హరిస్తున్న వలస కార్మికుల హక్కులు

అత్యధిక మంది వలస కార్మికులు వ్యవసాయం, పరిశ్రమలు, నిర్మాణ రంగాలలో కనిపిస్తారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో10శాతం వలస కార్మికుల శ్రమ నుండే వస్తోంది.అయితే, వలస కార్మికులు ఎంతమందివున్నారు? వారు ఏ రంగంలో పని చేస్తున్నారు? ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నారు? తెలుసుకునే వ్యవస్థ లేదు. పర్మినెంట్‌ వర్కర్ల కంటే ఏడు రెట్లు అధికంగా వలస కార్మికులు వున్నట్లు జాతీయ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ గణాంకాలు తెలియ జేస్తున్నాయి. దుర్బలమైన, ప్రమాదకరమైన, ఎటువంటి భద్రత లేని పరిస్థితులు ఈ రంగం లో నెలకొన్నాయి.2011జనాభా లెక్కల ప్రకారం45కోట్ల 60లక్షల మంది వలస కార్మి కులు ఉన్నారు. వీరిలో 41శాతం మంది తమంతట తాముగా వలస కార్మికులుగా మారలేదు. తమ ప్రాంతాలలో నెలకొన్న నిరుద్యోగం వలస వెళ్ళాల్సిన పరిస్థితికి నెట్టింది. వీరి జనాభా లెక్కలు సరిగా వుండవు. వాటి మీద ఆధారపడలేం. ఐక్యరాజ్యసమితిలో భాగంగా ఉన్న విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ 2013లో దేశంలో అంతర్గతంగా తిరిగే వలస కార్మికులు కోటిన్నర నుండి10కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఏరకంగా చూసినా భారతదేశంలో వలస కార్మికులు అసంఘటిత రంగంలో అత్యధికంగా ఉన్నట్లు తేలుతుంది. అందుకని వీరి పట్ల అధిక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.ముఖ్యంగా పేదరికం,దుర్బలత,అభద్రత,ఉద్యోగంలో పెట్టుకునే పద్ధతికి…ఈ కార్మికుల సామాజిక స్థాయికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్ధం చేసు కోవాలి. ఈ కారణంగా వీరు ప్రమాదక రమైన,అతి తక్కువ వేతనాలున్న పనులను చేయాల్సి వస్తోంది. కుల,లింగవివక్షలను ఎదుర్కొంటున్నారు.కీలక రంగాలైన వ్యవ సాయం,పరిశ్రమలు,నిర్మాణరంగాల కార్య కలాపాలు వీరు లేనిదే నడవవు. కానీ వీరి కనీస భద్రత, న్యాయమైన వేతనాలను పట్టించు కునే దిక్కులేదు. వలస కార్మికులకు వర్తించే ప్రస్తుత చట్టాలు లేబర్‌ కోడ్లలో భాగం కాను న్నాయి. లేబర్‌ కోడ్‌లు అమలులోకి వచ్చే లోపు ‘అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల (పని మరియు సర్వీసు కండిషన్ల క్రమబద్ధీకరణ) చట్టం-1996, అసంఘటిత కార్మికులసామాజిక భద్రతా చట్టం-2008 అమలులో వుంటాయి. కోవిడ్‌ సమయంలో వలస కార్మికులు ఎదు ర్కొన్న విషాదకర పరిస్థితులను, ఆరోగ్య-సామా జిక భద్రతా వైఫల్యాలను గమనించిన అత్యు న్నత న్యాయస్థానం తనంత తానుగా వీరి తరపు న కేసు తీసుకొని అనేక నిర్ధారణలకు వచ్చింది. అయితే ఈలోగా వలస కార్మికుల చట్టం-1997ను ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ, ప్రభుత్వానికి అనేక ఆదేశాలను, సిఫార్సులను పంపింది.అత్యున్నత న్యాయస్థానం 2020 మే 28న, 2020 జూన్‌ 9న ఇచ్చిన తీర్పుల ద్వారా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాలను, లోపాలను ఎత్తిచూపింది. ఈ కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపర్చటానికి అనేక ఆదేశాలు ఇచ్చింది. కాని ఇవి ప్రధానంగా వలస కార్మికులకు ఉన్న పథకాలు, విధానాలకు పరిమితమైనవి. స్వస్థలాలకు తిరిగి వెళ్ళిన కార్మికుల సంఖ్యను గుర్తించమన్నది. 2020, జులై 31న ఇచ్చిన ఆదేశాలలో మాత్రం పైన పేర్కొన్న కార్మిక చట్టాల అమలు వివరాలను కూడా అన్ని ప్రభుత్వాలు తనకు సమర్పించమని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిన సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులకు ఉపశమనం కలిగించాయి. తమ ఖర్చుతో రైళ్ళు,బస్సులను నడిపించాయి. తాను ఇచ్చిన ఆదేశాల అనంతరం…రాష్ట్ర ప్రభు త్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన సమాచారంలో…వాస్తవాలను,గణాంకాలను పేర్కొనలేదని సుప్రీంకోర్టు గుర్తించింది. అందు కని చట్టాల అమలులో భాగంగా వలస కార్మికు లను పెట్టుకునే సంస్థలను రిజిస్టర్‌ చేయాలని, లైసెన్సులను జారీ చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. ‘వలస కార్మికుల కష్టాలు-సమస్యలు’లో భాగంగా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌ స్థితిపై ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు (2021మే 24న) ఆదేశించింది. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందకపోవటంతో ఈ ఆదేశాలు ఇచ్చింది. దీనితో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో 2021 ఆగస్టు 26న రూ.704 కోట్ల ఖర్చుతో వలస కార్మికులతో సహా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌కు ‘ఈ-శ్రమ’ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. 2021 డిసెంబర్‌ ఆఖరులోగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికులు/వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.ఈ-శ్రమ’ రిజిస్ట్రేషన్‌కు కార్మికుల నుండి స్పందన చాలా పరిమితంగా వుంది. అందులో వారికి ఎలాంటి ప్రయెజనం కనపడకపోవడం అందుకు కారణం. పైగా‘ఈ-శ్రమ’ నెట్‌ సౌకర్యంతో కూడుకున్నది కావడంతో కార్మికులు దీనిలో తమంత తాముగా రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు.ఇప్పటికే నిర్మాణ (సెస్సు-సంక్షేమ పథకాలు), వ్యవసాయ రంగాలలో (రైతు బంధు పథకం) పరిమితమైన ఇతర పథకాలు ఉన్నాయి.140 రకాల వృత్తులలో కార్మికులు పనిచేస్తున్నట్లుగా గుర్తించామని మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ తాము ఏరకమైన సామాజిక భద్రతను ప్రవేశపెట్టేదీ ఇంత వరకు నిర్ణయిం చలేదు. ‘ఈ-శ్రమ’ లో రిజిస్ట్రేషన్‌కు ఇ.పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ ఉన్న వారు అర్హులు కారు. సంఘటిత రంగంలో పని చేసే లక్షలాది మంది కాంట్రాక్టు వర్కర్లు, చిన్న మధ్యతరహా సంస్థల్లో పని చేసే కార్మికులకు ఈ రెండూ ఇప్పటికే ఉంటాయి. కాబట్టి వారు రిజిస్ట్రేషన్‌ చేసుకోలేరు. వలస కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ‘వలస కార్మికుల చట్టం-1979’ రద్దును ప్రకటించింది. దీనికి బదులుగా వచ్చేటటువంటి కోడ్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల కష్టాలను పెంచుతుంది. 1979 చట్టం యజమానులకు, కాంట్రాక్టర్లకు, సబ్‌ కాంట్రాక్టర్లకు నిర్ద్ఱేశిత ఆదేశాలు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మికులను పెట్టుకోవాలంటే ముందుగా వీరు రిజిస్టరై ఉండాలి. ప్రతి వలస కార్మికుని సమాచారాన్ని, వారికి చెల్లించే వేతనాల వివరాల నమోదును స్పష్టీకరించింది. ఇవన్నీ ఇప్పుడు కోడ్‌లో లేవు. ఇటీవల అగ్ని ప్రమాదాలలో కార్మికులు చనిపోయినప్పుడు వారి గుర్తింపుకు వ్యక్తిగత రికార్డులు లేక పోవటం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడు తుంది. వారు పలానా వారు అని గుర్తించ టానికి వంశీకుల డిఎన్‌ఎ లను పరీక్షించాల్సి వచ్చింది. యజమానులు తమ దగ్గర ఉన్న వలస కార్మికుల నియామకం,నమోదు, రవాణా, నివాసం,కనీస వేతనం,కాలనుగుణ వేతనాలు తదితర సమాచారాన్ని తప్పకుండా నిర్వహిం చాలని 1979చట్టం నిర్దేశించింది.వేతనాల చెల్లింపు,ఆరోగ్య సౌకర్యాల కల్పన,పని ప్రదేశం లో రక్షణ కల్పించే డ్రస్సులు,మంచినీటి సౌక ర్యం,క్యాంటిన్‌,మరుగుదొడ్లు, విశ్రాంతి గదుల ఏర్పాటు, ప్రయాణ ఖర్చులను గ్యారంటీ చెయ్య టానికి-అయ్యే మొత్తం ఖర్చులో40శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా లైసెన్సింగ్‌ అధికారి తీసుకుంటారు. కాంట్రాక్టర్లుగానీ, ముఖ్య యజమాని గానీ వేతనాలు చెల్లించకపోతే ఈ నిధి నుండి చెల్లిస్తారు.ఈహామీలను లేబర్‌ కోడ్‌లో ఉపసంహరించారు.1979 చట్టంలో ఇంకొక ముఖ్యమైన నిబంధన ప్రకారం వలస కార్మికులు పారిశ్రామిక వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని…తాము పనిచేసే ప్రాంతాలు, స్వస్థలాలు రెంటిలోనూ వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా వలస కార్మికు లకు వర్తించే ఇటువంటి 4 చట్టాలను కూడా కోడ్‌ ఒక్క కలం పోటుతో స్వాహా చేసింది.వీధి వ్యాపారులతో సహా అందరికీ సామాజిక భద్రత కల్పించబడుతుందని కేంద్ర కార్మిక మంత్రి ప్రకటించారు. ఇంత వరకు దానికి సంబం ధించిన ఎటువంటి పథకం తయారు కాలేదు. కానీ వలస కార్మికుల రిజిస్ట్రేషన్‌ పరిమితి 5 నెలల నుండి 10 నెలల వరకు పొడిగించారు. రిజిస్ట్రేషన్‌ వలన వలస కార్మికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.పెద్ద సంఖ్యలో వలస కార్మి కుల హక్కులు నిరాకరించబడ్డాయి. అంతకు ముందున్న అనేక సౌకర్యాలను వలస కార్మికులు కోల్పోతారు.
మీకు ఉద్యోగం కావాలా, హక్కులు కావాలా?’’
ఒక నిరుద్యోగి ఉద్యోగం కోరుకుంటాడా, హక్కు లు కోరుకుంటాడా? భారత్‌లో కులవ్యవస్థ కార్మి కులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కార్మి కుల హక్కులు, సంక్షేమం, ఐక్యత కోసం సుదీర్ఘ కాలం కృషిచేసిన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ ఈఅంశాలపై ఏమన్నారు?
‘‘ఒక నిరుద్యోగికి ఎంతో కొంత వేతనమున్న, నిర్దిష్టమైన పనిగంటలు లేని ఒక ఉద్యోగం ఆఫర్‌ చేశారు. అతడికి ఒక షరతు పెట్టారు. ఉద్యోగ సంఘంలో చేరే హక్కు, భావ ప్రకటనా హక్కు, నచ్చిన మతాన్ని ఆచరించే హక్కు, ఇతర హక్కులు ఉండవని చెప్పారు. ఇప్పుడు ఆ నిరుద్యోగి ఏ నిర్ణయం తీసుకుంటారనేది స్పష్టం. ఆకలి భయం, ఇల్లూవాకిలీ కోల్పోతాననే భయం, ఏమైనా పొదుపు చేసుకొనుంటే ఖర్చయి పోతుందేమోనన్న భయం ఆ నిరుద్యోగికి కలుగు తాయి. ఈ భయాందోళనలు చాలా బలమైనవి. వీటివల్ల ఎవరూ తమ ప్రాథమిక హక్కుల కోసం నిలబడలేరు’’ అని అంబేడ్కర్‌ చెప్పారు. కేవలం లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ పౌరుడి ప్రాథమిక హక్కులను ఎలా దెబ్బ తీయగలదో సోదాహరణంగా చెబుతూ ఆయన ఒక సందర్భంలో ఇలా రాశారు. ఎనిమిది గంటల పనిగంటలు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు కార్మికుల ప్రయోజ నాలు కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ఫలితా లను కార్మిక వర్గం నేటికీ పొందుతోంది. లాభా ర్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ రెండు రాజకీయ ప్రజాస్వామిక సూత్రా లకు విఘాతం కలిగిస్తుం దని అంబేడ్కర్‌ చెప్పారు. వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమా న్యాలు నిర్దేశిస్తాయని, అలాగే జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పో వాల్సి రావొచ్చని పేర్కొన్నారు.‘కుల వ్యవస్థ పనినే కాదు, కార్మికులనూ విభజిస్తుంది’ భారత సమాజ తీరును లోతుగా పరిశోధించిన అంబే డ్కర్‌, కులానికి, పనికీ సంబంధముందని గుర్తించారు. కుల వ్యవస్థ పని విభజనకు సంబంధించినదనే వాదనను ఆయన తిరస్క రించారు.ఈ సమాజం పనినే కాకుండా కార్మికు లను కూడా విభజించి చూస్తోందని, ఇది అసహజమైనదని, ఏ నాగరిక సమాజంలోనూ ఇలా ఉండదని వ్యాఖ్యానించారు. కార్మికుల విభజనను హిందూ సమాజ నిర్మాణమే ఆమో దించి, కొనసాగిస్తోందని, ఈ విభజనలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే వర్గీకరణ ఉందని చెప్పారు. కార్మికులను ఇలా చూసే పని విభజన మరే దేశంలోనూ లేదన్నారు.పని విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండాలని, కానీ కుల వ్యవస్థ సృష్టించిన కార్మిక విభజన వ్యక్తుల ఇష్టాయిష్టాలపై ఆధారపడినది కాదని అంబేడ్కర్‌ వివరించారు.వ్యక్తి తన సామ ర్థ్యాల ప్రాతిపదికన కాకుండా అతడు పుట్టిన కులం ప్రాతిపదికగా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. అంటరాని కులాలుగా పిలిచే కులాలకు అపరిశుభ్రమైన,తక్కువ స్థాయి పనులను, ఇతర కులాలకు శుభ్రమైన, గౌరవప్రదమైన పనులను కుల వ్యవస్థే కేటాయిస్తుందని ఆయన ప్రస్తావించారు.– అమితవ్‌ గుహ