్‌ వెదర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థలన్నీ శుభం పలుకుతున్నాయి.
ప్రతి బోరు యజమాని కనీసం 2ఎకరాల క్యాచ్‌మెంట్‌ కుంటలు,ఫారం ఫాండ్స్‌ నిర్మిం చాలి.
పూర్వం కాకతీయ రాజులు, నిజం నవాబులు, కృష్ణదేవరాయలు వంటి పాలకులు తక్కువ శ్రమశక్తితోనే చెరువులు, కుంటలు తవ్వు కోగలిగారు. అప్పట్లోనే రాజులు లోత్కెన చెరు వులు తవ్వి భావితరాలకుగొప్ప మేలుచేశారు. కానీ నేడు ఇంత జనాభా,ఆధునిక యంత్రాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండి కూడా ఆచెరువుల్లో కనీసం పూడిక తీసుకోలేని దురవస్థలో నేటి ప్రభుత్వాలున్నాయి. అయి దారు వందల ఏళ్ల కిందట గానుగ సున్నంతో నిర్మించిన తూములు ఇప్పటికీ చెక్కుచెదర కుండా నిలిచి ఉండగా,నేడు అత్యాధునిక పరిజ్ఞానంతో,సాధనాలతో,సిమెంట్‌ కాంక్రీటు లతో నిర్మించే నిర్మాణాలు మూణ్నాళ్ల ముచ్చ టగా మిగులుతున్నాయి.లోపం ఎక్కడ జరుగుతోందో పసిగట్టి పరిహరించాల్సిన పాలక గణం కేవలం పదవులను నిలబెట్టుకు నేందుకే ప్రాధాన్యమిచ్చి మిన్నకుండటం దుర దృష్టకరం.నేటి పాలకుల నిర్లక్ష్య ధోరణి పట్ల యువత తమ నిరసనను తెలియజేయాలి. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించాలి.
సోషల్‌ మీడియా,పత్రికలు-టివీఛానల్స్‌ ద్వారా కూడా యువత నీటి వనరుల పరిరక్షణ పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించే ప్రయ త్నం చేయాలి.
వ్యవసాయశాఖ అధికారులు కూడా క్షేత్ర స్థాయి సందర్శనలకువెళ్ళి పంటల పై, నీటి వినియోగ తీరుతెన్నుల పై రైతులకు అవగా హన కలుగజేసే ప్రయత్నం చేయాలి.
వాన నీరువృథా కాకుండా తక్కువ పెట్టు బడితో ఎక్కువ ప్రయోజనం పొందే పద్ధతిది. వర్షపు నీరు ఎండిన బావి వైపు వచ్చేలా కాల్వలు తవ్వుకోవాలి.ఈ కాల్వలో మట్టి వడపోసి కేవలం నీరు మాత్రమే వచ్చే ఏర్పాటు చేయాలి. నాలుగు అంగుళాల వ్యాసం ఉన్న పైపు ద్వారా బావిలోకి నీరు చేర్చాలి.ఎండిన బావిని వర్షపు నీటితో నింప డంతో బోరు బావుల్లోకి నీరు వస్తుంది. బావి వెడల్పు తక్కువ గనుక ఎండకు ఆవిరై పోవడం అంతగా ఉండదు.
పట్టణ ప్రాంతాలలో బోరు బావులు, కుళా యిలు పక్కన నేల నీటిని గ్రహించడానికి వీలుగారాళ్ళు,కంకర,దొడ్డు ఇసుకతో ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేయాలి. పట్టమాలు, నగరాల్లో డాబాలపై కురిసిన వర్షపు నీరు వృథా పోకుండా ఈ గుంతలలో చేర్చడం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది.
భూమి ఎత్తు కన్నా కొంచెం తక్కువ ఎత్తులో ఉండేలా పొలాల్లో గుంతలు తవ్వాలి. పొలంలోపడ్డ వర్షపు నీరు ఈగుంతల్లోకి చేరుతుంది.చిన్న పొలాలకయితే ఆ నీరు ప్రాణాధారంగా ఉపయోగపడుతుంది. పశు వులకు తాగు నీరుగా వాడుకోవచ్చు. గుంత పరిధి,వైసాల్యం చిన్నది కావడంవల్ల ఎక్కువ నీరు ఆవిరి రూపంలో వృథాగా పోకుండా ఉంటుంది.ఇలా చేయడంవల్ల భూగర్భ జల మట్టం పెరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం నీరు-చెట్టు అనే పథ కాన్ని ప్రవేశపెట్టింది.ఈ పథకంలో చెరువుల్లో మట్టి పూడిక తీయడం,చెట్లు నాటడం లాంటి పనులు చేయాలి.దీనివల్ల వర్షపు నీటిని సంరక్షించుకో వచ్చు నని ప్రభుత్వ ఉద్దేశ్యం.కానీ ఈకార్యక్రమం సవ్యంగా జరిగిన దాఖలాలు లేవు.నీటి సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. విజ్ఞత గల పౌరులందరూ ఈవిషయంపైదృష్టి సారించాల్సిన అవసరం, ఆవశ్యకతఉంది. నేడు ప్రపంచంలో చాలా దేశాల లోను,మరి ముఖ్యంగా భారతదేశంలో చాలా రాష్ట్రాలలోను నీటి కొరత సమస్య అధికంగా ఉం ది.నీటి వనరుల పర్యవేక్షణ లో ప్రజలు-ప్రభు త్వాలు సమిష్టిగా చర్యలుతీసుకొని ముందుకు సాగా లి. లేనియెడల ఈసమస్య మరెంత జఠిలమై మాన వ జీవనమే ప్రశ్నార్ధకమై పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.చైతన్యవంతమైన యువత బాద్య తగా వ్యవహించి ఈసమస్య పరిష్కార మార్గా లను అన్వేషించే ప్రయత్నం చేయాలి. ‘‘జలో రక్షితి రక్షతః – జలంతోనే జగతి’’.- (యం.రాంప్రదీప్‌)

పుడమి తల్లిని కాపాడుకుందాం!

ఓవైపు కాలుష్యం పెరుగుతుంటే, మరో వైపు తరుగుతున్న వనరులు మానవాళికి ఆవాసంగా నిలిచిన పుడమితల్లికి కడుపు కోత మిగుల్చు తున్నా యి. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు..పీల్చేగాలి..నివసించే నేల…ఇలా పంచ భూ తాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చద నంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మూగ రోదనతో కన్నీరు కార్చుతోంది. ఈదుస్థితి నుంచి భూమాతను కాపాడి..మానవ మనుగడకు తోడ్పాటునందించే సమయం ఆసన్న మైంది.మనిషి స్వార్థపరుడు..చెట్లను నరికేసి పక్షు లకు గూళ్లు లేకుండా చేశాడు.అడవుల్ని మాయం చేసి జంతువులకు నిలువనీడ లేకుండా చేస్తు న్నాడు. ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపించి అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరుల్ని దోచేశాడు. నేల,నదులు,సముద్రాలు ఒకటేమిటి ఆఖరికి ఆకా శాన్ని సైతం తన అదుపులోనే ఉంచుకోవాలన్న అత్యాశతో మొత్తంగా భూమండలాన్ని కలుషితం చేశాడు.అలా తాను సృష్టించుకున్న కాలుష్యానికి తానే బలవుతున్న వేళ…వచ్చింది ఓ మహమ్మారి. నీ సత్తా ఏమిటో చూపమని సవాలు విసిరింది. ఊహించని ఈ ఉత్పాతం మనిషిని వణికించింది. ఇంటి నాలుగుగోడల మధ్య బందీని చేసింది. పెరిగిపోతున్న భూతాపం, వాతావరణ కాలుష్యం తో అల్లాడుతున్న భూమాతను కాపాడుకునే దారేది? పర్యావరణ పరిరణక్ష విషయమై ప్రజల్లో అవగా హన పెంచే అవకాశమే లేదా? అంతరించి పోతున్న జీవజాతులను కాపాడుకోలేమా?ఈ ప్రశ్నలకు సమా ధానమే ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ దీనికి 1970 లో బీజం పడిరది.1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్రతీరం చమురు తెట్టులతో నిండి పోయి తీరమే ఆలంబనగా బతకుతున్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి.సుమారు నాలుగు వేల పక్షులు ఆ తెట్టులో చిక్కుకొని ఎగిరే దారిలేక ప్రాణాలొదిలాయి. జీవ వైవిధ్యం కొడిగట్టిన ఆనాటి సంఘటన ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి పునాదిగా మారింది.అమెరికన్‌ సెనేటర్‌ గెలార్డ్‌ నెల్సన్‌ పర్యా వరణ పరిరక్షణకు పిలుపునివ్వగా దాదాపు 20 లక్షల మంది ఏప్రిల్‌ 22న ధరిత్రి దినోత్సవంలో పాల్గొన్నారు. నేల అంటే మట్టి అన్న అర్థం మాత్రం కాదు,భూమంటే 84 లక్షల జీవరాశుల సముదా యం. మొదటిసారిగా ధరిత్రి దినోత్సవం 1970 ఏప్రిల్‌ 22న పాటించారు.
మానవ మనుగడకు పంచభూతాలే ఆధారం
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి.గాలి,నీరు,నింగి,నిప్పు,నేల అనే పంచభూతాల వల్లే మానవ మనుగడ సాధ్యమవు తుంది.వీటిలో ఏఒక్కటి లోపించినా జీవనం అస్త వ్యస్తమవుతుంది.భూమిపై అన్ని వనరులూ సక్ర మంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ,అంతులేని ఆధిపత్య దాహంవల్ల భూమం డలం కాలుష్యకాసారంగా మారిపోయింది.ఉపరి తలంపై ఉన్న వనరులే కాదు,భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలుదేశాలు విచక్షణారహితం గా వాడుకోవడంవల్ల భూతాపం పెరిగి రాబోయే కొన్నిదశాబ్దాలలో ముడిచమురు నిల్వలు అంతరించి పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరి స్తున్నారు.రోజురోజుకూ భూగోళంపై హరితదనం తగ్గిపోవడం,కొన్ని రకాల జీవరాశులు నశించిపో వడంవల్ల భూతాపం పెరుగుతూ వస్తోంది. నానా టికీ పెరుగుతున్న భూతాపంతో ప్రకృతి సమతౌల్యత దెబ్బతిని జీవరాశి మనుగడకు ముప్పు ఏర్పడు తోంది.
పరిశ్రమలు,వాహనాలు తదితరాల నుంచి వెలువడుతోన్న క్లోరోఫోరో కార్బన్‌లు భూగ్ర హాన్ని మరింత వేడెక్కిస్తూ పలుకాలుష్యాలకు కారణ మవుతున్నాయి.భూతాపం పెరగడంవల్ల పర్యావర ణంలో పెనుమార్పులు చోటుచేసుకుని జీవరాశుల మనుగడకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరో వైపు వాతావరణంలో మార్పుల కారణంగా జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. వృక్షాలను విచక్షణారహి తంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించి పోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువుకాటకాలు సంభవిస్తున్నాయి. దీంతో జల వనరులు నానాటికీ తీసుకట్టుగా మారుతున్నాయి. తత్ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్‌ వార్మింగ్‌తో ఓజోన్‌ పొర దెబ్బతింటోంది
భూమాతను శాంతింపజేసే చర్యలు
మొత్తం193దేశాలు ‘ఎర్త్‌’ డేలో భాగా మవుతున్నాయి. ప్లాస్టిక్‌ వాడకపోవడమే మంచిది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి, వృథాను అరికట్టాలి. వీలైనన్ని మొక్కలు నాటి వన సంరక్షణ చేపట్టాలి. తొమ్మిదో దశకం నుంచిప్రపంచవ్యాప్తంగా సుమారు 12.9 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ భూములు కనుమరుగయ్యాయి.ఈ చిన్న సూచనలు పాటిస్తే భూతాపం కొంత తగ్గించవచ్చు.బయటకు వెళ్లే సమయంలో వాహనాలు కాకుండా నడిచి వెళ్ళడం లేదా సైకిల్‌ను ఎంచుకోవడం. దూర ప్రాంతాలకు వెళ్లటేప్పుడు స్వంత వాహనాలు కాకుండా ప్రజా రవాణను ఆశ్రయించడం.మాంసాహారానికి దూరం గా ఉండటంవల్ల కూడా కార్బన ఉద్గారాల ప్రభా వాన్ని తగ్గించవచ్చు.పర్యావరణ అనుకూల ఉత్పత్తు లను ఉపయోగించాలి.చెత్తను ఎప్పటికప్పుడు తొల గించాలి. పునర్వినియోగ ఇంథనాలు, వస్తువులను వినియోగించాలి.స్థానికంగా దొరికే ఆహారాన్నే విని యోగించాలి.
వాతావరణ చర్య.. అపారమైన సవాళ్లు
ఏటా ధరిత్రీ దినోత్సవాన్ని ఒక ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసుకుని కార్యక్రమాలను నిర్వ హిస్తారు.ఈఏడాది‘వాతావరణ చర్య.. అపా రమైన సవాళ్లు…కానీ అనేక అవకాశాలు’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు.వాతావరణ మార్పులపై చర్య 50 వ వార్షికోత్సవం సందర్భంగా చాలా ముఖ్యమైన అంశంగా గుర్తించింది. వాతావరణ మార్పు మాన వాళి భవిష్యత్తుకు, ప్రపంచాన్ని నివాసయోగ్యంగా మార్చే జీవిత-సహాయక వ్యవస్థలకు అతిపెద్ద సవాల్‌ను సూచిస్తుంది. పెరుగుతున్న భూతాపం, పలు ఉపద్రవాలకు కారణమవుతున్న వాతావరణ మార్పులను పట్టించుకోకుండా పరుగులు పెడుతున్న మనిషికి కరోనా వైరస్‌ ఇచ్చిన రaలక్‌…భూమా తకు మాత్రం గొప్ప వరమే అయింది. ఏకంగా భూమిపైనా లోపలా కూడా కనీవినీ ఎరుగని మార్పు లు చోటుచేసుకుని ఈ యాభయ్యో ధరిత్రీ దినోత్సవ సందర్భంగా మానవాళికి మరువలేని గుణపాఠంగా మారుస్తున్నాయి.
సమాధానం చెప్పిన ప్రకృతి
వాతావరణ మార్పులు, శిలాజ ఇంధ నాల వాడకంపైనా గత మూడేళ్లక్రితం ప్రపంచ వ్యాప్తంగా యువతరం పెద్దఎత్తున ఆందోళన చేసి దేశాధినేతలనే నిలదీశారు. ప్రకృతే వారికి సమాధా నం చెప్పిందా అన్నట్లుంది నేటి పరిస్థితి. ప్రపంచా న్ని ప్రస్తుతం కరోనా వైరస్‌ మహమ్మారి వణికిస్తోం ది. దీంతో పలు దేశాలలో లాక్‌డౌన్‌వల్ల అన్ని పనులు ఆగిపోవడంతో కర్బన ఉద్గారాలూ తగ్గా యి. భారతదేశంలోనూ ప్రజా రవాణా నిలిచిపోయి ఇంధనాల వాడకం దాదాపు 66 శాతం తగ్గింది. ఇంధనానికి డిమాండు తగ్గడంతో చమురు ఉత్ప త్తీ,బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి.చరిత్రలో ఎన్న డూలేని విధంగా చమురు ధరలు పాతాళానికి పడిపోయాయి.ఫలితంగా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అన్ని రకాల కాలుష్యాలకూ అడ్డుకట్ట పడిర ది.ఈ మార్పు ఎంత కాలం ఉంటుందో తెలియదు. ఎందుకంటే 2008-09లో పెద్దఎత్తున ఆర్థిక మాం ద్యం ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల ఒకశాతం తగ్గింది. అప్పుడు ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వా లన్నీ ప్రోత్సాహకాలను ప్రకటించడంతో తర్వాత ఏడాది ఉద్గారాలు ఏకంగా 5 శాతం మేర పెరిగా యి.ఆ పొరపాటు ఇప్పుడు జరగకుండా చూసు కోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదైతే, అవసరానికీ విలాసానికీ మధ్య గీత గీసుకుని వ్యవహరించాల్సిన బాధ్యత ప్రజలది.
కరోనా ఎఫెక్ట్‌.. తేరుకుంటున్న నదులు
భారతీయులకు పవిత్రమైన గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమైపోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. గంగా నదిని శుభ్రం చేయాలంటూ ఎందరో ఆందోళనలు చేస్తూసే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో ఇసుమంత కూడా మార్పు లేదు. అలాంటిది లాక్‌ డౌన్‌తో ఫ్యాక్టరీల మూసివేయడంవల్ల వ్యర్థాలు నదిలోకి రావడం ఆగిపోయి గంగమ్మ కొత్త అందా లను సంతరించుకుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గంగానది పొడవునా ఏర్పాటుచేసిన 36 కేంద్రాలతో లాక్‌డౌన్‌ తర్వాత పది రోజులకే వాటి ల్లో 27 కేంద్రాల వద్ద నీటి నాణ్యత బాగా మెరుగు పడిరది. అక్కడి నీరు మనుషులు స్నానం చేయడా నికీ జలచరాలు ఆరోగ్యంగా బతకడానికీ అనువుగా ఉన్నాయనీ నీటిలో ప్రాణవాయువు పరిమాణం పెరిగిందనీ ఈ పరీక్షలు చెబుతున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ నగరాల మీదుగా ప్రవహిస్తూ పరిశ్రమల వ్యర్థాలను మోస్తున్న నదులన్నీ లాక్‌డౌన్‌ దెబ్బకి కాస్త తేరుకుంటున్నాయి.
లాక్‌డౌన్‌తో నెమ్మదించిన భూమాత
లాక్‌డౌన్‌తో అన్ని రవాణాలు నిలిచి పోగా..నిర్మాణాలు,గనుల తవ్వకాలు ఆగిపోయా యి.నిత్యం హోరెత్తే ఈపనులు భూమాతకు ఊపిరి సలపనివ్వడం లేదేమో…మన ఉరుకులు పరుగు లతో ఆమె కూడా అలసి పోతుందేమో…లాక్‌డౌన్‌ వేళ తానూ కాస్త నెమ్మదించింది.లాక్‌డౌన్‌ ప్రభా వం భూమి మీద ఎలా ఉందోనని భూకంప శాస్త్రవే త్తలు పరిశోధించారు.భూమి పొరల లోపల నుంచి అనునిత్యం విన్పించే హోరూ, ప్రకంపనలూ (సీస్మిక్‌ నాయిస్‌,వైబ్రేషన్స్‌)బాగా తగ్గినట్లు రాయల్‌ అబ్జర్వే టరీ ఆఫ్‌ బెల్జియంకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తిం చారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి మూల కేంద్రమైన వూహాన్‌ పారిశ్రమిక నగరం.దీంతో అక్కడ లాక్‌ డౌన్‌ ప్రకటించిన కొద్దిరోజులకే అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఎంతో శుభ్రంగా దృశ్యాలన్నీ స్పష్టంగా కనిపించడం నాసా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.గొడార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్లో గాలి నాణ్యత మీద పరిశోధన చేస్తున్న ఫెయ్‌ లియు అనే శాస్త్రవేత్త లాక్‌డౌన్‌ అనే ఒకే ఒకచర్యతో నగరం చుట్టూ ఉన్న వాతావరణం ఇంతగా మారిపోవడాన్ని చూడ డం ఇదే మొట్టమొదటిసారి అని పేర్కొన్నాడు.
మనిషి కనపడకపోతే వాటికి స్వేచ్ఛ దొరికింది
మనిషి కనపడకపోతే పక్షులూ జంతు వులూ ఎంతస్వేచ్ఛగా తిరుగుతాయో తెలిపే దృశ్యా లుగమనిస్తూనే ఉన్నాం.అపార్ట్‌మెంట్‌ బాల్కనీ గోడ లపై కువకువలాడుతున్న పక్షుల జంటల ఫొటోలూ నడివీధిలో పురివిప్పి నాట్యమాడుతున్న నెమళ్లు, కోయిలమ్మ పాటలు, పిచ్చుకల కిలకిలలు సందడి చేస్తున్నాయి. కేరళలోని ఓపట్టణంలో నడివీధిలో నిదానంగా నడుస్తున్న ఓపునుగు పిల్లి,ఒడిశా తీరం లో హాయిగా ఆడుకుంటున్న ఆలివ్‌రిడ్లీ తాబేళ్లు, ముంబయి తీరంలో అలలపై కేరింతలు కొడుతున్న డాల్ఫిన్లూ,తిరుమలలో సంచరిస్తున్న జంతువులు, ఇజ్రాయెల్‌లోని కార్మేలియా నగరం మధ్యలో పార్కు లో గడ్డి మేస్తున్న అడవిపందులు,జపాను వీధుల్లో షికారు చేస్తున్న జింకలూ,టెల్‌ అవీవ్‌ విమానాశ్ర యంలో వాకింగ్‌కి బయల్దేరిన బాతులు,వేల్స్‌ లోని ఒకనగరం వీధుల్లో గొర్రెల మంద వాహ్యాళీ… ఇలాంటి ఎన్నో వీడియోలు గత కొన్ని వారాలుగా ప్రసారా మాధ్యామాల్లో దర్శనమిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.మానవుడి జోక్యం లేకపోతే ప్రకృతి ఎంత సహజంగా,ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనాలు ఇవన్నీ.1.వాహానాల వాడకం తగ్గిద్దాం.2.అనవసర విద్యుత్‌ వాడకాన్ని తగ్గిద్దాం.3.అడవులను నాశనం చేయకుండా.. చెట్లనుపెంచడం అలవరచుకుందాం.4.భూమికి హాని చేసే ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దాం. మనిషి మనుగడకు నష్టం చేసిన కరోనా మాత్రం పుడమి తల్లికి మంచి చేస్తుందనే చెప్పు కోవాలి. మనిషి సృష్టించిన కాలుష్యం నుంచి ధరణి బయట పడేలా చేస్తుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బందించి..అలాగే వ్యర్థా లతో నిండిపోయిన నదు లు మళ్లీ స్వచ్చంగా కనిపిస్తున్నాయి.
ఇంతకాలం భూగర్భంలో భగ భగమని మండు తోన్న ఉష్ణం ఉబికివచ్చే తరుణం వచ్చేసింది. సమస్త జీవరాసులను వణికిస్తూ మానవాళిని వెంటాడే స్తుంది నిప్పులు చిమ్మకుంటూ వచ్చే ఆ ప్రచంఢాగ్నికి సర్వం వినాశమవు తుంది. ధ్రువాల మంచు కరడగం,సముద్ర మట్టాలు పెరగ డం,ద్వీపసమూ హాలన్ని సముద్ర గర్భంలో నిక్షప్తమ వవ్వడం ఇవన్నీ జరుగుతాయి.ఈ విపత్కర పరిణా మాలే కాదు.సమీప భవిష్యత్తులో కరువు కాటకాలు, వరదలు, తుపానులు భూమండలాన్ని అతలాకుత లం చేస్తా యని అమెరికన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరి స్తున్నారు.భూమ్మీద నిత్యం విడుదల అవుతున్న ఉష్టం మొత్తం బయటకు వెళ్లడం లేదు. అందులో సగానికి సగం భూమ్మీదే దాగి వుంటోంది.ఏదో సమయంలో అది ఉబికి రావచ్చు.అదే జరిగితే ఊహించడానికే భయ మేస్తోంది.రోడ్లపై క్షణం తీరక లేకుండా తిరుగా డుతున్న వాహనాలు. నిరంతరం పొగలు కక్కుతున్న ఫ్యాక్టరీలు. ఇలాంటి వాటిల్లో ఇంధనం దహనం కావడంవల్ల విడుద లయ్యే ఉష్టం భూమి నుంచి విడుదల అవుతున్న దానికి సమానంగా వుండాలి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.వాతావరణంలోకి ప్రవేశించే ఉష్టం కంటే బయటికి పోయే ఉష్టం తక్కువవుతోందని అమఎరికాలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ అట్మాస్ఫి యర్‌కు చెందిన జాన్‌ ఫసుల్లో అభిప్రా యపడు తున్నాడు.భూమ్మీద ఎంత ఉష్టం విడుదల అయిందో అంతే ఉష్టంవాతావరణం నుంచి బయటకు వెళుతున్నట్టు ఉపగ్రహ సెన్సర్లు ఇతర పరిక రాలు గుర్తించాలి.అయితే అలా జరగడం లేదు.ఆ ఉష్ణ మంతా సముద్ర గర్భంలోవుంటోంది. దీని కారణం గానే పసిఫిక్‌ మహాసముద్రంలోని ఎల్‌ని నోలు సంభవించి ఉష్ట ప్రాంత భూముల్లో వర్షాభావ పరిస్థితులు వస్తాయి.మరికొన్నిచోట్ల కనివినీ ఎరు గని రీతిలో వరదలు ముంచెత్తుతాయి.కాలం కాని కాలంలో వర్షాలు కురుస్తాయి. అతివృష్టి అనావృష్టి వరసపెట్టి వస్తాయి. వాతావరణంలో జరుగుతున్న మార్పులన్నింటికీ మనమే బాధ్యులం.భూమిపై పెరు గుతోన్న ఉష్టోగ్రతలకు మనమే కారణం ముం దస్తు హెచ్చరికలు లేకుండా ముంచుకొస్తున్న పెను విపత్తులకు మనమే కారకులం. ధ్రువాల మంచు కరిగే శాతం ఎక్కువైంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగి న ఇంధన వాడకమే గ్లోబ ల్‌ వార్మింగ్‌కు ప్రధాన కారణం..మరో పక్క ఓజోన్‌ పొరకు చిల్లు ఏర్పడ టం వల్ల భూమిపై ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి. -(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

గిరిజన నేస్తం

‘పుష్పవిలాపం’లో ఓబాల తనను చెట్టు నుంచి వేరు చేస్తున్నందుకు పూబాల విలపిస్తుంది, విషాదగీతం ఆలపిస్తుంది. కానీ, చిరుగాలి సవ్వడికి చెట్టుమీది నుంచి రాలే ప్రతి ఇప్పపువ్వూ ఆనందంగా గోండుల వెదురుబుట్టలోకి వెళ్లిపోతుంది. ఆహారమై ఆకలి తీర్చబోతున్నందుకూ, పలారమై పిల్లల నోళ్లు తీపిచేయబోతు న్నందుకూ, ఔషధ గుణాలతో అమ్మల చనుబాలను వృద్ధి చేస్తున్నందుకూ .. ఆ సంతోషానికి అనేక కారణాలు. తెల్లవారుజాము సమయంలో తాడ్వాయి అడవులకు వెళితే%ౌౌ% ఆ పుష్ప విలాసాన్ని కళ్లారా చూడవచ్చు. ఇది పువ్వులు రాలే కాలం. గోండుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలం. ఉదయంపూట నడుస్తుంటే, పాదాలకు మెత్తని పూలు తాకుతుంటాయి. తలపైకెత్తి చూస్తే దట్టంగా ఇప్పపూల చెట్లు%ౌౌ% గొడుగులా అల్లుకొని! రాలిన పూలకు అంటిన మట్టిని సుతారంగా తుడిచి, జాగ్రత్తగా వెదురు బుట్టల్లోకి వేస్తుంటారు పిల్లలూ పెద్దలూ. అదో అందమైన దృశ్యం!
ఆ పూవు అటవీ ప్రాంత ప్రజల బతుకుదెరువు. ఇప్పచెట్లకు ఓజీవనచక్రం ఉంటుంది.ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకూ ఆకురాలే కాలం. ఆసమయంలోనే ఘాటైన పరిమళంతో పూలు వికసిస్తుంటాయి. మార్చి నుంచి మూడు నెలల వరకూ పూలు రాలే కాలం.ఒక్కో చెట్టు నుంచీ సుమారు వంద కిలోల పూలు రాలతాయి. ప్రతి పువ్వునూ జాగ్రత్తగా ఒడిసిపట్టుకుంటారు గిరిజనులు.ఎందుకంటే,వాళ్ల బతుకంతా ఇప్పతోనే ముడిపడి ఉంటుంది.ఇప్పపూల సేకరణ కోసం తెల్లవారుజామునే అడవులకు బయల్దేరతారు గోండులు.పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుడి కోసం చూసినట్టు, రాలిపడే ఇప్పపూల కోసం ఎదురు చూస్తుంటారు.అలా, ఒక్కొక్కరు ఐదు నుంచి పది కిలోల వరకూ సేకరిస్తారు. సాయం త్రం బుట్టనిండా పూలతో తృప్తిగా ఇళ్లకు చేరుకుంటాం. వాటిని ఎండబెట్టి పుప్పొడి రేణువులు పోయేదాకా కర్రమొద్దులతో బాదుతారు. ఆ తర్వాత,చేటలతో చెరుగుతారు. గుమ్ముల్లో దాచు కుంటారు. ముందుజాగ్రత్తగా, వాటిలో కొన్ని వేపాకులు చల్లుతారు.దానివల్ల పువ్వు ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఒకనాటి పువ్వు ఇప్పుడు ఆహార పదార్థం.
పువ్వుకే మనసు ఉంటే..
అందంగా పుట్టినందుకు కాదు,ఆహారమై కడుపు నింపుతున్నందుకే ఎక్కువ సంతో షిస్తుందేమో ఇప్పపువ్వు. ఏ కూర లూ లేనపుడు,నాన బెట్టిన బియ్యానికి ఇప్ప పువ్వు కలిపి అన్నం వండుకుంటారు. నాలుకకు కాస్త తీపి తగిలితే బావుండునని అనిపించినప్పుడు బెల్లం కలిపి ఉండలుగా చేసుకొంటారు. ‘ఇవి మా జీవితం. మా ఆత్మ’ అంటూ ఆరబెట్టిన ఇప్పపూలను దోసిళ్లతో చూపుతుంది మోట్లగూడానికి చెందిన అలుగుమెల్లి రజిత.
ఇప్ప గారెలు,జంతికలు
ఇప్పపువ్వు అనగానే సారా తయారు చేస్తారనేదే ఇప్పటి వరకూ ఉన్న ప్రచారం.అంతకుమించి, ఎన్నో వంటలు వండుకుంటారు గోండు మహిళలు.జొన్నపిండి ఉడక బెట్టి,అందులో ఇప్పపూలు కలిపి అంబలి చేస్తారు.వేయించి బజ్జీలు వేస్తారు.చిక్కుడు గింజలు,అలసందలు కలిపి ఉడికిస్తే ఆ అంబలి అమృతమే! ఇప్ప కుడుములు (ఇడ్లీల్లాంటివి),జొన్న-ఇప్పరొట్టె, గోంగూర-ఇప్పపూల కూర,జొన్న-ఇప్ప సత్తుపిండి ఇప్ప పడితే ఎండు గడ్డికైనా ఎక్కడలేని రుచి వస్తుంది.ఇప్పతో అరిసెలు, గారెలు, జంతికలు, మురుకులు కూడా చేసు కుంటారు.ఎర్ర జొన్న పిండి,బెల్లంతో చేసిన రెండు లడ్డూలు తింటే చాలు,రోజంతా భోజనమే అవసరం లేదు.‘చక్కెర పాకానికి ఇప్పపూవు కలిపి జామ్‌, కేక్‌ తయారు చేస్తాం’ అని చెప్పింది ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన భాగుబాయి. వైవిధ్యమైన ఇప్ప వంటకాల తయారీలో ఆమె సిద్ధహస్తురాలు. ఉట్నూరులో ఆదివాసీ ఆహార కేంద్రం నిర్వహిస్తున్నదామె. అనేక ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే,రోజువారీ ఆహారంలో ఇప్పపూవు ఉండేలా చూసుకుంటారు గిరిజ నులు. వారి నివాసాలు కూడా ఇప్పచెట్లకు దగ్గరలోనే ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5లక్షల ఇప్ప చెట్లు ఉన్నట్లు అంచనా.ఐదు లక్షల చెట్లంటే,ఐదు లక్షల జీవితాలే.ఇప్పసారాను నైవేద్యంగా కూడా పెడతారు.ఇప్ప అంటే గోండు దేవతలకు మహా ఇష్టమని అంటారు.మంచిచేసే పువ్వును ఏ దేవుడు మాత్రం ఇష్టపడడు!
శానిటైజర్‌గా ఇప్పసారా!
‘ఆపిల్‌, మామిడి, ఎండు ద్రాక్షలతో పోలిస్తే ఇప్ప పువ్వులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. శరీరానికి కావలసిన ..క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు,బి-కాంప్లెక్స్‌, విటమిన్‌-సి ఇందులో అధికం. ఇవన్నీ వ్యాధినిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. ఇప్ప పూలను దగ్గు, శ్వాసకోశ సమస్యల నివా రణకు వాడతారు. ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకొని తాగుతారు బాలింతలు. దీనివల్ల చనుబాలు వృద్ధి అవుతాయని అం టారు.‘ఇప్పసారా తయారీపై నిషేధం ఉంది. శుభకార్యాలప్పుడు అయిదు లీటర్ల వరకు తయారు చేసుకోవడానికి మాత్రం అనుమతి ఉంది. ఇప్పుడున్న పరిస్ధితుల్లో శానిటైజర్లు మారుమూల గిరిజన ప్రాంతాల్లో దొరకవు. కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్‌ నిరోధానికి ఇప్పసారాను శానిటైజర్‌గా వాడుతున్నారు’ అంటారు.
ప్రారంభమైన ఇప్పపువ్వు సేకరణ!..
ఏజెన్సీ అడవుల్లో ఇప్పపువ్వు సీజన్‌ నడుస్తుంది. ప్రతి ఏడాది మార్చి నుంచి మే చివరి దాకా ఇప్పపువ్వు సేకరణలో గిరిజనం నిమగ్నమవు తుంటారు. వేసవి కాలంలో ఉపాధినిచ్చే ఇప్పపూల కోసం మంటుటెండను సైతం లెక్కచేయకుండా చిన్నాపెద్దా తరలుతున్నారు. తెల్లవారుజామునే తట్టా బుట్టా,అంబలి బుర్రతో బయలుదేరి, సాయంత్రం కల్లా ఊళ్లకు చేరు కుంటారు.గిరిజనులకు ఇప్పపూల సేకరణే ప్రధాన ఆదాయవనరు మాత్రమే కాదు.ఇప్ప పువ్వును గిరిజనులు పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ,వేడుకలు, సంబరాలు, పెళ్లి సమయాల్లో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాయి తాగడం ఆచారంగా పాటిస్తారు.సాధారణగా ఉదయం సమయంలో రాలుతుంటాయని,30సంవత్సరాల వయస్సు గల ఒక చెట్టు నుండి సుమారు 100నుండి 150 కిలోల ఇప్పపూలు లభిస్తుంటాయని పలువురు గిరిజనులు న్యూస్‌18కు తెలియ జేశారు ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెడుతారు.బాగాఎండిన తరువాత వీటిని తమ అవసరాలకు అనుగుణంగా కావాల్సినప్పుడు వాడుతుంటారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్ప పువ్వు అంటే కేవలం సారా యి తయారు చేయడానికే వాడుతారు అనే భావన ఉంది.కానీ భద్రాచలం ఏజెన్సీ అడుగులలో లభించే ఈ పప్పుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదం భక్తులకు విక్రయిస్తారని గిరిజనులు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా గతంలో పలువురు శాస్త్ర వేత్తలు జరిపిన పరిశోధనలో ఇప్ప పూల నుండి పంచదార పాకం తయారు చేసి దీంతో బిస్కెట్‌,చాక్లెట్‌,జామ్‌,కేక్‌లు తయారు చేసే విధానాన్ని కనిపెట్టారు.1999లో పేటెంటు కొరకు దరఖాస్తు చేశారు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఇప్ప పూలు బాలింతలకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. సాధారణ శారీరక బలహీనత నుండి రక్షిస్తుంది. వీటిని నేరుగా తినడంవల్ల పిల్లలు పోషకహార లోపం నుండి బయట పడవచ్చు. గతంలో గిరిజనులందరూ ఇప్ప పూలను మంగళంలో పొడిగా చేసి వేపి,వేపిన గోంగూర గింజల పొడిని కలుపుతూ ఇప్ప నూనె కొంచెం చేర్చి ఉండలుగా చేసుకొని తినేవారు. రెండు లడ్లు తింటే ఒక రోజుకు సరిపడా శక్తి శరీరా నికి లభించేది. కొన్ని రాష్ట్రాల్లో గిరిజనులు ఈ పూలను రొట్టెల పిండిలో కలిపి తింటారు. ఇప్పపూలతో ఇప్పజామ్‌గిరిజనులకు ఇప్పపూల సేకరణే ఆధారం.
దివ్య ఔషదాల కల్పవల్లి..
కొండకోనల్లో జీవించే గిరిజనులకు ప్రకృతి వనరులే జీవనాధారంగా ఉంటాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా లభించే వివిధ రకాల పండ్లు, పంటలు గిరిజనులకు ఆహార సంపదతో పాటు ఆదాయ వనరులుగా ఉపయోగపడుతుంటాయి. ప్రస్తుతం జీడీ, చింతపండు,కరక్కాయ వంటి సహజసిద్ద పంట లతోపాటు ఇప్పపూలు సేకరణద్వారా గిరిజ నులు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
వేసవిలో ఇప్పపూలు సేకరణలో గిరిజనులు బిజీగా గడుపుతుంటారు.గిరిజనులు చింత పండు,జీడి పిక్కలు సేకరణతో పాటు మరోవైపు ఇప్పపూలు సేకరణలో బిజీగా కనిపి స్తుంటారు. ఏగ్రామం చూసిన విప్పపూల సువాసన వెదజల్లుతోంది.ఇప్పపూలులో దివ్యౌషధం గుణాలు కలిగి ఉన్నాయి. ఇప్పపూలు విని యోగించేవారు విశేషమైన ఆరోగ్య లాభాలు పొందుతారు.ముఖ్యంగా కీళ్ల నొప్పులు,ఒళ్ళు పట్లు, వాతాలకు దివ్యౌషధం ఇప్పపూలు. దగ్గు,శ్వాసకోస వ్యాధులకు కూడా వాడు తుంటారు.ఇప్ప కాయలను పొడిచేసి పాలలో కలుపుకుని గిరిజన మహిళలు తాగుతారు.దీని వలన బాలింతలు చనుబాలు వృద్ధి అవుతాయని అంటుంటారు. విప్ప పువ్వు తో ఆయుర్వేదిక్‌ మందులు, నూనె లడ్డు, హల్వా, కేకులు తయారు చేస్తుంటారు. అందుకే విప్ప పువ్వుకు మార్కెట్‌ లో మంచి డిమాండ్‌.అడవుల్లో సేకరించిన విప్ప పువ్వును బాగా ఎండ బెడతారు. అనంతరం ఆ పువ్వు నుంచి గింజ లను వేరు చేసి,మళ్లీ ఎండబెడతారు. అనం తరం వాటిని గానుగ ఆడిరచి నూనె తీస్తారు. ఈ నూనెను వంటలలో ఉపయోగిస్తుంటారు. అలాగే, ఔషధాలకూ ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో విప్ప నూనె కిలో ధర 50రూపాయల వరకు పలుకుతుంది. గిరిజను లు ఈ నూనెను విక్రయిస్తూ, ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. గతంలో గిరిజన సహకార సంస్థ ద్వారా విప్ప పువ్వు,విప్ప నూనెను ప్రభుత్వమే కొనుగోలు చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.దీంతో మార్కెటింగ్‌ కోసం గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పపూలు,గింజల నుంచి తీసే నూనెలో ఔషధపోషక గుణాలు కూడా ఉన్నా యని జాతీయ పౌషకాహార సంస్థ అధ్యయనంలో తేలిందని ట్రైఫెడ్‌ చెబుతుంది. బాలింతలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతోపాటు శారీరక బలహీ నత నివారించే గుణాలు వీటిలో ఉన్నాయని పేర్కొంటోంది.30 ఏళ్ల వయస్సున్న ఇప్ప చెట్టు సగటున 150 కిలోల పూలను ఉత్పత్తి చేస్తుంది.మట్టి అంటకుండా ఈపూలను సేకరించి నిల్వ చేస్తారు.అనంతరం వీటి నుంచి పంచదార పాకం చేసి దాంతో బిస్కెట్‌,చాక్లెట్‌, జామ్‌,కేక్‌లను తయారు చేస్తారు.కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన పరిశోధనలో ఢల్లీికి చెందిన డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.నాయక్‌ ఈ ప్రక్రియపై పేటెంట్‌ కోసం కూడా దరఖాస్తు చేశారు- ఎ.పోశాద్రి

అమల్లోకి సీఏఏ

‘‘ వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఓట్లు కురిపిస్తున్నందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంగా బయటికి తీసింది. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌ల నుంచి భారత్‌కు శరణార్ధు లుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా మార్చి 11న నోటిఫికేషన్‌ జారీ చేసింది.’’ ` గునపర్తి సైమన్‌
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన లౌకిక భార తాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వినాశకర పౌరసత్వ చట్ట సవరణ-2019ని ఎన్నికల ముంగిట మోడీ ప్రభుత్వం మళ్లీ ముందుకు తెచ్చింది. మతపర మైన ఉద్రిక్త తలు రెచ్చగొట్టడం దేశ సమగ్రత, సమె ౖక్యతకు గొడ్డలిపెట్టు. ఎన్నికల్లో లబ్ధిపొం దాలన్న యావతో వివాదాస్పద సిఎఎ అమలుకు అది తెగబడిరది.ఈ చట్టానికి వ్యతిరేకంగా 2019-20లో దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ప్రభుత్వ రాక్షసత్వానికి దాదాపు వంద మంది బల య్యారు. అప్పట్లో తాత్కాలికంగా వెనక్కితగ్గి ఇన్నాళ్లూ కోల్డ్‌ స్టోరేజిలో పెట్టిన ఈ చట్టాన్ని ఎన్నికల ముంగిట అందునా రంజాన్‌ ఉపవా సాలు ప్రారంభమైన ముందురోజున నోటిఫై చేయడం దాని దుష్ట ఎజెండాలో భాగమే. విచ్ఛిన్నం చేసే మత విభజనను తెచ్చి రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు,నిరు ద్యోగం,కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలన్నీ పక్కనపెట్టి భావోద్వేగ అంశాలను, మతపరమైన అంశాలను రెచ్చగొట్టడం వల్లే ప్రయోజనం పొందాలనేది బిజెపి కుతంత్రం. 2019లో ఎన్నికల ముందు పుల్వామా, సర్జికల్‌ స్ట్రైక్స్‌,దేశభక్తి లాంటి అంశాలను ముందుకు తెచ్చినట్టే ఇప్పుడూ సిఎఎ లాంటి అంశాలతో లబ్ధిపొందాలని ఆపార్టీ చూస్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్‌ 11న పార్లమెంట్‌లో ప్రతిపక్షాల బహిష్కరణ మధ్య అత్యంత అప్రజాస్వామిక రీతిలో ఆమోదింప జేసుకుంది.ఎన్‌డిఎ భాగస్వాము లతోపాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ఎంపిలు ఆనాడు దీనికి అనుకూలంగా ఓటు వేశారు.ఈచట్టం ప్రకారం 2014డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లా దేశ్‌ల నుండి మనదేశానికి వలస వచ్చిన హిందువులు, బౌద్ధులు, జైనులు,సిక్కులు,క్రైస్తవు లు,పార్శీలకు భారత పౌరసత్వం ఇస్తారు. ఈ చట్టం అమలును జాతీయ పౌరపట్టిక ఏర్పాటుతో ముడిపెట్టడం ముస్లిం పౌరులను లక్ష్యంగా చేసుకునేందుకే. రాష్ట్రాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారి గుర్తింపు,పేర్ల నమోదు క్రమం నుండి రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేయడం చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చిన రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించింది. ఇది భారత ఫెడరల్‌ వ్యవస్థ స్ఫూర్తికే విరుద్ధం. ఈ చట్టాన్ని మూడు దేశాలకే పరిమితం చేయడం,మతం ఆధారంగా తీసుకురావడం 1955లో తీసుకొచ్చిన సిఎఎ చట్టానికి, రాజ్యాం గ మౌలిక స్వరూపానికి వ్యతిరేకం.రాజ్యాంగం లోని 19వ అధికరణం మతప రమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లం ఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపర మైన హింసను ఎదుర్కొం టున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారు? తమిళులపట్ల వివక్షా? ఇప్పుడు ముస్లిములను మినహాయించిన వారు తరువాత క్రైస్తవులను, ఇతర మైనార్టీలను మినహాయిం చరా? వంటి ప్రశ్నలనేకం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం,మతం,రంగు,జాతి,ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండ కూడదు.కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుంది కనుక ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ మౌలిక సూత్రా లను (బేసిక్‌ స్ట్రక్చర్‌ను) మార్చే అధికారం పార్ల మెంట్‌కు కూడా లేదని కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ఇవేవీ పట్టని మన పాలకులు మతాన్ని అడ్డగోలుగా రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ‘జై భజరంగి’ అంటూ ఓట్లు వేయాలని ప్రధాని స్వయంగా పిలుపు నిచ్చారు.‘పాకిస్తాన్‌కు వెళ్లండి..లేదా కబరి స్థాన్‌కు వెళ్లండి’అంటూ వీరంగం వేయడం, బుల్డోజర్లతో నివాసాలను కూల్చివేయడం..కమ లం పార్టీకి,ఆ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వా లకు నిత్యకృత్యమే.400 సీట్లు ఇవ్వండి రాజ్యాం గాన్నే మార్చేస్తాం..సెక్యులర్‌ దేశంగా భారత్‌ను ఉంచం అని బిజెపి ఎంపి అనంత హెగ్డే అన్నారు. సిఎఎను అమలు చేయబోమని ఇప్పటికే కేరళ,తమిళనాడు ప్రభుత్వాలు ప్రకటిం చగా, మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. భిన్న మతాలు, ఆచారా లు,సంప్రదాయాలు,సంస్కృతులకు నియమైన మన దేశానికి ఈ చట్టం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.మత మారణహోమాన్ని రగిలించే మతోన్మాద శక్తుల ఆట కట్టించేందుకు యావ ద్భారత జాతి ఐక్యంగా ముందుకు ఉరకాలి. సిఎఎను తిప్పికొట్టాలి.
ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం.. అంటే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ముఖ్య అజెండాల్లో ఒకటి.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ). ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ అంశం వివాదాస్పదమవుతోంది. సీఏఏను వారంలో దేశమంతా అమలు చేస్తామని కేంద్రం ప్రకటిం చడం కాక రేపుతోంది. అయోధ్యలో రామాల య నిర్మాణంతోపాటు ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా బీజేపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోందని విపక్షాలు విమర్శి స్తున్నాయి.ఇంతకూ ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అంటే..పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గనిస్తాన్‌ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించ డం.2014 డిసెంబర్‌ 31కి ముందు ఆయా దేశాల నుంచి భార్ష కు వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందడానికి అర్హులు. ఆయా దేశాల నుంచి వలస వచ్చిన హిందు వులు,సిక్కులు,జైనులు,బౌద్ధులు,పార్శీలు,క్క్రెస్తవులు దీని సీఏఏ కింద భారత పౌరసత్వం పొం దొచ్చు. ఆఫ్గనిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చినవారికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా,వాటి గడువు ముగిసినా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకో వచ్చు.ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టా నికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణలు చేసింది. వాస్తవానికి పౌరసత్వ సవరణ చట్టం ప్రతిపాదన బిల్లును మొదట 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే అప్పుడు బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్‌ తోపాటు తదితర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెం టు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రూపుదాల్చింది.అయితే దేశవ్యా ప్తంగా సీఏఏపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్షాల ఆందోళనలతో దాని అమలు ఇన్నాళ్లూ వాయిదా పడిరది. కానీ జమ్ముకాశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడం,లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం,అయోధ్యలో రామా లయం నిర్మాణం వంటి చర్యలతో దూకుడు మీదున్న బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం విషయంలోనూ అంతే పట్టుదలతో ఉం దని అంటున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ఖాయమని వెల్లడిర చారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం.. 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు భారత పౌరసత్వం కల్పిస్తారు. అలాగే వీరు భారత్‌ పౌరసత్వం పొందడానికి భారత్‌లో కనీసం 11ఏళ్లుగా నివసిస్తూ ఉండా లన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. అయితే హిందువులకు, క్క్రెస్తవులకు, బౌద్ధులకు, పార్శీలకు పౌరసత్వం ఇస్తూ ముస్లిం మైనారిటీ లను చేర్చకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్త మవుతున్నాయి. సీఏఏపై విపక్షాల అభ్యంతరా లెందుకు అంటే..వివిధ దేశాల నుంచి వలస వచ్చి భారత్‌లో జీవిస్తున్న వివిధ మతాలవారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వీరికి పౌర సత్వం కల్పిస్తే వారంతా బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకుగా మారతారని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ముస్లింలకు పౌరసత్వం కల్పించకపోవడం పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే విదే శీయుల కారణంగా స్థానికంగా ఉండేవారికి ఉపాధి విషయంలో,సంస్కృతి సంప్రదాయాల విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ప్రతిపక్షాల అభ్యంతరంగా ఉంది.అలాగే పాకిస్థాన్‌,బంగ్లాదేశ్‌,ఆప్గనిస్తాన్‌ల నుంచి వచ్చినవారికి పౌరసత్వం కల్పిస్తూ శ్రీలంక, టిబెట్‌,మయన్మార్‌ నుంచి వచ్చినవారికి పౌర సత్వం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా సీఏఏ చట్టం రాజ్యాంగబద్ధతనే సవాలు చేస్తూ పలు పార్టీలు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసులు వేశాయి. వీటిపై విచారణ తుది దశలో ఉంది.
చట్టం అమలుకు నిబంధనలను విడుదల
ఈ చట్టాన్ని అమలు పరచడానికి అవసరమైన నియమ నిబంధనలను కేంద్రం నోటిఫై చేసిం దని ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడిరచింది. ఈ నిబంధనలకు అమల్లోకి వస్తే 2014డిసెంబర్‌ 31తర్వాత పాకిస్తాన్‌,అఫ్గానిస్తాన్‌,బంగ్లాదేశ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వలస వచ్చిన హిందువులు, సిక్కులకు భారత పౌరసత్వం దక్కే అవకాశం ఏర్పడుతుందని హోంశాఖ తన ట్వీట్‌లో పేర్కొంది.ఇందుకోసం పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
ఏమిటీ బిల్లు
ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంటులో ప్రవేశ పెట్టారు.అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న పార్లమెంటు దిగువసభ (లోక్‌సభ)లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే..ఈశాన్య భారత దేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత ఎగువ సభ (రాజ్యసభ)లో ఇది ఆమోదం పొందలేదు. ముఖ్యంగా..ఆగస్టు నెలలో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితాలో దాదాపు ఇరవై లక్షల మంది నివాసులకు చోటు కల్పించని అస్సాం రాష్ట్రంలో నిరసనలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ పౌరసత్వ సవరణ చట్టం,ఆపౌరుల జాబి తా రెండూ ఒకటి కాకపోయినప్పటికీ..ఆ జాబి తాకు ఈ చట్టానికి సంబంధం ఉందని జనం భావిస్తున్నారు. జాతీయ పౌరుల జాబితా (నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌-ఎన్‌ఆర్‌సీ) అనేది..1971 మార్చి 24వ తేదీ నాటికి – అంటే పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌ స్వతంత్ర దేశంగా మారటానికి ఒక రోజు ముందు నాటికి తాము ఈ రాష్ట్రానికి వచ్చామని నిరూపించు కోగలగిన ప్రజల జాబితా.ఆ జాబితాను ప్రచురించటానికి ముందు ఎన్‌ఆర్‌సీని బీజేపీ సమర్థించుకుంటూ వచ్చింది. కానీ.. తుది జాబితాను ప్రచురించటానికి కొన్ని రోజుల ముందు అందులో తప్పులు ఉన్నాయంటూ వైఖరి మార్చుకుంది. దానికి కారణం..బీజేపీకి బలమైన ఓట్ల పునాదిగా ఉన్న బెంగాలీ హిందు వులు చాలా మందిని కూడా ఆ జాబితా నుంచి మినహాయించారు. ఈ నియమాలు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌,అఫ్గానిస్తాన్‌ దేశాల్లో మతపరంగా హింసకు గురవుతున్న మైనారిటీలకు మన దేశంలో పౌరసత్వాన్ని పొందేలా చేస్తాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న హిందువులు,సిక్కులు, బౌద్ధులు,జైనులు,పార్సీలు,క్రైస్తవులకు మన రాజ్యాంగ నిర్మాతలు ఇచ్చిన వాగ్దానాన్ని గ్రహించి,ఈ నోటిఫికేషన్‌తో నరేంద్ర మోదీ నెరవేర్చారు’’ అని ఎక్స్‌ వేదికగా తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరూ మతం ఆధారంగా వివక్ష చూపకూడదు.అయితే ఈ చట్టంలో ముస్లింలకు పౌరసత్వం కల్పించే నిబంధన లేదు. ఈ కారణంగానే సెక్యులరి జానికి విఘాతం కలుగుతోందన్న ఆరోపణలు వినిపించాయి.
పౌరసత్వ చట్టం చరిత్ర ఏమిటి?
అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది.ఆచట్టం ప్రకారం.. అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు.ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి 11సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తుంది.ఆరు మతపర మైన మైనారిటీ సమూహాలకు-హిందువులు, సిక్కులు,బౌద్ధులు,జైనులు,పార్సీలు,క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది.అయితే..వారు పాకిస్తాన్‌,అఫ్ఘానిస్తాన్‌,బంగ్లాదేశ్‌ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించు కోగలగాలి.అటువంటి వారు పౌరసత్వం పొంద టానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవ త్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పనిచేసి ఉంటేచాలు. ప్రవాస భారత పౌరులు (ఓవర్‌సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా- ఓసీఐ) కార్డులుగల వ్యక్తులు-భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవ ధికంగా నివసించటానికి లేదా పని చేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు.. చిన్న,పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లం ఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పో తారని కూడా ఈ సవరణ చెప్తోంది.పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉండే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా? దేశం లోని కొన్ని బీజేపీయేతర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేయబోమని ప్రకటించాయి.అయితే, పౌరసత్వం కేంద్ర ప్రభుత్వ ?అధికార పరిధి లోకి వస్తుంది కదా,మరి అది సాధ్యమేనా? పౌరసత్వ సవరణ చట్టం-2019ను భారత పార్లమెంట్‌ ఆమోదించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం దీనికి సంబంధిం చిన నిబంధనలు నోటిఫై చేసింది.ఈచట్టం ప్రకారం 2014కు ముందు పాకిస్తాన్‌,బంగ్లా దేశ్‌,అఫ్గానిస్తాన్‌ దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించిన హిందూ,బౌద్ధ,పార్సీ,క్రైస్తవ,జైన మతాలకు చెందిన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.వారు భారత్‌లోకి ప్రవేశించినట్లుగా నిరూపించే ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి అందించా ల్సిన పత్రాలను సెక్షన్‌ 1ఏ,సెక్షన్‌ 1బీ విభాగా ల్లో పొందుపరిచారు.1ఏ పత్రాలలో జనన ధ్రువీకరణ,అద్దె ఒప్పంద పత్రం, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌,అఫ్గానిస్తాన్‌, బంగ్లా దేశ్‌,పాకిస్తాన్‌ దేశాలు జారీ చేసిన విద్య సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పిం చాలి.1బీ కోసం భారత ప్రభుత్వం జారీ చేసిన వీసా,పాన్‌ కార్డు,మ్యారేజ్‌ సర్టిఫికేట్‌,సెన్సస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ అడ్మిట్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్డులు పేర్కొన్నారు.ఈ పత్రాలు 2014కి ముందే తీసుకొని ఉండాలి. ఈ పత్రాలు అందుబాటులో ఉంటే,ఈ మూడు దేశాల ప్రజలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా?పౌరసత్వం మంజూరు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది, అయితే ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేయ కుండా ఉండటం సాధ్యమవుతుందా? ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తు తున్నాయి.భారత రాజ్యాంగంలోని భాగం సెంట్రల్‌ లిస్ట్‌,స్టేట్‌లిస్ట్‌,కామన్‌ లిస్ట్‌ పరిధిలోకి వచ్చే విషయాలను నిర్వచిస్తుంది. కేంద్ర జాబితాలో మొత్తం 97అంశాలు ఉన్నాయి. 17వ అంశంగా ‘సిటిజన్‌షిప్‌,నాచురలైజేషన్‌, అలియన్స్‌’లను ప్రస్తావించారు.ఈ జాబితాలో ఉన్న విషయాలపై చట్టం చేసే హక్కు పూర్తిగా పార్లమెంట్‌ది.భారత పార్లమెంట్‌ ఆమోదించిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోగలవా?
కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడం,వ్యతిరేకించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ గతం లో కొన్ని వ్యాఖ్యలు చేశారు.2020లో కేరళలో జరిగిన ‘కేరళ లిటరేచర్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ..‘సీఏఏను పార్ల మెంట్‌ ఆమోదించిన తర్వాత ఏరాష్ట్రం కూడా దాన్ని అమలు చేయబోమని చెప్పలేదు.కానీ, వ్యతిరేకించవచ్చు.అసెంబ్లీలో తీర్మానం చేయ వచ్చు. చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయవచ్చు.కానీ దానిని అమలు చేయబోమని చెప్పడం రాజ్యాంగ పరంగా సంక్లిష్టమైనది’’ అని ఆయన అన్నారు. అంతేకాదు, పౌరసత్వం కోరేవారు కేంద్ర ప్రభు త్వం రూపొందించిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎలా అడ్డుకుంటుంది లేదా అమలు చేయ కుండా ఉంటుందా?అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
‘పౌరుల రిజిస్టర్‌ తయారు చేయగలరా?’
సిటిజన్‌ షిప్స్‌, నాన్‌- సిటిజన్‌ షిప్స్‌ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చినా,రాష్ట్ర ప్రభుత్వం మద్దతు లేకుండా ఏమీ చేయలేరని డీఎంకే అధికార ప్రతినిధి సీ రవీంద్రన్‌ అన్నారు.‘‘సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు ఒకదానికొకటి అనుసంధానమైనవి. రాష్ట్ర ప్రభుత్వ సహాయం లేకుండా పౌరుల రిజిస్టర్‌ తయారుచేయవచ్చా? ఉదాహరణకు, శ్రీలంక తమిళులు ఈ సీఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం పొందలేరు. వారు ఒకవేళ శ్రీలంక తమిళులని చెబితే వెళ్లగొడతారు,అది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా?మేం అంగీకరించం’’ అని రవీంద్రన్‌ అన్నారు.రాజకీయాల కోసమే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చట్టాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.‘‘ఉత్తర భారతదేశంలో హిందూ శక్తులు బలంగా ఉన్న ప్రాంతాలలో,బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అని నటిస్తోంది. వాళ్లు దీన్ని పూర్తిగా అమలు చేయలేరు’’ అని రవీంద్రన్‌ ఆరోపించారు.

ఏపీలో ఎన్నికల కోడ్‌`2024

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది సీఈసీ. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర సరిహద్దుతో పాటుగా జిల్లాల సరిహద్దుల్లో కూడా అవసరమైన చోట చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.డబ్బులు, బంగారం, వెండి,మద్యం,విలువైన వస్తువులు భారీగా పట్టుబడుతోంది.దీంతో ఎంత వరకు డబ్బు,బంగార,వెండిని వెంట తీసుకె ళ్లొచ్చు..ఒకవేళ తీసుకెళితే ఎలాంటి ఆధారాలు ఉండాలి అనే నిబంధనలపై చర్చ జరుగుతోంది.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం..పరిమితికి మించి తీసుకెళ్తే తప్పనిసరిగా లెక్క చూపించాలి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రూ.50వేలు వరకు మాత్రమే డబ్బులు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తే..ఆ నగదుకు సంబంధించిన వివరాలు, సరైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎక్కడికి తీసుకెళుతున్నారు వంటి అంశాలను చెప్పాల్సిందే. ఒకవేళ డబ్బులు తీసుకెళ్లేవారు ఇచ్చే డాక్యుమెంట్లు, చెప్పే విషయాల్లో నిజాలు లేకపోతే ఆ డబ్బుల్ని స్వాధీనం చేసుకుంటారు. సరైన పత్రాలు చూపించిన తర్వాతే తిరిగి ఆ నగదును అప్పగిస్తారు. అప్పటి వరకు ఆ డబ్బులు కోర్టు కస్టడీలో ఉంటాయి. ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. డబ్బులు మాత్రమే కాదు.. బంగారం, వెండి తదితర ఆభరణాలు, విలువైన వస్తువుల్ని కూడా పరిమితికి మించి తీసుకెళ్లకూడదు..
నియమావళి అంటే ఏమిటి, పాటించకపోతే ఏమవుతుంది?
లోక్‌ సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ లకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. దీంతో 2024 జనరల్‌ ఎలక్షన్స్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రక్రియ మొదలు పెట్టినట్లయింది.ఏడు దశల్లో జరిగే ఈ ఎన్నికల్లో కోట్లమంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఎన్నికల నియ మావళి(ఎలక్షన్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) కూడా అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ‘‘ఎన్నికల నియమావళి’’గా పిలుస్తారు.ఎన్నికల నియమావళిని అమలుచేసిన తర్వాత ప్రభుత్వ పరిపాలన యంత్రాంగంలో కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కొందరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సిబ్బందిగా పని చేస్తారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరు ఈసీ కోసమే పనిచేస్తారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత,ఒక పార్టీకి ప్రయో జనాలు చేకూర్చేలా ప్రజాధనాన్ని ఉపయోగించ కూడదు. ఒకసారి కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత,కొత్త ప్రభుత్వ పథకాలు,భూమి పూజలు,శంకుస్థాపనలు,ప్రకటనలు చేయ కూడదు.ప్రభుత్వ వాహనాలు,విమానాలు, ప్రభుత్వ భవనాలను ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోకూడదు.ఎన్నికల ర్యాలీలు, పాదయాత్రలు,బహిరంగ సభలు లాంటి ప్రజా కార్యక్రమాలు నిర్వహించే పార్టీలు,అభ్యర్థులు, వారి మద్దతుదారులు ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మతం,కులంపేరుతో ఏరాజకీయ పార్టీ ఓట్లు వేయాలని అభ్యర్థించకూడదు.మత ఘర్షణలు రెచ్చగొట్టేలా లేదా కులాల మధ్య చిచ్చు పెట్టేలా లేదా భాష పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేలా అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రకటనలు లేదా వ్యాఖ్యలు చేయకూడదు. పార్టీలు లేదా అభ్యర్థుల విమర్శలు..విధాన నిర్ణయాలు,పథకాలు,కార్యక్రమాలు,గతంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావాలి.అభ్యర్థుల వ్యక్తిగత అంశాలు, ప్రజా జీవితంతో సంబంధంలేని అంశాల జోలికి పోకూడదు. నిరూపించలేని ఆరోప ణలను చేయకూడదు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మసీదులు, చర్చ్‌లు, దేవాలయాలు ఇతర ప్రార్థనా స్థలాలను ఉపయోగించుకో కూడదు.ఎన్నికల చట్టంలో నేరాలుగా పరిగణించే ‘‘అవినీతి‘’ విధానాల జోలికి అభ్యర్థులు, పార్టీలు వెళ్లకూడదు.ఓటర్లకు డబ్బులు లేదా బహుమతులు ఇచ్చి ప్రలోభ పెట్టడం,భయపెట్టడం,దొంగ ఓట్లు వేయడం లాంటివి చేయకూడదు.పార్టీలు ఓటర్లకు లంచం ఇవ్వడం/బెదిరించడం/అవమానించడం లాంటవి చేయకూడదు.ఓటర్లను పోలింగ్‌ స్టేషన్‌లకు, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు కల్పించకూడదు. పోలింగ్‌ రోజున మద్యం సేవించడం/పంపిణీ చేయడం నిషేధం.పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఎలాంటి ప్రచార బోర్డులు ఏర్పాటుచేయకూడదు. పోలింగ్‌కు ముందు 48 గంటల సమయంలో ఎలాంటి ప్రచార కార్యక్రమాలూ నిర్వహించకూడదు.ఎన్నికల కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్‌ ఎన్నికల పరిశీలకులను నియమిస్తుంది.
ప్రవర్తనా నియమావళి ఎప్పుడు ప్రారంభమైంది?
భారత్‌లో 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికలతో ప్రవర్తనా నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల అంగీకారంతో వారితో సంప్రదింపులు జరిపి ప్రవర్తనా నియమావళిని రూపొందించారు. పార్టీలు, అభ్యర్థులు ఏ నియమాలను అనుసరించాలో నిర్ణయించుకున్నారు.1967 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ప్రవర్తనా నియమావళి అమలు చేశారు. దానికి కొన్ని కొత్త విషయాలు, నియ మాలు పొందుపరిచారు.కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఏ చట్టంలోనూ భాగం కాదు.కానీ దానిలోని కొన్ని నిబంధనలు ఐపీసీలోని సెక్షన్ల ఆధారంగా అమలవుతాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 1979లో రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవర్తనా నియమావళిని సవరిం చింది.1979 అక్టోబరులో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి దీన్ని అమలుచేశారు.ప్రవర్తనా నియమావళి విషయంలో 1991జనరల్‌ ఎల క్షన్స్‌ అత్యంత ముఖ్యమైనవి.ఈ సమయంలో ప్రవర్తనా నియమావళిని విస్తరించారు.దీనిని అమలుపరచడంలో ఎన్నికల సంఘం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిచింది. తేదీలు (షెడ్యూల్‌) ప్రకటించిన రోజు నుంచే ప్రవర్తనా నియమావళి అమల్లోకి తెచ్చేలా చూడాలని ఎన్నికల కమిషన్‌ భావించగా,నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.ఈ వ్యవహారం చివరకు కోర్టుల వరకు వెళ్లింది.కానీ,అక్కడి నుంచి స్పష్టత రాకపోవడంతో చివరకు 2001 ఏప్రిల్‌ 16రాజకీయ పార్టీలు,ఎన్నికల సంఘం మధ్య జరిగిన చర్చల తర్వాత,షెడ్యూల్‌ విడుద లైన రోజు నుంచి ప్రవర్తనా నియమావళి (కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌)ను అమలు చేయడానికి ఇరు వర్గాలు అంగీకారానికి వచ్చాయి.అయితే, ఎన్నికల తేదీకీ, నోటిఫికేషన్‌కు మధ్య కనీసం మూడు వారాల (21రోజుల) గడువు ఉండా లన్న షరతు పెట్టారు.

ఏపీ ఎన్నికల `2024 షెడ్యూల్‌ ఇదీ..
ఏప్రిల్‌ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్‌
ఏప్రిల్‌ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
ఏప్రిల్‌ 26న నామినేషన్ల పరిశీలన
ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు
తెలంగాణలోనూ మే 13న ఎన్నికలు
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక
జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ..ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్‌ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు

` సైమన్‌

1 2