జగనన్న సురక్ష

ప్రజా సమస్యలను సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడం,అర్హులందరికీ పథకాలు అందిం చడం లక్ష్యంగా జూన్‌ 23 నుంచి జూలై 23 వరకు నెల రోజులపాటు జగనన్న సురక్ష కార్య క్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. దీనికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రతి సచివాలయ పరిధిలో విస్త్రతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా మరో కొత్త కార్యక్రమైన జగనన్న సురక్ష కార్యక్రమం అనే శ్రీకారం చుట్టబోతోంది.ఇది ఎప్పట్నించి ప్రారంభమౌతుందనేది పరిశీలిద్దాం.!
వైసీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో మరో కొత్త కార్యక్రమాన్ని తలపెట్టింది.ఇది జూన్‌ 23 నుంచి ప్రారంభం కానుంది.. ప్రతి ఇంట్లో ఏసమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి జగనన్న సురక్ష కార్యక్రమం కొనసాగింపుగా ఉంటుంది. ప్రతి సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ కార్యక్ర మం ఉద్దేశ్యమం.
ఇదో బృహత్తర కార్యక్రమం
ప్రభుత్వం చేపడుతున్న వివిధకార్య క్రమాలు,సంక్షేమపథకాలు, గడపగడపకూ ప్రభుత్వం,ఉపాధిహామీ పనులు, రెవెన్యూ, హౌసింగ్‌, వ్యవసాయం,సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు కార్యక్రమాలపై సచివాలయ స్థాయి నుంచి జిల్లా కలెక్టరేట్‌ స్థాయివరకు ఎప్పటికప్పడు సమీక్ష చేసుకొని అర్హుల్కెన లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందించడం ప్రధాన లక్ష్యం.ఈబృహాత్తర క్యాక్రమం నెల రోజుల పాటు నిర్వరామంగా కొనసాగుతుంది. సచివాలయ సిబ్బందికి సైతం శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు సంబంధించిన జనన,మరణ,కుల,మత, నివాస పత్రాలు,సర్టిఫికేట్లు జారీ,ప్రభుత్వపథకాల సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తారు.ఈపనుల నిర్వహణ కోసం మండలాధికారులు స్థానికంగా ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి తక్షణం పరిష్కరిస్తారు.ఎవరి సమస్యైనా తిరస్కరించ బడితే ఎందుకు తిరస్కరించారనేది ఆఫిర్యాదు దారుడి ఇంటికెళ్లి వివరిస్తారు.అప్పటి వరకూ పరిశీలనకు నోచుకోని సమస్యను 24గంటల్లోగా పరిష్కరమయ్యే అవకాశం ఉంది. అర్హత ఉండీ ప్రభుత్వపథకాలు అందనివారిని గుర్తించి తక్షణం వారికి ఆపధకాల లబ్ది పొందేలా చేస్తారు.
సమస్యలపై మండలాధికారులు క్యాంపులు
సర్టిఫికెట్లకు సంబంధించి,అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా యా? లేవా?అన్నదానిపై ఈ కార్యక్ర మంలో జల్లెడపడపట్టనున్నారు.నగర/పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌,జోనల్‌ కమిషనర్లు,సిబ్బంది ఒక టీమగా ఏర్పాటు చేసుకుని వివిధ వార్డుల్లో పర్యటిస్తారు.మండల స్థాయిలో ఎంపీడీఓ,డిప్యూటీ తహాసీల్దార్‌ ఒక బృందం,తహాసీల్దార్‌ ఈఓ పంచాయితీ రాజ్‌ కలసి రెండు బృందాలుగా గ్రామాలకు వెళ్తారు. సచివాలయానికి వస్తున్న తేదీ వివరాలను ముందే నిర్ణయించి,ఆ రోజు వాటికి గ్రామంలో ఉన్న క్షేస్థ్రాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు.నెల రోజులపాటు జరిగే ఈక్రార్యక్రమంలో ప్రతిరోజుఒక టీమ్‌ ఒక్కో సచివాలయాన్ని మాత్రమే సందర్శిస్తారు.
వాలంటీర్ల గుర్తించుకోవాల్సిన విషయాలు
పనిని సమర్ధవంతంగా అర్ధం చేసుకోవడానికి ఎంఎల్‌ఓ,మండల ఇన్‌చార్జిలు,కలసి ఏర్పాఉ చేసిన శిక్షణా సమావేశానికి హాజరుకావాలి. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో సమన్వ యం చేసుకోవాలి. ప్రజల సమస్యలకు సంబంధించిన పత్రాలను గుర్తించి పౌరుల నుంచి తీసుకొని సచివాలయంలో సమర్పించాలి.ప్రతి ఇంటిని సందర్శించి వాలంటీర్‌ యాప్‌లో సర్వేని పూర్తి చేయాలి.ఇంటికి తాలం వేసి ఉంటే..వేరే సమయంలో మళ్లీ సందర్శించాలి. ఆయా సచివాలయ పరిథిలో క్యాంపు జరిగే తేదీని ప్రతి ఇంట్లో పలుమార్లు చెప్పాలి.ఆవ్యక్తి అనుమతితో వారి జియో`ట్యాగ్‌ చేయబడిన చిత్రాలను క్లిక్‌ చేయాలి.అదే రోజున యాప్‌,వాట్సాప్‌ గ్రూపుల్లో పోటోలు, అప్‌టడేట్‌ను షేర్‌ చేయాలి.పథకాలు లేదా డాక్యుమెంట్‌ సంబంధింత సమస్యలు ఉన్న వ్యక్తులందరినీ క్యాంప్‌కు రావడానికి ప్రొత్సహించాఇ. క్యాంపుకు ముందు ఫిర్యాదు చేయని వ్యక్తులను కూడా తమ సమస్య పరిష్కారం కోసం క్యాంప్‌ రోజు సందర్శించ వచ్చు. దీనికి సంబంధించి ఆయా వార్డు/గ్రామ సచివాలయంలో ప్రత్యేక డెస్కలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి శనివారం నుంచే మండలస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆగస్టు 1వతేదీన అర్హత పత్రాలు అందించే కార్యక్రమం
జగనన్న సురక్షలో వివిధ పథకాల కిందఅర్హు లుగా గుర్తించినవారికి ఆగస్టు1వతేదీన అర్హత పత్రాలు అందిస్తారు.ఇందులో సమస్యల పరిష్కారంలో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికా రులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉం డాని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు.. గ్రీవెన్స్‌రిజెక్ట్‌ చేస్తే ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారుడు ఇంటికెళ్లి వివరిస్తున్నారు. ప్రజలకు అన్నిరకాలసేవలు అందించాలని సీఎం ఆదేశించారు.
కల్తీ విత్తనాల పట్ల అలర్ట్‌..
అదే విధంగా వర్షాకాలం ప్రారంభమైనందున విత్తనాలు,ఎరువులు,పురుగుమందుల కొరత రాకుండా రైతు భరోసా కేంద్రాలను పర్యవేక్షించాల్సి ఉంది.కల్తీవిత్తనాలపట్ల అలర్ట్‌గా ఉండటం,ఎక్కడ్కెనా కల్తీ కనిపిస్తే కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులుగా చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించారు. జుల్కె1నుంచి ఇ-క్రాప్‌ బుకింగ్స్‌ ప్రారంభించి,సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి.సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటి ఫేజ్‌లో2వేల గ్రామాల్లో జగనన్న భూహక్కు,భగరక్షకార్యక్రమం పూర్తయ్యిందని సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్‌,రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష క్యాంపులు ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను ఇప్పటి వరకు 99శాతం మంది అర్హులందరికి అందజేసి.. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1 శాతం లబ్ధిదా రులను కూడా కవర్‌ చేస్తూ 100 శాతం సంక్షేమం అందిచాలనే దిశగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్బంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి రోజు క్యాంపుల నిర్వహణ తీరును వివరించారు. ఈ సందర్బంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడం, ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లు, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష పథకాలన్ని ప్రారంభించినట్లు మంత్రి మేరుగ తెలిపారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా భావించి..సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. దేశ చరిత్రలో ఏముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఒక్క రోజులోనే సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది
జగనన్న సురక్ష క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడే ప్రజల సమస్యకు పరిష్కారం చూపు తూ.. అదేవిధంగా అర్హులైన వారికి పథకాలు వచ్చేలా సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చూపుతున్నామన్నారు. ఇక అవసర మైన వారికి ఉచితంగా సర్టిఫికేట్లను అందిస్తున్న ఘనత సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికే దక్కుతుం దని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వాలం టీర్లు, సచివాలయ గృహసార థులు ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి వారి సమస్య లను తెలుసుకుని టోకెన్లు ఇస్తారని.. ఇక జులై 1 నుంచి 30 వరకు సచివాలయాల పరిధిలో క్యాంపులు పెట్టి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్స్‌, పథ కాల లబ్ది, సమస్యలను మండల, సచివాల య అధికారులు దగ్గరుండి పరిష్కరి స్తారని ఈ అవ కాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వి నియోగం చేసు కోవాలని మంత్రి మేరుగ అన్నారు. టీడీపీ హయాంలో చేసిన ఒక్క మంచిపని కూడా లేదని.. సీఎం జగన్‌ సంక్షేమ పథకాలు ఇస్తుంటే.. ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు రాష్ట్రం శ్రీలంక అవుతుందని.. అప్పులపాలు అవుతుందని ప్రచారం చేయిం చారని, ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు తానూ ఇస్తానని కళ్లబొల్లి మాటలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు.
పారదర్శక పాలనకు నిదర్శనంగా జగనన్న ప్రభుత్వం: ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌
సంక్షేమ పథకాల అమలులో పార్టీ, కులం, మతం, ప్రాంతం చూడకుండా..అర్హతే ప్రామాణికంగా ఉందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దాదాపు 2.16లక్షల మంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది మండల అధికారులు,జిల్లా అధికారులు పాల్గొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ‘’జగనన్న సురక్ష పథకాన్ని జులై నెలలో ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం.. ఈ నెల లోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది, దీంతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఆగస్టు నుంచే పథకాల క్యాలెండర్‌ అమలవుతుంది..అందు కని ఈ నెలలో పథకాలకు లింక్‌ చేయా ల్సిన సర్టిఫికెట్లను ప్రభుత్వం అందిస్తోంది’’ అని ఎమ్మె ల్సీ మర్రి రాజశేఖర్‌ చెప్పుకొచ్చారు. గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ సిఫార్సు లు,టీడీ పీ నాయకుల సూచనల మేరకు పథకాలు ఇచ్చే వారని, కానీ సీఎం జగన్‌ నాయకత్వంలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తు న్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే వాలంటీర్లు అందరూ ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని..ఇక వారి సచివాలయ పరిధిలో క్యాంపులు పెట్టి వాటిని పరిష్కరి స్తారని ఎమ్మెల్సీ రాజశేఖర్‌ చెప్పారు. ప్రజల వద్దకే పాలనను ఆచరించి చూపాం
‘’జగనన్న సురక్ష వంటి కార్యక్రమం అమలు చేయాలంటే దమ్ము, ధైర్యం ఉండాలి, ఆ లక్షణా లు మా నాయకుడు సీఎం జగన్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడైనా మాకు ఈ సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారని, కానీ సీఎం జగన్‌ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి మీ సమస్య లు ఏంటి అని తెలుసుకుని..వాటిని పరిష్కరిం చేందుకు క్యాంపులు ఏర్పాటు చేయడం ఇది సుపరిపా లనకు నాంది పలకడమేనని’’ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మండలానికి 2 చొప్పున 1,305 సచివాలయాల పరిధిలో ‘జగనన్న సురక్ష’ క్యాంపులు విజయవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు అవసరమైన ద్నృవపత్రాలు, ప్రభు త్వ సేవలను అక్కడికక్కడే అందించినట్లు ఎమ్మె ల్సీ పేర్కన్నారు. దీనికి సంబంధించి ఆయా సచి వాలయాల పరిధిలోని వాలంటీర్లు జూన్‌ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతులను సేకరిం చి జగనన్న సురక్ష యాప్‌ లో నమోదు చేశారని తెలిపారు. రద్దీగా ఉన్న జగనన్న సురక్ష క్యాంపుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండావారి భోజన, త్రాగునీరు సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది.-జిఎన్‌వి సతీష్‌

అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది..!

భారతదేశంలోని ధనవంతులైన 70లక్షల మంది పేదవారు 80కోట్లకు సమానం. మరో మాటలో చెప్పాలంటే,ఎగువ0.5శాతం మంది భారతీయులు దిగువన ఉన్న 57శాతం మందితో సమానంగా సంపాదిస్తారు.ఈసంఖ్యలు వివాదాస్పదంగా ఉండవచ్చు. ప్రపంచ అసమానత ల్యాబ్‌లోని ప్రముఖ అసమానత ఆర్థికవేత్త థామస్‌ పికెట్టీ,అతని సహచరుల అంచనాల ఆధారంగా ప్రముఖ సీనియర్‌ ఎకనామిక్‌ అనలిస్ట్‌ ఔనింద్యో చక్రవర్తి రూపొం దించారు.
199లో భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్తఆర్థిక సంస్కరణల్లో సరళీకరణ, ప్రపంచీకరణ మరియు ప్రైవేటీకరణ ప్రవేశపెట్టింది.ఈసంస్కరణలు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థను తెరవడం,దేశానికి ఆర్థిక సంస్కరణలను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశ ఆర్థికాభివృద్ధికి అవరోధంగామారిన కొన్ని పరిమితులను తొలగించేందుకు ఇది దోహద పడిరది.ఇదిదేశంలో ప్రైవేట్‌రంగం విస్తరించడానికి మరియు ఆర్థికవృద్ధికి దోహదం చేసింది. ఈనేపథ్యంలోనే నూతన ఆర్ధికసరళీకరణ విధానాన్ని స్వీకరించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇంటర్నేషనల్‌ మోనార్టింగ్‌ ఫండ్‌(ఐఎంఎఫ్‌),వరల్డ్‌ బ్యాంక్‌లు అప్పటి నుంచి వీటిని తమ గుప్పెట్లోకి వచ్చాయి.
దాని ముందర మనకు సోషలిస్టు విధానం ఉండేది. 30 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగినట్టు కనిపిస్తోంది.కానీ డేటా పరిశీలిస్తే0.5శాతం జనాభ ధనికవర్గానికే చెందు తుంది. సంపాదనలో 80కోట్ల మంది పేదవారి సంపాదనతో సమానం అని డేటా చెబుతుందని ఔనింద్యోచక్రవర్తి ద్వారా తెలుస్తోంది.దీనబట్టి పరిశీలస్తే,ముప్పైయేళ్ల క్రితం ప్రవేశపెట్టిన సరళీకరణ విధానం ధనవంతులకే ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.ఆలాగే ప్రపంచంలో అభివృద్ధి చెందినదేశాల కంటే అత్యంతపేదగా పరిగణించబడే బురుండి,మడగాస్కర్‌.ఈ రెండుదేశాల సగటు ఆదాయాలు భారతదేశంలోని రెండు జనాభా విభాగాల సగటు ఆదా యాలతో దాదాపు సమానంగా ఉంటాయి.ఎందుకంటే ఇక్కడ పేదరికం ఎక్కువ..ఆదాయం తక్కువ.
2022లో బురుండిలో సగటు ఆదాయం సుమారు వి1,750 (ూూూ).భారత దేశంలో దిగువన ఉన్న42శాతం మంది పెద్దలు దానికంటే తక్కువ సంపాదించారు దాదాపు వి1,720 (ూూూ).అదే సంవత్సరంలో మడగాస్కర్‌లో సగటు ఆదాయం సుమారు వి3,065 (ూూూ).భారతదేశంలో దిగువన ఉన్న52శాతం మంది పెద్దలు దాని కంటే తక్కువ సంపాదించారు.దీనర్థం దాదాపు58కోట్ల మంది భారతీయులు(ఈపెద్దలపై ఆధార పడిన పిల్లలతోసహా) ప్రపంచంలోని అత్యంత పేదదేశమైన బురుండిలో సగటు వ్యక్తివలే పేదలు.మడగాస్కర్‌లోని ప్రజల సగటు స్థాయికి ఆదాయపరిమితిని పెంచితే,73కోట్ల మంది భారతీయులు అంతకంటే దిగువన ఉన్నట్టు డేటాద్వారా తెలుస్తోంది.
అయితే దేశరాజ్యాంగం మాత్రం ఒకసోషలిస్టు విధానాన్ని స్థాపించేదిగా ఉంది.కానీ ఆర్ధిక విధానంమాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా మారుతోంది.అభివృద్ధి పేరుతో పేదరికం పెరుగుతోంది.ఆర్ధిక విధానాలను రూపొందించే సమయంలో పాలకులు ఇలాంటి అంశాలపై దృష్టిలో పెట్టుకుంటే భవిష్యత్తు తయారుకు భలోపేతం చేసినవాళ్లం అవుతాం.-రెబ్బాప్రగడ రవి ,ఎడిటర్ 

ఫ్టాస్టిక్‌పై పోరు బాట

‘‘ ప్లాస్టిక్‌ మహ మ్మారిపై పోరును ఒకఅత్యవసర ఉద్యమంగా చేపట్టాలి. పర్యావరణం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం, భావితరాలకు సురక్షితమైన జీవితం కోసం…ప్లాస్టిక్‌ బ్యాగులు,బాటిల్స్‌ తదితర వస్తువులను బహిష్క రించాలి. క్లాత్‌ బ్యాగులను వాడకాన్ని ప్రారంభించాలి. ఇందుకు అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా పూనుకుంటేనే సాధ్యం.నిత్య జీవితంలో ప్లాస్టిక్‌వినియోగం విడదీయలేని స్ధాయికి చేరుకున్నది. ప్రతి నిత్యం మనకు నిత్యావసరాలైన కూరగాయలకు,కిరాణా సామాన్లకు, ఫ్యాన్సీ వస్తువులకూ మందులకు, ఎలక్ట్రానిక్స్‌ వస్తువులకు కూడా ప్లాస్టిక్‌ బ్యాగుల వాడడం మనకు అలవాటై పోయింది. తెలీకుండానే మన పరిసరాలు,భూమి,పర్యావరణం,ఆరోగ్యాలను తీవ్రంగా నష్టపరచుకుంటున్నాం.ఈ నేపథ్యంలో ముందుగా పర్యావరణాన్నీ, ప్రజారోగ్యాన్నీ తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్లాస్టిక్‌ మహమ్మారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం! ’’
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి 20లక్షల ప్లాస్టిక్‌ బ్యాగులు వినియోగించ బడుతున్నాయి.మన దేశంలో ప్రతి పౌరుడు సగటున ఒక్క సంవత్సరకాలంలో11కేజీల ప్లాస్టిక్‌(బ్యాగులు, బాటిల్స్‌, స్ట్రావంటివి) వాడటం జరుగుతున్నది.ప్లాస్టిక్‌ బాటిల్స్‌ భూమిలో కరిగి పోవడానికి 450ఏళ్లు,సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌బ్యాగులు కరిగిపోవడానికి వెయ్యి సంవత్స రాలు పడుతుంది.మొత్తంఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్‌లో కేవలం 9శాతం మాత్రమే రీసైకిల్‌ చేయబడుతున్నది. దాదాపు గా14ప్లాస్టిక్‌ బ్యాగుల ఉత్పత్తికి అవసరమయ్యే పెట్రోలియం నుండి ఒకమైలు దూరం వాహనం నడపటానికి అవసరమయ్యే గ్యాసును ఉత్పత్తి చేయవచ్చు. ప్రతి ఏటా పెద్దసంఖ్యలో పక్షులు,చేపలు,జంతువులు ప్లాస్టిక్‌వల్లచనిపోతున్నాయి.అంతరించి పోతున్న ప్రాణుల్లో దాదా పు700జాతులు ప్లాస్టిక్‌వల్ల ప్రభావితమైనట్లు గుర్తించారు.మనం తినే జలచరాల్లో(చేపలు,రొయ్యలువంటివి) మైక్రోప్లాస్టిక్‌ అవశేషాలు ఉం టున్నట్లు శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది.ప్లాస్టిక్‌ కాల్చి నప్పుడు విడుదలయ్యే డయాక్సిన్స్‌,ఫ్యురాన్స్‌, మెర్క్యురి,పాలిక్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌,పాలిసైక్లిక్‌ ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్స్‌ వంటి హానికరమైన రసాయనాలు మానవ ఆరోగ్యాన్నీ,మనం నివసించే భూమినీ,తాగే నీటిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను పోసి కాల్చడం మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏటా 20మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఉత్పత్తి అవుతోంది. దీని ఫలితంగా 60లక్షల మంది మరణిస్తున్నారని తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో కాల్చడంవల్ల దగ్గు,ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. మనం తినే ఆహారం,తాగే నీటిలో సూక్ష్మస్ధాయిలో ఉంటున్న ప్లాస్టిక్‌ పాలిమర్‌ అవశేషాల వలన క్యాన్సర్‌, చర్మవ్యాధులు,హార్మోన్లకు సంబంధించిన వ్యాధులు, సంతానలేమి,గుండెపోటు వంటి వ్యాధులు సోకుతు న్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉల్లాసంగా, ఆహ్లాదంగా గడపడానికి సందర్శించే సముద్ర తీరాలలో(బీచ్‌లలో)పడవేసే వ్యర్థపదార్ధాలలో 73శాతం ప్లాస్టిక్‌ ఉంటున్నది.ప్లాస్టిక్‌ బ్యాగులు, బాటిల్స్‌ వంటి ఉత్పత్తుల నుండి విడుదలయ్యే వ్యర్ధాలతో కలుషి తమైన సముద్ర జలాల వలన సముద్రంలో విస్తారంగాఉండి,ప్రపంచంలో పది శాతం ఆక్సిజన్‌ను కిరణ జన్య సంయోగక క్రియ ద్వారా అందిస్తున్న ప్రోక్లోరో కోకస్‌ అనబడే బ్యాక్టీరియా తీవ్రంగా దెబ్బతింటున్న ట్లు శాస్త్రజ్ఞులు గుర్తించారు.శాస్త్రజ్ఞుల అధ్యయనం ప్రకారం 2050 సంవత్సరం నాటికి సముద్రా లలో చేపలకంటే ప్లాస్టిక్‌ పరిమాణం ఎక్కువగా ఉంటుందని తెలు స్తోంది. ప్రస్తుతానికి నదుల్లోనూ, సముద్రా ల్లోనూ మన ఆహారం నిమిత్తం సేకరించే చేపల్లో ప్రతి మూడు చేపలలో ఒక్క చేప ప్లాస్టిక్‌ అవశేషాలు కల్గిఉన్నట్లు తెలుస్తోంది.నేడు ప్రపంచ వ్యాప్తంగా సగటు మనిషి తినేఆహారంలో ఒకవారానికి 5గ్రాముల మైక్రోప్లాస్టిక్స్‌ కణాలను తింటున్నట్లు శాస్త్రజ్ఞుల అంచనా.ప్రపంచ వ్యాప్తం గా 1974సంవత్సరం నాటికిప్లాస్టిక్‌ తలసరి విని యోగం 2కేజీలు ఉండగా 2023నాటికి 43 కేజీ లకు చేరుకున్నది.ఈవినియోగం నానాటికీ ఆందోళన కరంగా పెరుగుతున్నది.2060నాటికి ప్లాస్టిక్‌ తల సరి వినియోగం123కేజీలకు చేరనున్నట్లు అంచనా. ఇంత ప్రమాదకరంగా పరిణమించి గాలి, నీరు, నేల,మానవ ఆరోగ్యాలను కబళిస్తున్న ప్లాస్టిక్‌ విని యోగాన్ని ప్రభుత్వాల స్ధాయిలోనే కాకుండా ప్రజ లందరూ వ్యక్తిగత స్ధాయిలో దీని ప్రాధాన్యతను అర్ధం చేసుకుని సరైన దృక్పథంతో స్పందించకపోతే రానున్న తరాలకు మనం మిగిల్చేది క్యాన్సర్లు, ఆస్తమా,గుండెపోటువంటి అనారోగ్యమూ, కలుషిత మైన నేల,నీరు,గాలి మాత్రమే. రామేశ్వరం పోయి నా శనీశ్వరం వదలదన్న సామెతలాగా మన దృక్ప థం మార్చుకోకపోతే భూమిని వదిలి చంద్ర మం డలం పోయినా మనకు తిప్పలు తప్పవు.
వ్యక్తిగతంగా మనమేం చేయవచ్చు?
టీ,కాఫీ తాగడానికి ప్లాస్టిక్‌ కప్పులు కాకుండా మట్టి,సిరామిక్‌, స్టీల్‌ కప్పులు వాడాలి. కూరగాయలు,పండ్లు, కిరాణా సరుకులు తెచ్చుకునే ప్రతిసారీ క్లాత్‌ బ్యాగును తీసుకు వెళ్లాలి.చికన్‌, మటన్‌, పాలు వంటి పదార్ధాలు కొనుక్కురావడానికి స్టీల్‌ క్యాన్‌,బాక్స్‌ వాడాలి.బయటకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ,ప్రయాణాలలోనూ మంచినీళ్ల కోసం స్టీల్‌ బాటిల్‌ తీసుకువెళ్లాలి.బర్త్‌ డేలు,శారీ ఫంక్షన్లు,వివాహాలు,గృహప్రవేశాలు వంటి పలు సందర్భాలలో స్టీల్‌ గ్లాసులు మాత్రమే వాడాలి. ఫంక్షన్లలో ఇచ్చే రిటన్‌ గిఫ్ట్‌లు ప్లాస్టిక్‌వి కాకుండా పర్యావరణానికి మేలు చేసే…మొక్కలు,క్లాత్‌, జ్యూట్‌ బ్యాగులు వంటివి ఇవ్వాలి. ఇప్పటికే అనేక దేశా లలో ప్లాస్టిక్‌ బ్యాగులను నిషేధించడం జరిగింది. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ప్లాస్టిక్‌ వినియో గంపై జరిమానాలు కూడా విధిస్తున్నారు. అధికా రికంగా తెలుగు రాష్ట్రాలలో కూడా 120 మైక్రాన్ల సైజు కంటే తక్కువ మందం కల్గిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులను మరియు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించారు.
జులై 3 అంతర్జాతీయ ప్లాస్టిక్‌ బ్యాగు రహిత దినం సందర్భంగా…పర్యావరణ ప్రేమి కులు, ప్రజారోగ్య ఉద్యమకారులు, అభ్యుదయ వాదులు ప్లాస్టిక్‌ మహమ్మారిపై పోరును ఒక అత్య వసర ఉద్యమంగా చేపట్టాలి.పర్యావరణం, ప్రజా రోగ్య పరిరక్షణ కోసం,భావితరాలకు సురక్షిత మైన జీవితం కోసం…ప్లాస్టిక్‌ బ్యాగులు,బాటిల్స్‌ తదితర వస్తువులను బహిష్కరించాలి.క్లాత్‌ బ్యాగుల వాడ కాన్ని ప్రారంభించాలి. ఇందుకు అన్ని వర్గాల ప్రజ లూ స్వచ్ఛందంగా పూనుకుంటేనే సాధ్యం.
ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని పరిష్కరించడానికి పర్యాటకాన్ని పునర్నిర్మించడం
కోవిడ్‌-19 మహమ్మారికి ప్రతిస్పందన గా 2020లో పెరిగిన వ్యక్తిగత రక్షణ పరికరాల ఉత్పతి,వినియోగం బీచ్‌లు,ఇతర ప్రాంతాలలో ప్లాస్టిక్‌ కాలుష్యానికి గణనీయంగా దోహదపడిరదని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ప్లాస్టిక్‌ కాలు ష్యం పెరగడానికి దారితీసే కోవిడ్‌-19మహ మ్మారి మాత్రమేకాదు.కొత్త ఐక్యరాజ్యసమితి పర్యావ రణ కార్యక్రమం (ఖచీజుూ) నివేదిక,కాలుష్యం నుండి పరిష్కారం వరకు: సముద్రపు చెత్త మరియు ప్లాస్టిక్‌ కాలుష్యం యొక్క ప్రపంచ అంచనా, మహ మ్మారి కంటే ముందు కూడా ప్లాస్టిక్‌ కాలుష్యం సంవత్సరానికి పెరుగుతోందని చూపిస్తుంది. సము ద్రంలో ప్రస్తుతం75-199మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉన్నాయి మరియు 2016లో 9-14 టన్నుల వ్యర్థాలు జల జీవావరణ వ్యవస్థలోకి ప్రవేశించాయి. కానీ2040 నాటికి, ఇది దాదాపు మూడు రెట్లు పెరిగి సంవత్సరానికి 23-37 మిలి యన్‌ టన్నులకు చేరుకుంటుందని అంచనా. సముద్రపు చెత్తలో ప్లాస్టిక్‌లు అతిపెద్దవి, అత్యంత హానికరమైనవి మరియు అత్యంత నిరంతరాయంగా ఉంటాయి, మొత్తం సముద్ర వ్యర్థాల్లో కనీసం 85 శాతం వాటా కలిగి ఉంది. ప్లాస్టిక్‌ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు మానవ మరియు పర్యావరణ ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రయాణి కులు, ప్రభుత్వం ,సంస్థాగత విధానాలకు మార్పులు అవసరం.
ప్రయాణీకుల ఎంపికలు
సింగిల్‌-యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల విని యోగాన్ని తగ్గించడం మరియు కోవిడ్‌-19 ఇతర వ్యాధుల నుండి రక్షించడానికి ప్రజారోగ్యం మరియు పారిశుద్ధ్య చర్యలకు కట్టుబడి ఉండటం పరస్పర విరుద్ధం కాదని నిపుణులు అంటున్నారు. ‘‘మహ మ్మారి సమయంలో, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ కంటే స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ తక్కువ సురక్షి తమైనవి వంటి పునర్వినియోగ ఉత్పత్తులపై మేము అపోహను చూశాము’’అని యూనిస్కో ప్రోగ్రామ్‌ మేనేజర్‌ హెలెనా రేడిఅసిస్‌ చెప్పారు. ‘‘ఈ తప్పుడు అవగాహన వినియోగదారులచే సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచింది మరియు ప్రభుత్వ మరియు టూరిజం ఆపరేటర్ల నిబంధన లను ప్రభావితం చేసింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులు మరియు ప్యాకేజింగ్‌ స్వతహాగా శానిటై జేషన్‌ చర్యలు కాదు. వైరస్‌ వీటిపై జీవించగలదు వాటి రవాణా లేదా నిర్వహణ సమయంలో అవి కలుషితమవుతాయి. సెలవుదినం ప్రయాణీకులు ఖర్చులను ఆదా చేస్తూ వారు ఉత్పత్తి చేసే వ్యర్థాల మొత్తాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవచ్చని రే డి అసిస్‌ చెప్పారు. సొంతంగా బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు,టాయిలెట్లను తీసుకురావడం వల్ల స్థానిక వ్యర్థాలు మరియు రీసైక్లింగ్‌ మౌలిక సదుపాయా లపై భారం తగ్గుతుంది.ఇది సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై స్థానిక ఆర్థిక వ్యవస్థల ఆధారప డటా న్ని కూడా క్రమంగా తగ్గిస్తుంది.కోవిడ్‌ యొక్క క్లీన్‌ సీస్‌ ప్లాట్‌ఫారమ్‌ -సముద్ర ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అంతం చేయడానికి అంకితమైన అతిపెద్ద ప్రపంచ కూటమి-‘‘మీ బాత్రూంలో ఏముంది?’’అనే పేరుతో ఒక ఇంటరాక్టివ్‌ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. సాధారణ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ప్లాస్టిక్‌ వ్యాప్తిని హైలైట్‌ చేస్తుంది. ఈఉత్పత్తులు చాలా వరకు పర్యాటక వసతి గృహాలలో అందుబాటులో ఉన్నందున,ఆచరణీయ ప్రత్యామ్నాయాలకు మార డం ప్లాస్టిక్‌ ముప్పును తగ్గించడంలో సహాయపడు తుంది.
ప్రభుత్వ చట్టం
బీచ్‌లు,సముద్ర పర్యావరణ వ్యవస్థలపై ప్లాస్టిక్‌ కాలుష్యం ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయా ణికులు వసతి గృహాలు పునర్వినియోగ ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. అన్‌స్ప్లాష్‌/ జాన్‌ కామెరాన్‌ ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రేరణ కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించడానికి, తగ్గించడానికి లేదా దశలవారీగా తొలగించడానికి బలమైన చట్టం ప్రభావవంతమైన మార్గంగా చూపబడిరది. నిషేధాలు స్థానిక పర్యా టక రంగాన్ని ఆవిష్కరించడానికి, సందర్శకు లకు పర్యావరణ అనుకూల ఎంపికలను అందించ డానికి మరియు వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ప్రేరేపించగలవు. కెన్యాలో, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌లపై నిషేధం దాని ‘‘ప్లాస్టిక్‌ కాలుష్య విపత్తు’’ను పరిష్కరించింది, కెన్యా యొక్క పర్యాటక మరియు వన్యప్రాణుల మంత్రిత్వశాఖ క్యాబినెట్‌ సెక్రటరీ నజీబ్‌ బలాలా తెలిపారు. ‘‘నిషేధం తగ్గిన ప్లాస్టిక్‌ కాలుష్యంతో కెన్యా బీచ్‌లు మరియు జాతీయ పార్కుల స్థితిని మెరుగుపరిచింది’’అని బలాలా చెప్పారు.‘‘ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలి ఎందుకంటే మనం మన దేశాన్ని శుభ్రం చేసినప్ప టికీ,ఎత్తైన సముద్రాలలోని ఓడల నుండి విసిరి వేయబడే ప్లాస్టిక్‌లు మన బీచ్‌లకు తుడిచివేయ బడతాయి. అందువల్ల, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ల వినియోగాన్ని తగ్గించి,చివరకు పూర్తిగా రద్దు చేయా లని ప్రజలకు ప్రపంచవ్యాప్త విజ్ఞప్తిని చేయాలను కుంటున్నాను.
సంస్థాగత ప్రోత్సాహకాలు
టూరిజం ఆపరేటర్లు, వ్యాపారాలు సంస్థలు కూడా పరిశ్రమ ప్లాస్టిక్‌పై ఆధారపడ కుండా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వడానికి చొరవ తీసుకోవచ్చు. స్వచ్ఛందంగా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడంలో ముందుంటే వాణిజ్య ప్రయోజ నాలను పొందవచ్చు. తక్కువ చెత్త, ఉదాహరణకు, మరింత సుందరమైన వీక్షణలు మరియు ఎక్కువ మంది సందర్శకులకు దారి తీస్తుంది. కోవిడ్‌ నేతృ త్వంలోని గ్లోబల్‌ టూరిజం ప్లాస్టిక్స్‌ ఇనిషియే టివ్‌ (జీటీపీఐ),జాతీయ,స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేట్‌ కంపెనీలు మరియు పర్యాటక రంగంలోని సహాయ క సంస్థలు ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని తగ్గించడానికి 2025 నాటికి సర్క్యులారిటీకి మారడానికి కట్టుబడి ఉం డాలి.ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫారమ్‌ దీశీశీసఱఅస్త్ర. షశీఎ ప్లాస్టిక్‌ల వృత్తాకార ఆర్థిక వ్యవస్థను రూపొం దించడానికి కట్టుబడి ఉన్న జీటీపీఐకి సంతకం చేసిన 100మందికి పైగా ఒకటి.ఈ నిబద్ధతలో ఆరోగ్య ప్రోటోకాల్‌లను కొనసాగిస్తూ సింగిల్‌ యూ జ్‌ ప్లాస్టిక్‌లను తొలగించే దశలుఉన్నాయి. ‘‘ఆరోగ్యం మరియు భద్రత చాలా ముఖ్యమైనదని మేము అంగీకరిస్తున్నప్పటికీ, మా భాగస్వాములలో చాలా మందికి వారి ప్రాపర్టీలలో అధిక స్థాయి పరిశుభ్రత,పరిశుభ్రతను అందించే ప్రత్యామ్నాయ, ప్లాస్టిక్‌ రహిత మార్గాల గురించి తెలియదని మేము చూశా ము’’ అని సస్టైనబుల్‌ సప్లై,థామస్‌ లౌగ్లిన్‌ అన్నారు. బుకింగ్‌ డాట్‌.కామ్‌లో లీడ్‌ చేయండి. ‘‘అందుకే మేము జీటీపీఐ భాగస్వామ్యంతో రూపొం దించిన మా స్వంత మార్గదర్శకాలను ప్రచురించా ము. మాభాగస్వాములు విశ్వసనీయమైన, ఆచర ణాత్మక సమాచారం యొక్క విస్తృత శ్రేణికి ప్రాప్యత కలిగి ఉన్నారని మేము నిర్ధారించుకోవాలను కుంటు న్నాము,కాబట్టి వారు ఈ సవాళ్లను స్థిరమైన మార్గం లో ఎలా ఎదుర్కోవాలనే దాని గురించి మరింత సమాచారంతో నిర్ణయాలు తీసుకోగలరు. ఖచీజుూ తూర్పు ఆఫ్రికాలో ఉన్న ఒక సర్క్యులర్‌ ఎకానమీ ఉద్యమం అయిన ఫ్లిప్‌ఫ్లోపి మరియు రూట్స్‌ అడ్వెం చర్‌తో భాగస్వామ్యమై, కెన్యాలోని లాము పర్యాటక ప్రదేశంలో సెట్‌ చేయబడిన ‘‘పీసెస్‌ ఆఫ్‌ అస్‌’’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను విడుదల చేసింది. పర్యాటక ఆధారిత ఉత్పత్తులపై ఆధారపడే దిశగా స్థానిక ఆర్థిక వ్యవస్థను మార్చడంలో సందర్శకులు పోషిం చిన పాత్రను ఈ చిత్రం హైలైట్‌ చేస్తుంది. మహ మ్మారి-అమలు చేయబడిన మూసివేతలను అను సరించి,పర్యాటకులు, ప్రభుత్వాలు మరియు సంస్థలు పర్యాటక పరిశ్రమను దాని హృదయంలో స్థిర త్వంతో పునర్నిర్మించడానికి ఒకప్రత్యేకమైన అవకా శాన్ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్‌ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి మరియు పరిశుభ్రమైన, మరింత స్థితిస్థాపకంగా మరింత ఆర్థికంగా లాభ దాయకమైన భవిష్యత్తును నిర్ధారించడానికి సమయం ఆసన్నమైంది.-(డా.కె.శివబాబు)

1 2