హామీలు ఇచ్చి..అమలు మరిచి..!

ఎన్నికల సందర్భంగా ఇచ్చీ హామీలు అన్నీ అమలు చేయడం, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికే కాదు, ఏ ప్రభుత్వనికీ సాధ్యంకాదు. కానీ, ఏవో కొన్ని ఉచితాలు తప్ప, ఇచ్చిన హామీలు ఏవీ, ముఖ్యంగా సుస్థిర అభివృద్ధికి ఆడగా నిలిచే హామీలు ఏవీ అమలు చేయని ఘనత మాత్రం నిస్సందేహంగా వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి మాత్రమే దక్కుతుంది.
ప్రభుత్వ ఉద్యోగుల విషయమే తీసు కుంటే, 2019 ఎన్నికలకు ముందు ఆయన, సాధ్యా సాద్యాల గురించి క్షణమైనా ఆలోచించ కుండా, సీపీఎస్‌ రద్దు చేస్తామని హమీ ఇచ్చారు. అదికూడా ఎప్పుడో కాదు ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే సీపీఎస్‌’ను ఎత్తేసి మళ్ళీ పాత పెన్షన్‌ పద్దతిని తెస్తామని హమీ ఇచ్చేశారు. ఉద్యోగులు ఆశ పడ్డారు …గుడ్డిగా ఓట్లు గుద్ది గెలిపించారు. అయినా, వారం పోయి వందవా రాలు అయినా, సీపీఎస్‌ పోలేదు ..చివరకు ఆల్‌ ఇన్‌ వన్‌ సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అబ్బే అప్పుడు ఏదో తెలియక తప్పుచేశాం… సీపీఎస్‌ రద్దు సాధ్యంకాదని చావు కబురు చల్లగా చెప్పారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసన సభలో అమరావతి రాజధాని అంటే ఓకే అన్నారు. రాజ ధాని బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సుమారు 40నిముషాలకు పైగా సాగిన ప్రసం గంలో అధికార వికేంద్రీకరణ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వికేంద్రీకరణ పేరిట మూడు రాజధా నుల ముచ్చట తెరమీదకు తెచ్చారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనను, మూత కట్టి అటకెక్కించారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌’ను రాజధాని లేని రాష్ట్రంగా త్రిశంకు స్వర్గంలో వెళ్లాడ దీశారు. ఇక అంచెల వారీ సంపూర్ణ మధ్య నిషేధం హామీ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. సంపూర్ణ కాదు , పాక్షిక మధ్య నిషేధం కూడా మరో పాతికేళ్ళు వెనక్కి నేట్టేశారు. జగన రెడ్డి ప్రభుత్వం ఉన్నా లేకున్నా, మరో 25 సంవత్సరాల పాటు, ఆంధ్ర ప్రజలు చచ్చినట్లు ప్రతి రోజు మందు తాగకే తప్పదు. చావకా తప్పదు. రానున్న 25 సంవత్స రాలలో మద్యం అమ్మకాల మీద వచ్చే అదా యాన్ని పూచికత్తుగా పెట్టి జగనన్న అప్పు తెచ్చుకు న్నారు.సో …మరో రెండేళ్లలో ఈ ప్రభుత్వం పోయినా,జగన్‌ రెడ్డి జ్ఞాపకంగా నిత్య మధ్య విధా నం కొనసాగుతూనే ఉంటుంది.మధ్య నిషేధం సంగతి దేవుడెరుగు, ప్రభుత్వమే మద్యం వ్యాపా రంలో పీకలలోతు కూరుకుపోయింది. బడి పం తుళ్ల చేత మధ్యం అమ్మించే ‘ఎత్తు’కు ఎదిగిపో యింది.
అలాగే, పోలవరం ప్రాజెక్టు, 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హమీ ఇచ్చారు. రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి అనీల్‌ కుమార్‌, అసెంబ్లీలో విపక్షాలను అవహేళన చేస్తూ 2021 డిసెంబర్‌ చివరకు ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, జరిగింది ఏమిటో .. అందరికీ తెలుసు. పోల వరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ వదిలిందో .. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత కూడా అక్కడే వుంది. జగన్‌ రెడ్డి ప్రభు త్వం ప్రాజెక్టు పనులకు చాపచుట్టేసింది. అయితే జగన్‌ రెడ్డి ప్రభుత్వం చెప్పినవి చేయక పోయినా, చెప్పనివి చాలా చేసింది.చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఐదేళ్ళలో ఎప్పుడు పెంచని ఆర్టీసీ చార్జీలు, విద్యుత్‌ చార్జీలు జగన్‌ సర్కార్‌ పెం చింది. ఇలా, జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీలు తప్పడం అలవాటుగా చేసుకుంది.అందుకే, రాష్ట్ర అభివృద్ది కోరుకునే ప్రతి ఒక్కరూ, ఆరోజు కోసం ఎదురు చూస్తున్నారు.
నెరవేరని హామీలు
ఈ వాగ్దానాల అమలు కోసం రాష్ట్రంలోని 123 నగర కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, నగర పంచాయతీ లలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పరిధిలోకి వచ్చే సుమారు 46 వేల మంది పారిశుధ్య కార్మికులు గత నాలు గున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడు తున్నారు. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గోదాలోకి దిగిపో యాయి. ‘మాట తప్పం, మడమ తిప్పంఅంటూ మీరిచ్చిన హామీలను అమలు చేయకుండా మరలా ఎన్నికలకు ఎలా వెళ్తారు?’ అని ప్ర్రశ్నిస్తూ మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్‌ మోగించారు. ‘ఇంకో ఆరు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తాం.టైం స్కేలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన జీతం అమలు చేస్తాం. వారం రోజుల్లోనే సిపిఎస్‌ రద్దు చేస్తాం’ అంటూ గత ఎన్నికలకు ముందు సంకల్ప పాదయాత్రలోనూ, శాసనసభలోను ప్రతిపక్ష నాయకుడిగా వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీల అమలుకోసం డిసెంబర్‌ 26వ తేదీ నుండిఎ.పిమున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లా యీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికులు నిరవధిక సమ్మెకుదిగారు. ఈ వాగ్దానాల అమలు కోసం రాష్ట్రంలోని 123 నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు,నగర పంచా యతీలలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ పరిధిలోకి వచ్చే సుమారు 46వేల మంది పారిశుధ్య కార్మికులు గత నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఇంకో మూడు నాలుగు నెలల్లో ఎన్నికల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు గోదాలోకి దిగిపోయాయి. ‘మాట తప్పం, మడమ తిప్పం అంటూ మీరిచ్చిన హామీలను అమలు చేయకుండా మరలా ఎన్నికలకు ఎలా వెళ్తారు?’ అని ప్రశ్నిస్తూ మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్‌ మోగించారు.
పాలకులందరిదీ ఒకటే దారి
అధికార పీఠం ఎక్కే ముందు చెప్పే మాటలకు తీరా గద్దెనెక్కిన తర్వాత అనుసరించే విధానాలకు పాలకులందరిది ఒకటే దారి! ’’తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కిస్తే రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తాం’’ అంటూ 2014ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ప్రకటించింది టిడిపి. తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు మొండి చేయి చూపింది. కనుక తెలుగుదేశం పార్టీ 2019ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల్లో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకు నేందుకు నాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసిపి నేత జగన్మోహన్‌ రెడ్డి గారు కాంట్రాక్ట్‌, ఔట్‌సో ర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఊరూవాడతో పాటు అసెంబ్లీలోను ఊదర గొట్టారు. గత నాలుగున్నరేళ్లుగా ఔట్‌సో ర్సింగ్‌ కార్మికులు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. వారి ఆశలను గత టిడిపి ప్రభుత్వం మాదిరిగానే వైసిపి ప్రభుత్వం కూడా అడియాసలు చేసింది.
ప్రభుత్వ ప్లాప్‌ సినిమా ఆప్కాస్‌
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చీ రాగానే ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఆప్కాస్‌ పేర శఠగోపం పెట్టింది. గతంలో మధ్యవర్తి కాంట్రాక్టర్‌ ద్వారా పని చేసిన కార్మికులను దోపిడీ నుండి విముక్తి చేసేందుకు ఆప్కాస్‌ తెస్తున్నామంటూ 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు ముఖ్యమంత్రి గారు. ప్రతి పట్టణంలో ఉన్న మధ్య దళారీల బెడదైతే తొలగిపోయింది కానీ వైసిపి ప్రభుత్వం ద్వారా కొత్త సమస్యలు కార్మికులను చుట్టుముట్టాయి. అందుకు ఉదాహరణ గతంలో మున్సిపల్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ పద్ధతి అమలులో లేదు. ఆప్కాస్‌ వచ్చాక రిటైర్మెంట్‌ విధానాన్ని బలవం తంగా కార్మికులపై రుద్దారు. ఆప్కాస్‌ మున్సిపల్‌ కార్మికులతో పాటు ఇతర డిపార్ట్‌మెంట్లలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరినీ ఉద్యోగులుగా నమోదు చేశారు. ఉద్యోగులకు అమ లు చేస్తున్న జీతభత్యాలు,సరెండర్‌ లీవులు, గ్రాట్యుటీ,పెన్షన్‌ వంటి పథకాలు ఏవీ వీరికి వర్తింపచేయలేదు. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారైంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల పరిస్థితి. ఆప్కాస్‌లో ఉద్యోగులుగా నమోదు చేసినందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎగిరిపోయాయి. పిల్లలకు అమ్మఒడి,ఫీజు రీయం బర్స్‌మెంట్‌, కుటుంబ సభ్యులకున్న వితంతు/వృద్ధాప్య పెన్షన్‌ దారులకు పెన్షన్‌ కట్‌ చేశారు. దీనితో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్‌ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు,చెత్త పన్ను వంటివి కార్మికుల నెత్తిన బండ లుగా మారాయి. ముఖ్యమంత్రి గారు నవర త్నాలు ప్రారంభిస్తూ పారిశుధ్య కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన హామీ అటకెక్కింది.
కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఒకటేనన్నారే !
అధికార పీఠం ఎక్కక ముందు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఒక్కటే, పేరులోనే తేడాలు తప్ప. చదువులు విధులు ఒక్కటే అన్నారు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి. అయితే ముఖ్యమంత్రి అయ్యాక అందుకు విరుద్ధంగా కాంట్రాక్టు కార్మికులను మాత్రమే పర్మినెంట్‌ చేస్తూ ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను గాలికొదిలేశారు. దసరా సందర్భంగా కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తూ జీవో నెంబర్‌ 114ను జారీ చేసే సందర్భంలో తమకు కూడా తీపి కబురు వస్తుందని ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరూ వేయి కళ్ళతో ఎదురు చూశారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం కటాక్షించలేదు. గత టిడిపి ప్రభుత్వం, వైసిపి ప్రభుత్వం రెండిరటికి తేడా కనిపించడంలేదు. దొందూ దొందే చందంగా వుంది.
చర్చలతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం
ఈ సమస్యపై మున్సిపల్‌ రంగంలోని అన్ని సంఘాలు కలిసి 2022 జులై 11 నుంచి 15వ తేదీ వరకు సమె నిర్వహించాయి. ఈ సమ్మెకు ముందు జులై ఏడో తేదీన డిఎన్‌ఏ ఆధ్వర్యం లోనూ, సమ్మె ప్రారంభమైన జులై 11వ తేదీ ఇరువురు మంత్రులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి నేతృత్వంలో అన్ని సంఘా లతో సచివాలయంలో చర్చలు జరిగాయి. 2022 జనవరి నుండి జీతాలు 3000 రూపా యలు పెరిగాయి కనుక హెల్త్‌ అలవెన్స్‌ రూ.6000 కాకుండా రూ.3000 మాత్రమే చెల్లిస్తామంటూ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇంజనీరింగ్‌ కార్మికులకు సంబంధించి జీవో ఆర్టీ నెంబర్‌ 30సవరించి వాటర్‌ సప్లై, వర్క్‌ ఇన్‌స్పె క్టర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, షైన్‌ దళం మొద లగు ఎనిమిది కేటగిరీలకు కార్మిక శాఖ ప్రతిపా దనల మేరకు జీతాలు చెల్లిస్తామని, పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలోకి వచ్చే చెత్త తరలించే వాహన డ్రైవర్లు మలేరియా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కార్మికులకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ చెల్లిస్తామని, పారిశుధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్‌ కార్మికులకు కూడా సంక్షేమ పథకాల అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. పారిశుధ్య కార్మికులకు రూ.6000 హెల్త్‌ అలవెన్స్‌ మాత్రమే చెల్లిస్తూ మంత్రి గారు ఏకపక్షంగా ప్రకటించి ఇంజనీరింగ్‌ కార్మికులకు ద్రోహం చేశారు. అప్పటివరకు పారిశుధ్య కార్మికులకు అమలైన సంక్షేమ పథకాలను 2022 ఆగస్టు ఒకటో తేదీ నుండి ఎత్తివేశారు.
హామీల అమలు కోసం సమరశీల పోరాటాలు
పట్టణాల విస్తరణ మేరకు పని భారం పెరిగి కార్మికులు అవస్థలు పడుతుంటే సిబ్బంది సంఖ్యను పెంచాలని కార్మికులు నిలదీస్తున్నారు. సిబ్బందిని పెంచుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి అంటూ 44మున్సిపాలిటీలు ఆర్థిక శాఖకు మొరపెట్టుకొని ఏళ్లు గడుస్తున్నా అనుమతి ఇవ్వడం లేదు. రోడ్లమీద పని చేయాల్సిన కార్మికులను అధికారులు డ్రైవర్లు గాను ఇతర పనుల కోసం పెద్ద సంఖ్యలో వినియోగించుకుం టున్నారు. దీనివల్ల వీధుల్లో పని చేస్తున్న కార్మి కులపై మోయలేని పని భారంపడుతున్నది. దీనితోపాటు జీవో నెంబర్‌ 30 సవరణ, పబ్లిక్‌ హెల్త్‌ పరిధిలోని వారికి హెల్త్‌ అలవెన్స్‌, ముఖ్య మంత్రి హామీలైన సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మినెంట్‌, సిపిఎస్‌ రద్దు డిమాండ్ల సాధన కోసం సిఐటియు అనుబంధ సంఘం మే,జూన్‌ మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా రెండు బస్సుయాత్రలు నిర్వహించింది.ఆగస్టులో మున్సి పల్‌ కార్యాలయాల ముట్టడి,జిల్లా కలెక్టరేట్ల ముట్టడి మిలిటెంట్‌గా జరిగాయి. అనేక జిల్లాల్లో మహిళా కార్మికులతో సహా తలలు పగిలి చేతులు విరిగాయి. పోలీసు నిర్బంధం పెద్ద ఎత్తున కొన సాగింది. రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మార డంతో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ సిఐటియు అనుబంధ సంఘంతో ఆగస్టు 10వ తేదీన ప్రత్యేకంగా చర్చలు జరిపారు. గత నాలుగున్నరేళ్లలో 20 నుండి 25 దఫాలు చర్చలు జరిగినప్పటికీ ఏఒక్క సమస్యాపరిష్కారం కాలేదు. మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని డిసెంబర్‌ 21వ తేదీ తరువాత సమ్మెకు వెళ్తామని ప్రభుత్వానికి అధికారులకు సిఐటియు అనుబంధ సంఘం సమ్మె నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఏఐటీయూసీ నాయకత్వం కూడా డిసెంబర్‌ 27 నుండి సమ్మెలోకి వెళ్తామంటూ ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వైశ్రీలక్ష్మి డిసెంబర్‌ 14వ తేదీ మున్సి పల్‌ కార్మిక సంఘాలతో చర్చలు జరిపారు. ప్రధా నమైన డిమాండ్లు ఒక్కటి కూడా పరిష్కారానికి నోచుకునే దిశలో చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో సిఐటియు అనుబంధ సంఘం డిసెంబర్‌ 26వ తేదీ నుండి నిరవధిక సమ్మె తేదీని ప్రకటించింది. సమ్మెని ఫెయిల్‌ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్థానిక మున్సిపల్‌ అధికారులను రంగంలోకి దించి మున్సిపల్‌ కమిష నర్ల ఆధ్వర్యంలో జాయింట్‌ మీటింగులు పెట్టి స్థానిక సమస్యలు పరిష్కరిస్తాం. మీరు సమ్మెలోకి వెళ్ళొద్దంటూ కార్మికులను లొంగదీసుకునేందుకు, బెదిరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు,హెచ్చరికలను లెక్క చేయకుండా కార్మికులు తమన్యాయమైన డిమాం డ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెకు సర్వం సన్నద్ధం చేస్తున్నారు. సమ్మె జయప్రదం కావడం కోసం ప్రజల మద్దతు కోరుతున్నారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం డిమాం డ్లతో ఆంధ్రప్రదేశ్‌ లోని పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. -(కె.ఉమామహేశ్వరరావు)

ఎటు చూసినా నిరసనలే..

రాష్ట్రం ఇప్పుడు ఉద్యమాంధ్రగా మారింది. ఒకవైపు అంగన్వాడీలు, మరోవైపు ఆశా వర్కర్లు, ఇంకోవైపు మున్సిపల్‌ కార్మికులు జగన్‌ సర్కారుపై ధ్వజమెత్తుతున్నారు. సమస్య లు పరిష్కరించాలంటూ ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల ముందు జగన్‌ గొప్పగా ఇచ్చిన హామీలు గుర్తు చేస్తూ… వాటిని నిలబెట్టుకోవాలంటూ నాలుగు రోజులుగా అంగన్వాడీలు సమ్మె బాట పట్టారు. సమస్యల పరిష్కారం కోసం 36 గంటల దీక్ష చేసిన ఆశావర్కర్లు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మున్సిపల్‌, పారిశుధ్య కార్మిక సంఘాలు తమ సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 27 నుంచి సమ్మెకు దిగుతామని ఇప్పటికే హెచ్చరించాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షమంది అంగన్వాడీలు సమ్మెబాట పట్టడంతో అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలు తెరిపించి బెదిరింపులకు పాల్పడినా అంగన్వాడీలు వెనక్కి తగ్గడం లేదు. చాలా చోట్ల అంగన్వాడీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయినా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపడంలేదు. ఇక ఆశావర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని నాలుగున్నరేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదు. మున్సిపల్‌, పారిశుధ్య కార్మికుల గోడునూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జగన్‌ ఉద్యోగులనే గాక తమనూ మోసం చేశారని ప్రభుత్వ రంగ కార్మికులు మండిపడుతున్నారు. వేతనాల నుంచి క్రమబద్ధీకరణ వరకూ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఉద్యోగులు హక్కుల కోసం ఆందోళన బాట పడితే ప్రభుత్వం కేసులతో భయపెట్టేది. నాలుగున్నరేళ్లుగా విసిగిపోయిన కార్మికులు, ఉద్యోగులు కేసులకు భయపడకుండా సమ్మె బాట పడుతున్నారు.
అక్కాచెల్లెమ్మల ఆక్రోశం
‘బటన్‌’ నొక్కుడు అయినా, బహిరంగ సభ అయినా సీఎం జగన్‌.. ‘నా అక్కాచెల్లెమ్మలు’ అని సంబోధిస్తుంటారు. అయితే వారి సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరీ మాట తప్పారంటూ అంగన్వాడీ సిబ్బంది ఆక్రోశిస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మరోవైపు తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ ఇప్పటికే ధర్నాలు, నిరసనలు చేపట్టిన ఆశావర్కర్లు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు సిద్ధమవుతున్నారు.
జగనన్నా.. మాటిచ్చి మరిచారే?

తాను అధికారంలోకి వస్తే తెలంగాణలో కంటే అంగన్వాడీ వర్కర్లకు రూ.1000 ఎక్కువ జీతం ఇస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు రూ.13,650 ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.11,500 మాత్రమే ఇస్తున్నారు. ఎన్నికల హామీ ఏమైంది జగనన్నా అంటూ అంగన్వాడీ సిబ్బంది మండిపడుతున్నారు.
కార్మికుల కష్టాలు
మున్సిపల్‌, పారిశు?ధ్య కార్మికులు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నారు. జీతాలు పెంపు, ఇతర ప్రయోజనాలు, క్రమబద్ధీకరణ కోసం నాలుగున్నరేళ్లుగా ఎన్నోసార్లు నిరసనలు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
మా గోడు వినండి
సీఎం మానసపుత్రికగా చెప్పుకొనే గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు. దాదాపు 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో శాఖకు సంబంధించిన ఒక్కో రకమైన సమస్య ఉన్నా ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదు. సరెండర్‌ లీవ్‌లు ఎన్‌క్యాష చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. తమకు ‘ఖాకీ’ వద్దని మొత్తుకుంటున్నా సచివాలయ ఉద్యోగులను మహిళా పోలీసులుగా మార్చారు. దీంతో వారు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పనిభారం తీవ్రమైందంటూ డిజిటల్‌ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖలో పనిచేసే ఎనర్జీ అసిస్టెంట్లు, సచివాలయాల ద్వారా నియమితులైన ఏఎన్‌ఎంలు, ఇతర శాఖల ఉద్యోగులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.అంగన్వాడీలు మొత్తం సిబ్బంది: దాదాపు లక్ష మంది జగన్‌ హామీ ఇదీఅంగన్వాడీ సిబ్బందికి తెలంగాణలో ఇస్తున్న జీతాల కంటే కనీసం రూ.1000 ఎక్కువగా ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ
తెలంగాణలో అంగన్వాడీ వర్కర్లకు రూ.13, 650, హెల్పర్లకు రూ.7,800, మినీ వర్కర్లకు రూ.7,800 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500 హెల్పర్లకు రూ.7,000, మినీ వర్కర్లకు రూ.7000 ఇస్తున్నారు. జగన్‌ సర్కారు వచ్చాక అంగన్వాడీలకు రూ.1000 పెంచి చేతులు దులుపుకొంది. ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలు పెంచలేదు. జీతాలు పెంచాలని అంగన్వాడీ సిబ్బంది అనేకసార్లు వినతులు ఇచ్చారు. రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అయినా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా… వారి కుటుం బ సభ్యులకు సంక్షేమ పథకాలు కట్‌ చేశారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టారు.
అంగన్వాడీల డిమాండ్లు
అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలి.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి.
రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలి. ఆఖరి వేతనంలో 50 శాతం పెన్షన్‌గా ఇవ్వాలి.
చనిపోయిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల కుటుంబంలో ఒకరికి ఉద్యో గం ఇవ్వాలి.
మిని సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలి.
ఉపాధి సిబ్బందికి ‘హామీ’ ఏదీ?
గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసే సెర్ప్‌ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయగా, ఉపాధి హామీ పథకం సిబ్బందికి మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. అంతేగాక ఉపాధి సిబ్బందికి రిటైర్మెంట్‌ వయో పరిమితి పెంచలేదు. మరోవైపు ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్‌, ఔట్‌సో ర్సింగ్‌ ఉద్యోగులు అన్ని శాఖల్లో అరకొర జీతాలతో పనిచేస్తున్నారు. జగన్‌ సర్కార్‌ వచ్చిన తర్వాత వేతనాలు పెంచలేదు.పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేస్తా మన్న హామీని కొందరికే పరిమితం చేశారు. దీంతో లక్షల మంది సిబ్బంది లబోదిబో మంటున్నారు. ప్రభుత్వంపై గళమెత్తితే ఉద్యో గాలు పోతాయన్న భయంతో కొందరు ఉండ గా, మరి కొందరు ఏదో ఒక రూపంలో నిరస నలు తెలియజేస్తున్నారు. మున్సిపల్‌ కార్మికులు మొత్తం సిబ్బంది: 65 వేల మంది సమస్యలు పట్టని సర్కారు మున్సిపల్‌, పారిశుధ్య కార్మికు ల సమస్యలు పరిష్కరించడంలో జగన్‌ సర్కార్‌ విఫల మైంది. జీతాలు పెంచాలని, క్రమబ ద్ధీకరణ చేయాలని నాలుగున్నరేళ్లుగా ఎన్నో సార్లు కార్మికులు వినతులు ఇచ్చినా, నిరసనలు తెలిపినా పట్టించుకోలేదు. దీంతో తమ సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్‌ 27 నుంచి సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. మున్సిపల్‌ కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ(జేఏసీ) కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
కార్మికుల డిమాండ్లు ఇవీ
8 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజేషన్‌ చేయాలి. అప్పటి వరకు కనీస వేతనంగా రూ.20 వేలు, బేసిక్‌, డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిపి ఇవ్వాలి. జీవో నంబరు 308ను సవరించి స్కిల్‌, అన్‌స్కిల్డ్‌ వారీగా సూపర్‌వైజర్ల వేతనాలు చెల్లించాలి. టైమ్‌ స్కేల్‌తో పాటు ఉద్యోగ, కార్మికులను రెగ్యులరైజేషన్‌ చేస్తూ 1992లో ఇచ్చిన జీవో 212ను సవరించాలి. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వర్కర్లు మరణించినా, ప్రమాదాల బారిన పడినా సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.పర్మినెంట్‌ కార్మికులకు జీపీఎఫ్‌ ఖాతాలు తెరవాలి. హెల్త్‌కార్డులు ఇవ్వాలి. ఆశావర్కర్లు మొత్తం సిబ్బంది: 42 వేలమంది నిరసనలు చేపట్టినా… జగన్‌ సర్కార్‌లో ఆశావర్కర్లకూ అన్యాయం జరిగింది. సమస్యల సాధన కోసం ఎన్నోసార్లు నిరసనలు తెలిపారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. తమకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తు న్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళ నలను ఉధృతం చేస్తామని ఆశావర్కర్లు హెచ్చరిస్తున్నారు.
ఇవీ డిమాండ్లు
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలి. పెన్షన్‌ రూ.10 వేలు ఇవ్వాలి. చనిపోయిన ఆశావర్కర్ల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలి.-సైమన్ 

మత్తు ఉచ్చులో బాలలు

‘‘డ్రగ్స్‌ చట్టంలో మనిషి నుంచి మనిషికి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అవ్వడాన్ని కూడా ట్రాఫికింగ్‌ అనే అంటారు. ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంటుకునే వ్యాధే ఈ ట్రాఫికింగ్‌. ఒక విధంగా డ్రగ్స్‌ వాడుతున్న వాళ్ళను క్షమించి వారికి కొత్త జీవితాన్ని అందించడానికి ప్రయ త్నాలు చేయడంలో తప్పు లేదు. కానీ సరఫరా చేస్తున్న డ్రగ్‌ మాఫియాను మాత్రం కూకటి వేళ్ళతో పెకలించినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ఐక్యరాజ్యసమితి సాధారణ సభ జూన్‌ 26, 1987న చేసిన తీర్మానం మేరకు ‘డ్రగ్స్‌’ విని యోగం, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుం బిగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసేందుకుగాను నడుం బిగించింది. ఈ సంవత్సరం (2023) హానికరమైన మాదక ద్రవ్యాలను వినియోగించే వారు, వారి కుటుంబాలలో అత్యధికులు వివక్షను ఎదుర్కొంటున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే పరిస్ధితులకు దారితీస్తుంది. వారికి అవసరమైన సహాయాన్ని పొందకుండా నిరోధించే పరిస్ధితులు బలపడేలా చేస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలు ముందుగా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై వివక్షతను తొలగించి మాదకద్రవ్యాల దుర్వినియోగం లేని ప్రపంచాన్ని సాధించడంలో సహకారాన్ని బలోపేతం చేయాలనే ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరం ధీమ్‌ ప్రకటించింది.’గునపర్తి సైమన్‌


సరదాగా ఒక్కసారి అన్న భావనతో మత్తుమందుల వినియోగం ప్రారంభించినప్పటికీ వాటిని వినియో గించినప్పుడు కలిగే తాత్కాలిక ఆనందం తరచూ పొందాలని కోరికతో క్రమేపీ అది బానిసలుగా మార్చేస్తోంది. చివరకు మత్తు మందు తీసుకోకుంటే తట్టుకోలేని పరిస్థితికి చేరు కుంటున్నారు. వాటిని సమకూర్చు కోవడానికి ఎంతకైనా తెగించేస్తున్నారు. ఈ విధంగా సరదా గా అలవాటు చేసుకుంటున్న ప్రతి 10 మందిలో ఇద్దరు దానికి పూర్తిగా బానిసలై పోతున్నట్లు, మాదక ద్రవ్యాలను వినియోగించే ప్రతీ ముగ్గురిలో ఒక మహిళ ఉంటున్నట్లు ఈమధ్యనే భారత గ్రామీణ చైతన్య వేదిక చేసిన సర్వేలో తేల్చి చెప్పిం ది.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో మాదకద్ర వ్యాల విని యోగం అత్యంత ప్రమా దకర స్థాయిలో పెరుగుతోంది. పదేళ్ల ప్రాయం నుంచే కొందరు బాలలు వీటికి అలవాటు పడుతున్నారు. ఏకంగా 3.17లక్షల మంది బాలలు ఈ మత్తు వలలో చిక్కుకున్నారు. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదకద్రవ్యాల వ్యసనపరులు ఉండగా.. వారిలో 15.70 శాతం మంది బాలలే ఉండ టం ఆందోళన కలిగి స్తోంది.బాలల్లో గంజాయి వినియోగం అధికం గాఉన్న రాష్ట్రాల్లో ఏపీ 12వ స్థానంలో ఉండటం మరింత కలవరపెడుతోంది. మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని రాష్ట్రంలోని కొందరు బాలలు అల్లాడు తున్నారు.ఓపియం, హెరాయిన్‌, గంజాయి వంటి నాటికీ వారు బాని సలవుతుండటం కలవరం రేపు తోంది. వీటిలో గంజాయి వినియో గం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలోని ఏపీ12వ స్థానంలోఉండగా.. బాలల్లో ఓపయడ్స్‌కు సంబందించిన మాదక ద్రవ్యాల వినియోగంలో పదివస్థానంలోఉంది. సెడెటివ్స్‌ వినియోగంలో ఎనిమిదివ స్థానంలో ఉంది. కేంద్ర సామాజిక న్యాయ సాధి కారిత మంత్రిత్వశాఖ స్థాయీ సంఘం తాజాగా పార్లమెంట్లో నివేదిక సమర్పించింది.
దేశంలో మత్తు పదార్ధాల బారిన పడి త్రీవంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని ఈ నివేదిక వెల్లడిరచింది. ప్రధానంగా బాలల్లో వీటి వినియోగం ఇక్కడ ఎక్కువగా ఉందని పేర్కోంది.మాదకద్రవ్యాల మైకం రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా కమ్మేసిందో చెప్పటానికి ఈ గణాంకాలే సాక్ష్యాలు.దీనివల్ల నేరాలూ పెరుగుతున్నాయి.ముప్పు ఇంతస్థాయిలో ఉన్నా సరే ప్రభుత్వం నియంత్రణకు అవసరమైన కార్యాచరణ కొరవడిరది.
మత్తు ఉచ్చులో విద్యార్థులు..కిక్కు కోసం బానిసలు
రాష్ట్రంలో గంజాయికి బానిసులుగా మారిన వారు 4.64లక్షలమంది ఉన్నారు. వారి లో 21వేలమంది బాలలే.వీరిలో 10నుంచి 17ఏళ్లలోపు వారు గంజాయి రుచిచూస్తున్నారు. మొత్తంగా మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న 20.19లక్షల మందిలో 22.98శాతం మంది గంజాయి తీసుకుంటున్నారు. 10నుంచి 17ఏళ్ల మధ్య వయస్సున్న 3.17లక్షల మంది మాదకద్ర వ్యాలకు అలవాటుపడగా..,వారిలో 21వేల మంది గంజాయి సేవిస్తున్న వారే కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.18నుంచి 75ఏళ్లలోపువారిలో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 11వ స్థానంలో ఉంది.గతంలో మన రాష్ట్రంలో సాగు మాత్రమే ఉండేది.గత నాలుగేళ్లలో దాని లభ్యత, వినియోగం విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడికక్కడే లభిస్తోంది. విక్రయదారులు, సరఫ రాదారులు ఎవరో తెలిసినా వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసకోవల్లేదు.ఈ ఉదాసీనత ఫలి తంగా దానికి అడ్డుకట్ట పడట్లేదు.ఓపి యోడ్స్‌, ఇన్‌హెలెంట్స్‌,సెడిటిప్స్‌కు సంబంధించిన మాదక ద్రవ్యాల వినియోగం కూడా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా9.88లక్షల మంది ఓపి యెడ్స్‌కు బానిసలుగా మారారు.
రాష్ట్రంలో గాజాయి ఫుల్‌..చర్యలు నిల్‌
మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారిని దాన్నుంచి విముక్తి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం నేషనల్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఫర్‌ డ్రగ్‌ డిమాండ్‌ రిడక్షన్‌ కార్యక్రమం అమలు చేస్తోంది. దీని కింద ఏపీలో 201819లో 1,752మంది లబ్దిపొందగా,202021నాటికి వారిసంఖ్య ఏకంగా 8,878కు పెరిగింది. కేవలం రెండేళ్ల వ్యవధిలో 291.57శాతం మంది లబ్దిదారులు పెరిగారు.201920తో పోలిస్తే 20221లో ఏకంగా 233.39శాతంమంది లబ్దిదారులు పెరిగారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, వాటి బారిన పడుతున్న వారి సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో ఈగణాంకాలే చెబుతు న్నాయి.
గంజాయి ఊబిలో యువత..జీవితాలు నాశనం
దేశవ్యాప్తంగా 272జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం,ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సహకారంతో కేంద్రం గుర్తించింది.ఆజాబితాలో ఉమ్మడివిశాఖ, తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాలు ఉన్నా యి.వీటిలో విశాఖమన్యం గాజాయి సాగు సర ఫరాకు కేంద్రంగా ఉంది. మిగితా జిల్లాలు మీదు గా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. రాష్ట్రంలో మద్యం వినియోగం చాలా తీవ్రంగా ఉంది.మద్యానికి అలవాటు పడి బానిసలైన వారు ఎక్కువమంది ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఏడో స్థానంలో ఉంది.3.86కోట్ల మందితో ఉత్తరప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉం డగా..65.09లక్షల మందితో ఏపీఏడోస్థా నంలో ఉంది. పొరుగున ఉన్న తెలంగాణలో మద్యానికి అలవాటుపడ్డవారు ఏపీకంటే తక్కువగానే ఉన్నారు. అక్కడ 50.40లక్షలమంది ఉన్నారు.
డ్రగ్‌ అడిక్ట్స్‌ను గుర్తించడమెలా?
డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు స్థిమితంగా ఉండలేరు. ఊరికే ఉద్రేకపడిపోతుం టారు. దేనిపైనా దృష్టి నిలపలేరు. వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ చూపించరు. మంచి దుస్తులు వేసుకోరు. వేళకు స్నానం చేయరు. మురికిగా కనిపిస్తారు. ఒళ్లు వణుకుతుండటం, మాటలు ముద్ద ముద్దగా వస్తాయి. రక్తనాళాల్లో రక్తప్రసరణ అధికంగా జరుగుతుంటుంది. వారి ధరించిన దుస్తులు నుండి చిత్రమైన వాసన రావచ్చు. కళ్లలో ఎర్రజీరలు కనిపిస్తాయి. కనుపాపలు సాధారణ స్థితి కంటే మరింతగా విప్పారినట్లుగానో లేదా మరింతగా కుంచించుకుపోయినట్లుగానో తయా రవుతాయి. అతిగా తినడం లేకుంటే ఆకలి మంద గించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గంటల తరబడి మత్తుగా నిద్రపోవడం లేదా నిద్రలే కుండా గంటల తరబడి గడపడం వంటి లక్షణా లు, ఫోన్‌ లో రహస్యంగా మాట్లాడటం ఎవ్వరి తోను కలవక పోవడం, ఎక్కువుగా బబుల్‌ గమ్‌, చూయింగ్‌ గమ్‌లు నమలడం, డోర్‌ లాక్‌ చేసు కుని గదిలోనే ఉండిపోవడం. ఇటువంటి లక్షణా లున్న వారు డ్రగ్స్‌ మాయలో చిక్కుకున్నట్లే.
సమిష్టి పోరుతో సత్ఫలితాలు
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారోద్యమాలు కార్యక్రమాలు చేపట్టినా వీటి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అంతర్జాతీయ సమాజానికి మార్గనిర్దేశనం చేసినా, డ్రగ్స్‌ వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. ఉగ్ర వాదంవల్ల మరణి స్తున్నవారి కంటే ప్రపం చంలో మత్తుమందుల వల్ల కన్ను మూస్తున్నవారే ఎక్కువ ఉన్నారనేది అనేక సర్వేల్లో వెల్లడైంది. అంటే పూర్తిగా అదిప్రభుత్వ వైఫల్యంగానే చెప్పుకో వచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న ప్రతీ సర్వేలోను వీటి వినియోగం పెరిగినట్లు గణాంకాలు వస్తున్నా యి తప్ప అదుపులోకి వస్తున్న జాడ ఏ మాత్రం కనిపించడం లేదు.ఈ సమస్యకు శాశ్వత పరి ష్కారం దిశగా ముందుగా వ్యవస్ధ పునాదులును బలోపేతం చేయాలి. ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్ర మాలు ప్రభుత్వాలు చేపట్టాలి.ఈ విషయమై ప్రభుత్వం చేపట్టే కార్యాచరణలో చిత్తశుద్ధి ఉం డాలి.అదే సమయంలో విద్యా వ్యవస్ధలో సమూల మార్పులు చేయాలి అంటే విద్యా బోధనలో నైతిక విద్యకు అగ్రతాంబూలం ఇవ్వాలి. విలువలు లేని విద్యా విధానం ఎన్ని చట్టాలు చేసినా ఇటువంటి విష సంస్కృతలకు ఎప్పటికి చరమ గీతం పాడలేం. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ సకల అనర్ధాలకు, అరాచకాలకు అమానుష ధోరణులుకు కారణమై కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలి గొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఉపేక్షించడం అనేది జాతి భవితకే తీరని చేటని గుర్తించి తల్లి దండ్రులు,విద్యాసంస్థలు,ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా దీనిపై పోరు సాగిస్తే తప్పక మాదక మహమ్మారిని తరిమి వేయడం సాధ్యం అవుతుంది.ఆనాడే వివేకవంతమైన సమాజం మన కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడా అక్కడా అని కాదు.. ఇప్పుడు అప్పుడని కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఈ మాదకద్ర వ్యాల భూతం ఎల్లెడలా పంజా విసురుతూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మనిషి ఆరోగ్యం పైనే కాదు సమాజంపైనా తీవ్ర దుష్పరిమాణాలు చూపుతుంది. అందుచేతనే ప్రస్తుతం మానవాళిని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం తరువాతి స్థానం మాదక ద్రవ్యాలదేనని ఐక్యరాజ్యసమితి స్పష్టీకరించింది. ప్రాధమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల నుండి 60సంవత్సరాల వయసు గల పెద్దల వరకూ భాగ్యవంత దేశాల నుండి అభి వృద్ధి చెందుతున్న దేశాల వరకూ అన్ని వర్గాల వారిని ఈమాదక మహమ్మారి మత్తుగా మింగేస్తూ ఉంది. జీవితాలను చిత్తు చేసే ఈ డ్రగ్‌ రక్కసి కోరల్లో మత్తు కోసం చిక్కుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. మత్తు కోసం మాదక ద్రవ్యాలకు బానిస అయిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు గెలిచినా ఓడినా దానిని మత్తు లోనే పంచుకోవాలి అనే భావం వీరిలో క్రమేపీ బలపడిపోతుంది.
నేటి సమకాలీన సమాజంలో పరిశీలి స్తే పుస్తకాల తోటలో విహరిస్తూ పుస్తకాలు చదు వుతూ జ్ఞానాన్ని ఆర్జించవలసిన ఎందరో విద్యా ర్థులు పుస్తకాల అధ్యయనానికి బదులు పొగ పీలుస్తున్నారు. గురువులు చెప్పేది మెదడులో ఎక్కించుకోవడానికి బదులు మెదడుకు రసాయ నాల మత్తును ఎక్కిస్తూ మత్తులో తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ రోజురోజుకు మాదక ద్రవ్యాల ఊబిలో కూరుకు పోతున్నారు. పట్టుమని పదహారేళ్లయినా నిండని ఈ టీనేజ్‌ పిల్లలు కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో పొగతాగడం, మద్యం తీసుకోవడం వంటివి ముందుగా ప్రారంభిస్తారు. అయితే క్రమంగా ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారిపోతాయి.కానీ కాలక్రమంలో ఈ వ్యసనాన్ని సిగరెట్లతోనో, మద్యంతోనో సరిపెట్టుకోరు. మరింత థ్రిల్‌ కోరుకుంటారు. జీవితంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసం కొం దరు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం మరికొందరు డ్రగ్స్‌ వైపు అడుగులేస్తారు. సరదా కోసం ఒకటికి రెండుసార్లు వాడితే చాలు, వాటి మత్తులో పూర్తిగా కూరుకుపోతారు.
ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదుకానీ డ్రగ్స్‌ మాత్రం బాగా అందుబాటు లోకి వచ్చాయి అనేది మాత్రం వాస్తవం. దేశం లో యువ శక్తిని నిర్వీర్యం చేస్తూ, అత్యంత విలు వైన మానవ వనరులను చీడ పురుగుల్లా తొలి చేస్తూ దేశ భవిష్యత్‌ను పెనుగండంగా మార్చి, మొత్తం సమాజాన్ని విచక్షణా రహితంగా వ్యస నాల ఊబిలోకి డ్రగ్‌ రక్కసి నిర్దాక్షిణ్యంగా నెట్టి వేస్తున్నది. ఈ సమస్యకు కారణం మాదక ద్రవ్యాల వినియోగం కన్నా ఖండాలు దాటి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాగా చెప్పవచ్చు.
చరిత్ర..
మత్తు కోసం మత్తు కలిగించే పదార్ధా లను వాడటం ఈ మధ్య కాలంలో మొదల య్యింది మాత్రం కాదు. చారిత్రిక కాలం నుంచి ఈతరహా వ్యసనాలు అనేకం కనిపిస్తాయి. అయితే అప్పట్లో వాటికి వినియోగించిన పదార్ధాలు మాత్రం వేరు.మత్తు కోసం ఆనాడు ప్రకృతి సిద్ధం గా లభ్యమయ్యే మద్యం,గంజాయి,పొగాకు, నల్లమందు,మత్తునిచ్చే పుట్టగొడుగుల వంటి పదార్థాలను విరివిగా వాడుతుండేవారు. అయితే గత శతాబ్ద కాలం నుంచి పరిశీలిస్తే సాంప్రదా య మత్తు పదార్ధాలను తలదన్నే రీతిలో సింథటిక్‌ మత్తు పదార్థాలు ఎపిడ్రిన్‌,కొకైన్‌,ఓపియమ్‌ (నల్ల మందు),హెరాయిన్‌, బ్రౌన్‌షుగర్‌,కెటామైన్‌ పేరే దైతేనేం..ఈమత్తు పదార్థాలు ఎక్కువగా వాడుక లోనికి వచ్చేసాయి. గడచిన ఆరేడు దశా బ్దాల్లో వీటి తయారీ, సరఫరా, విక్రయాల విష యంలో మాఫియా ముఠాలు పనిచేయడం,ప్రభుత్వ నియంత్రణలు సత్ఫలితాలు ఇవ్వలేక పోవడం వలన ఈ మాదక ద్రవ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరించాయి. ఈమత్తు పదార్థాల విని యోగానికి క్రమేపీ యువత బానిసలు కావడం నేడు ఆందోళనకరంగామారి వారి పాలిట కాల కూట విషాలుగా పరిణమిస్తున్నాయి. ఫలితంగా యువత ఈ మాదక ద్రవ్యాల విషవలయంలో కూరుకుపోతున్నారు. వాస్తవంగా వీటి వినియోగం ద్వారా తాము బానిసలుగా తయారై జీవితాన్ని నాశనంచేసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. అయితే చాలా మంది ఇది ఎలా ఉంటుంది? ఒక సారి రుచి చూద్దాం అనే కోరికతో మొదలై, దానికి బానిసలుగా మారే స్ధితికి వచ్చిన వారే అధికం. వీరితో పాటు డిప్రెషన్‌ కు గురయిన వారు, ఆందోళనలు ఎక్కువుగా ఉన్నవారు, సామాజికప రంగా వెనుకబడి ఉన్నవారు, ఆర్ధికంగా సమస్య లను ఎదుర్కొనే వారు, చదువులో వెనుకబడిన వాళ్ళు, కుటుంబం నుండి ప్రేమ ఆప్యాయతలు పొందలేని వాళ్ళు, తరచూ గొడవలు పడే భార్యా భర్తలు, జీవితంలో ఊహించని ఎదురుదెబ్బల నుంచి ఉపశమనం కోసమని, నిస్సత్తువగా మారిన బతుకులో కొంత ఉత్తేజం పొందాలని, ప్రేమలో విఫలమై ఆ బాధకు ఉపశమనం పొందాలనే ప్రయత్నంలో మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తు న్నారు. ఇంతకన్నా ముఖ్యంగా ఈనాటి ఆధునిక కుటుంబాల్లో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం కారణంగా పిల్లలపై సరైన పర్య వేక్షణ ఉండడం లేదు. దీంతో తమను గమనించే వారు లేరన్న అవకాశాన్ని సరదా కోసం, ఫ్యాషన్‌, మోజు,స్నేహితుల ఒత్తిడి కారణాలతో మత్తు మందులు వినియోగానికి కొందరు అలవాటుపడు తున్నారు. చివరకు ఇది దీర్ఘ కాలిక సమస్యగా పరిణమించిన తరువాత ఆఉచ్చు నుండి బయట పడటం సాధ్యంకాక నిలువునా జీవితాలను బుగ్గి పాలు చేసుకుంటున్నారు.
భారత్‌లో మాదక ద్రవ్యాలు
మాదక ద్రవ్యాల విష సంస్కృతి మన దేశంలోకి కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ వ్యాప్తి మాత్రం చాప క్రింద నీరులా సాగుతూనే ఉంది. డ్రగ్స్‌ బానిసలు రోజు రోజుకు పెరిగిపోతున్న దేశాలలో భారత్‌ ఒకటి..! ఇటీవల కేంద్రం విస్తృతంగా నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో యువత కొకైన్‌, హెరాయిన్‌, గంజాయి వంటి మత్తుమందుల వాడకం గత పదేళ్లలో ఐదింతలు పెరిగినట్లు తేలింది. ఇండియా క్రైమ్‌ బ్యూరో లెక్కల ప్రకారం మన దేశంలో డ్రగ్స్‌ తీవ్రంగా వాడడం వలన 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. మాదకద్రవ్యాల వినియోగం కారణంగా దేశంలో ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని చెబుతున్న ఎన్‌సీబీ గణాంకాలు భారతావనిని కలవరపెడుతున్నాయి. మరొక పక్క మన దేశంలో సుమారు 15 కోట్లమంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని అంచనా. వీరందరికి ఇవి మొదట పబ్‌లు, క్లబ్‌లు,సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అయితే ఇప్పుడు ఇవి నేరుగా విద్యా సంస్ధల చెంతకే అందుబాటులోనికి వచ్చేసాయి. కెల్విన్‌ అనే డ్రగ్‌ సరఫరాదారుడిని అదుపులో తీసుకున్న సందర్భంలో అతని వద్ద ఉన్న సమా చారం చూస్తే దాదాపు 130మంది పబ్లిక్‌ స్కూల్‌ చిన్నారులకు డ్రగ్స్‌ అందిస్తున్నట్లు తెలిసింది. దీనిని బట్టి స్కూల్‌ పిల్లలు కూడా ఈ ఉచ్చులో చిక్కుకు పోయారన్న చేదు నిజం బయట పడిరది.
ఐక్యరాజ్యసమితి విభాగమైన డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్ర వ్యాలు ఉపయోగించేవారు 0.71శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఇండియా లో 2.65శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్‌ వాడు తున్నారని తెలిసింది. భారత ప్రభుత్వం 1985లో నార్కోటిక్‌-డ్రగ్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టాన్ని అమలులోనికి తెచ్చింది. అప్పటి నుండి పరిస్ధితులకు అనుగుణంగా1988,2001, 2004లో ఈచట్టానికి సవరణలు చేపట్టారు. అయినా డ్రగ్స్‌ ఇండియాలోకి రావడం మాత్రం తగ్గడం లేదు. దేశంలో ముంబై తర్వాత పంజాబ్‌ డ్రగ్స్‌ వినియోగంలో అగ్రగామిగా ఉంది. అక్కడ దాదాపు 30లక్షల మంది డ్రగ్‌ యూజర్లు ఉన్న ట్టు అంచనా.గంజాయిసాగు విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ముందు వరుసలో నిలిచింది.మన దేశంలో ఒకప్పుడు మెట్రో నగరా లకు మాత్రమే పరిమితమైన ఈ మాదక ద్రవ్యాలు క్రమేపీ ద్వితీయ శ్రేణినగరాలకు చివరకు గ్రామా లకు సైతం విస్తరించి ఎల్లెడలా మత్తు వాసనలు గుప్పు మంటున్నాయి. విదేశాల నుంచి తరలి వస్తున్న డ్రగ్స్‌తో పాటు స్దానికంగా నెలకొన్న ఔషధ పరిశ్రమలలో తయారయ్యే మత్తు పదార్థా లు వీటికి తోడవుతున్నాయి.
గతంలో యువకులు ఏర్పాటు చేసుకునే పార్టీలలో మద్యం ఏర్పాటు చేసుకునే వారు. అయితే ఇప్పటి పార్టీలలో మద్యంకు బదులు మాదక ద్రవ్యాలు చేరాయి. ఉన్నత విద్యా సంస్ధలలో విశ్వ విద్యాల యాల్లో చివరకు పబ్లిక్‌ స్కూల్స్‌లో సైతం మాదక ద్రవ్యం ఉదంతాలు మనం నిత్యంచూస్తూ ఉన్నాం. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం 1985లోనే మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టం‘ఎన్‌డీపీఎస్‌’ తీసుకువచ్చింది. తర్వాత ఎప్పటికప్పుడుపలు సవరణలు చేస్తూ ఈ చట్టాన్ని పటిష్టం చేసింది. అయితే ఈ చట్టం కాగితాలకే పరిమితం అయ్యింది. ఫలితంగా ప్రపంచం మొత్తంమీద మత్తులో జోగుతున్న దేశా ల్లో భారత దేశం ముందు వరుసలో నిలవడం భావి భారతానికి అత్యంత ఆందోళన కలిగించే విషయం.
డ్రగ్స్‌కు ఆకర్షితులు కావడానికి కారణాలు..
ప్రేమపూర్వకమైన వాతావరణం లేని ఇళ్లలోని పిల్లలు, ఆత్మవిశ్వాసంలేని వాళ్లు జీవి తంలో తగిలే ఎదురుదెబ్బల నుంచి ఉపశమ నం పొందాలనుకునే వాళ్ళు, ఒంటరితనం, ఓట మిని తట్టుకోలేని వాళ్ళు, చదువులు బుర్రకు ఎక్కక పోవడం, చెడు స్నేహాలు..ఒత్తిడిని తట్టుకోలేని సున్నిత మనస్కులు. పట్టణాలకు పెరుగుతున్న వలసలు.పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అంత రాలు.కనుచూపుమేరలో దొరికే మత్తు పదార్థాలు. పరీక్షలో, ప్రేమలో, ఫెయిల్‌ అయినవారు, స్తబ్దుగా మారిన బతుకులో కొంత ఉత్తేజం కోసం ఎదురు చూసే వాళ్ళు పాశ్చాత్య పోకడలు, టీవీ, సినిమా, మీడియా ప్రభావం ఇత్యాదికారణాలవల్ల యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని కోల్పోతున్నారు. కిక్‌ కోసమో, థ్రిల్‌ కోసమో ప్రారంభించిన ఈ అలవాట్లు కాల గమనంలో ఇవి వదులుకోలేని వ్యసనాలుగా మారి క్రమేపీ యువత వీటికి బాని సలై బలైపోతున్నారు. ఒక్కసారి ఈడ్రగ్స్‌ విష వలయంలో చిక్కుకుంటే చాలు, మరలా వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. ఈలోపు కెరీర్‌ అంతా సర్వనాశనం అవుతుంది. యువత దీనికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు.డ్రగ్‌ వ్యసనం నుండి వెనక్కి తిరిగి రాలేని వాళ్ళు మరణం పాలవు తున్నారు. కొందరైతే డ్రగ్స్‌ లభించక బలవన్మ రణం పాలవుతున్నారు. మాదక ద్రవ్యాల వినియో గంలో బానిసలుగా చిక్కుకున్న యువతను దాని నుంచి బయటపడేసే విషయంలో ప్రభుత్వాలు సామాజిక సంఘాలు తమ వంతు కృషి జరుపు తున్నప్పటికీ డ్రగ్స్‌ మాఫీయా మాత్రం వెనుకడుగు వేయడం లేదు.ఎవరు తెస్తున్నారో.. ఎలా సరఫరా చేస్తున్నారో తెలియదు కానీ పోలీసులు, నిఘా సంస్ధల కళ్ళు కప్పి రహస్య ప్రాంతాల్లో ఈ డ్రగ్స్‌ దందా నిరాటంకంగా కొనసాగుతూ ఉంది. ఈ విషయంలో స్ధానిక ముఠాలు,అంతర్జాతీయ గ్యాంగులు మార్కెట్‌లో మాదక ద్రవ్యాలను కుమ్మ రిస్తూనే ఉన్నాయి. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సర ఫరా,సేవనం విషయంలో కఠిన చర్యలు తీసు కుంలున్నప్పటికీ డ్రగ్స్‌మాఫియా తమ కార్య కలా పాలను మాత్రం నిర్విఘ్నంగా కొనసాగిస్తుంది.
మాదకద్రవ్యాలు తెచ్చే అనర్ధాలు
శారీరక ఆరోగ్యం,మానసిక ఆరో గ్యం,సామాజిక ఆరోగ్యం ఈమూడు కూడా సం పూర్ణ ఆరోగ్యానికి ప్రధాన హేతువులు. అయితే మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా ఈ మూడు నశించి పోతున్నాయి. వీటి వినియోగం ద్వారా ప్రాధమికంగా విచక్షణ కోల్పోతారు. మాదకద్ర వ్యాలు,ఉత్ప్రేరకాలకు ఒకసారి బానిసలైన తర్వాత వీటిని పొందటం కోసం ఎంతటి అకృత్యాలు, అత్యాచారాలు, నేరాలు చేయడానికైనా యువత వెనుకాడరు. డ్రగ్స్‌ నేరుగా మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ప్రభావం చూపుతాయి. ఇది డ్రగ్స్‌ వల్ల తలెత్తే తక్షణ దుష్ప్రభావం. వీటిని వాడుతుండే కొద్దీ శరీరంలోని ఇతర వ్యవస్థల పైనా దారుణమైన దుష్ప్రభావాలు పెరిగిపోతా యి. చివరకు అకాల మరణాలకు కారణమవు తాయి. డ్రగ్స్‌ వల్ల శరీరానికి వాటిల్లే ప్రధానమైన అనర్థాలు చూస్తే.. గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి, కేన్సర్‌, మానసిక అనారోగ్యం, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ సంక్రమించే అవకాశాలు ఎక్కువ. ప్రదానంగా రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతిం టుంది. జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతిని, శరీరం శుష్కించిపోతుంది. లివర్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడి, చివరకు అది పూర్తిగా పనిచేయని స్థితి ఏర్పడుతుంది.
ఊపిరితిత్తుల పనితీరు మందగింపు
రక్తనాళాలు కుంచించుకుపోయి, రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. జ్ఞాపకశక్తి క్షీణించ డంతో పాటు ఏకాగ్రత లోపిస్తుంది. మెదడు దెబ్బతిని మూర్ఛ, పక్షవాతం వంటి పరిస్థితులు కూడా తలెత్తుతాయి. మూత్రపిండాలు దెబ్బతిన డం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఎదురు గా ఏం జరుగుతోందో అర్థంచేసుకోలేని గందర గోళ పరిస్ధితి ఏర్పడుతుంది. పరిస్థితులను గ్రహిం చి వాటికి అనుగుణంగా స్పందించే శక్తి పూర్తిగా నశిస్తుంది. మత్తుకు బానిసలుగా మారి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతారు. వైద్య నిపుణుల పరిశోధ నలు ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిస అయిన వారిలో 25 శాతం మంది శారీరక సమస్యలకు గురవుతారు.42శాతం ఒత్తిడికి,మానసిక సమస్య లతో బాధపడతారు. 25 శాతం మంది భార్యల నుండి విడాకులు కోరుతున్నారు.40శాతం నేర పూరిత ఆలోచనలతో గడుపుతున్నారు. యువత విషయంలో చూస్తే 45శాతానికి పైగా సెక్స్‌ లో విఫలమవుతున్నారు.24 శాతం మంది స్థూల కాయంలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువత వారి అలవాట్లను అవసరాలను తీర్చుకునే నేపథ్యంలో సంఘ విద్రోహుల వలలో చిక్కి, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. వీటి ఫలి తంగా ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకం గా మానసికంగా నిర్వీర్యమైపోతున్నారు.ఈ విధంగా డ్రగ్స్‌ మత్తులో పడి యువత నిర్వీర్యమై పోయిన దేశాలు మన కళ్ల ముందే ఎన్నో ఉన్నాయి. మానవ అక్రమరవాణా, దోపిడీలు, హత్య లు, గృహ హింస, వేధింపులు వంటి ఎన్నో నేరాలకు డ్రగ్స్‌ వినియోగమే మూల కారణమవు తోంది. ఏది ఏమైనా ఈ మాదక మహమ్మారి వినియోగం, దానికి బానిస కావడమనేది తల్లిదం డ్రుల కలలనే కాదు, మన దేశ భవిష్యత్తునే కాల రాస్తోందని చెప్పవచ్చు.
నివారణ సాధ్యమే
ఆరోగ్యాన్ని ఛిద్రం చేసి ఆయుష్షును హరించే ఈ మత్తు మహమ్మారి విష వలయంలో చిక్కుకున్న తరువాత దాని నుంచి బయటపడటం కష్టమే కానీ అసాధ్యం కాదనే చెప్పాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మార్గాలలో మందులు, కౌన్సిలింగ్‌, బిహేవిరియల్‌ థేరపీ వంటి వాటి ద్వారా బయట పడవచ్చు. కాకపోతే, దీనికి కాస్త సమయం, సహనం, కృషి కావాలి. ఇది దీర్ఘకాల ప్రక్రియ. దీనికి కుటుంబం సహకారంతోపాటు వైద్య నిపుణుల అవసరం కూడా తోడవ్వాలి. ప్రధానంగా మాదకద్రవ్యాల బారి నుంచి బయట పడాలనే గట్టిసంకల్పం డ్రగ్స్‌ వాడే వారిలో ఉండాలి. అయితే ఇలా సంకల్పించిన ప్రతీ సారి ఏదో ఒక విఘ్నం తారసపడుతూనే ఉంటుంది. అటువంటి సందర్భంలో నిగ్రహంగా నిలబడి వైద్యుల సలహాలు కుటుంబ సభ్యుల సహకారం మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌ తీసుకోవడం అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది.ఎందుకంటే వీరు డ్రగ్స్‌ వాడకానికి దోహద పడిన కారణాలు విశ్లేషణ చేసి దాని నుండి బయట పడటానికి అవసరమైన కౌన్సిలింగ్‌ మానసిక వైద్యులు అందిస్తారు.మాదక ద్రవ్యాల ఉచ్చు నుండి బయట పడాలంటే ముందుగా దానికి దోహద పడిన కారణాలు నిర్ములించాలి. ఇది కేవలం మానసిక వైద్యుల కౌన్సిలింగ్‌ ద్వారానే సాధ్యమవుతుంది. ఇవన్నీ తీసుకుంటూ సడలని మనో సంకల్పంతో నిలబడగలిగితే ఈవిషవలయం నుండి బయట పడటం అసాధ్యం ఏమీ కాదు. ఇవన్నీ పాటిస్తూ డ్రగ్స్‌కు బానిస అయిన వాళ్ళుకూడా గట్టి సం కల్పంతో ఈ విషవలయం నుండి బయట పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు.
తల్లిదండ్రులదే ప్రధాన బాధ్యత
చాలా మంది తల్లి తండ్రులు తమ పిల్లల విషయంలో మార్కులు ర్యాంకులు మాత్రమే పరమావిధిగా చూస్తున్నారు తప్ప తమ పిల్లల మానసిక పరివర్తన వ్యవహారశైలి గురించి పట్టించుకోవడంలో శ్రద్ద చూపడం లేదు.వారికి కావలసిన పాకెట్‌ మనీ అందచేస్తూ వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తున్నది అసలు పరిశీలించడం లేదు. తల్లితండ్రులలో ఎక్కువ మంది తమ పిల్లలు బుద్ది మంతులని ఇల్లు బడి తప్ప మరొక ప్రపంచం తెలియదు అంటూ పిల్లలపై అపార నమ్మకం చూపిస్తారు. పిల్లలపై నమ్మకం, ప్రేమ చూపించడంలో తప్పులేదు. చూపించాలి కూడా. అయితే అదే సమయంలో ఆనమ్మకం అతి కాకూడదు. నిజంగా ఆడ్రగ్‌ మహమ్మారి మన ఇంట్లోనే మన పిల్లల చెంత తిష్ట వేసినప్ప టికీ దానిని గమనించే అవకాశాన్ని మనకు ఇవ్వదు. ఈ స్ధితిలో పరిస్ధితి చేయి దాటి పోయిన తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు. అందుచేత ప్రతీ తల్లితండ్రులు తమ బిడ్డపై నమ్మ కంతో పాటు బిడ్డ వ్యవహార శైలి బట్టి అను మానం కూడా కలగాలి. అప్పుడే పెను ప్రమాదం నుండి బిడ్డను బయట పడేసే అవకాశం మనకు చిక్కుతుంది.ఈ విషయంలో తల్లి తండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఎటువంటి సందే హం లేదు.డ్రగ్స్‌ బారిన పడిన వారిని దండిర చడం, బెదిరించడం, వారితో వాదించడం వారిని చిన్నబుచ్చకునేలా చేయడం ఆత్మన్యూనత కలిగేలా వ్యవహరించడం వంటి చర్యలు ద్వారా వారిని డ్రగ్స్‌ వ్యసనం నుంచి ఎట్టి పరిస్ధితులలో కూడా బయట పడేయలేమని ముందుగా తల్లి తండ్రులు గుర్తించాలి. డ్రగ్స్‌ వాడకం వలన తలెత్తే దుష్పరి ణామాల గురించి పిల్లలకు చాలా ఓపికగా వివరించాలి. ఈ వ్యసనం నుండి బయటపడితే సమాజంలో మనం తిరిగి గౌరవ ప్రద జీవితాన్ని పొందగలం అనే ఆశాజనకమైన ప్రేరణ కలిగిం చే మాటలు చెప్పాలి. దానివలన ఖచ్చితంగా అనుకూల ప్రభావాన్ని సాదించవచ్చు.
ఔషధం కన్నా కౌన్సిలింగే కీలకం
నేడు వైద్య విధానంలో డ్రగ్స్‌ నుండి విముక్తి చేయడానికి అనేక ఆధునిక ప్రక్రియలు అందుబాటులోనికి వచ్చినా డ్రగ్స్‌ బారిన పడిన వారిని బయట పడేయడానికి ఔషధాలు కన్నా కౌన్సిలింగ్‌ చాలా బలమైన ప్రభావం చూపిస్తుంద నడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మాదకద్రవ్యాలకు బానిస కావడం అనేది ఒక జబ్బు.వాటికి అలవాటు పడిన వాళ్ళను మనం ఒక రోగిలా మాత్రమే చూడాలి తప్ప నేరగాడిలా చూడకూడదు. పిల్లవాడిని నిర్బంధిస్తే ఆ మహ మ్మారి నుంచి బయట పడేయవచ్చు అని భావించే తల్లి తండ్రులు లేకపోలేదు. ఈ తరహా అభిప్రా యం సమస్యను మరింత జఠిలం చేస్తుంది తప్ప పరిష్కారం మాత్రం లభించదు.డ్రగ్స్‌ ఊబి నుంచి బయట పడాలంటే వైద్య సహాయం ఎంత అవసరమో కుటుంబ సభ్యుల సహకారం అంత కన్నా ఎక్కువ అవసరం. అందుచేత వైద్యులు రోగి కన్నా ముందు కుటుంబ సభ్యులకు కౌన్సి లింగ్‌ ఇస్తారు. ఇది వీరు పాటించగలిగితే తప్పక మంచి ఫలితాలు లభిస్తాయి. పిల్లవాడిని నువ్వు చేస్తున్నది తప్పుఅని చెప్పకుండా కౌన్సిలింగ్‌ ద్వారా తాను చేస్తున్నది తప్పు ఈఉచ్చు నుంచి నేను బయట పడాలి అనే సంకల్పం ప్రారంభం అయ్యే విధంగాచూడాలి. ఇదికనుక పిల్ల వాడిలో మనం రప్పించగలిగితే సగం విజ యం సాధించి నట్లే. దీనిని బట్టి ఔషధం కన్నా కౌన్సిలింగ్‌ కీలకం అని వైద్యుల చేపట్టిన అనేక కేసుల ద్వారా స్పష్టం అయ్యింది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు
విశాఖపట్నంజిల్లాలో మాదకద్రవ్యా ల రవాణాను అరికట్టేందుకు పోలీసుశాఖ తీసు కున్న చర్యల ఫలితంగా దాదాపు రెండేళ్లుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయని జిల్లాకలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ, నగర పోలీస్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వార్షిక నేర సమీక్ష సమావేశం డిసెంబర్‌ 27న ఏయూ కన్వెన్షన్‌ సెంటరులో జరిగిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జునతోపాటు నగర పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ.రవిశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌.విశ్వనాథన్‌,జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయి కాంత్‌ వర్మ, డీసీపీలు పి వెంకటరత్నం, కె.ఆనంద్‌ రెడ్డి, కె. శ్రీనివాసరావులు, రెవిన్యూ, జ్యుడీషియల్‌, ఇతర శాఖల అధికారులు హాజర య్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లా డుతూ జిల్లా స్థాయి కమిటీ సభ్యుల సూచనల మేరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యల వలన మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడంలో, నివారించడంలో ప్రజలు, కళాశాల విద్యార్థుల్లో కూడా అవగాహన పెరిగినట్లు చెప్పారు. వి.ఎం. ఆర్‌.డి.ఏ, జి.వి.ఎం.సి.పోలీసు శాఖల సహకా రంతో నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు తగ్గి ప్రమా దాల సంఖ్య కూడా తగ్గినట్లు కలెక్టర్‌ తెలిపారు. దీనికి పోలీసు, ఇతర శాఖల సహకారం కూడా ఉందన్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ. రవిశంకర్‌ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రావ్యల అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి నిఘాతో పాటు పటిష్ట చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నగర పోలీసు అధికారులు మరింత సమర్ధవంతంగా పోలీసింగ్‌ చేయడానికి అవసరమైన విధానాల గురించి పేర్కొన్నారు. తమ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ఈ ఏడాది కాలంలో నగరంలో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, క్రైమ్‌లపై ఆయా అధికారులతో విశ్లేషించిన ఆయన ఉత్తమ పోలీసింగ్‌ కోసం రాబోవు సంవ త్సరంలో తీసుకోవలసిన చర్యలను వివరించారు. సమావేశంలో ఎస్‌.ఇ.బి అడిషనల్‌ ఎస్‌.పి బి.శ్రీనివాసరావు,ఉపరవాణా కమీషనర్‌ జి.సి. రాజరత్నం,ఆర్డీవోలు హుస్సేన్‌ సాహెబ్‌,భాస్కర రెడ్డి, ఎన్‌.హెచ్‌.ఎ.ఐ. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ప్రభాత్‌ రంజన్‌,డీఈవో కె.చంద్రకళ, సమగ్రశిక్ష ఏ.పి.సి శ్రీనివాసరావు, నగర ఏ.డి.సి.పిలు, ఏ.సి.పిలు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

విధి విసిరే చివరి అస్త్రం ముసలితనం

వృద్ధాప్యపు బందిలదొడ్డిలో నువ్వు ఒంటరివి.వృద్ధోపనిషత్‌లోని ప్రతీ పేజీ ‘మసకే’, సాయం తక్కువ. సలహాలు ఎక్కువ. మనిషి ఏడో ఋతువే ‘‘వృద్ధాప్యం’’.కాలధర్మంలో దేహధర్మమే ‘‘వృధ్ధాప్యం’’.మంచం మీద వెల్లకిలా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఈ లోకంలో పుట్టిన ప్రతీవాడు’’వృద్ధోపనిషత్‌’’లో భాగస్వామి కాక తప్పదు.
జీవితం భళ్లున తెల్లవారుతుంది. మెల్లగా చీకటి పడుతుంది. వృద్ధుడికి వెన్నుపై కళ్ళుంటాయన్న ఓ నానుడి వుంది. అంటే వృద్ధాప్యంలో వెనుక చూపే తప్ప ముందు చూపు వుండదు. జీవితంలో మనం ఎన్నో సాధించి ఉండవచ్చు గాక.
మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉండొచ్చుగాక అయితే వృద్ధాప్యంలో దాన్నెవరూ గుర్తించరు. అసలు పట్టించుకోరు. ఓసారి సీనియర్‌ సిటిజన్‌ బడిలోకి అడుగుపెడితే సమాజం మనగురించి పట్టించు కోదు. పాత వస్తువులా ఓపక్కన పడేస్తుంది.‘‘ఆరోజుల్లో నేను’’ అంటూ గత వైభవ చర్విత చర్వణం తప్ప భవిష్యత్‌ ఆలోచన వుండదు.
కాళ్ళు,కీళ్ళు,ఒళ్ళు సడలి,కదల్లేక,మెదల్లేక,దేహాన్ని వదల్లేక, ఏమీ చేయలేక, వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంతాకాదు.వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు జనం. నిజానికి వృద్ధాప్యం శాపమోపాపమో కాదు. అది ప్రకృతి పరమధర్మం. వృద్ధాప్యంరాగానే బయటి వాళ్ళు సరే కుటుంబసభ్యులు కూడా చులకనగాచూస్తారు. నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తలెగరేసి, నిలదీస్తాయి. లెక్కలు అడగటం మొదలెడతాయి. ‘‘ఏమండీ / నాన్నగారూ.’’ అంటూ విధేయంగా వుండే భార్యాపిల్లలు కూడా ధిక్కరించడం మొదలు పెడతారు. వాళ్ళేదో పుడిరగులన్నట్లు లేనిపోని సలహాలు, సూచనలిస్తుంటారు. ఏంమాట్లాడినా,యేం చేసినా వాళ్ళకు నచ్చదు సరికదా ‘చాదస్తం’ అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు. లోకువ గా చూస్తారు. మధ్యతరగతి కుటుంబం అయితే,మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా? లేక చూసీ చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలో మనవాళ్ళే చర్చిస్తూ ఉంటారు.అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెలకువ వస్తుంది. పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచన తోనే తెల్లవారుతుంది. ఆరాత్రి నిద్ర కరువవుతుంది.
చివరి మజిలీ !!
మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలీ వృద్ధాప్యం. మనం కాదనుకున్నా కూడా కోరి వస్తుంది వృధ్ధాప్యం. మనిషి జీవితం ఋతువు లతో ముడిపడి వుంటుంది. వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది. వసంతకాలం మన పుట్టుక అనుకుంటే,శిశిరం వృద్ధాప్యం. వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా,రంగురంగుల పూలతో మురిపిస్తుంది.మనసు ఉల్లాసభరితమవుతుంది. ఇక శిశిరానికొచ్చేసరికి ఆకులు పండి, ఎండి, రాలి, చెట్లు మోడులవుతాయి. అలాగే వృద్ధా ప్యంలో మనిషి దేహం కూడా ఒడలి, ఎండిన మోడవుతుంది. అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసివుంటారు. ఎంత అనుభవంగడిరచి వుంటారో!ఒక్క సారి ఆలోచిస్తే తెలుస్తుంది. అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి.వారి అనుభవాన్ని యువతరం చూపుడువేలుగా తీసుకొని ముందుకు నడవాలి.అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా వుంటుంది.కానీ దురదృష్టం యేమంటే, వృద్ధుల్ని గౌరవించడం అటుంచి అసలు లెక్కేచేయరు. కొందరైతే ముసలాళ్ళను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏమాత్రం వుండదు. ఏతావాతా వృద్ధాప్యం శాపంగా మారుతుంది. యవ్వనంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం. మధ్య వయసులో సంపాదించింది ఖర్చుపెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం. నాకొడుకు అమెరికా లోనో, ఇంకేదో దేశంలో వున్నాడనో, కూతురు ఆస్ట్రేలియా లోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్‌ ప్రిస్టేజి ఫీలవుతాం. అంతా బాగానే వుంటుంది. పిల్లలూ విదేశా ల్లో సెటిలైపోయి బాగుంటారు. మన వృద్ధా ప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు. అప్పుడప్పుడు సీజనల్‌గా వచ్చే సెల్‌ ఫోన్‌ కాల్స్‌ తోనే సరిపెట్టుకోవాలి. తృప్తి పడాలి. కొడుకో, కూతురో,మనవడో గుర్తొచ్చి, వాళ్ళతో మాట్లాడాలని ఫోన్‌ చేస్తే ‘సారీ.! బిజీ.’ అంటూ సమాధాన మొస్తుంది.పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది. అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనాపాలనా చూసుకోవ టానికి కన్నతల్లి ఉంటుంది. వృద్ధాప్యంలో ఎవరూ వుండరు. అదృష్టం బాగుంటే అప్పుడ ప్పుడూ వచ్చి పలకరించే కూతురు తప్పదన్న ట్టు సేవలు చేసే కోడలూ వుండొచ్చు. అనాథా శ్రమంలో అయితే వాళ్ళుకూడా ఉండరు. అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు.కొందరుంటారు అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలూ వుంటారు. అలాంటివాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకొని ఎంతో ప్రేమతో చూసుకుం టారు. బతుకంతా బుద్ధిబలం మీద ఆధార పడ్డ వారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష వుండదేమో? బాగాబతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమై పోవడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి అవస్థనుతలుచుకుంటేనే భయమేస్తుంది. భగవాన్‌.!ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు. ఇందులో నుంచి అందర్నీ తప్పించు తండ్రీ.
వృద్ధాప్యం శాపం కాదు..ఓ వరం.
ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చెయ్యొచ్చు.ఓపిక, సదుపాయముంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపోచ్చు.చిన్న పిల్లలుంటే కొద్ది సేపు వారికి ఇంటరెస్టు ఉన్న టాపిక్స్‌ కబుర్లు చెప్పుకోవచ్చు, ఆడుకో వచ్చు.ఏం చేసినా అఫెక్షన్‌ బ్యాంక్‌లో ఆప్యాయతని క్రెడిట్‌ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్‌ అవుతామో?మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలపాటు వాయిదా వెయ్యొచ్చు. సో..ఇప్పటికే సీనియర్‌ సిటిజన్స్‌ అయిన వారు, భవిష్యత్తులో సీనియర్‌ సిటిజన్స్‌ కాబోయేవారు జీవితాల మీద ఓలుక్కేసి వుంచుకోండి.!?
వృద్ధాప్య సంరక్షణ కోసం కొత్త దృష్టి
భారతదేశం పెరుగుతున్న పట్టణీకరణ మరియు కుటుంబాలు చిన్న యూనిట్లుగా విడిపోవడంతో,వృద్ధుల కోసం గృహాలు పుట్టుకొచ్చాయి. వృద్ధుల సంరక్షణ అనేది వృద్ధాప్య సేవలపై ఆసక్తి ఉన్న నిపుణులు లేదా స్వచ్ఛంద సంస్థలచే నిర్వహించబడు తుంది. అర్బన్‌ మరియు సెమీ అర్బన్‌ ఇండి యాలో ఇటువంటి సంరక్షణ గృహాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ గృహాలు చెల్లించ బడతాయి లేదా ఉచిత లేదా సబ్సిడీ సేవను అందిస్తాయి. సాధారణంగా, ఇటువంటి గృహాలు ప్రభుత్వం నుండి మద్దతుతో ఎన్‌జీఓ లు మతపరమైన లేదా స్వచ్ఛంద సంస్థలు లేదా స్థానిక పరోపకారిచే నిర్వహించబడ తాయి.వారు తమ నివాసి తులకు వసతి, సకాలంలో సంరక్షణ మరియు భద్రతా భావాన్ని అందిస్తారు.ఈ గృహాలకు నియం త్రణ పర్యవేక్షణ లేకపోవడంతో సేవ యొక్క నాణ్యత మారుతూ ఉంటుంది. చాలా గృహా లలో స్పష్టంగా స్థాపించబడిన ప్రామా ణిక ఆపరేటింగ్‌ విధానాలు లేవు మరియు ఆరోగ్య సంరక్షణకు వారి రిఫరల్‌ మార్గాలు అనధికారి కంగా ఉంటాయి. వారి నివాసితుల మానసిక ఆరోగ్యంపై ఈగృహాల ప్రభావంతో సహా అటు వంటి సంస్థలలో జీవన నాణ్యతను అర్థం చేసుకోవడం అత్యవసరం.వృద్ధుల గృహాలకు అధికారిక విధానం భారతదేశానికి ఒక ముఖ్యమైన విధానం మరియు ప్రణాళిక సమస్య. భారతదేశం యొక్క వృద్ధాప్య జనాభా (60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 2050 నాటికి దాదాపు 8% నుండి దాదాపు 20%కి పెరుగుతుందని వరల్డ్‌ పాపులేషన్‌ ఏజింగ్‌ రిపోర్ట్‌ పేర్కొంది.2050 నాటికి, వృద్ధుల శాతం 326 పెరుగు తుంది, 80 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయ స్సు ఉన్న వారి సంఖ్య 700 పెరగ నుంది, దీనితో వారు భారతదేశంలో అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న వయస్సు గల సమూ హంగా మారతారు. ఈ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, మా పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ మరియు సామాజిక ప్రతిస్పందనలు ఈవాస్తవి కతకు అనుగుణంగా ఉండటం చాలా అవసరం. వృద్ధాప్యం అంటే భారమేనా?
జీవన ప్రమాణాలు పెరిగినందుకు సంతోషించాలా? వయోభారాన్ని పెద్దలు మరికొంతకాలం మోయాల్సి వస్తున్నందుకు చింతించాలా? అత్యాధునిక వైద్య పరిజ్ఞా నానికి మురిసిపోవాలా? కార్పొరేట్‌ దవాఖా నల మోతలను తలుచుకునివణికి పోవాలా? ఎలా చూసినా.. వృద్ధాప్యం సంక్షోభంలో పడుతున్న ఛాయలే కనిపిస్తున్నాయి.వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలతో పాటు.. ఆర్థికం నుంచి సామాజికం వరకు అనేకానేక సవాళ్లు చిరాకుపెడుతుంటాయి. వాటన్నిటికి పరిష్కారాలు అసాధ్యం కానేకాదు. ముందు జాగ్రత్తతో, పరిపూర్ణ అవగాహనతో ఆ సంక్షో భాన్ని దాటేయవచ్చు. వి.ఎస్‌.అచ్యుతా నందన్‌! భారతీయ ఫిడెల్‌ క్యాస్ట్రోగా పేరు పొందిన ఈ కమ్యూనిస్టు నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయానికి, ఆయన వయసు 83 ఏండ్లు. లాటరీ మాఫియా, అక్రమ కట్టడాల కూల్చివేత లాంటి విషయాల్లో దూకుడుగా వ్యవహరించారు.97ఏండ్లు వచ్చే వరకూ పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌! చరిష్మా లేకున్నా, మాటల మాంత్రికుడు కాకున్నా వ్యక్తిత్వంతో, మేధస్సు తో అత్యున్నత స్థానానికి చేరుకున్న వ్యక్తి. 82 ఏండ్ల వయసులోనూ దేశాన్ని నడిపించిన మౌని. మన్మోహన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతి పక్ష నేతగా ఉన్న అద్వానీ కూడా ఎనిమిది పదులు దాటినవారే. ఇలాంటి నేతలెందరో, వయసును ఓ సంఖ్యగానే భావించారు. చురుకైన ప్రజా జీవితం గడిపారు. ఆ మాట కొస్తే నేతలే కాదు అన్నా హజారే లాంటి సామాజిక కార్యకర్తలు సైతం రాజీలేని పోరుతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మిలీనియల్‌ తరం మధ్య ఉంటూనే తాము నమ్మిన విలువల కోసం పోరాడుతున్నారు. గుల్జార్‌, శ్యామ్‌ బెనెగల్‌,రోమిలా థాపర్‌..80 ఏండ్లు దాటినా తమవైన రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఓ వ్యక్తిగా కాకుండా, వ్యవస్థకు మార్గ దర్శిగా ఉన్న వృద్ధుల జీవితాలు ఏమేరకు సౌకర్యంగా ఉన్నాయి? అనే ప్రశ్నకు సవాళ్లే జవాబుగా నిలుస్తున్నాయి.
వైద్యం.. ఖరీదైన వ్యవహారం
వృద్ధుల ఆరోగ్య సమస్యల గురించి చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. కణ విభజనలో లోపంవల్ల వయసుతో పాటు అవయవాలూ బలహీనపడుతూ ఉంటాయి. ఇక డయాబెటిస్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు, వార్ధక్యంలోని ఒంటరితనంతో వచ్చే కుంగుబాటు లాంటి సమస్యలు సరేసరి. ఆ వయసులో వీటికి మందులు వాడటమే ఆర్థికంగా పెను భారం. ఇక హాస్పిటల్‌లో చేరాలన్నా, శస్త్రచికిత్స అవసరమైనా..ఆస్తుల మీద ఆశ వదులుకోవాల్సిన పరిస్థితి. కారణం! ఆసుపత్రి ఖర్చులకు అండగా నిలిచే ఆరోగ్య బీమా వీరికి అంత తేలికగా వర్తిం చదు. ఓఅయిదు లక్షల పాలసీ తీసుకో వాలన్నా.. నెలనెలా వేలకు వేలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక అనారో గ్యం ఉన్నవారిని బీమా సంస్థలు అంత త్వరగా కరుణించవు. ఓ ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ టారిఫ్‌ ప్రకారం..రక్తపోటు, మధుమేహం ఉన్న ఎనభై ఏండ్ల వ్యక్తికి పదిలక్షల మొత్తానికి ఆరోగ్య బీమా కావా లంటే వార్షిక ప్రీమియం అక్షరాలా 84వేలు. మరేదో కంపెనీ అందులో సగానికి సగం ప్రీమియం వసూలు చేసినా.. నెలకు దాదాపు నాలుగు వేలు చెల్లించాల్సి ఉంటుంది. దశా బ్దాల క్రితమే రిటైర్‌ అయిపోయి..అప్పటి లెక్కల ప్రకారం పెన్షన్‌ పొందుతున్న వృద్ధు లకు ఇదంతా ఎంత భారం! ఈ సమస్యకు పరిష్కారాలు లేకపోవు. అప్పటికప్పుడు కాకుండా, తక్కువ వయసులోనే పాలసీ తీసుకుంటే.. ప్రీమియంలో రాయితీ వస్తుంది. మిత్రులంతా కలిసి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునే సౌలభ్యం కూడా ఇప్పుడిప్పుడే మొదలవు తున్నది. ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి..ఆస్తిలో, ఆదాయంలో కొంత భాగాన్ని వైద్యానికి దాచి ఉంచడం మరో పద్ధతి. ఇలాంటి సందర్భాల్లో సమా చారమే కీలకంగా మారుతుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మధుమేహం, క్యాన్సర్‌, కుంగుబాటు తదితర సమస్యల మీద కృషి చేస్తూ ఉంటాయి. వాటిని సంప్రదిస్తే తగిన సూచనలు, సలహాలు ఇస్తాయి. ఆ ఎన్జీవోలు నిర్వహించే వైద్య శిబిరాలను కూడా వినియో గించుకోవచ్చు. వృత్తిపరమైన సంఘాల్లో సభ్యు లుగా కొన్ని రాయితీలు దక్కించుకోవచ్చు.ఇక ప్రభుత్వాల తరఫు నుంచి కూడా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన,ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఉన్నాయి. అవి ఎంతవరకు వర్తిస్తా యి అనే అవగాహన కూడా ముఖ్యమే.
టెక్నాలజీ ఆసరా
కంప్యూటర్ల ప్రవేశంతో సాంకేతికత విస్తరిం చింది. కంప్యూటర్‌ వాడని కార్యాలయం.. స్మార్ట్‌ ఫోన్‌ లేని ఇల్లు కనిపించడం లేదు. టెక్నాలజీ ఊసే లేకుండా చదువు, కెరీర్‌ దాటేసిన తరం..హఠాత్తుగా వాటి మీద పట్టు సాధించడం కష్టమే. అందుకు చాలా కార ణాలే ఉన్నాయి.గతంలో ఎన్నడూ పరిచయం లేని క్లిష్టమైన విషయాన్ని నేర్చుకునేందుకు సంకోచించడం.దృష్టి సమస్య కారణంగా.. స్క్రీన్‌ మీది అక్షరాలను చదవలేకపోవడం. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రకారం 23 శాతం మంది వృద్ధులు ఈ ఇబ్బందితోనే ఆన్‌లైన్‌కు దూరంగా ఉంటున్నారు. చేతులు వణకడం లేదా వేళ్లు మొద్దుబారిపోవడంవల్ల టచ్‌ స్క్రీన్‌ ఉపయోగించలేకపోవడం.
-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

సంకల్పంతో అడుగులేద్దాం..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్‌, ఆలోచనలకు అనుగుణంగా ప్రతి పౌరుడూ, అధికారీ, ప్రజాప్రతినిధి, స్వచ్ఛంద సేవకులు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగస్వా మ్యం కావాలని అభివృద్ధి లక్ష్యాలను చేరుకు నేందుకు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను రూపొందించి అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రయోజనాలు అందిస్తోందని పేర్కొన్నారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను విశాఖ వేదికగా గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏయూ కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి భారత దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన తప్పక నిలుస్తుందని.. ఈ కలను నిజం చేసేందుకు అందరం కలిసికట్టుగా పని చేయాల్సి ఉందని, అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా గవర్నర్‌ ఉద్ఘాటించారు. అర్హులైన ప్రతి భారతీయుడికీ ఆర్థిక ప్రయోజనాలు అందించటమే వికసిత్‌ భారత సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లుగా రాబోయే 25 ఏళ్లలో(అమృత కాల) లక్ష్యాలను చేరుకునేందుకు 140 కోట్ల మంది భారతీయులు ప్రణాళికాయుతంగా అడుగులేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అర్హులెవరూ సంక్షేమ, ఆర్థిక ఫలాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదని, వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా ఎక్కడిక్కడే సహాయక కేంద్రాలు పెడుతున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆయు ష్మాన్‌ భారత్‌ యోజన, పీఎం ఆవాస్‌ యోజన, పీఎం పోషణ్‌ అభియాన్‌,దీనద యాల్‌ అంత్యోదయ యోజన,పీఎం ఉజ్వల్‌ యోజన, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన, పీఎం భారతీయ జన్‌ ఔషధి పరియోజన తదితర పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ, ఆర్థిక ఫలాలు అందాయని తన ప్రసంగంలో భాగంగా రాష్ట్ర గవర్నర్‌ గుర్తు చేశారు. పేదలకు మరింత చేరువవటం,వారి అభిప్రా యాలను తెలుసుకోవటం, వారితో మమేకం కావటం, వారి నుంచి నేర్చుకోవటం తదితర ప్రయోజనాలు వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రతో ఒనగూరుతాయని పేర్కొన్నారు. అనంతరం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను ప్రారంభిస్తూ అందరిచేత గవర్నర్‌ ప్రతిజ్ఞ చేయించారు.
విశాఖ నగర అభివృద్ధికి అవిరళ కృషి చేశాం – జీవీఎంసీ కమిషనర్‌ ః కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ విశాఖ నగర అభివృద్ధికి అవిరళ కృషి చేశామని జీవీఎంసీ కమిషనర్‌ ప్రారంభో పాన్యం చేశారు. ఇప్పటి వరకు నగర పరిధి లో అమలు చేసిన పథకాలు, వెచ్చించిన వ్యయం,లబ్దిపొందిన వారి వివరాలను వివరించారు. పీఎం ఆవాస్‌ యోజన ద్వారా 24,192 మంది లబ్ధిపొందారని వారికి బ్యాంకు లింకేజీ ద్వారా రూ.311.46 కోట్ల ఆర్థిక ప్రయోజనాలు అందించామన్నారు. 1.18 లక్షల మందికి ఒన్‌ సెంట్‌ గృహాలు మంజూరు చేశామని తెలిపారు. అమృత్‌ మొదటి విడతలో భాగంగా రూ.124.99 కోట్లు, రెండో విడతలో రూ.70.44 కోట్లు వెచ్చించి వివిధ పనులు చేపట్టామని వివరిం చారు. 315 మంది నిరాశ్రయులు నివసించేం దుకు అనువుగా రూ.50 లక్షలతో ఎన్‌.యు. ఎల్‌.ఎం. పథకంలో భాగంగా ఎనిమిది షెల్టర్‌ హోంలు నిర్మించామని తెలిపారు. పీఎం స్వానిధిలో భాగంగా 23,675 మంది కి రూ.26.21 కోట్ల మేర లబ్దిచేకూర్చా మని పేర్కొన్నారు. 5.22 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు అందజేశామ న్నారు. రూ.1000 కోట్లతో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులు చేపట్టామని వెల్లడిర చారు. పీఎం పోషణ్‌, మిషన్‌ వాత్సల్య ఇతర పథకాల ద్వారా ఎంతోమందికి అండగా నిలిచామని జీవీఎంసీ కమిషనర్‌ ప్రగతి నివేదికను వివరించారు.
పేదలందరికీ ఆర్థిక ఫలాలు అందాలి ః సాల్మన్‌ ఆరోక్య రాజ్‌
పేదలందరికీ ఆర్థిక ఫలాలు అందించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని, వాటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించటం, అవకాశాలను సృష్టించటం కోసమే కేంద్రం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రను చేపడుతోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సాల్మన్‌ ఆరోక్య రాజ్‌ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ యాత్ర ఉద్దేశాలను అర్థం చేసుకొని భాగస్వామ్యం కావాలని, అర్హతల మేరకు పథక ఫలాలు పొందాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చిత్తశుద్ది -నగర మేయర్‌ ః కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు నగర మేయర్‌ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చిత్తశుద్దితో పని చేస్తున్నారని గుర్తు చేశారు. సదుద్దేశంతో తలపెట్టిన వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రంలో ప్రతి ఒక్కరూ భాగస్వా మ్యం కావాలని పిలుపునిచ్చారు.
అధికారులందరం ప్రత్యేక సంకల్పంతో పని చేస్తాం – జాయింట్‌ కలెక్టర్‌ ః భారత ప్రధాన మంత్రి,రాష్ట్ర గవర్నర్‌ పిలుపు మేరకు అధికారులందరం వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రంలో భాగస్వామ్యం అవుతామని, అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక సంకల్పంతో పని చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ కె.ఎస్‌. విశ్వనాథన్‌ పేర్కొన్నారు. కార్యక్రమం లో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టుల గురించి వివరిం చారు. జిల్లా ప్రజలు కూడా వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో మనస్ఫూర్తిగా భాగస్వా మ్యం కావాలని సూచించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందిన పెదజాలారి పేటకు చెందిన దొడ్డి ఆదిలక్ష్మి, మద్దిలపాలెనికి చెందిన సుచిత్ర, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా చికిత్స చేయించుకున్న నానాజీ వారి అభిప్రాయాలను సభలో పంచుకున్నారు. ఏయూ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన సభలో పాల్గొనడానికి ముందు రాష్ట్ర గవర్నర్‌ ప్రాంగణంలో ఏర్పటు చేసిన వివిథ పథకాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. అక్కడ పథకాల వివరాలను పరిశీలించారు. నిర్వాహకుల ద్వారా పలు వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ వద్ద నెలల చిన్నారికి గవర్నర్‌ అన్నప్రాసన చేసి ఆశీర్వదించారు. రెండో విడతలో భాగంగా గాజువాక పరిధిలో 10 వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి ఏయూ కన్వెన్షన్‌ హాలు వద్ద మొక్క నాటి శ్రీకారం చుట్టారు. సభా వేదికపై ఉజ్వల పథకంలో లబ్దిపొందిన పలువురు మహిళలకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. క్రీడాకారులు దాసరి స్రవంతి, కుసుమంచి తేజేశ్‌, వెలగలనేటి కిరణ్‌ కుమార్లను గవర్నర్‌ చేతుల మీదుగా సత్కరిం చారు. కార్యక్రమంలో ఏయూ ఇన్ఛార్జి వీసీ ప్రొ.కె.సమత,స్థానిక కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, అధిక సంఖ్యలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. –జిఎన్‌వి సతీష్‌

75వ గణతంత్ర దినోత్సవ వేడుక

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశమైంది. బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్‌ మౌంట్‌ బాటన్‌ గవర్నర్‌ జనరల్‌ గాను మనకు స్వాతంత్య్రం సిద్దించింది. మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది. దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 1947 ఆగస్టు 28న రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అధ్యక్షునిగా బాబా సాహెబ్‌, అంబేద్కర్‌ బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ (తాత్కాలిక పార్లమెంట్‌)కు సమర్పించగా, దాదాపు రెండేళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి, సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్‌, హిందీ భాషలలో చేతిరాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు.
అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే ‘’భారత గణతంత్ర’’ దినం 1950 జనవరి 26. చారిత్రాత్మకంగా ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం దష్ట్యా జనవరి 26వ తేది గణతంత్ర దినంగా ఎంపిక చేశారు. భారత స్వాతంత్య్రం పోరాటానికి నాయకత్వం వహించిన ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ 1930లో ‘పూర్ణ రాజ్య’ కోసం ప్రకటన చేసి ప్రతి సంవత్సరం జనవరి 26ను పూర్ణ స్వరాజ్య జయంతి దినోత్సవం జరపాలని జాతికి పిలుపునిచ్చింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశమంతటా వాడవాడలా ప్రజలు జాతీయ పతకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకొంటారు.
రాజ్యాంగ సభ 11సార్లు, 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. రాజ్యాంగ రాతప్రతిని తయారుచేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7,635 సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2,473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి, పరిష్కరించింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్‌ 26న సభలో ఆమోదించారు. 1950 జనవరి 24న సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేసారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి, భారత్‌ తాత్కాలిక పార్లమెంటు గా మారింది.1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తరువాత కొత్త పార్లమెంటు ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు రెండు మాత్రమే ఉన్నా యి, హిందీలో ఒక ప్రతి, ఇంగ్లీష్‌లో ఒక ప్రతి ఉన్నాయి, ఆ ప్రతులు పాడవకుండా ఉండేం దుకు హీలియం వాయువు నింపిన బ్రీఫ్‌కేసు లలో పార్లమెంట్‌ భవనంలో భద్రపరిచారు, వాటి నకలును ఫోటో కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది. 1930వ సంవత్సరంలో జనవరి 26వ తేదిని స్వాతంత్య్ర దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్‌ దినోత్సవంగా జరుపుకొనేవారు, అంటే ఆరోజున భారతదేశం పూర్తి స్వేచ్చ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించబడడం ప్రోటోకాల్‌ పరంగా దేశం అందించే అత్యున్నత గౌరవం. కాలక్రమేణా ఈవెంట్‌ యొక్క ఫాబ్రిక్‌ మరియు దాని రన్‌-అప్‌లో భాగంగా మారిన అనేక ఉత్సవ కార్యక్రమాలలో ముఖ్య అతిథి ముందు మరియు కేంద్రంగా ఉంటారు. వారికి రాష్ట్రపతి భవన్‌లో సెరిమోనియల్‌ గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇవ్వబడుతుంది, ఆ తర్వాత సాయం త్రం భారత రాష్ట్రపతిచే రిసెప్షన్‌ ఇవ్వబడుతుంది. వారు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ గౌరవార్థం పుష్పగుచ్ఛం కూడా ఉంచారు. వారి గౌరవార్థం ఒక విందు ఉంది, ప్రధానమంత్రి ఆతిథ్యం ఇచ్చే లంచ్‌ మరియు ఉపరాష్ట్రపతి విదేశాంగ మంత్రి కాల్స్‌. 1999 మరియు 2002 మధ్య ప్రోటోకాల్‌ చీఫ్‌గా పనిచేసిన మాజీ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారి అంబా సిడర్‌ మన్బీర్‌ సింగ్‌, ముఖ్య అతిథి సందర్శన ప్రతీకాత్మకతతో నిండి ఉందని ఇంతకు ముందు ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు ‘‘ఇది ముఖ్య అతిథి భారతదేశ గర్వంలో పాల్గొంటున్నట్లు చిత్రీకరిస్తుంది. ఆనందం, మరియు భారత రాష్ట్రపతి మరియు ముఖ్య అతిథి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరువురి ప్రజల మధ్య స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది’’.ఈ ప్రతీ కవాదం భారతదేశం మరియు దాని ఆహ్వానిత దేశం మధ్య సంబంధాలను ఏర్పరచడానికి మరియు పునరుద్ధరించడానికి ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది, ఎక్కువ రాజకీయ మరియు దౌత్యపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది.
అయితే రిపబ్లిక్‌ డే ముఖ్య అతిథిని ఎలా ఎంపిక చేస్తారు?
ఈవెంట్‌కు దాదాపు ఆరు నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆహ్వానాన్ని పొడిగించే ముందు అన్ని రకాల పరిగణన లను పరిగణనలోకి తీసుకుంటుందని రాయ బారి మన్బీర్‌ సింగ్‌ చెప్పారు.భారతదేశం మరియు సంబంధిత దేశానికి మధ్య ఉన్న సంబంధాల స్వభావం అత్యంత కేంద్ర పరిశీలన. రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించడం భారత దేశం మరియు ఆహ్వానించబడిన దేశం మధ్య స్నేహానికి అంతిమ సంకేతం. భారతదేశం యొక్క రాజకీయ, వాణిజ్య, సైనిక మరియు ఆర్థిక ప్రయోజనాలు ఈ నిర్ణయానికి కీలకమైన చోదకాలు, ఈ అన్ని అంశాలలో ఆహ్వానించ బడిన దేశంతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించు కోవాలని కోరుతోంది.ముఖ్య అతిథి ఎంపికలో చారిత్రాత్మకంగా పాత్ర పోషించిన మరో అంశం 1950ల చివరలో మరియు 1960ల ప్రారంభంలో ప్రారంభమైన నాన్‌-అలైన్డ్‌ మూవ్‌మెంట్‌ తో అనుబంధం.అనేది ప్రచ్ఛన్న యుద్ధం యొక్క గొడవల నుండి దూరంగా ఉండటానికి మరియు వారి దేశ నిర్మాణ ప్రయాణాలలో ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి కొత్తగా వలసరాజ్యం చేయబడిన దేశాల అంతర్జాతీయ రాజకీయ ఉద్యమం. 1950లో జరిగిన కవాతుకు మొదటి ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో, %చీAవీ% యొక్క ఐదుగురు వ్యవస్థాపక సభ్యులలో ఒకరు.
1950లో మొదటి గణతంత్ర వేడుకలు ఎలా జరిగాయో తెలుసా?
జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. రిపబ్లిక్‌ డే రోజున దిల్లీలో ఎలాంటి సందడి ఉంటుందో టీవీల్లో చూస్తున్నారు. పేపర్లలో చదువుతున్నారు. కానీ 68 సంవత్సరాల క్రితం, మొదటి ‘రిపబ్లిక్‌ డే’ ఎలా జరిగిందో మీకు తెలుసా?ఆనాటి వేడుకలను కళ్లారా చూసిన వారు ఆరోజును ఎలా మరువగలరు? ఆనాటి జ్ఞాపకాలను సీనియర్‌ వ్యాసకర్త ఆర్‌.వి.స్మిత్‌ బీబీసీతో పంచుకున్నారు. 1950 జనవరి 26న పురానా ఖిలా ఎదుట ఉన్న బ్రిటిష్‌ స్టేడియంలో రిపబ్లిక్‌ డే పెరేడ్‌ జరిగింది. డా.రాజేంద్ర ప్రసాద్‌ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, సి.రాజగోపాలాచారి అక్కడే ఉన్నారు.ఆ ఉదయం..ఆ స్టేడియంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత పెరేడ్‌ ప్రారంభమయ్యింది. గాల్లోకి పేల్చిన తుపాకీ చప్పుళ్లు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి.చివరి బ్రిటిష్‌ వైస్రాయ్‌ లార్డ్‌ లూయీస్‌ మౌంట్‌బాటన్‌ నుంచి గవర్నర్‌ జనరల్‌ బాధ్యతలను సి.రాజగోపాలాచారి అప్పటికే స్వీకరించి ఉన్నారు. వీదేశీ పాలన పూర్తిగా అంతరిం చిపోయి, అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్‌ డే! స్వతంత్ర దేశంగా పురుడుపోసు కుని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్‌ చేరింది.అప్పటి బ్రిటన్‌ రాజు కింగ్‌ జార్జ్‌-భారత్‌కు శుభా కాంక్షలు తెలుపుతూ, ఇండియాకు కామన్‌వెల్త్‌ దేశాల సభ్యత్వం కొనసాగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అప్పటికే అంతర్థానమైన నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ‘దిల్లీ చలో’ పిలుపునిస్తూ రిపబ్లిక్‌ డే వేడుకల్లో తిరిగి ప్రత్యక్షమవుతా రన్న వార్తలు దావానంలా వ్యాపించాయి. అప్పటికి రెండేళ్ల ముందే మహాత్మ గాంధీ మరణించారు. రిపబ్లిక్‌ వేడుకల్లో ఆయన లేకపోవడం లోటుగా కనిపించింది. ఇప్పుడు జరుపుతున్నంత ఆర్భాటంగా ఆనాటి రిపబ్లిక్‌ డే వేడుకలు జరగలేదు. కానీ అప్పటికి ఆ వేడుకలు కూడా బ్రహ్మాండంగానే జరిగాయని చెప్పుకోవాలి. రిపబ్లిక్‌ వేడుకల్లో నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, సైనిక దళాలు పాల్గొన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాల శకటాలు ఆనాడు లేవు.
ఇప్పటిలా న్యూ దిల్లీ, ఎర్రకోటల మీదుగా పెరేడ్‌ సాగలేదు. ఆనాటి పెరేడ్‌ మొత్తం ఆ స్టేడియానికే పరిమితమైంది. కానీ 1951 నుంచి పెరేడ్‌ ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. వేడుకల్లో భాగంగా యుద్ధ విమా నాల విన్యాసాలు జరిగాయి. కానీ ఆ విన్యా సాల్లో జెట్‌ విమానాలు, థండర్‌బోల్ట్‌ విమానాలు లేవు. అప్పటికి వినియోగంలో ఉన్న డకోటా, స్పిట్‌ ఫైర్స్‌ మాత్రమే విన్యాసాల్లో పాల్గొన్నాయి.
మొట్ట మొదటి భారత సైన్యాధిపతి కరియప్ప. ఈయన బ్రిటిష్‌ ప్రభుత్వంలో కూడా ఎంతో గౌరవం, కీర్తి సంపాదించిన వ్యక్తి.
‘’ఈరోజు నాకు, మీకు, మనతో పాటు మన కుక్కలకు కూడా స్వాతంత్య్రం వచ్చింది’’ అంటూ సైనికాధిపతి కరియప్ప బారత సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కరియప్ప ప్రసంగం. అక్కడివారిలో ఆనందం, ఉత్సా హాన్ని నింపాయి. ఇప్పటికీ నాకు గుర్తే. రిపబ్లిక్‌ డే సందర్భంగా జామా మసీద్‌ సమీపంలోని ఓ హోటల్‌ యజమాని అందరికీ స్వీట్లు పంచాడు. ఆ స్వీట్ల రుచి నాకింకా గుర్తుంది. అవి మహాద్భుతంగా ఉన్నాయి.చాందినీ చౌక్‌ను అందంగా ముస్తాబు చేశారు. వీధుల నిండా ప్రజలు. వారి చేతుల్లో చిన్నచిన్న జాతీయ జెండాలు. వారంతా చాలా ఉత్సా హంగా కనిపించారు. ఎక్కడచూసినా బంతిపూల హారాలు. పూల వ్యాపారులు ఆ ప్రాంతమంతా రోజా పూలను చల్లారు. ఒకరికొకరు పువ్వులు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
ఆగస్ట్‌ 15న పురుడుపోసుకున్న స్వతంత్ర భారతం.. 1950, జనవరి 26కు ఓ రూపం తీసుకుందన్న భావన వారిలో స్పష్టంగా కనిపించింది. దిల్లీలో ప్రధాన కూడలి ‘కన్నాట్‌ ప్లేస్‌’ను చాలా అందంగా ముస్తాబు చేశారు. నగరంలోని కొన్ని హోటళ్లు, ప్రధాన దుకాణాలు తమ అమ్మకాలపై డిస్కౌంట్లు కూడా ప్రకటించాయి.ఇక ఆ రాత్రి చూడాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలన్నీ దీప కాంతులతో వెలిగిపోయాయి. రాష్ట్రపతి భవన్‌ను కొత్త పెళ్లికూతురిలా ముస్తాబు చేశారు.ఎర్రకోట, పార్లమెంట్‌ భవనం, ఆల్‌ ఇండియా రేడియో కార్యాలయం, ఇండియా గేట్‌, అన్నిటి వైభ వాన్ని ఆరోజు చూడాలి. ఆ అందమే వేరు! మరోవైపు, క్లబ్బులు, రెస్టారెంట్లలో పాటలు పాడుతూ..నృత్యాలు చేస్తూ.. ఒకటే కోలాహలం, సంబరం.. ఎక్కడ చూసినా పండగ వాతావరణమే!
ఆ కాలంలో జీన్స్‌ ప్యాంట్లు లేవు. కానీ, పాశ్చాత్య దుస్తుల్లో కనిపించే అందమైన యువతులు క్లబ్బులు, రెస్టారెంట్లలో తళుక్కుమన్నారు. అమ్మాయిల విషయంలో యువకుల మధ్య ఒకట్రెండు చిన్నచిన్న గొడవలూ జరిగాయి. ఎక్కడచూసినా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందు గురించే చర్చలు నడిచాయి.జవహర్‌లాల్‌ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరాగాంధీ, రాజేంద్ర ప్రసాద్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, మౌలానా ఆజాద్‌ మరెందరో ఆ విందులో పాల్గొన్నారు.చివరగా ఆ రాత్రి జరిగిన ముషాయిరాలు, కవిసమ్మేళనాలతో తొలి రిపబ్లిక్‌ డే వేడుకలు అలా ముగిశాయి..
(బీబీసీ సౌజన్యంతో..)-జి.ఎన్‌.వి.సతీష్‌

ఉద్దానం ప్రజల కల..నెరవేరిన వేళ..

ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని సము ద్రపు ఒడ్డునున్న కళింగపట్నంలో మహిళల ఆవేదన. తరచుగా మీడియావాళ్లు ఈ గ్రామా న్ని సందర్శిస్తుండటంతో వారి స్పందన ఇది.
ఉద్దానం అంటే ఉద్యానవనం!
పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రాంతం ఒక వైపున సముద్ర తీరం, మరో పక్క కొబ్బరి, జీడి మామిడి, పనస, మామిడి తోటలు, మరో వైపున నాగావళి, వంశధార, మహేంద్ర తనయ వంటి జీవ నదులు పారుతూ నిత్యం సస్యశ్యామలంగా ఉండ టంతో ఈ ప్రాంతా నికి ఉద్దానం అనే పేరొచ్చింది.అయితే ఆకుపచ్చని ఉద్దానం, ఇప్పుడు కిడ్నీ వ్యాధు లతో వణికిపోతోంది. అంతుపట్టని సమస్య లతో ఈ ప్రాంత ప్రజలు అల్లాడు తున్నారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున ఉన్న శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపు కొత్తూరు, పలాస, మందస మండ లాలను కలిపి ఉద్దానం ప్రాంతం గా పిలుస్తారు.ఈ ప్రాంతంలోని సోంపేట, కవిటి, కుసుంపురం, కుత్తుమ, కళింగ పట్నం సహా ఏ గ్రామానికి వెళ్లినా, ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధులతో బాధపడుతు న్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకో వచ్చు.ప్రభుత్వ అంచనాల ప్రకారం గత రెండు దశాబ్దాలలో ఇప్పటి వరకు 15,623 మంది ఇలా తీవ్రమైన కిడ్నీ జబ్బుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13, 093 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు.
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం: సీఎం జగన్‌
‘ఉద్దానం అంటే ఉద్యానాలవనం అటువంటి ఈ పచ్చని ప్రాంతాన్ని కిడ్నీ మహమ్మారి రూపంలో ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది.ఈ పరిస్థితిని నా పాదయాత్రలో కళ్లారా చూశా.‘‘నేను చూశాను. నేను విన్నాను. నేను ఉన్నాను’’ అన్న మాట నాకు గుర్తుంది. ఇచ్చిన మాట ప్రకారం 200 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని చెప్పి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించినందుకు గర్వపడు తున్నా.’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఉద్దా నం కిడ్నీ సమస్య పరిష్కారం కోసం రూ.85 కోట్లతో నిర్మించిన డా. వైఎ స్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, రూ.700 కోట్ల ఖర్చుతో నిర్మించిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టను సీఎం జగన్‌ ప్రారంభించారు. సీఎం జగన్‌ మాట్లా డుతూ ఉద్దానం ప్రాంతంలో ఈ సమ స్య ఉందని తెలిసినా గతంలో ఏ పాల కుడూ ఆలోచన చేయని సమస్యను రూ.785 కోట్లు ఖర్చు చేసి పరిష్కరిం చామని పేర్కొన్నారు.
కిడ్నీ బాధితులకు నిరంతర వైద్యసహాయం
ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి మెరుగైన వైద్యం అందుతోం దని సీఎం జగన్‌ గుర్తు చేశారు. వైఎస్సార్‌ కిడ్సీ రీసెర్చ్‌ సెంటర్లో ఫిబ్రవరి నాటికి కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ కూడా చేసి దేశానికే తలమానికంగా నిలుస్తుందన్నారు. రీసెర్చ్‌ సెంటర్లో కిడ్నీ వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్‌ కోసం అన్ని విభాగాలతో పాటు డయాలసిస్‌ సెంటర్లు, ఆపరేషన్‌ థియేటర్లు మెరుగైన ప్రమాణాలతో ఏర్పాటు చేశామని, ఇక మీ ఆరోగ్య అవసరాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు. ఈ ఆసుపత్రిలో స్పెషలిస్ట్‌ డాక్టర్లు మొదలు ఇతర సిబ్బంది 375 మంది ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిం చనున్నట్లు తెలిపారు. జిల్లాలోని కిడ్నీ వ్యాధు లను గుర్తించేందుకు ఏడు మండలాల్లో స్క్రీనింగ్‌ చేయిస్తామని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అవసరమైన 37 రకాల ఔషదాలను స్థానికంగా ఉన్న అన్ని పీహెచ్‌ సీల మొదలు, రీసెర్చ్‌ సెంటర్‌ వరకు అందు బాటులో ఉంచి ప్రతి పేదవాడికి ఉచితంగా ఇంటి వద్దకే అందిస్తామని పేర్కొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మందుల అందజేత కొనసాగుతుందంటూ భరోసా ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 2,500గా ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్‌ ను ఏకంగా రూ. 10,000 వేలకు పెంచామన్నారు. గత ప్రభుత్వంలో కిడ్నీ పేషెంట్ల కింద పెన్షన్‌ అందుకున్న వాళ్లు 3,076 మంది ఉండగా వారి కోసం గత ప్రభుత్వం నెలకు కేవలం రూ.76లక్షలు ఖర్చు చేసేవాళ్లని, మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా 13,140 మందిని పెన్షన్ల జాబితాలో చేర్చా మని కేవలం పెన్షన్ల కోసమే నెలకు రూ.12. 54 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రజలకు వివరించారు. ఉద్ధానంలో అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో మన ప్రభు త్వం కేంద్ర సంస్థలు ఐసీఎంఆర్‌తో కలిసి సమగ్ర ఆధ్యయనం చేసిందని వివరించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఎక్కువ ఉన్న వారిని గుర్తించి మెరుగైన ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. హార్వర్డ్‌, నార్త్‌ కరోలినా యూనివర్సిటీతో మన ప్రభుత్వం ఈ అంశంపై కలిసి పనిచేసిందన్నారు. ఇలాంటి సమస్యే ఉన్న మార్కాపురం ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ స్థాపించి కిడ్నీ వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం నెఫ్రాలజీ, యూరాలజీ విభాగా లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నా కమిట్మెంట్‌ ఇదీ..
ఉద్దానం కిడ్నీ సమస్య శాశ్విత పరిష్కారం కోసం ఏ నాయకుడూ ఊహించని విధంగా రూ.700 కోట్లు ఖర్చు చేసి హీరమండలం రిజర్వాయర్‌ నుంచి 130 కిలోమీటర్ల మేర పైప్‌ లైన్‌ నిర్మించామని సీఎం జగన్‌ అన్నారు. ఇదీ తమకున్న కమిట్మెంట్‌ అని పేర్కొన్నారు. 7 మండలాల్లోని 807 గ్రామాలకు సురక్షిత నీరు అందించే వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్టు ద్వారా సురక్షిత నీరు అందిస్తున్నట్లు తెలిపారు. రెండో దశ కింద ప్రాజెక్టు ద్వారా మరిన్ని గ్రామాలకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో కూడా ఉద్దానం సమస్య ఉండేదని. కానీ సమస్య పరిష్కారం మాత్రం ఈ ప్రభుత్వంలో జరిగిందని గుర్తుంచుకోవాలని విజ్ణప్తి చేశారు. చంద్ర బాబుకు పేదల ప్రాణాలంటే లెక్కేలేదని విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లివ్వలేదన్నారు.
పొత్తులు, ఎత్తులు, చిత్తులు, కుయుక్తులు మాత్రమే..14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్ర బాబు తన వల్ల ప్రజలకు జరిగిన మంచి ఇది అని చెప్పుకునే ఒక్క పథకమైనా.. పనైనా ఉందా అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. ఇలాంటి చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి పొత్తుల మీద, ఎత్తుల మీద, చిత్తుల మీద, కుయుక్తుల మీద ఆధారపడతారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు కలిసి పొత్తు లతో సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఉద్దానం కిడ్నీ సమస్య ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. విశాఖను పరిపాలనా రాజ ధానిగా చేస్తామని మీ బిడ్డ అంటూ ప్రతి పక్షంలో ఉంటూనే అడ్డుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో ఓబిల్డింగ్‌ కట్టినా, అభివృద్ధి చేసినా.. సీఎంగా ఇక్కడే వచ్చి ఉంటానన్నా మెడికల్‌ కాలేజీలు, పోర్టులు,ఎయిర్‌ పోర్టులు కడతామంటే ఏడుస్తారని విమర్శించారు. పక్క రాష్ట్ర నాన్‌ లోకల్స్‌ మన సీఎం ఏం చేయాలి, మన రాజధాని ఎక్కడ ఉండాలో ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.
కదిలిస్తే కన్నీళ్లే…
‘’అయిదేళ్లుగా నేను,నా భర్త సీతారాం కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నాం. ఏడాది క్రితం ఆ జబ్బు ముదిరి ఆయన మాకు దూరమయ్యాడు. ఇపుడు నా కొడుకే కూలీ పనులు చేస్తూ నన్ను పోషిస్తున్నాడు. మందులకు నెలకు రూ. రెండు వేలకు పైగా ఖర్చవుతుంది. వాటికోసం అప్పులు చేయాల్సి వస్తోంది’’ అంటూ దీనంగా చెప్పారు కుసుంపురం గ్రామానికి చెందిన బత్తిన మాలక్ష్మి.
‘’ఏడాది నుంచి ఈ రోగంతో కుదేలయిపోతున్నాను. కొడుకు తప్ప మాకు ఏ దిక్కూ లేదు. సముద్రంపై వేటకు వెళ్లి నాలుగు డబ్బులు తెచ్చేవాడు. ఈ మధ్య యాక్సిడెంట్‌లో చేయి కోల్పోయి వాడు మూలనపడ్డాడు. ఇపుడు మందులు కొనుక్కునే స్తోమత లేదు, ఎవరూ ఆదుకునే దిక్కులేదు’’ అంటూ కళింగపట్నంకు చెందిన శివకోటి దానమ్మ విలపించారు. ఇదే గ్రామానికి చెందిన ఈగ కోమలమ్మ మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కూలీనాలీ చేసుకొని బతుకుతూ, సగం ఆదాయం డాక్టర్ల చుట్టూ తిరగడానికే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
డాక్టర్లు బలవర్ధకమైన ఆహారం, క్రమం తప్పకుండా మందులు వాడమన్నారు. కానీ ఆర్థిక స్తోమతలేక డబ్బులున్నపుడే మందులు వాడుతున్నారు కోమలమ్మ. సోంపేటలో కర్రి గణపతి, కాసమ్మ, కవిటిలో అర్జి శశి, తెప్పల తులసమ్మ, కంచిలిలో నారాయణ…ఇలా ఎవరిని కదిలించినా హృదయాన్ని పిండేసే దీన గాథలే వినిపిస్తాయి.పేదరికం కారణంగా కొందరు ఈ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ గుర్తించిన ప్పటికీ నాటు వైద్యుల వద్దకు వెళ్లి, తాత్కాలి కంగా నొప్పి నివారణకు మందులు వేసుకో వడంతో ఈ జబ్బు మరింత తీవ్రమైపో తోంది.ఆ సమస్య ఏమిటో.. అది ఎందు కొచ్చిందో వీళ్లకే కాదు, పరిశోధకులకు, ప్రభుత్వాలకు కూడా అంతుపట్టడం లేదు.
సామాజిక కోణం
ఉద్దానం ప్రాంతంలో సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేవు. డయాలసిస్‌ చేయించుకునే రోగికి మరొకరు తోడు ఉం డాలి. రోజుకూలీతో పొట్ట నింపుకునే పేదలకి అది పెద్ద భారమే. ఈ కారణంగా డయా లసిస్‌ వాయిదా వేసుకునేవారు, మందుల ఖర్చు భరించలేక క్రమ పద్ధతిలో వాడనివారు అనేకమంది ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో తక్షణం వ్యాధి లక్షణాలు తగ్గితే చాలు అనుకుంటారు. పైపెచ్చు నాటు వైద్యులు మిడిమిడి జ్ఞానంతో ఇచ్చే మందులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ సంబంధాలపై ‘ఉద్దానం సమస్య’ ప్రభావం తీవ్రంగా ఉంది.‘’కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చాక మా ప్రాంతపు వారితో చుట్టరికం కలుపుకోవడానికి వెనకాడుతున్నారు. కొబ్బరి, మామిడి పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు’’ అని కుత్తుమ(కంచిలి మండలం) రైతులు చెప్పారు.
ఒక్క గ్రామంలో 500 రోగులు
కవిటి మండలం, కుసుంపురం గ్రామం కొబ్బరి, జీడిమామిడి తోటలతో పచ్చగా ఉం టుంది. కానీ ఇక్కడి మనుషుల్లో ‘జీవం’ కనిపించదు. ఈ గ్రామంలోకి అడుగు పెట్టిన మమ్మల్ని కిడ్నీబాధితులంతా చుట్టుముట్టారు.
‘’మా ఊరి జనాభా 4 వేలు. ఐదొందలకు పైగా కిడ్నీ రోగులున్నారు. అపుడపుడు అధికారులు వచ్చి మా వివరాలు అడిగి పోతుంటారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. అందరం ఉపాధి హామీ పనుల మీద ఆధారపడి బతుకుతున్నాం. కిడ్నీ సమస్యలున్న మాకు ఉపాధి కూలీ రెట్టింపు చేస్తే, మందులు కొనుక్కొని ప్రాణాలు నిలుపు కుంటాం’’ అని అన్నారు డ్వాక్రా పొదుపు సంఘం నాయకురాలు సిందుల ఇంధిర.
సమస్యను గుర్తించిన డాక్టర్లు వీళ్లే
ఇక్కడి ప్రజలు విచిత్రమైన కిడ్నీ వ్యాధికి గురవుతున్నారని సోంపేటలోని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ వై. కృష్ణమూర్తి, డాక్డర్‌ శివాజీ 1993లోనే అనుమానం వ్యక్తం చేశారు. ‘’సాధారణంగా వచ్చే కిడ్నీ వ్యాధికి భిన్నంగా ఇక్కడి ప్రజలకు ఈ వ్యాధులు ఉండడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా బీపీ, షుగర్‌ వ్యాధులు ఉన్నవారికి కిడ్నీ వ్యాధి వస్తుంది. కానీ ఈ ప్రాంతంలో ఆ రెండూ లేనివారికి కూడా రావడం అంతుపట్టని విషయం. రోజూ మా ఆసుపత్రికి ఆరవై మందికి పైగా పేషెంట్లు వస్తారు. వారిలో కనీసం 3 నుంచి ఐదుగురు వరకు కిడ్నీ రోగులు ఉంటారు’’ అని డాక్టర్‌ కృష్ణ మూర్తి చెప్పారు. ఈ ప్రాంత ప్రజల్లో 37% మందికి కిడ్నీ వ్యాధి ఉందని ఇండి యన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఇప్పుడా సంఖ్య 40 శాతానికి చేరిందని ఆయన వివరించారు. సోంపేట పవర్‌ ప్లాంట్‌ వ్యతిరేక ఉద్యమంలో డాక్టర్‌ కృష్ణ మూర్తి కీలక పాత్ర వహించారు.
ఏడు మండలాలకు రెండే డయాలసిస్‌ కేంద్రాలు!
ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఈ ప్రత్యేక వ్యాధికి ‘క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌’ అని పేరు పెట్టింది.‘’ఉద్దానం నెఫ్రోపతి’’ అని కూడా దీనిని పిలుస్తున్నారు.ప్రస్తుతం ఉద్దానం ప్రాంతంలో 13,093 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండగా..కొత్తగా రోజుకు 9 నుంచి 12 కేసులు నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 5 ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో ఉద్దానం ప్రాంతం మొత్తంలో.. అంటే 7 మండలాలకు కలిపి 2 కేంద్రాలు ఉన్నాయి.కిడ్నీ వ్యాధి స్క్రీనింగ్‌ కేంద్రాలు రెండు ఉన్నాయి. 361 మంది కిడ్నీ బాధితులు ప్రభుత్వం నుంచి పెన్షన్‌ అందుకుంటున్నారు. ‘’మేం 2017లో లక్ష మందికి పరీక్షలు చేయగా 13,900 మందికి కిడ్నీ వ్యాధులున్నట్టు తేలింది. ప్రభుత్వ అసు పత్రుల్లో డయాల్సిస్‌ చేయించుకునే వారికి మాత్రమే రూ. 2,500 పెన్షన్‌ ఇస్తున్నాం. ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాలకు కలిపి రెండు డయాల్సిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఒకటి పలాసలో, రెండోది సోం పేటలో ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెండు, టెక్కలిలో మరోటి ఉన్నా యి. ఉద్దానం ప్రాంతానికి సమీపంలోనే టెక్కలి ఉంది. కాబట్టి బాధితులు అక్కడికి కూడా వెళ్లి డయాలసిస్‌ చేయించుకోవచ్చు’’ అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డా.ఎస్‌.తిరు పతిరావు చెప్పారు.
పుష్కరాలకు ఖర్చు చేస్తారు కానీ ఇది పట్టదా?
‘’ఇరవై ఏళ్లుగా ఒకే ప్రాంతంలో విస్తరించిన కిడ్నీవ్యాధి, కేవలం వైద్యరంగ సమస్య మాత్రమే కాదు, ఇది ఆందోళనకరమైన సామాజిక సమస్య. పుష్కరాలకూ, ఇతర కార్యక్రమాలకూ కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒలింపిక్‌ విజేతలకు కోట్ల రూపాయలు నజరానాలు ఇస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన సమస్య పట్ల మాత్రం ఎందుకు ఇంత అలక్ష్యం?’’ అని ప్రశ్నిస్తున్నారు తిరుపతిలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసి యేషన్‌ అధ్యక్షురాలు,డాక్టర్‌ పి. కృష్ణ ప్రశాంతి.‘’న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, చంఢీగడ్‌ లోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన అండ్‌ రీసెర్చ్‌ సంస్థల్లో 40సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధుల మీద విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సంస్థల సేవలను ఉద్దానంలో వినియోగించు కోవచ్చు’’ అని కృష్ణ ప్రశాంతి అన్నారు.
మొదలైన పరిశోధన
కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు విశాఖ విమ్స్‌ ఆసుపత్రిలో జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఆధ్వ ర్యంలో పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. కిడ్నీ సమస్యలు పెరుగుదలకు కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, చుట్టు పక్కల ప్రాంతాలకు, ఉద్దానం ప్రాంతా నికి గల తేడాలను పరిశీలిస్తామని పరిశోధ కులు అంటున్నారు.ముఖ్యంగా ఫ్లోరైడ్‌, జీడితోటలకు ఉపయోగించే రసాయనాలు సమీపంలోని నీటిలోకి చేరడం తదితర కారణాలతో కిడ్నీ వ్యాధుల సంఖ్య పెరుగుతు న్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు.
పరిష్కార మార్గాలు
ఈ సమస్య పరిష్కారానికి వైద్యులు, పరిశోధ కులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్ధానిక సర్పంచ్‌లు, పాత్రికేయులు తమ సూచనలను పంచుకున్నారు. అవి..మైక్రోబయాలజీ, పాథా లజీ, బయోకెమిస్టీ, పీడియాట్రిక్స్‌, గైనకాలజీ, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల పీజీ విద్యార్ధుల సేవలను ఆ ప్రాంతంలో వినియోగించు కోవాలి.వంశధార, మహేంద్రతనయ నదీ జలాలను పైపు లైన్ల ద్వారా ఉద్దానం ప్రాంత వాసులకు అందించాలి. రసాయనాలు లేని సేంద్రీయ పంటలను రైతులు పండిరచాలి. జంతువులలో కూడా కిడ్నీ సమస్యలు వస్తున్నాయా?, ఆవులు, గేదెలు, వాటి పాలద్వారా సంక్రమిస్తున్న రోగాల గురించీ పరిశోధనలు చేయాలి. కోళ్ళు, చేపలు, మేకలు వాటి మాంసం మీద పరిశోధనలు జరగాలి. ఉద్దానం ప్రాంతంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ డయాలసిస్‌ యంత్రాలు ఏర్పాటు చేసి, నిపుణులను నియమించాలి. కోటి రూపాయల ఖర్చుతో పది డయాలసిస్‌ యంత్రాలు ఏర్పాటు చేయవచ్చని వైద్యులంటున్నారు.పౌష్టికాహార నిపుణుల పర్యవేక్షణలో ఉద్దానంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మధ్యాహ్న భోజన పథకం కింద ప్రత్యేక ఆహారం అందే ఏర్పాటు చేయాలి.కిడ్నీ రోగులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వాలి.
-(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

కాలుష్యకోరల్లో ఢల్లీి..

ఇప్పటికే చుట్టుముట్టిన వాయు కాలుష్యం, ఇంతలోనే దీపావళి పండుగ, సుప్రీంకోర్టు వద్దని చెప్పిన వినకుండా స్థానికులు భారీ స్థాయిలో పటాసులు పేల్చారు. ఇంకేముంది ఢల్లీి వ్యాప్తంగా తీవ్ర వాయు కాలుష్యం అలుముకుంది. పండుగ మరుసటి రోజు, మంగళవారం ఉదయం కాలుష్యం తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మంగళవారం ఉదయమైతే విషపూరిత పొగమంచు దేశ రాజధానిని పూర్తిగా కమ్మేసింది. దీపావళి రోజున సుప్రీంకోర్టు విధించిన పటాకుల నిషేధాన్ని నివాసితులు ఉల్లంఘించిన రెండు రోజుల తర్వాత ఢల్లీిలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (%జజదీ%) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిని విషపూరి పొగమంచు చుట్టుముట్టింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక తీవ్రమైన కేటగిరీగా నమోదైంది. చాలా చోట్ల ఏక్యూఐ 400 దాటింది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో బవానాలో గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) 434, ద్వారకా సెక్టార్‌ 8లో 404, ఐటీఓలో 430, ముండ్కాలో 418, నరేలాలో 418, ఓఖ్లాలో 402, రోహిణి, ఆర్కేపురంలలో 417గా నమోదైంది.
ఢల్లీిలో పెరిగిన విషవాయువుల తీవ్రత
ఢల్లీిని కాలుష్యం వెంటాడుతూనే ఉంది. అసలే చలికాలం దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీనికి తోడూ చుట్టు పక్కల నుంచి వస్తున్న విషవాయువులు ఢల్లీి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ నిపుణులు. మన్నటి వరకూ వాయువుల వేగంతో పాటూ గాలి దిశ మార్పుతో కొంత వరకూ ఉపశ మనం లభించింది. దీంతో కాలుష్యతీవ్రత కొంత మేర తగ్గిందని భావించారు స్థానికులు. దీంతో అధికారులు కొన్నింటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.
ప్రస్తుతం గాలిలో ఉధృతి ఏర్పడి అది కాలుష్యానికి కారణం అవుతోంది. తద్వారా విజిబులిటీ సమస్య తీవ్రంగా మారింది. మంగళవారం ఢల్లీిలోని ఐదు ప్రాంతాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 400కు పైగా నమోదైంది. మధ్యాహ్నం 2గంటలకే రహదారులు కనిపించకుండా మసగగా మారిపోయాయి. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో సూర్యరశ్మి బలహీనంగా మారింది. సాధారణంగా 2వేల మీటర్ల వరకూ కనిపించే రహదారి.. ప్రస్తుతం 1000 నుంచి 1500 మీటర్ల పరిధిలోనే కనిపిస్తోంది. దీనిపై స్పందించిన సెంట్రల్‌ పొల్యూషన్‌ బోర్డు కొన్ని కీలక అంశాలను వెల్లడిరచింది. సాధారణం కంటే ఒకడిగ్రీ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైనట్లు ప్రకటించింది. నిన్న దేశ రాజధాని ఢల్లీిలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 11.5గా నమోదైనట్లు వెల్లడిర చింది. గాలిలో తేమ భారీగా పడిపోయింది. రెండు రోజుల క్రితం 95శాతం ఉండగా నిన్న 56శాతం ఉన్నట్లు పేర్కొంది. చుట్టు పక్కల నెలకొన్న పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం, దట్టమైన పొగ కారణంగా మరిన్ని రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని సూచిస్తు న్నారు. అప్పుడప్పుడూ వేడి నీళ్లతో ఆవిరి పట్టుకొవడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు తలెత్తకుండా కాపాడు కోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఎన్సీఆర్‌లో చలి పంజా..
దేశ రాజధాని ఢల్లీి సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. పలు రాష్ట్రాల్లో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల నుంచి ఢల్లీిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపో తున్నాయి. చలిగాలులు మరో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సైతం ఢల్లీిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువగా 15.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తగ్గి.. 5 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 16.2, కనిష్ట ఉష్ణోగ్రత 5.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రెండు మూడు రోజుల పాటు చలిగాలులు, చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.పొగ మంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జమ్మూ కశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతున్నాయి. పర్వతాల నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాల ప్రజలు చలితో వణుకుతున్నారు. పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌లో ఢల్లీిలోని చాలా ప్రాంతాలు, ఉత్తరాఖండ్‌, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌, రాజ స్థాన్‌లోని చాలా చోట్ల చలితీవ్రత పెరిగింది. ఢల్లీి నగర శివారుల్లోని ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్‌ 62,సెక్టార్‌ 1,సెక్టార్‌ 116వద్దగాలి నాణ్యత పరిస్థితి తీవ్రంగా ఉన్న ట్లు అధికారులు వ్లెడిరచారు. అనవసరమైన నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.‘శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారి సంఖ్య గణనీ యంగా పెరిగింది.చాలా మంది దగ్గు, జలు బు, కళ్లనుంచి నీరు కారడం,కళ్లు మండడం వంటి సమస్యలతో బాధపడతున్నారు’ అని ఓ వైద్యుడు చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజధానిలో అయిదు రోజుల పాటు నిర్మాణ కార్యక లాపాలు చేపట్టరాదని ఢల్లీి పర్యావ రణ మంత్రి గోపాల్‌ రాయ్‌ ఆదేశాలు జారీ చేశారు. వాహనాలనుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలో రెడ్‌ సిగ్నల్‌ పడగానే వాహనాల ఇంజిన్‌ను అపేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే కాలుష్యాన్ని వెదజల్లే పాతకాలపు వాహనాలు, కమర్షియల్‌ వాహ నాలపైనా నిషేధం విధించారు. దీంతో పాటు గా వెయ్యి సిఎన్‌జి బస్పులను ప్రవేశ పెట్టేం దుకు యత్నాలు చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు ఇదివరకే రెండు రోజులు సెలవులు ప్రకటిం చారు.అయితే వాయుకాలుష్యం బెడద ఒక్క ఢల్లీి నగరానికి పరిమితం కాలేదు. పొరుగు రాష్ట్రాలయిన హర్యానా, రాజస్థాన్‌, యుపిల లోని పలు నగరాల్లో పరిస్థితి కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఢల్లీి వాసులు
దేశ రాజధానిని మంచు దుప్పటి కప్పేసింది. ఢల్లీిలో దట్టమైన పొగమంచు అలుముకుంది. పట్టపగలే రహదారులన్నీ రాత్రిని తలపిస్తుం డటంతో లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు వాహనదారులు.దేశ రాజధానిలో 7డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఒకవైపు పొగమంచు..మరోవైపు కాలుష్యంతో ఢల్లీి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
-(బి.సూర్య ప్రకాష్‌ యాదవ్‌)

గిరిజన సంస్కృతి వాచకం…

ఒకప్పుడు మౌఖిక సాహిత్యంకే పరిమితమైన… మన ఆదివాసీ సాహిత్యం… అక్షరాస్యతలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా .. వివిధ ప్రక్రియలలో పుస్తకాల రూపంలో… వస్తూ ప్రామాణికతకు చోటుచేసు కుం టుంది, ఈ గిరిజన సాహిత్యంలోని… పుస్తకాల వివరాలను ‘‘గవాక్షం’’ శీర్షికన… ‘‘థింసా పాఠకుల’’ కోసం ప్రతి నెల ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న పరిశోధక రచయిత డా. అమ్మిన శ్రీనివాసరాజు గారు ప్రముఖ రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ కలం నుంచి జాలువారిన ‘‘ గిరిజనులు సంస్కృతి పగ్రతికి సవాళు ’’ అనే పుస్తకంపై సమీక్షడా. అమ్మిన శ్రీనివాసరాజు
మన దేశ సంస్కృతి సారథి స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా వెలువరించబడ్డ ‘‘ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనులు సంస్కృతి ప్రగతికి సవాళ్లు….’’ అనే పుస్తకాన్ని ప్రముఖ గిరిజన పరిశోధకు రచయిత డా: పిరాట్ల శివరామకృష్ణ రాశారు. గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాల గురించి ఇప్పటి వరకు చాలా పుస్తకాలు విలువడ్డాయి కానీ వాటి అన్నిటికన్నా భిన్నమైనది సంక్షిప్తంగా సమగ్ర సమాచారాన్ని అందించింది ఈ పుస్తకం,70 పేజీలుగల ఈ రచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని గిరిజన ప్రాంతాలను స్పృశిస్తూ చారిత్రక, భౌగోళిక, సంస్కృతి, సాంప్రదాయాలను కూలంకషంగా అందిం చింది.
రచయిత శివరామకృష్ణ తెలుగు ప్రాంతా లలోని గిరిజన ఆవాసాలు విస్తృతంగా పర్యటించి ప్రత్యక్షంగా అక్కడి వారి స్థితిగతులు అర్థం చేసుకున్న అనుభవంతోనే ఈ పరిశోధనాత్మక రచన చేశారు, ప్రసిద్ధ ఒరియా రచయిత ‘‘గోపీనాథ మహంతి’’ వ్రాసిన అమృత సంతానం నవల చదివి గిరిజనులకు వారిదైన ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుందని దానిని తెలుసుకోకుండా మనం వారిని అర్థం చేసుకోలేము అనే విషయాన్ని అర్థం చేసుకున్న స్వానుభవంకూడా రచయిత ఈ రచనకు తోడు తీసుకున్నారు. గిడుగు రామ్మూర్తి, హైమన్‌ డార్ప్‌లతో పాటు యానాదుల పరిశోధకుడు వెన్నెల కంటి రాఘవయ్య, వంటి వారు సైతం ఆయా గిరిజనుల గురించిన పరిశోధన కృషి చేసేటప్పుడు వారి సమాచారాన్ని సేకరించటం కన్నా వారి ప్రపంచంలో సంచరించడం మీదే ఎక్కువ దృష్టి పెట్టారనే అంశం ఈ రచయిత స్పష్టం చేశారు, ఇది భావి పరిశోధకులు అందరికీ శిరోధార్యం అయిన విషయం.
‘‘గణరాజ్యాలు’’ మొదలు ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కులు అభివృద్ధిలో వాటాలను కోల్పోతున్నారా?’’ అనే శీర్షిక వరకు ముచ్చటగా మూడు ప్రధాన శీర్షికలు గల ఈ పుస్తకంలో గిరిజనులకు సంబంధించిన చారిత్రక, సాంస్కృతిక, వర్తమాన, సాంఘిక, సమాచారం గణాంకాలతో సైతం సమగ్రంగా అందించబడిరది. గణరాజ్యాల యందు నాటి చక్రవర్తులకు గిరిజనుల కు మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండేవి, నల్లమల అడవుల్లో గిరిదుర్గాలు చెంచుల నాయకత్వంలో ఉన్న విషయం, కొండ రెడ్ల జాతి ఆవిర్భావం,గోండు జాతి గిరిజనులలోగల ఉపతెగల వివరాలు, మన్యం కొట్టాలు,బోయకొట్టాలు,పితూరీలు, ఏర్పాటుతో పాటు అవి చేసిన కృషి ఫలితాల గురించిన విశ్లేషణ ఇందులో చదవవచ్చు. అలాగే మార్గ, దేశి, గిరిజన సంప్రదాయాలు, సంచార గిరిజన తెగల గురించి చెబుతూ భారతదేశంలో ప్రధాన భాషలు పదుల సంఖ్యలో ఉంటే గిరిజనుల భాషలు వందల సంఖ్యలో ఉన్నాయన్న ఆసక్తికర విషయం రచయిత ఇందులో లేవనెత్తారు. మనకు సాధారణంగా తెలిసిన గిరిజనుల పండు గలతో పాటు, వివిధ ప్రాంతాల్లో స్థానికంగా చేసుకునే విలక్షణ పండుగల సమాచారం కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణ. అరకులోయలోని ఆదివాసులు పాటించే కాలచక్రం చాలా విలువైన భౌగోళిక సమాచారం అందిస్తుంది, ఆ విషయాల గురించి రచయిత ఇందులో కూలం కషంగా వివరించారు. గిరిజనులు చేసుకునే ‘‘నంది పండుగ’’ మొదలు తెలుగు నెలల వారీగా చేసుకునే గిరిజనుల పండుగలు విశేషాలు తెలిస్తే అడవి బిడ్డలకు తెలుగు భాష పట్ల గల అభిమానం అర్థం అవుతుంది. కళింగ రాజ్యంలోని శ్రీముఖలింగం క్షేత్రంలో గల మధుకేశ్వర స్వామి అవతరణలో ఆరాజ్య సవర గిరిజన రాజు కుమార్తె, సవరరాజుల ప్రస్థావనతో ఆ ప్రాంతంలో గిరిజన రాజులస్థానం. అలాగే పూరీ జగన్నాథుడు సవర గిరిజనుల దేవుడుగా ఉన్న విషయం, కాకతీయుల సేనా ధిపతుల్లో 12 వేల విలుకాండ్ల దళానికి నాయకుడైన కోయరాజు ‘‘సీతాపతి రాజు’’ విషయంతో పాటు అతడు ‘‘శితాబ్‌ ఖాన్‌’’ గా మార్చబడ్డ వైనం ఇందులో చర్చించబడిరది.
ఇలా ఎన్నో ఆసక్తికర గిరిజన చారిత్రక సంఘటనలు ఈ పుస్తకంలో మనం చదవవచ్చు.
రెండవ విభాగం నిండా నిజాం, బ్రిటిష్‌ ,పాలకులతో గిరిజనులు చేసిన ప్రత్యక్ష పోరాటాలు వివరాలు వ్రాయబడ్డాయి.
నైజాంతో పోరాడి అమరుడైన కొమరం భీమ్‌ గురించి ఇందులో ప్రధానంగా చెప్పబడిరది, ఏడు నెలల పాటు జోడెడ్‌ ఘాట్‌ ప్రాంతంలో జరిగిన అభీకర పోరాటం వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. ఇక తూర్పు కనుమల్లో గిరిజనులు చేసిన స్థానిక తిరుగుబాట్లు, పితురీలతో పాటు 1920- 24 సంవత్సరాల మధ్య అల్లూరి సీతారా మరాజు నాయకత్వంలో జరిగిన గిరిజన పోరాటాలు తిరుగుబాటుల గురించి కూలంకషంగా వివరించ బడ్డాయి.ఈ పోరా టాల సమగ్ర అధ్య యనం ద్వారా తెలిసే విషయాలు, వివిధ ప్రాంతాలలోని గిరిజనులు అంతా సమీప రాజులు, జమీందారులతో సత్సం బంధాలతో స్నేహం చేస్తూ… వారి పాలనలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ సైనికుల వలే ముందుండి నడిచే వారిని. కొన్ని రాజ్యాలకు సామంత రాజులుగా కూడా వ్యవహరించే వారనే విషయాలు ఈ సందర్భంగా తేటతెలమవుతాయి. అదేవిధంగా స్వాతంత్ర పోరాటంలో కూడా తెలుగు ప్రాంతాలలోని గిరిజనుల పాత్ర అజ్ఞాతంగా ఉండేదనే విషయం అర్థమవుతుంది. స్వాతంత్ర అనంతరం కూడా గిరిజన సమాజంలో అలజడులు పోరాటాలు కొనసాగడానికి కారణాలను కూడా సామాజికవేత్తలు అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనే విషయం రచయిత సూచించారు. స్వతంత్ర భారతదేశంలో పాలనాపరమైన రాజ్యాంగం అమలై… గిరిజనుల కోసం ప్రత్యేక చట్టాలు, నిధులు, కేటాయించిన, వాటి అమలులో చూపిస్తున్న అశ్రద్ధ కారణంగా కొన్ని గిరిజన తెగలు నేటికీ వెనుకబడి అన్ని విధాలా నష్టపో తున్నారు అసంతృప్తితో రగిలి పోతున్నారు అనే విషయం కూడా రచయిత రేఖామాత్రంగా పేర్కొన్నారు.మూడవ విభాగంలో ‘‘గిరిజనులు రాజ్యాంగ హక్కు లను అభివృద్ధిలో వాటాలను కోల్పో తున్నారా?’’ అంటూ తెలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన షెడ్యూలు ప్రాంతాల వివరాలు, ప్రాంతాల వారీగా జనాభా గణన,జిల్లాల వారీగా గిరిజన తెగల వ్యాప్తి, వారిలో గల విభిన్న సంస్కృ తులు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేసిన పంచశీల విధానాలతో పాటు భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 46 ప్రకారం గిరిజన అభివృద్ధికి తీసుకున్న ప్రత్యేక చర్యలు, అటవీ హక్కుల చట్టం 2006, పిసా చట్టం, వంటి ప్రధాన చట్టాల గురించిన సమాచారంతోపాటు గిరిజనులు హిందూజాతి వారే అనడానికి సహేతుక కారణాలు వివరిస్తూ గిరిజన అభివృద్ధిలో వనవాసి కళ్యాణ ఆశ్రమం కృషి తదితర విలువైన సమాచారం ఇందులో అందించారు. గిరిజనుల సమగ్ర సమాచారం ‘‘కొండ అద్దమందు’’ అన్న చందంగా ఆవిష్కరించబడ్డ ఈ పుస్తకం సమస్త పరిశోధకులకు గిరిజన ఆధ్యయనకర్తలకు చక్కని దారి దీపంలా పనిచేస్తుంది, అనడంలో నిండైన నిజం ఉంది.
పుస్తకం పేరు:- ‘‘ఆంధ్రప్రదేశ్‌ లో గిరిజనుల సంస్కృతి ప్రగతికి సవాళ్లు..’’
రచయిత: డా: పిరాట్ల శివరామకృష్ణ,. పేజీలు: 72, వెల: 20/- రూపాయలు.
ప్రతులకు: సాహిత్య నికేతన్‌, బర్కత్‌ పురం, హైదరాబాద్‌ – 27, ఫోన్‌: 040- 27563236.
సమీక్షకుడు :- డా: అమ్మిన శ్రీనివాసరాజు, సెల్‌: 7729883223.

జనం ప్రేమ గెలుచుకున్న కోయ దొరసాని

అనసూయ అలియాస్‌ సీతక్క నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సాధారణ మహిళ లేదా రాజకీయ వారసత్వం అందుకున్న మహిళ అయితే అందులో ప్రత్యేకత ఏమీ లేదు.కానీ మావో యిస్టుగా ఉండి తర్వాత జనజీవన స్రవంతిలో కలిసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత మంత్రి కావడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ఒక గిరిజన మహిళ అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొని,కేసులను తలపడి.. చివరకు రాజ్యాంగాన్ని రచించే టీంలో భాగస్వామ్యులవుతున్నారంటే ఒక్క సీతక్కకే సాధ్యం. ప్రజల్లో ఉంటూ..నిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వాళ్లకు ఎక్కడా అపజయం ఉండదు అనడానికి సీతక్క జీవితమే ఉదాహరణ…
ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాత్రుస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ జాడ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అతని నాలుకమీద కాల్చిన ఇనపకడ్డీతో వాత పెట్టి,అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాకగానీ వాళ్ళు అతన్ని ఇంట్లోకి రానివ్వరు…అటువంటి తెగలో పుట్టిన ఆమె ఓ కొండ దొరసాని…ఆదివాసుల సాధికారతను కాలరాసిన మధ్యయుగా లనాటి రాజ్య దురహంకారంమీద వీరోచితంగా పోరాడి తమ స్వాభిమా నాన్ని చాటిన సమ్మక్క,సారలమ్మల పోరు వారసత్వం ఆమెది.ఆమె ‘రణధీర’ తనకి యుద్ధం కొత్తకాదు,ధిక్కారం తన రక్తంలోనే వారసత్వంగా తెచ్చు కుంది. అందుకే చిన్నతనంలో కత్తిపట్టి అడవి బాట పట్టినా ఎమ్మెల్యే అయ్యాక తన మనుషుల ఆకలి తీర్చడానికి కొండలు కోనలు దాటినా జనం కోసమే! ఆమె పేరు ‘ధనసరి అనసూయ’ అలియాస్‌ ‘సీతక్క’.అడవిలో పుట్టి అడవిలో పెరిగిన సీతక్కకి కష్టాలు,కడగండ్ల గురించి పుస్తకాలలో చదవా ల్సిన పనిలేదు. గ్రంధాలయాలలో వుండే పుస్తకా లకు మించిన జ్ఞానం ఆమెకి అనుభవాలనుంచి అబ్బింది. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా విసిరేసిన కోయ గూడెంలో అరకొర సౌకర్యాలు, అగచాట్లమధ్య పెరిగిన తనకి ఆకలి రుచి తెలుసు. అలాగే, సాయుధదళాలలో అడవి లోత ట్టు ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు కనీసం తిన డానికి తిండి, తాగడానికి మంచినీరు కూడా లేక పస్తులతో నడిచినరోజులు, పాచి పట్టిన అన్నా న్ని ఎండబెట్టుకుని తిన్నరోజులూ తెలుసు.
అడవిలో దొరికే ఆకూ,అలమా ఏరు కొచ్చుకుని,పోడు వ్యవసాయంలో పండిన రాగి గింజలతో అంబలి కాసుకుతాగే ధనసరి సమ్మక్క, సమ్మయ్యల రెండవ సంతానం‘అనసూయ’. తన కంటే ముందు అన్న‘సాంబయ్య’ వున్నాడు. సమ్మ క్క, సమ్మయ్యల బిడ్డగా మొదలైన అనసూయ ‘సీతక్క’ గా మారడం వెనకవున్నది బతుకునుంచి వచ్చిన తిరగబడే తత్వమే! వుమ్మడి వరంగల్‌ జిల్లా, (ప్రస్తుత ములుగుజిల్లా) ములుగు మండ లం, జగ్గన్నపేటలో పుట్టింది. అటవీ గ్రామమైన తమ గూడెంకి తరచూ ‘అన్నలు’ వచ్చి కరప త్రాలు పంచి, పాటలు పాడి, జనానికి దొరల దౌర్జన్యాలను ప్రశ్నించే చైతన్యాన్ని అందించేవారు. అనసూయ మేనమామ ఆమె బాల్యంలోనే అన్న లలో కలసిపోయాడు. ఆమె అన్న‘సాంబయ్య’ కూడా జనశక్తి పార్టీ కొరియర్‌గా వున్నాడు. హై స్కూలు రోజులనుంచే విద్యార్ధి ఉద్యమాలలో క్రియాశీలకంగా వుండే అనసూయ పదో తరగతి అయ్యాక జనశక్తి పార్టీ వుద్యమకారిణిగా సాయుధ దళాలలోకి వెళ్ళింది. అక్కడే వుద్యమ తరగతు లకు హాజరై సిద్ధాంతపరమైన పుస్తకాలు, సాహి త్యం చదివింది. ఆయుధాలు ఉపయోగించడం, దళాలను ఆర్గనైజ్‌ చెయ్యడంలో నేర్పుగలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందడంతోపాటు తక్కువ సమయంలోనే దళ కమాండర్‌ స్థాయికి ఎదిగి మూడు జిల్లాలకు తన కార్యక్రమాలను విస్తరింప జేసింది.దళ కమాండర్‌గా వున్నప్పుడు తన మారు పేరు ‘రణధీర్‌’.నల్లగా,పొడుగ్గా,చలాకీగా ఖాకీ యూనిఫారంలో అచ్చం అబ్బాయిలాగే వుండేది. అయితే అక్కడ వుండే పితృస్వామిక ధోరణి ‘రణధీర్‌’ని ‘సీత’ని చేసింది.ఉద్యమ పెద్దలు ‘కుంజా రాము’ అనే నాయకుడితో పెళ్లి చెయ్యాలని నిర్ణయించి,పార్టీ పద్ధతుల్లోనే పెళ్లి జరిపినా, ఆ రాముడికి సహచరిగా ఆమె‘సీత’,‘సీతక్క’ అయ్యిం ది.ఖమ్మం జిల్లాకొత్తగూడెం వాడైన రాము కూడా కోయ జాతికి చెందిన తన దూరపు బంధువు కావడం విశేషం.
సీత గర్భవతిగా వున్నప్పుడు పోలీసు లకి చిక్కిఅరెస్టై, జైలు జీవితం గడిపింది. ప్రసవం సమయానికి బైటికొచ్చి పుట్టిన రెండునెలల బాబుని బంధువులకు అప్పగించి మళ్ళీ రసహ్య జీవితం లోకి వెళ్ళింది. తర్వాత బంధువుల నుంచి బాబు ని ఆమెతల్లి తీసుకెళ్ళి పెంచి హాస్టల్‌లో చేర్చింది. సుమారు ఎనిమిదేళ్ళు జనశక్తి నక్సలైట్‌గా,దళ కమాండర్‌గా వుద్యమానికి అంకితమై చావైనా, బతుకైనా జనం కోసమే అనుకున్న సీతక్కకి పార్టీ లో ఏర్పడిన సిద్ధాంతపరమైన విభేదాలు, చీలిక లు ఆమెని జనజీవన స్రవంతిలోకిరాక తప్పనిస్థితి కలిగించాయి. ఈలోపల తనభర్త రాముతో కూడా విభేదాలు వచ్చి విడిపోయింది. రాము జనశక్తి పార్టీలోనే కొనసాగి కొన్నాళ్ళ తర్వాత ఎన్కౌంటర్‌ లో చనిపోయాడు. తన ఉద్యమ సహచరులంతా తలోదారి చూసుకున్నప్పుడు సీతక్క కూడా బైటి కొచ్చి మధ్యలో ఆగిపోయిన చదువుని కొనసాగిం చింది. హైదరాబాద్‌లో ఒక చిన్న రూమ్‌ తీసు కుని ఐదుసంవత్సరాల న్యాయశాస్త్రంలో ఎల్‌ ఎల్‌బీ పూర్తి చేసింది.తన ఖర్చులు,చదువు కోసం ఆదివాసుల సమస్యలమీద పనిచేసే ‘యక్షి’ అనే ఒక ఎన్‌.జి.ఓలో వుద్యోగంలో చేరింది. నక్సలైట్‌ గా తెలంగాణలో బాగా గుర్తింపు పొందిన సీతక్క బైట ‘లా’ స్టూడెంట్‌ ‘ధనసరి అనసూయ’గా మళ్ళీ రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అయినా పాత కేసులు ఆమెని ప్రశాంతంగా బతకనివ్వ లేదు. ఎప్పుడుబడితే అప్పుడు పోలీసు స్టేషన్లకి పిలిపించేవారు.ఒకవైపు ఆర్ధికఇబ్బందులు, మరో వైపు కేసులు…ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు ఆమె రాజకీయాలను అనూహ్య మైన మలుపు తిప్పాయి.‘లా’ పూర్తయ్యాక వరం గల్‌ వెళ్లి గతంలో తనకేసులు వాదించిన సీని యర్‌ అడ్వకేట్‌,వెంకటస్వామిరెడ్డిగారి దగ్గర జూనియర్‌ లాయర్‌గా చేరి కొన్ని నెలలు పని చేశాక 2004 ఎలక్షన్లకు ముందు కొందరు మిత్రుల ప్రోద్బలంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆ బూర్జువా పార్టీకి కూడా జన సామాన్యంలో పాపులారిటీ వున్న ‘సీతక్క’ అనే మాజీ నక్సలైట్‌ ఇమేజ్‌ మీదనే మక్కువ కాబట్టి మళ్ళీ ‘ధనసరి అనసూయ’ ప్రజానాయకురాలు ‘సీతక్క’ అయ్యింది.
తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తరపున పోటీ చెయ్యడానికి పార్టీలో ఎప్పటినుంచో కొన సాగుతున్నా సీటు దక్కని వాళ్ళున్నప్పటికీ ప్రజా జీవితంలో మమేకమై గుర్తింపు పొందిన సీతక్కకి ములుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో షెడ్యూలు ట్రైబ్స్‌కి రిజర్వు అయిన ములుగు అసెంబ్లీ నియోజ కవర్గం సీటురావడం సులభతరం అయింది. కానీ,2004లో రాజశేఖర్‌ రెడ్డి ప్రభావంతో ఆమె కాంగ్రెస్‌ అభ్యర్ధి‘మోదం వీరయ్య’చేతిలో ఓడి పోయింది. అయినప్పటికీ ఆమె వెనుకంజ వెయ్య కుండా అటు జనంలోనూ,ఇటు పార్టీలోనూ తన ప్రభావం పెంచుకుంటూ 2009 అసెంబ్లీ ఎన్నిక ల్లో అదే మోదం వీరయ్య మీద బంపర్‌ మెజారిటీ తో గెలిచింది.అయితే అప్పటికే మలి దశ తెలం గాణా ఉద్యమం ఊపందుకుంది. తాను ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ తమపార్టీ ఓడిపోవడంతో ప్రజలకు సీతక్క ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే స్థితి లేకపోగా తాను తెలంగాణా బిడ్డగా తన ఆంధ్రా పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణా ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించాల్సి రావడం ఆమెని తీవ్ర ఘర్షణకు లోను చేసింది. అయిన ప్పటికీ తన తెలంగాణా అస్తిత్వ ప్రకటన చేస్తూ కాకతీయ యూనివర్సిటీ విద్యార్ధుల సమ్మెకి మద్దతు పలికి వారితో పాటు ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అరెస్టై రెండు రోజులు జైలు శిక్ష అనుభవించింది.2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి ప్రత్యేక తెలం గాణా రాష్ట్రం ఏర్పడినా సీతక్క తెలుగుదేశం పార్టీలో వుండడం వలన ఆమెకి రాజకీయ లబ్ది జరగలేదు. తెలంగాణా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఈ క్రమం లోనే ఆమెకి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒకవైపు, తెలంగాణా రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) నుంచి ఒకవైపు ఆహ్వానాలురావడం, ఆమె తెలంగాణాని ఇచ్చిందనే అభిమానంవల్ల,టీడీపీ రేవంత్‌ రెడ్డి కుటుంబంతో సీతక్కకి వున్న సాన్నిహిత్యంవల్ల ఆమె కాంగ్రెస్‌ పార్టీవైపే మొగ్గుచూపింది. మళ్ళీ ములుగు నియోజకవర్గం నుంచే కాంగ్రెస్‌ అభ్యర్ధి గా పోటీచేసి ఈసారి కాంగ్రెస్‌ ప్రభావం తగ్గి పోవడం వలన తన ప్రత్యర్ధి టీడీపీ అభ్యర్ధి చందూ లాల్‌ చేతిలో ఓడిపోయి 2018 అసెంబ్లీ ఎన్ని కలలో అదే చందూలాల్‌ మీద కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయింది. సీతక్క. మొదట తెలుగుదేశం పార్టీ పాలిట్‌ బ్యూరో సభ్యు రాలి స్థాయికి ఎదిగిన ఆమె తర్వాత కాంగ్రెస్‌ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై జనబాహుళ్యంలో గొప్ప ప్రాబల్యం, చరి ష్మా కలిగిన నాయకురాలిగా, తనపార్టీలోనేకాక తెలంగాణా రాష్ట్రంలోనే ఒక ప్రజామోదం పొం దిన మేటి నాయకురాలిగా గుర్తింపు పొందు తుంది.
పోరాట పటిమకు మారుపేరు సీతక్క పట్టుదలకు, పోరాట పటిమకు మారు పేరైన సీతక్క విప్లవ పార్టీలలోనే కాక బూర్జువా పార్టీల ప్రత్యక్ష రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె విప్లవ పార్టీలో నక్సలైట్‌ గా సీతక్క బాగా సాహసోపేతమైన నాయకురాలి గా, రెబల్‌ గా పేరుతెచ్చుకుంది. తన నాయకత్వం లోని దళం ఆడవాళ్ళమీద దౌర్జ్యన్యాలు చేసే మగ వర్గశత్రువులకు మర్మాంగాలను తెగ్గోయడం, గుండు కొట్టించి ఊరేగించడంవంటి శిక్షలు విధిం చేవారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ప్రతి పక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఆదివాసుల సమ్మక్క, సారలమ్మ దేవతల మేడారం జాతరలో కోయ తెగవారికి భాగస్వామ్యం లేకపోవడంపై ప్రభుత్వ అధికారులతో చర్చించి ఆదేవతల వారసులకు జాతరలోచోటు కల్పించడానికి కృషి చేసి సాధిం చింది. అలాగే ఆదివాసుల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టంపై అసెంబ్లీలో తరచుగా ఆలోచనాత్మకమైన చర్చ లేవనెత్తుతూ వస్తుంది. ఆదివాసీ తెగల ప్రధాన సమస్యలైన మౌలిక వసతులు లేకపోవడంపైన అసెంబ్లీలో గళమెత్తింది. ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు,పాఠశాలలు,హాస్పటళ్ళు లేకపో వడం పైన ఆమె నిత్యం అధికారులతో చర్చించి కొంత మేరకు సాధించగలిగింది. అడవి లోపల గూడే లలో జీవించేవారికి రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డు లు లేకపోవడంపై ఆమె ఆందోళన చేస్తుంది. ఆమె ఎమ్మెల్యే గా గెలిచిన రెండుసార్లూ తానున్న పార్టీలు గెలవక ఆమె ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదు. తన స్వభావమే అధికార,ఆధిపత్య వ్యవస్థలకు వ్యతిరేకమైన ప్రతి పక్ష ధోరణి కాబట్టి ఎక్కడున్నా ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడడాన్ని కొనసాగించింది. తెలంగాణా రాష్ట్రం వస్తే అన్ని సమ స్యలు పరిష్కారమౌతాయని ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ రాష్ట్రం ఇచ్చిన వారితోపాటు ప్రజల్ని కూడా వంచించి తమ కుటుంబ పాలనని కొనసాగిస్తున్నదని సీతక్క ఆరోపణ. నీళ్ళు,నిధులు,నియామకాలు వస్తాయ ని చెప్పే ముఖ్యమంత్రి,ఆయన సహచర మంత్రు లు వాటిని గాలికి వదిలెయ్యడమే కాక ప్రజా సమస్యల మీద మాట్లాడేవారిని నేరస్తులని చేసి శిక్షిస్తున్నారని, హైదరాబాద్‌ లో ఒకప్పుడు ప్రజలు తమ నిరసనని వ్యక్తం చేసుకునే ధర్నా చౌక్‌ కూడా లేకుండా పోవడమే ఆపరిస్థితికి చక్కటి తార్కాణం అని ఆరోపిస్తుంది. ప్రజలు ఆశించిన తెలంగాణా రాలేదని, ఇది దొరల పాలన అని ఆమె విమర్శ. కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నా ఇక్కడి పాలకులు ప్రజలకు కనీసం మాస్కులు కూడా పంపిణీ చెయ్యడం లేదని, బైట వ్యాపారులు మాస్కులను అధికరేట్లకు అమ్ముతున్నారని అసెంబ్లీ లో సీతక్క మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఇంత మంది మంత్రులకు లేనిబాద ఈమెకెందుకని ఆమె మాటలకు ఎగతాళిగా నవ్వి హేళన చేసి నప్పుడు సీతక్క అవమానంగా భావించింది. నవ్విన నాపచేనే పండుతుంది అనుకుని లాక్దౌన్‌ ప్రకటించి నాక తన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇచ్చిన ఆర్ధిక సహకారంతో ములుగు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల ప్రజలకు,ముఖ్యంగా రవాణా సౌకర్యాలు లేని ఆదివాసీ తండాల ప్రజ లకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలు పెట్టింది.గత మార్చి 23నుంచి ఇప్పటివరకు సుమారు నాలుగొందలు గ్రామాల ఆదివాసులకు, దళితులకు సరుకులు పంచింది. మాస్కులతో పాటు బియ్యం,కూరగాయలు,నూనె సబ్బులు ట్రాక్టర్‌, జీపులలో వేసుకుని అటవీ ప్రాంతంలో వెళ్ళగలిగినంత మేరకు వాహనాలలో వెళ్లి ఇంకా లోతట్టు గూడేలకు తన సహచరులతోపాటు స్వయంగా తానుకూడా సరుకుల మూటలు మోస్తూ ఎగుడు దిగుడు అడవి బాటల్లో, వాగులు, వంకలు దాటుకుని వెళ్తుంది. అడవి బిడ్డలకు పౌష్టికా హారం గురించి, కరోనా వ్యాధి సోకకుం డా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిశుభ్రతలను వివరిస్తుంది. ఆడవాళ్ళను, పిల్లల ను కూర్చోబెట్టుకుని నేను కూడా ఇటువంటు గూడేలలో సరైన తిండి, వసతి లేకుండా పెరిగిన దాన్నే అని వారిలో ఒకదానిగా వివరిస్తుంది సీత క్క. ఆమె సేవగురించి పత్రికలూ,సోషల్‌ మీడి యా వేనోళ్ళ కొనియాడుతుంటే అధికార పార్టీకి అక్కసుగా ఉండి ఆమెమీద అవాకులూ, చవాకు లూ పేలుతుంది.మరికొందరు గిట్టనివాళ్ళు ఆమె తన సొంత డబ్బుతో సరుకులు ఇస్తుందా? అని విమర్శిస్తున్నారు.సీతక్కకి మోతాదు మించి ప్రచా రం లభిస్తున్నదని అసూయతో తప్ప ఆమెలా జనంతో మమేకమయ్యే నాయకులు దాదాపు లేరనే చెప్పాలి.ప్రధాన స్రవంతి రాజకీయాలలో వున్న ప్పుడు కొన్ని ఎత్తుగడలు వెయ్యాల్సిరావడం ఎవరి కైనా తప్పదు. అంతమాత్రాన తన నియోజకవర్గ ప్రజలపట్ల, ఆదివాసీ బిడ్డల పట్ల ఆమెకున్న శ్రద్ధ, ప్రేమలను సీతక్క పనితీరును దగ్గరగా గమనించిన వారెవరూ కాదనలేరు. సీతక్క అంటే ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి కనీస సౌకర్యాలకు నోచు కోని అభం శుభం తెలియని ఆదివాసీ ప్రజలకు తమజాతిలోంచి ఉద్భవించిన ఒక మణి మాణి క్యం.సీతక్క చైతన్యవంతమైన సాహిత్యాన్ని చదవడమేకాక ‘వెన్నెల’ అనే కలం పేరుతో కవి త్వం రాసేది.‘యక్షి’ అనే సంస్థలో పనిచేస్తున్న పుడు ఆదివాసీల ఉనికిమీద వ్యాసాలు కూడా రాసింది. ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టంమీద, ఆదివా సుల హక్కులమీద ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కవితలు రాసింది. ఆమెకి కష్టపడి పనిచెయ్యడం ముందునుంచీ అలవాటే! నక్సలైట్‌ గా బైటికొచ్చి హైదరాబాద్‌ లో చదువు కొనసాగించేటప్పుడు కూడా తనసొంత ఊరెళ్ళి తునికాకు పనికి, వ్యవ సాయ పనులకి వెళ్లి వచ్చిన కూలి డబ్బులతో ఫీజులు కట్టుకునేది. బాబు ‘సూర్య’ని కష్టపడి ఎం.టెక్‌ దాకా చదివించింది, తనుకూడా తల్లి కష్టం చూసి బాగా పట్టుదలతో చదివి నాగపూర్‌ ట్రిపుల్‌ ఐటిలో సీటు తెచ్చుకున్నాడు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్లో సైన్స్‌ లో ఎమ్మే పూర్తిచేసి ఇప్పుడు అదే యూనివర్సిటీలో గొత్తి కోయల జీవన ప్రమాణాలు-స్థితిగతులమీద పీహెచ్‌.డీ చేస్తుంది.
సీతక్కది అచ్చమైన ఆదివాసీ స్వాభి మానం, స్వయం పాలనని, స్వేచ్ఛని ప్రేమించే గుణం.నగరంలో వుండి ఎమ్మే,ఎల్‌.ఎల్‌.బి చేసినా,ఎమెల్యే అయినా ఆదివాసి సంస్కృతి అంటే తనకి సహజాతంలా వచ్చిన ప్రేమ వెలిసిపోలేదు. రెండేళ్లకోసారి వచ్చే వనదేవతల మేడారం జాతరతోపాటు ఆదివాసుల గూడేలలో జరిగే పండగ పబ్బాలకు, శుభకార్యాలకు, చావులకు ఆమె తప్పకుండా హాజరవ్వడమే కాక వారి సంస్కృతిలో భాగమైన ఆట, పాటలలో పాల్గొం టుంది. పెళ్ళికి,చావుకీ తప్పనిసరిగా మోగే డోలు వాయిద్యమంటే ఆమెకి ఇష్టం,డోలు శబ్దం విన గానే అప్రయత్నంగానే తనకాళ్ళు చిందేస్తాయి. అందుకే, తన కొడుకు ‘సూర్య’ వివాహానికి చత్తీస్‌ ఘడ్‌ నుంచి డోలు వాయిద్యకారులైన గొత్తికోయ లను పిలిపించింది. నక్సలైట్‌గా తను తిరిగిన అటవీ గ్రామాలే కాదు,మైదాన ప్రాంతాలలో కూడా ప్రతివూరు,పల్లె,వాగు,వంకా తనకి పరిచ యమే. తన నియోజకవర్గంలో వుండే సుమారు వంద ఏజెన్సీ గ్రామాలలో ప్రతి చిన్న ఆదివాసీ గూడెం పేరును గుర్తు పెట్టుకుంటుంది. అగ్రకుల బూర్జువా పార్టీలలో చేరినప్పటికీ సీతక్క జనంతో తనకున్న ప్రత్యక్ష సంబంధాలను మాత్రం వదులు కోలేదు. ఆమెని తమ బిడ్డగా భావించే ములుగు ప్రాంతపు గ్రామాలలో ఆమె జనంలోకి చొచ్చుకుని పోతుంది. అందరితో ప్రేమగా వారి పరిస్థితు లను లోపలి వ్యక్తిగా అర్ధం చేసుకునే సీతక్కకి తనని ఎవరన్నా ‘మేడం’ అని సంబోధిస్తే ఇష్టం ఉండదు, ‘మేడం’అంటే దూరం పెట్టినట్టుగా, ‘అక్క’ అంటే ఇంట్లోవాళ్ళం అన్నట్టు వుంటుంది అని తను కూడా తన పార్టీ కార్యకర్తలను, అనుచ రులను ‘అన్నా, అక్కా’ అనే పిలుస్తుంది.
తనకి మామూలు అర్ధంలో దేవుడు, మతం అనేవాటిపైన నమ్మకం లేదు,గుళ్ళూ, గోపురాలకు వెళ్ళదు. కానీ, ఆదివాసీ అస్తిత్వాన్ని చాటే ఆదివాసుల పిత్రుదేవతారాధన,ప్రకృతికి సంబంధించిన జాతరలలో ఇష్టంగా పాల్గొం టుంది. సీతక్కది అసలైన ఆదివాసీ రూపంబీ నల్లని రంగుతో సాదాసీదా ముతక చీరలు కట్టు కుని జనంతో కలసిపోయే సీతక్క అంటే అడవి బిడ్డలకు ఒక సమ్మక్కనో,ఆమె బిడ్డ సారలమ్మనో చూసినట్టుంటుంది. జనం ప్రేమలను గెలుచుకున్న కోయ దొరసాని ఆమె. ఆమె ఆదివాసీ సాధికార తకు ప్రతీక, ముందునుంచీ స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు ఆమెకి పెట్టని ఆభరణాలు. తాను గన్‌ పట్టినా,గన్‌ మెన్‌తో వున్నా ఆమెది పోరాటదృష్టే! ఒకపుడు తనవెంట పడిన పోలీ సులు ఇప్పుడు తనకి రక్షణగా వెంట నడవడం చూసి నవ్వుకుంటుంది ఈ అడవి చుక్క. ఆమె మాటల్లోనే ‘ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం/ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం’ ఆమె నైజం.
‘అనంతయానం’లో తొలి ఆదివాసీ కేబినెట్‌ మంత్రి` సీతక్క
గత ముప్పై ఐదేళ్ల క్రితం ఆదివాసుల సమస్యలను ఎదిరించడానికి అడవిబాట పట్టిన ‘ఆమె’ నేడు అధికార పక్షంలో ఒక ముఖ్యమైన పాలనాదీశురాలు.తెలంగాణ రాజకీయ చరిత్రలో ఆమె మకుటం లేని మహారాణిగా నిలిచింది. నేటి ప్రజా ప్రభుత్వంలో ఆమె తెలంగాణ కేబినెట్‌ మంత్రి. ఆమె పేరే ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క. డిసెంబర్‌ 7న మూడో శాసన సభలో కొలువుదీరిన ఆమె ఎల్బి స్టేడియంలో హర్షద్వా నాల మధ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ  శాసనసభలోనే ఇప్పటివరకు సీతక్క తొలి ఆదివాసీ మంత్రి కావడం విశేషం. ములు గు ప్రజలకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు సీతక్కగా సుపరిచితమైన డాక్టర్‌ ధనసరి అనసూ య రాజకీయ రంగంలో అంచెలు అంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం లో పంచాయతీరాజ్‌,మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రిగా కొలువుదీరారు. డాక్టర్‌ అనసూయ నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టింది. ఆది వాసీ కోయతెగకు చెందిన ఆమె ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు దగ్గరలోని జగ్గన్నగూడెంలో ధనసరి సమ్మక్క, సమ్మయ్య దంపతులకు 1971, జులై 9న జన్మించింది. బాల్యం నుంచి బాగా చదుకోవాలని పట్టుదలతో బడికి వెళుతున్న సంద ర్బంలో ఆమెకు కొన్ని ఆటంకాలు వెంబడిర చాయి. తన14ఏళ్ళ వయసులోనే అన్నయ్య సాం బయ్య ను పోలీసులు అకారణంగా ఎన్‌ కౌంటర్‌ చేశారు. ఈ సంఘటనతో కలత చెందిన ఆమె ప్రజా వ్యతిరేక శక్తులను ఎదిరించడానికి 1988 లో అన్నల బాట (అడవి దారి) పట్టింది. అప్పుడే ఆమె అడవిలో ‘సీతక్క’గా మారింది. కొన్నాళ్ళ తర్వాత పోలీసుల చేతికిచిక్కి కొద్ది రోజులు జైలు జీవితం గడిపింది.జైలు నుండి విడుదలయ్యాక ఇంటర్‌, డిగ్రీ దూరవిద్య ద్వారా పూర్తి చేసుకొని అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ బుల్లెట్‌ పట్టింది. వార్‌ ఉద్యమంలో కమాండర్‌ స్థాయికి ఎదిగింది. తన సహచరుడు అయిన కొత్తగూడ మండలం మోకాళ్లపల్లికి చెందిన కుంజా రామును పెళ్లి చేసుకుంది. కుమారుడు సూర్య జన్మించాక అమ్మ మ్మ ఇంట్లోనే పెట్టి ఉద్యమాన్ని,కుటుంబాన్ని వేరుగా చూసింది. 2001లో బుల్లెట్‌ను వీడి ప్రజా జీవితంలోకి ప్రవేశించింది. తన కుటుం బాన్ని చూసుకుంటూనే ప్రజా సమస్యల పరిష్కారా నికి బ్యాలట్‌ వైపు మొగ్గు చూపింది.అప్పటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ములుగు (ఎస్టీ)టికెట్‌ను సీతక్కకు కేటాయించారు. తెలం గాణ అసెంబ్లీలో ఆదివాసీల తరపున అటవీ హక్కులు, గూడేలా అభివృద్ధి గురించి ప్రశ్నించే గొంతుకగా మారింది. మరోవైపు 2014లో మహాకూటమి నుండి ఓడిపోగా 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరినారు. అనంతరం సీతక్కకు ఏ.ఐ.సి.సి.అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ. ఐ.ఎన్‌.సిమహిళా కమిటీలో ప్రధాన కార్యద ర్శిగా నియమించారు.తను రాజకీయ జీవితాన్ని అనుభ విస్తూ కూడా న్యాయ శాస్త్రంలో పోస్ట్‌ గ్రాడ్యు యేషన్‌ ( ఎల్‌ఎల్‌ ఎం ) చదువుకున్నారు. 2018 లో కాంగ్రెస్‌ నుంచి గెలిచినా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. మొక్కవోని దీక్ష లాగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొలిటికల్‌ సైన్స్‌లో ‘‘ తెలం గాణకు గొత్తి కోయలు వలస రావడానికి గల సామాజిక అంతరాలు ‘‘ అనే అంశం మీద పి. హెచ్‌.డి పట్టా పొందినారు.ఎమ్మెల్యే గా ఉంటూ డాక్టరేట్‌ పొందిన తొలి ఆదివాసీ మహిళ మరి యు డాక్టర్‌ సీతక్కగా రికార్డ్‌ సొంతం చేసుకు న్నారు.  2019-20 మధ్య కరోనా మహ మ్మారికి కకావికలమైన ఆదివాసులు మంగపేట, వెంకటాపురం పరిధిలోని అడవిలో నిరాశ్రయు లుగా మిగిలారు.బంధాలు,బంధుత్వాలు తెగి పోయిన పరిస్థితుల్లోనూ‘‘నేనున్నా’’నంటూ కాలి నడక నడుస్తూ గోత్తికోయలను ఆదుకున్నది ఈ సీతమ్మ.2022,ఏప్రిల్‌ 28న మంగపేట మండ లంలోని శనిగకుంట అనే ఆదివాసీ గ్రామంలో ఎరగడివల్ల సుమారు 40దగ్ధం అయినవి. సర్వం కోల్పోయి నిలువ నీడలేని ఆదివాసులకు సీతక్క అండగా నిలిచింది.ఈ సంఘటనను తను సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడంతో వారికి తగిన పునరావాసం కలిగింది. ఈఏడాది (2023) ఆగష్టులో కురిసిన భారీ వర్షాలకు ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం మండలం మల్యాల,కొండాయి,దొడ్ల తదితర ఆదివాసీ గ్రామాలు నీట మునిగినవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకురాలి హోదాలోనూ పునరావాస సేవలు స్వశక్తితో అందించారు. ప్రభు త్వం నుండి  ఆదివాసులకు ఎలాంటి సహా యం అందలేదు.తన నియోజక పరిధిలోని కొన్ని ఏజెన్సీ గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థులకు నోట్‌ బుక్స్‌,స్టడీ మెటీరియల్‌, ఎగ్జామ్స్‌ మెటీరియల్‌ పంచి పెట్టారు. అక్కడి జనాలని కదిలిస్తే ‘‘ మాతరం లో  కాకతీయుల ఆరాచకాలపై తిరగబడ్డ వీరవనితలు సమ్మక్క సారక్కలను చూడలేదు కాని ప్రజా సమస్యలపై వీర్చోతింగా పోరాడుతూ నేడు తెలంగాణ సేవకురాలిగా నిలిచిన సీతక్క ను చూడటం తమ అదృష్టంగా భావిస్తున్నామ’’ ని ఆదివాసులు,గిరిజనేతరులు సైతం పేర్కొనటంవిశేషం.నేడుతెలంగాణ మంత్రి మండలిలో సీతక్క డిసెంబర్‌ 14(2023) న పంచాయతీ రాజ్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిగా విధులు స్వీకరించారు. భవిష్యత్తులోనూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో యావత్తు తెలం గాణ ప్రజలకు సేవచేస్తారని,ప్రత్యేకించి గిరిజనుల హక్కులకు భరోసా కల్పిస్తారని ఆశిద్దాం!- (చల్లపల్లి స్వరూపరాణి/గుమ్మడి లక్ష్మీనారాయణ)

1 2