నిరంతర స్పూర్తిప్రదాత

నూట ముప్పైయేళ్లు క్రితం భారతీయ సమాజంలో పుట్టిన ఆ మహా విప్లవం పేరు.అంబేద్కర్‌.133 ఏళ్ల తర్వాత.. ఈకోట్లాది మహాభారతావనికి బాబా సాహెబ్‌ రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు.ఈ దేశ గతిరీతులకు విధాత.నేటికీ ఆయనే మన సామాజిక పథ నిర్ధేత.కులం పునాదులను పెకలించాలని పిడికిలెత్తిన సామాజిక విప్లవకారులకు మహో పాధ్యా యుడు. దేశంలో అణగారిన కోట్లాది ప్రజలకు న్యాయం అందించే గొంతుక.ఆ ప్రజల చైతన్యాన్ని శాసిస్తున్న నడిపిస్తున్న, విప్లవింపచేస్తున్న మరణం లేని ప్రవక్త. మన బడ్జెట్లకూ,ఆర్ధిక విధానాలకు నిత్య నిర్ధేశకుడు అంబేద్కరే.ఈ దేశ రాజకీయ రంగాన్ని శాసిస్తున్న మహాశక్తి.-జీఎన్‌వీ సతీష్‌
ఆయన రాసిన ప్రతి అక్షరం,పలికిన ప్రతి మాటా ఈ దేశానికి ఒక సందేశం.ఆ నిత్య స్పూర్తిమంతుని 133వజయంతిని జరుపు కోవడం,సేవలను మన నం చేసుకోవడం ఒకగొప్ప అనుభవం.చారిత్రక అవసరం. అస్పృశ్యతా శాపానికి గురైన మహర్‌ కుటుంబంలో పుట్టిన అంబేద్కర్‌,ఆవర్గంలో మెట్రిక్యు లేషన్‌ చేసిన మొదటి విద్యార్ధి.బరోడా మహారాజు ఆర్ధిక సాయంతో ముంబైలో డిగ్రీపూర్తిచేసి,ఉన్నత విద్యకు కొలంబియా (అమెరికా)వెళ్లారు.అక్కడ ఉన్న భారతదేశ సమస్యల గురించి ఆయన ఆలోచించే వారు.సంఘానికి సంబంధించి నంతవరకు అస్పృశ్యులు వేరు కాదు.వారు భారతీయ సంస్కృతిలో అవిభక్త భాగమే అని ఇండియన్‌ రేస్‌ అనే తనవ్యాసంలో స్పష్టం చేశారు.తర్వాత ఆయన చేసిన పరిశోధనలకు ఈ సిద్దాంతమే ఆధారం.
అంబేడ్కర్‌ తొలి పత్రిక ‘’మూక్‌ నాయక్‌’’కు 104 ఏళ్లు
‘‘ఇక్కడి సామాజిక వ్యవస్థను ఓసినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈదేశం అన్యాయా లకు పెట్టని కోటలా కనిపిస్తుంది.కచ్చితంగా అలానే అనిపి స్తుంది’’.సరిగ్గా 104 సంవత్స రాల క్రితం,31జనవరి 1920నాడు‘ ‘మూక్‌నాయక్‌’’జర్నల్‌ తొలి సంచిక కోసం అంబేడ్కర్‌ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు ఇవి. అప్పటితో పోల్చిచూస్తే..నేడు చాలా మార్పులు వచ్చాయి.అయితే, మారాల్సినంత మార లేదు.మీడియాతో అంబేడ్కర్‌కు విడదీయరాని బంధాలు పెనవేసుకుని ఉండేవి.ఆయన సొంతంగా మీడియా సంస్థలను ప్రారంభించారు. సంపాద కుడిగా పనిచేశారు.ప్రత్యేక వ్యాసాలూ రాశారు.ఆతర్వాత ఆయనే పత్రికల వార్తల్లో నిలిచారు.అప్పట్లో ఎక్కువమందికి చేరువైన,సామాజిక ఉద్య మాలను ఒంటి చేత్తో నడిపించిన అగ్రనా యకుల్లో అంబేడ్కర్‌ ఒకరు. కాంగ్రెస్‌ తరహాలో ఆయనకు ఆర్థిక,సామాజిక సాయం అందలేదు.అయితే,పేదల ఉద్య మంగా ఆయన దీన్ని నడిపించారు.భూమికి లేదా యజమానులకు బానిసలైన వెనుక బడిన బలహీన వర్గాలే ఆయన అనుచ రులు. దీంతో ఆయ నకు ఆర్థికంగాఎలాంటి సాయమూ అందేదికాదు. బయట నుంచి ఎలాంటి మద్దతూ లేకుం డానే తన భుజాలపై అంబేడ్కర్‌ ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిం చాల్సి వచ్చేది. మీడియా కవరేజీలోనూ ఇది స్పష్టంగా కనపడేది.
అంతర్జాతీయ మీడియాలోనూ..
అంబేడ్కర్‌ కృషి దేశీయ మీడియాతోపాటు అంతర్జాతీయ మీడియాలోనూ కనిపించేది. దేశీయ మీడియాలో ఆయన రాసిన కథనాలు, వ్యాసాల గురించి మనకు కొంతవరకు తెలుసు. అయితే, అంతర్జాతీయ మీడియాలో ఆయనకు సంబంధించిన కవరేజీ చాలా వరకు మరుగున పడిపోయింది. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక లైన లండన్‌లోని ద టైమ్స్‌,బాల్టీమోర్‌ ఆఫ్రో అమెరికన్‌, ద నార్‌ఫోక్‌ జర్నల్‌లను అపట్లో నల్లజాతీయులు నడిపించేవారు.అంబేడ్కర్‌ అంటరానితనంపై నడిపించిన ఉద్యమాన్ని ఈ పత్రికలు విస్తృతంగా కవర్‌ చేశాయి.గాంధీతో ఆయన విభేదాలపైనా వార్తలు ప్రచురించాయి. రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్‌ పాత్ర, పార్లమెంటులో ఆయన చర్చలు,నెహ్రూ ప్రభు త్వం నుంచి ఆయన రాజీనామా తదితర పరిణామాలను ప్రపంచం క్షుణ్నంగా గమనిం చింది.అంతర్జాతీయ పత్రికల్లో అంబేడ్కర్‌పై వచ్చిన కథనాలు, ఆయన రాసిన కథనాలపై ‘’అంబేడ్కర్‌ ఇన్‌ బ్లాక్‌ అమెరికా’’ పేరుతో నేను ఓ పుస్తకాన్ని కూడా త్వరలో ప్రచురించబోతు న్నాను.దేశీయంగానూ తన సామాజిక ఉద్యమా న్ని ముందుకు నడిపించేందుకు అంబేడ్కర్‌ మీడియానే మాధ్యమంగా ఎంచుకున్నారు.దీని కోసం ప్రాంతీయతకు పెద్దపీట వేస్తూ ఆయన మరాఠీలో తొలి జర్నల్‌ ‘’మూక్‌ నాయక్‌’’ను ప్రారంభించారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం..
అణగారిన వర్గాల హక్కుల కోసం తన పత్రికలు, జర్నల్స్‌ సాయంతో అంబేడ్కర్‌ పోరాడేవారు. మూక్‌ నాయక్‌ తొలి 12 ఎడిష న్లకు ఆయనే సంపాదకుడిగా వ్యవహరించారు. ఆయన తర్వాత డీడీ ఘోలప్‌ ఆ బాధ్యతలను తలకెత్తుకున్నారు. అయితే 1923లో మూక్‌ నాయక్‌ మూతపడిరది.ఉన్నత చదువుల కోసం అంబేడ్కర్‌ విదేశాలకు వెళ్లడం,ప్రకటనలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.తొలి నాళ్లలో రాజశ్రీ షాహు మహరాజ్‌ ఈమ్యాగజైన్‌కు సాయం అందిం చారు.అంటరాని వారి స్వాతంత్య్ర ఉద్యమానికి మూక్‌ నాయక్‌ బాటలు వేసిందని అంబేడ్కర్‌ జర్నలిజంపై పరిశోధన చేస్తున్న గంగాధర్‌ పంత్‌వానే వ్యాఖ్యానించారు.అణగారిన వర్గాల్లో ఈ జర్నల్‌ కొత్త ఊపిరులు నింపిందని ఆయన అన్నారు.
బహిష్కృత్‌ భారత్‌ పేరుతో మరొకటి..
‘’మూక్‌ నాయక్‌’’ అనంతరం ‘’బహిష్కృత్‌ భారత్‌’’ పేరుతో3 ఏప్రిల్‌ 1927లో మరో జర్నల్‌తో అంబేడ్కర్‌ ముందుకు వచ్చారు. మహద్‌ ఉద్యమంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో దీన్ని మొదలుపెట్టారు.ఇది 15, నంబరు 1929 వరకు నడిచింది. అయితే ఈ జర్నల్‌ కూడా ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులకు తలొగ్గాల్సి వచ్చింది. మూక్‌ నాయక్‌, బహిష్కృత్‌ భారత్‌ల ఒక్కో ఎడిషన్‌ ధర ఒకటిన్నర అణాలు మాత్రమే.వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ అయితే పోస్టల్‌ చార్జీలతో కలిపి మూడు రూపాయలకే ఇచ్చే వారు. ఇదే సమయంలో ‘’సమత(1928)’’ జర్నల్‌ మొదలైంది.ఆతర్వాత బహిష్కృత్‌ భారత్‌ పేరును ‘జనతా’గా మార్చి24నవంబరు 1930 న దీన్ని మళ్లీ పునఃప్రారంభించారు.దళితుల కోసం ప్రత్యేకంగా నడిపించిన పత్రికగా జనతా రికార్డులకు ఎక్కింది.దాదాపు 25ఏళ్లపాటు ఈ పత్రిక నడిచింది.ఆ తర్వాత కాలంలో అంబే డ్కర్‌ ఉద్యమంలో మార్పులకు అనుగుణంగా దీని పేరును ‘’ప్రబుద్ధ భారత్‌’’గా మార్చారు. ఇది 1956 నుంచి 1961 వరకు నడిచింది. దీంతో బహిష్కృత్‌ భారత్‌ మొత్తంగా 33ఏళ్లు నడిచిందని,భారత్‌లో దళితుల కోసం సుదీర్ఘ కాలం పనిచేసిన పత్రిక ఇదేనని చెబుతారు.
అందరినీ కలుపుకుంటూ..
ఈ కాలంలోనే ఉన్నత కులాల పాత్రికేయుల్ని తన మిషన్‌లో అంబేడ్కర్‌ కలుపుకుంటూ వెళ్లారు. అప్పట్లో చాలా పత్రికలను బ్రాహ్మ ణులు నడిపించేవారు.డీవీ నాయక్‌ (సమత, బ్రాహ్మణ్‌ బ్రాహ్మణేతర్‌),బీఆర్‌ కాద్రేకర్‌ (జనతా),జీఎన్‌ సహశ్రబుద్ధి (బహిష్కృత్‌ భారత్‌, జనతా) తదితరులు ఆయనతో పనిచేసిన వారిలో ఉన్నారు.బీసీ కాంబ్లే, యశ్వంత్‌ అంబేడ్కర్‌ తదితర దళిత ఎడిటర్లు జనతాలో కీలకపాత్ర పోషించారు.అయితే,బహిష్కృత్‌ భారత్‌లో ఎడిటర్ల కొరత ఉండేది.ఒక్కోసారి ఒక ఎడిటరే 24-24కాలమ్స్‌ రాయాల్సి వచ్చేది.యశ్వంత్‌ అంబేడ్కర్‌, ముకుందరావ్‌ అంబేడ్కర్‌,డీటీ రూపవస్తే,శంకర్రావు కారాట్‌, బీఆర్‌ కాద్రేకర్‌ల సాయంతో ప్రబుద్ధ భారత్‌ ముందుకు నడిచింది.
దళిత జర్నలిజం
అంబేడ్కర్‌కు ముందు దళితుల కోసం పనిచేసిన జర్నల్స్‌ చాలాతక్కువగా ఉండేవి.ఫూలే ప్రారం భించిన ‘సత్యశోధక్‌ ఉద్యమం’ దళితుల కోసం పనిచేసింది.సత్యశోధక్‌ సమాజం సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా జనవరి 1, 1877లో కృష్ణరావ్‌ భాలేకర్‌‘దీన్‌ బంధు’ జర్న ల్‌ ప్రారంభించారు.దళితుల ఆలోచనలు,అభి ప్రాయాలకు దీన్‌బంధు స్థానం కల్పించేది. మధ్య మధ్యలో అంతరాయాలతో దాదాపు 100ఏళ్లు ఈ జర్నల్‌ నడిచింది.తొలి దళిత జర్నలిస్టులుగా పేరొందిన వారిలో మహర్‌ వర్గానికి చెందిన గోపాల్‌ బాబా వాలాంగ్కర్‌ ఒకరు. ఆయన వ్యాసాలు,కథనాలు..‘దీన్‌ మిత్ర’,‘దీన్‌బంధు’,‘సూధ్రక్‌’తదితర జర్నల్స్‌ కోసం ఆయన పనిచేశారు.హిందూ ధర్మాలపై ఆయన విమర్శలను ‘’విటాల్‌ విధ్వంసక్‌’’ పేరుతో ఓపుస్తకం కూడా ప్రచురించారు. దీనిలో శంకరాచార్య సహా ప్రముఖ హిందూ నాయకులకు 26 ప్రశ్నలు సంధించారు.
మరికొందరు కూడా..
మహర్‌ నాయకుడైన శివరామ్‌ జన్బా కాంబ్లే కూడా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరా డారు.తొలి దళిత దినపత్రిక ‘’సోమ్‌వాన్షీయ మిత్ర’’ను ఆయన జులై 1,1908లో ప్రారం భించారు.దళితుల ఉద్యమ నాయకుల్లో కిసాన్‌ బాన్సోడే పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు కార్మిక నాయకుడు ఎంప్రెస్‌ మిల్‌.. నాగ్‌పుర్‌లో స్వతంత్ర మీడియా సంస్థను కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడి నుంచే ‘మజూర్‌ పత్రిక’ (1918-22),‘చోఖామేలా(1936)’లను ఆయన నడిపించారు.1941లో రచయిత చోఖామేలా ఆత్మకథనూ ఆయన ప్రచురించారు. ‘సోమ్‌ వాన్షీయ మిత్ర’కు ముందు కిసాన్‌ బాన్సోడే.. ‘మరాఠా దీన్‌బంధు’ (1901)‘అత్యంజ్‌ విలాప్‌’ (1906),‘మహారాంచ సూధ్రక్‌’(1907)ల పేరుతో మూడు దిన పత్రికలను ఆయన నడిపించారు.అయితే,ఈ పత్రికల కాపీలు ఏ ప్రాచీన పుస్తక భాండాగారాల్లోనూ లభించడంలేదు. అయితే అప్పటి పరిణా మాలపై పరిశోధనలు చేసిన కొందరు..ఈ పత్రికలను బాన్సోడే నడిపించారని తేల్చారు. ముఖ్యంగా అణగారిన వర్గాలను ఏకం చేయ డమే ఈ పత్రికల లక్ష్యం.అంబేడ్కర్‌ ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్లిన పత్రికల్లో దాదాసా హెబ్‌ శిర్కే మొదలుపెట్టిన ‘గరుడ్‌’(1926), పీఎన్‌ రాజభోజ్‌ ప్రారంభించిన ‘దళిత్‌ బంధు’ పతిత్‌పావండాస్‌ నడిపించిన పతిత్‌పావన్‌ (1932),ఎల్‌ఎన్‌ హరదాస్‌ ప్రారంభించిన మహారత్తా(1933),దళిత్‌ నినాద్‌(1947)ఉన్నా యి. కులాలపై గాంధీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీఎన్‌ బార్వే..‘దళిత్‌ సేవక్‌’ను మొదలుపెట్టారు.తొలినాళ్లలో అంబేడ్కర్‌ జర్నలిజంపై..‘దళితాంచి వృతపత్రే’ పేరుతో 1962లో అప్పాసాహెబ్‌ రాన్‌పిసే ఓపుస్తకాన్ని ప్రచురించారు.మరోవైపు దళిత జర్నలిజంపై గంగాధర్‌ పంతవానే 1987లో ఓపరిశోధక పత్రాన్ని ప్రచురించారు. ఆతర్వాత అంబేడ్కర్‌ దళిత జర్నలిజంపై పరిశోధనలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
కళాత్మకంగా…
అంబేడ్కర్‌ రచనలు చాలా కళాత్మకంగా ఉంటా యి. వీటిలో ఆయన గట్టి విమర్శలు చేసేవారు. మరోవైపు అణగారిన వర్గాల కోసం ప్రవేశపెట్టే పథకాలను సమీక్షించడంతోపాటు బడుగు వర్గాలపై జరిగే అకృత్యాలను ఎత్తిచూపేవారు. ప్రభుత్వ విధానాలు,రాజకీయ పార్టీల వాద నలు,సామాజిక,రాజకీయ సంస్కరణలపై అంబేడ్కర్‌ సంపాదకీయాలూ రాసేవారు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలను క్షుణ్నంగా పరిశీలించేందుకు ఆయన కథనాలు,వ్యాసాలు మనకు చక్కటి అవకాశం కల్పిస్తాయి.ఆయన మంచి వ్యాసకర్త,ఆలోచనా పరుడు. ఆయన ప్రచురించిన జర్నల్స్‌లో దళిత ఉద్యమకారుల చిత్రాలు,దళిత కళాకారుల సృజనాత్మకత కనిపించేవి.జూన్‌ 15,1927లో‘బహిష్కృత్‌ భారత్‌’లో రాసిన ఓకథనంలో బ్రాహ్మణులపై అంబేడ్కర్‌ ధ్వజమెత్తారు.ముంబయి ప్రాంతంలో చేపట్టిన ఓసర్వేను ఈ సందర్భంగా ఆయన ఉదహరించారు.ప్రతి రెండులక్షల మంది విద్యావంతుల్లో బ్రాహ్మణులు వెయ్యి మంది వరకు ఉంటే…అంటరాని వారి ప్రాతినిధ్యం సున్నా అని గణాంకాలను ఉటంకించారు.దళిత ఉద్యమాలతో జర్నలిజానికి విడదీయరాని బంధముంది.దళితుల సామాజిక,రాజకీయ ఉద్యమాలు ప్రతిబింబించేలా వారు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక పత్రికల్లో కవరేజీ ఉండేది. అయితే,అంబేడ్కర్‌ కాలంలానే నేటీకీ ప్రధాన పత్రికల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు. (హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌లోని షోరెన్‌స్టీన్‌ సెంటర్‌ ఆన్‌ మీడియా,పాలిటిక్స్‌,పబ్లిక్‌ పాలసీలో సూరజ్‌ యెంగ్డే పరిశోధకుడు)

ఓటరా..మేలుకో..!

‘‘ లోక్‌ సభ ఎన్నికలకు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పజల ఆకాంక్షలకు పాలకులు చరమ గీతం పాడిన రోజున ప్రజల తమ తిరుగుబాటు ద్వారా తమకు అనువైన రాజకీయ వ్యవస్థను నిర్మించు కుంటారని హెచ్చరించడాన్ని బట్టి ప్రత్యామ్నయ ప్రభుత్వాల ఆవశ్యకతను అర్ధం చేసుకోవచ్చు.అదే సందర్భంలో విద్య,వైద్య,సామాజిక న్యాయం ప్రజలం దరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తి ఎదుగుదల ఉన్నతంగా ఉంటుం దని, మెరుగైన సమాజ నిర్మాణంలో వారు చురుగ్గా పాల్గొం టారని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ దిశానిర్దేశం చేవారు. రాజ నీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోసించ వలసిన పాలకులు అవకాశ వాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేధించడానికి అంబేద్కర్‌ చేసిన ప్రయత్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచవలసిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.’’
‘ప్రశ్నించేతత్వాన్ని పెంచిపోషించే విద్య ను మాత్రం ఉచితంగా అందివ్వరు’అని చురకలు అంటించారు.డాక్టర్‌బి.ఆర్‌అంబేద్కర్‌.విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందితే ప్రజలు చైతన్యవంతు లై శాసించేస్థాయికి వస్తారనేది ఇందులోని అంరా ర్దం.ప్రశ్నించేతత్వాన్ని పెంచిపోషించే అత్యంత చురుకైన సాధనం‘విద్య’ అని ప్రపంచవ్యా ప్తంగా ఏకాభిప్రాయం ఉంది. ఇందుకు ఎలాంటి మినహా యింపులు లేవు.కానీ,ఈప్రశ్నించేతత్వాన్ని నీరుగార్చే ప్రయత్నాలు కూడా సమాంతరంగా జరుగుతున్న మాట వాస్తవం కాదా?మతం,మూఢ విశ్వాసాలు, అతివినయం,మనకు సంబందం లేదని గిరి తీసుకు నేతత్వం,సామాజిక స్పృహ లేకపోవడం,పరిధి దాటి రాకపోవడం,ప్రబుత్వాల కుట్రవంటి అనేక అంశా లు కూడా ప్రశ్నించే తత్వాన్ని సమాజంలో ఎదగ కుండా చేస్తున్నవని చెప్పుకోవచ్చు. ఇన్ని అవరోధా లను అధిగమించి,అసాంఫీుక శక్తుల కబంధహాస్తాల నుంచి విముక్తి చెంది,సానుకూల దృక్పథాన్ని పెంచి పోషించడానికి,లక్ష్యాలనుచేరుకోవడానికి,ఆత్మ విశ్వాసం నింపడానికి,సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడి మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడే ప్రయాణంలో ‘ప్రశ్నించడం’అనివార్యమైంది.
ఏయే అంశాలలో..
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు జన జీవితాలను విచ్ఛన్నం చేస్తున్నప్పడు,అసాంఫీుక శక్తులు ప్రశాంత తను కొల్లగొడుతున్నప్పుడు, అసామానతలు, అంతరాలు,వివక్షత సమాజంలో ఎల్లెడలా వ్యా పించినప్పుడు,జాతిసంపదను సంపన్నులు, పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసి సామాన్య జనాలను నిర్లక్ష్యం చేసినప్పడు ప్రశ్నిం చడమే పరిష్కారంగా పనిచేస్తుంది. ప్రభుత్వాలు ప్రజా జీవితంలో చొరబడి,స్వేఛ్చా స్వాతం త్య్రాలను హరించివేసి,బానిసలుగా తయారు చేసుకొని, అధికారాన్ని శాశ్వతం చేసుకునే క్రమంలో ‘ప్రశ్నించి యజమానులుగా మారుతారా? లేక లొంగిపోయి బానిలుగా జీవిస్తారా? ’తేల్చు కొమ్మన్నారు డాక్టర్‌.బి.ఆర్‌.అంబేద్కర్‌.ఈ హెచ్చరిక వెనుకఉన్న నేపథ్యం విద్యను ఆయు ధంగా చేసుకుని సమాజాన్ని శాసించాలని ఆశించడమే.అందుకే అంబేద్కర్‌ ‘ప్రభుత్వాలు అంత సులభంగా విద్యను ప్రజలకు ఉచితంగా అందించడానికి సిద్దపడవు’ అని జ్ఞానోదయం కలిగించిన సందర్భాన్ని మనం సమయస్పూర్తి తో సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉంది.అంబేద్కర్‌ సూచనలు మేరకు ప్రశ్నింప నేర్పే నాన్యమైన విద్యను ఉచితంగా అందుకోవ డానికి మరో పోరాటం చేయక తప్పడం లేదని తేలిపోతున్నది కదా!?.కేరళ,ఢల్లీి, రాష్ట్రప్రభు త్వాలు విద్యారంగంలో నువ్వా?నేనా?అనే స్థాయిలో పోటీపడుతున్నాయి.విద్యకు 24,25 శాతం నిదులను కేటాయించి అంతర్జాతీయస్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్న సందర్భాలను మిగ తా రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలింపు చేసుకుంటే మంచిది.ఢల్లీి ప్రభుత్వం వేలాది తరగతి గదులను సర్వాంగ సుందరంగా,విశాలంగా తీర్చిదిద్ది విద్య ను ఉచితంగా అందిస్తూ,కార్పొరేటు పాఠశా లలను పరోక్షంగా మూసివేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలి.ఢల్లీి లాంటి రాష్ట్రాలలో నిబంధనలను తుంగలోతొక్కిన ప్రైవేటు పాఠశాలలను ప్రభుత్వాలే మూసివేసి జరి మానా విధించిన సంఘటనలు చూస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ వంటి రాష్ట్రాలలో విద్య అంగడి సరు కుగా మారిందని భావించక తప్పదు.
ఉచితం ఉండాలి..
రాజ్యాంగ రచన సందర్భంలోనూ,స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనూ జరిగిన అనేక సభలు, సమావేశాల సందర్భంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబే ద్కర్‌ చేసిన అనేక సూచనలు లేదా హెచ్చరికలు నేటి పాలకులకు కనువిప్పు కావాలి.ప్రజల ఆకాం క్షలకు పాలకులు చరమగీతం పాడిన రోజున ప్రజలు తమ తిరుగుబాటు ద్వారా తమకు అను వైన రాజకీయ వ్యవస్థను నిర్మించుకుంటారని హెచ్చ రించడాన్ని బట్టి ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఆవశ్య కతను అర్దం చేసుకోవచ్చు.అదే సందర్భంలో విద్య, వైద్య,సామాజికన్యాయం ప్రజలందరికీ ఉచితంగా అందిన రోజున వ్యక్తిఎగుదుల ఉన్నతంగా ఉం టుందని,మెరుగైన సమాజం నిర్మాణంలో వారుచు రుగ్గా పాల్గొంటారని అంబేద్కర్‌ దిశానిర్ధేశం చేశా రు.రాజనీతిజ్ఞతతో దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించవలసిన పాలకులు అవకాశ వాదులుగా మారుతున్న సందర్భంలో ప్రభుత్వాల కుట్రలను ఛేధించడానికి అంబేద్కర్‌ చేసిన ప్రయ త్నాలు, హెచ్చరికలు ప్రజల చైతన్యాన్ని మరింతగా పెంచ వలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
పాలకులు ఎప్పుడు కూడా సంపన్న వర్గాల పక్షాన నిలిచి పనిచేస్తారనే ముందుచూపు, ప్రజల ఐక్య ఉద్యమాలు,పోరాటాలద్వారా ఏర్పడే నిజమైన చట్టాల ముందు పాలకులు తలవంచక తప్పదనే హెచ్చరిక వారి మాటలలో కనబడు తుంది.కేంద్ర ప్రభుత్వం విద్య,వైద్యానికి నామ మాత్రపు నిదులను కేటాయిస్తూ ప్రైవేటుపరం చేయడానికి ఉత్సాహపడుతుంది.రాష్ట్రాల ప్రభు త్వాలు కూడా ఆయా రంగాలను గాలికి వదిలి, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయ డంలో పోటీ పడుతున్న తరుణంలో ఐక్య ఉద్యమా లే పరిష్కారమని సూచన కూడా మన ముం దు చర్జనీయాంశంగా నిలిచింది.దేవ గౌరవాన్ని, జాతి ప్రతిష్టను,ప్రజల ఆకాంక్షలను, రాజ్యాంగ స్పూర్తిని కాపాడుకోవడానికి పిడికిలి బిగించి నినదించడమే మన ముందున్న ఏకైక పరిష్కారం. ఎన్నికల వేళ అలాంటి పార్టీలకే తమ ఓటు అనే డిమాండ్‌ తెర మీదకు రావాలి.
ఓటు ఓ వజ్రాయుధం
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగను న్నాయి. రాజ కీయ పార్టీల ఎన్నికల్లో గెలవడానికి ప్రచారములో తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అమలుకు నోచు కోని హామీలు ఉచితాలు’ ఆర్థిక ప్రలోభాలు ప్రకటి స్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తు న్నాయి.ఓటర్లు తమ కున్న ఓటు హక్కును ఉత్తమ అభ్యర్థుని ఎన్నుకోవడంలో విజ్ఞతప్రదర్శించాలి. ఎన్నికలపై నిర్లక్ష్యం తగదు..ఎన్నికలు అంటే అవి నాయకులకే పరిమితమైనవని సాధారణ పౌర సమాజం ఎన్నికలపట్ల ఆసక్తి చూపక పోవ డంవల్ల అవినీతి పరులు చట్ట సభలకు ఎన్నికై రాజకీయ అవినీతికి పాల్పడి కోట్లాది సంపాదనకు రాజకీయా లు మార్గమైనాయి. ప్రాజెక్టుల పేరు మీద ప్రజల సొమ్మును దోపిడిచేస్తూ దోసుకో’దాసుకో అనే నినా దాన్ని తమ పాలన విధానంగా మార్చివేసి పేద’ మధ్యతరగతి బిసి బడుగు బలహీనర్గాలను చట్ట సభల్లోకి ప్రవేశించకుండా అడ్డు కునే వికృత రాజ కీయ క్రీడ కొనసాగడంశోచ నీయం. బ్రిటిష్‌ పాలన నుండి దేశ ప్రజల విముక్తి కొరకు జరిగిన పోరా టాల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన భారతదేశ ప్రజలు స్వాతంత్య్ర అనంతరం చట్టసభలకు జరిగే సార్వత్రికఎన్నికల్లో ఉదా సీన వైఖరి అవలంభించ డంవల్ల చట్టసభలు నేరచరితులరౌడీల’మాఫి యా ల’ ధన స్వాముల పరమైనాయి. ఎన్నికలు గెలుపు గుర్రాలు ఎన్నికలు అంటే గెలుపు గుర్రాలకు మాత్ర మే రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తు పార్టీ కొరకు ప్రజా ఉద్యమాలు చేసిన త్యాగశీలురు అంకిత బావం సిద్ధాంత నిబద్ధత కలిగిన సీనియర్‌ కార్యర్త లకు టికెట్లు ఇవ్వక పోవడంవల్ల చట్టసభలకు జరిగే ఎన్నికలు ధనికులకు‘మాఫియా‘డాన్‌ కార్పొరేట్‌ శక్తులకు రిజర్వ్‌ చేయబడ్డాయన్న మానసిక భావన సమాజంలో స్థిరపడి పోయింది.మన తలరాతను మార్చేది ఎన్నికలే..మనం ఎన్నికల ఓటింగ్‌ గురించి పట్టించు కోక పోయిన మనసమాజంలో ఆర్థిక ‘సామాజిక సాంస్కృతిక ‘సాంఘికఉద్యోగ’ ఉపాధి ‘పెట్టుబడి ఉత్పత్తి’ఉత్పాదకత ‘స్వదేశీవిదేశీ వర్తకం’ వ్యారం ‘విధ్య వైద్యం ‘ఆరోగ్యం ‘విదేశీ విధానాల రూపకల్పనలో మౌలికమార్పులు తెచ్చి మన జీవి తాలను భవిష్యత్తును మనపిల్లల భవిష్యత్తును మార్చ గలిగేది చట్ట సభలకు జరిగే ఎన్నికలు మాత్రమే నన్నది చారిత్రిక వాస్తవం .ఎన్నికలు అంటే సమాజ ములో అందరివి కొందరివి కాదు లేదా కొన్ని సామాజిక వర్గాల ఏకస్వామ్యంకాదు. కుటుం భాలగుత్తాధి పత్యంకాదు.ఓటర్లు పోలింగులో సంపూర్ణ భాగస్వాముల్కె‘‘తమ స్థితగతులను ‘‘మా ర్చు కునే పరిస్థితిగా గుర్తించాలి. ఓటు మన జన్మ హక్కు..నిజమైన సార్వభౌమాధికారం ఓటరు చేతి లోనే వుంటుంది.ఐదేళ్లకు ఒక సారి మన సేవకులను చట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్నుకుంటాం. పరి పాలన దక్షున్ని రాజ్యాంగ చట్టాలపట్ల ప్రజా సంక్షే మ పథకాలు చట్టాల పట్ల అవగాహన పరిజ్ఞానం వున్న అభ్యర్థిని ఎన్నుకొని సుపరిపాలనకు దిశ దశ నిర్ణయించడంలో ఓటే కీలకం.నోటుకు ఓటును అమ్ముకోవద్దు.ఓటుద్వారా తమ తల రాతను మార్చే శక్తి వుంది.ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్న అభ్యర్థిని ఎన్నుకొని ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపరిచే ఉత్తమ అభ్యర్థులకు ఓటువెయ్యాలి.ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభు వులు ప్రజలు తమకున్న ఓటుహక్కుతో ఐదు సంవ త్సరాల పదవీ కాలానికి ప్రజా ప్రతినిధులను ఎన్ను కొని ప్రభుత్వాల ఏర్పాటులో క్రియా శీలకంగ పాల్గొనాలి. ఓటుమార్పుకు ఆయుధం.. ఓటు అనే ఆయుధంతో ఓటరు తమ ఆకాంక్షలు అవసరాలు తీర్చే ప్రభుత్వాలకు అధికారం ఇస్తాడు. అభివృధ్ది సాధకులకు ఎన్నుకోవాలి..జాతి తల రాతలు మార్చే సమాజ సేవకులను సామర్థ్యం’ సత్తాగల అభివృద్ధి సాథకులనుచట్ట సభలకు అభ్యర్థులుగా ఎన్ను కోవాలి. ఓటు వేసే ముందు గత ఎన్నికల్లో పార్టీలు ఇచ్చిన వాగ్దానాల అమలునుఎన్నికల మేనిఫెస్టో పట్ల ఆలోచించాలి.
తలరాతను మార్చేది ఓటు..
బాధ్యత గల పౌరుడిగా మన జీవితాన్ని తద్వారా జాతి తల రాతను మార్చేది మన ఓటుతోనే వీలవు తుందనే వాస్తవాన్ని మరువరాదు. ఎవరికి ఓటు వెయ్యాలి? ఎందుకు ఓటు వేయాలి? జాతిభవి ష్యత్తు ‘దేశఐక్యతా సమగ్రత’ దేశ సార్వభౌమా ధికార రక్షణ భద్రత దేశ రక్షణ ఆర్థిక వ్యవస్థ, వ్యవ సాయం ‘పారిశ్రామిక అభివృధి ‘సేవా రంగాల విస్తరణ స్వయంసమృది సుస్తిరాభివృద్ది‘ఉపాధిఉత్పా దక’సామర్థ్యం ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగు పరిచే పార్టీ అభ్యర్థులను చట్ట సభ సభ్యు లుగా ఎన్నుకోవాలి. ఓటు వేసే ముందు రాజకీయ పార్టీల విదానాలు సిద్ధాంతాలు కట్టుబాట్లు నిబద్ధత నిజాయితీ ప్రజాసమస్యల పరిష్కారం కోసం అవ లంబించే సామర్థ్యం ఉన్న వారిని ఎన్నుకోవాలి. ఓటర్లుఎన్నికల మేనిఫెస్టో పరిశీలించాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వాటి అమలు ప్రాజెక్టుల నిర్మాణం నాణ్యత లభిదారుల సమస్యలు పరిష్కారాలు పరిశీ లించాలి.ఓటు వేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి అభివృధ్దికి పాటు పడేవారికి ఓటు వెయ్యాలి.ఏపార్టీ,మన దేశాన్ని,మన ధర్మాన్ని రక్షిం చడానికి కట్టుబడి ఉంది?ఏపార్టీ లంచగొండితనం తో కూరుకుపోయి ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తుంది. అభివృధ్ది సంక్షేమం పేరున అమలౌతున్న పథకాల ప్రయోజనాలు అధికారంలో ఉన్న వారి కుటుంబానికి లబ్దిచేకూరుస్తున్నాయనే అంశాల మీద ఓటర్లు అవగాహన కలిగి వుండాలి. సహజ వనరు లు మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగపడే దీర్ఘ కాలిక ప్రయోజనాలకు పెద్ద పీట వేసి పేదరికం నిరుద్యోగం తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే సరైన పార్టీకి ఓటు వేసి ప్రగతి శీల సమాజ స్థాపనకు చేయూత నివ్వాలి. మన ఓటు తోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి! మనం ఓటు వేసేది ఎవరికో అధికారం ఇవ్వటానికి కాదు. మన జాతి తలరాతను మార్చి ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఓటరు ఓటు వేసే ముందుపార్టీల మేనిఫెస్టో అంశాలు నిర్ణీత పదవీకాలంలో అమలుఅవుతాయా? లేదా? తెలుసుకోవాలి.రాజకీయాల పట్లఎన్నికల పట్ల ఎన్ను కునే ప్రతి పౌరుడు ఆసక్తి అవగాహన కలిగి వుం డాలి.మనం రాజకీయం చేయక పోయినా రాజకీ యాలు తెలుసు కోవటం నేటి తక్షణ అవసరం. ఓటు నిశ్శబ్ద విప్లవం.. దేశ రాజకీయాలకు వెగటు పుట్టిస్తున్నధన’ రౌడీ రాజకీయాలతో పరువు మాస్తున్న ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయడానికి తమ ఓటు హక్కు వినియోగం ద్వారా అవినీతి అక్రమాల చెర లోంచి జనస్వామ్యానికి స్వేచ్ఛ ప్రసాదించే ప్రజాఉద్యమానికి విజ్ఞతగల ఓటర్లు నేతృత్వం వహించాలి. ఓటు బుల్లెట్‌ కంటే బలమైంది.ఓటు ఒక నిషబ్ధ విప్లవం ఓటే మన ఆయుధం! దానితోనే మనం పోరాడాలి.మన ధర్మాన్ని మనం నిల బెట్టు కోవాలి!మన బతుకులు మనం చక్కపరచు కోవాలి! ఎన్నికల్లో ప్రతిఓటరు క్రియా శీలక బాగ స్వామి కావాలి.ఓటింగులో తప్పని సరిగా పాల్గొనాలి ఇతర ఓటర్లను యువతను తమఓటు హక్కు వినియోగించుకొని తమ తల రాతను మార్చే పార్టీ లకు అభ్యర్థులకు ఓటు.వెయ్యాలి. పోటీ చేసే అభ్య ర్థుల గునగణాలు వారి సామాజిక సేవా అంశాల మీధ విరివిగా చర్చించాలి. నోటుకు ఓటు అమ్ము కో వద్దు..ఓటువేసే ముందు విజ్ఞత ఓటరు రాజకీ య పార్టీల హామీల ఓట్ల వేలం పాటల హోరులో హైరానా పడి నోటుకు ఓటు అమ్ముకోవద్దు. మన ఓటు తెలంగాణ అభివృద్ధికి మన కులం వాడని, మన జిల్లా వాడని, మన ప్రాంతం వాడని భావించ కుండ కులమతాలకు అతీతంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిగించే వారిని ఎన్నుకోవాలి. ఎన్నిక ల్లో పోటీ చేసే అభ్యర్థి ఏపార్టీ వాడని చూడకు ఏ పాటి అభివృద్ధికి పాటుపడే వాడో ఆలోచించు. మనంవేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని పది కాలాల పాటు ఉద్దరించ గలగాలి.ఓటుకు ఒక ప్రత్యేక త వుంది.దాని ప్రాధాన్యం ఎంత చెప్పిన తక్కువే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ముందే జాగ్రత్త పడాలి.నీతినిజా యితీగా పనిచేసే వాడికి,రాష్ట్ర భవిష్యత్తు అభివృధ్దికి సంక్షే మానికి ప్రజారక్షణలో క్రమశిక్షణ కలిగిన సైనికు డిగా అండగా నిలబడే పార్టీకి/ అభ్యర్థికి ఓటు వెయ్యాలి రాష్ట్ర ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు పాటు పడే పార్టీ/ అభ్యర్థులకు ఓటు..పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో జీవన ప్రమాణాలు మెరుగు పరిచి సామాన్య పేద ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షిం చే వ్యక్తికి /అభ్యర్థికి ఓటు వేస్తే తెలంగాణా ప్రజల ఉజ్జ్వల భవిష్యత్తుకు సుఖమయ జీవితానికి దోహ దపడే నూతన అభివృధ్ది వ్యూహా లతో ముందుకు వచ్చే పార్టీకి/ అభ్యర్థులకు ఓటు వేయండి.ప్రజా సంక్షేమానికి పాటు పడని నేతలను ఓటు ద్వారా నిగ్గ తీయండి.ప్రజాఆకాంక్షలు తీర్చని వారిని శం కర గిరి మాన్యాలు పట్టించే శక్తిని సమకూర్చేది ఓటు హక్కేనని విజ్ఞతగల ఓటర్లు.గుర్తించాలి. ఓటర్లు జాతి తలరాతను మార్చి రాసేవిధాలుగా అవతరించాలి.ఓటర్లు నిర్లక్ష్యాన్ని నిర్లిప్తత ను సోమ రితనం విడనాడి ఓటింగులో చురుకుగా పాల్గొ నాలి.తమ ఓటుద్వారా ప్రభుత్వ నిర్మాణం జరుగు తుందనినే వాస్తవాన్ని మరువద్దు.ప్రజాస్వామ్య రక్షణ ప్రతి ఓటరు సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని జనస్వామ్యంగా మార్చే ప్రక్రియ లో ఓటర్లదే తుది తీర్పు .ఓటు పదున్కెన ఆయుధం. దీన్ని ఏవిధంగా సందిస్తే మన జీవితాలు మారుతా యనేది ఆలోచించాలి.ఎది ఏమైనా మనం వేసే ‘‘ఓటుకోహినూర్‌’’వజ్రంకంటే అత్యంత విలువై నది.ఓటు ఓగొప్ప మార్పుకు సంకేతం. ఓటు ప్రగ తికి మేలుకొలుపులాఉండాలి.మనం తోడుకున్న గోతిలో మనం పడకూడదు.ఓటరా మేలుకో ప్రజా స్వామ్యాన్ని రక్షించుకో (గునపర్తి సైమన్‌)

నిర్విర్యీమవుతున్న ప్రజాస్వామ్యం!

రాజ్యాంగేతర శక్తులతో ప్రజాస్వామ్యం నిర్వీర్యమైపోతుంది.వారి నియంత్రత్వధోరణి ప్రదర్శనతో ప్రతిపక్షాలను నోరెత్తకుండా చేస్తోన్నాయి.రాజ్యాంగం,చట్టం,న్యాయ వ్యవస్థలపై రాజకీయపెత్తనం గణనీయంగా పెరుగుతోంది.ఇటీవల వెలుగు చూసిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకం ద్వారానే తేటతెల్లమైంది.ఈఘటన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ను తల దించుకొనేలా చేసింది.పటిష్టమైన రాజ్యాంగబద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.బహుళజాతి వ్యాపార సంస్థల రాజకీయ విరాళాలు రాజకీయ పార్టీలకు సంపద ఆర్థిక,రాజకీయ కేంద్రీకరణకు దారితీస్తోంది.పటిష్టమైన రాజ్యాంగబద్ద వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.రాజ్యాంగబద్ద సంస్థలతోపాటు ఆర్థికంగా పరిపుష్టి సాధించిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం తహతహలా డుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు దుష్పలితాలిస్తాయని ప్రతి పక్షాలు భావిస్తున్న విషయం తెలిసిందే!.ఎన్నికల్లో హిందువుల ఓట్లు సాధించేందుకు మత దురహాకార విధానాన్ని పెంచుతూ,ముస్లిం మైనారిటీలకు హాని కలిగిస్తోంది.
నితో పాటు,నాటి పెద్దనోట్లరద్దు నిర్ణయంలో కూడా ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.ఈడీమోనిటైజేషన్‌ తర్వాత విచారణలో జస్టిస్‌ బివినాగరత్న తన అసమ్మతి వెల్లడిరచడం ప్రశంసనీయం.ఈదేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని సమర్థించడంలో ధైర్యం,విశ్వాసాన్ని వెల్లడిరచిన ఏకైక న్యాయమూర్తి ఆమె.అంతేకాకుండా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సర్వోత్తమ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సైతం కేంద్రంలోనిప్రభుత్వం నిర్వీర్యం చేయడం గమనార్హం.
ప్రతి సాధారణఎన్నికలను సజావుగా నిర్వహిస్తున్న ఘన చరిత్ర కేంద్ర ఎన్నికల కమిషన్‌కు దక్కుతుంది.అలాంటి గొప్పచారిత్రక నేపథ్యం ఉన్న కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం తన కనుసన్నల్లో పెట్టుకోవాలని చూడటం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదిగా వ్యవహరించడం ఆందోళనకరమని ప్రతిపక్షాలు సైతం ఆవేదనలు వ్యక్తం చేస్తున్నాయి.ఈనేపథ్యంలో దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుతమైన,నిష్పక్షపాతమైన వాతావరణంలో జరగవేమోనని ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది.
ప్రస్తుతం ప్రజాస్వామ్య గుంపులో నియంత్రత్వధోరణి నడుస్తోంది.అంబాని కుమారుడు అనంత అంబాని వివాహానికి ఓచిన్న విమానాశ్రాయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేశారు. అంటే బడా పారిశ్రామికవేత్తల గుప్పెట్లో ప్రజాస్వామ్యం విలవిలలాడుతోందని జగమెరిగిన సత్యం. 1947 ఆగష్టు 15న వచ్చిందిస్వాతంత్య్రం కాదు..తెల్లదొరల నుండి నల్లదొరలకు అధికార మార్పిడి మాత్రమేనన్న అంచనా నిజమని అంతకంతకూ రుజువుతోంది.మన దేశానికి రాజ్యాంగమే అత్యున్నత శాసనం.దేశంలోని వ్యక్తులు,సంస్థలు ప్రభుత్వాలు రాజ్యాంగ నియమాలకు లోబడి వ్యవహరించాలి. కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు రాజ్యాంగం ఆధారంగా ఏర్పడి,దానిద్వారానే అధికారాలు పొంది దాని పరిధికి లోబడి పనిచేయాలి.
రాబోయే ఎన్నికల్లో అలాంటి సమాఖ్య వ్యవస్థను ఎంచుకోవాలి.దేశాన్ని కాపాడుటానికి బలమైన కేంద్రీకృత యంత్రాంగం కావాలి.దాని కోసం ఏకకేంద్రపద్దతిని అనుసరించాలి.కేంద్ర,రాష్ట్రాల మధ్య అధికారాలను,విధులను స్పష్టంగా విభజించాలి.సంక్లిష్టమైన వైవిధ్యమైన దేశాన్ని పాలించ డానికి,జాతి ఐక్యతను రక్షించడానికి ఆచారణాత్మక విధానాన్ని రూపొందించాల్సిన వ్యవస్థ అవశ్యం.-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

1 2