సెకండ్‌వేవ్‌..పెద్ద పీడకల

తొలిదశ కరోనాలో తీసుకున్నంత ముందుస్తు జాగ్రత్తలు,సెకండ్‌వేవ్‌లో తీసుకోకపోవడంవల్ల ఎందరో కుటుంబాల్లో ఆత్మీ యులు,బంధువులు,అభాగ్యుల ప్రాణాలు విడిచారు. నిజానికి ఒక యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం.ఆస్పత్రికి వచ్చే కేసులన్నీ సీరియస్‌ కేటగిరీలే…అంతా ఆక్సిజన్‌తో అంబులెన్సుల్లో వచ్చేవారే. పడకలన్నీ ఫుల్‌.. బయట అంబులెన్సుల వరస..ఎన్నో ఒత్తిళ్లు.. మరెన్నో నిద్రలేని రాత్రులు ప్రజలు గడిపారు. ఇలా కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఒక పెద్ద పీడకల లాంటిది. ఫస్ట్‌వేవ్‌లో కేసులు తగ్గిపోవడంతో.. దేశ ప్రజలంతా తప్పట్లు కొట్టి పంపిస్తూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సెకండ్‌వేవ్‌ పంజా విసిరింది.ఫస్ట్‌వేవ్‌లో ఆక్సిజన్‌, ఐసీయూ అవసరం ఉండే రోగుల సంఖ్య తక్కువ. మైల్డ్‌,మోడరేట్‌ కేసులే ఎక్కువగా వచ్చేవి. అలాంటి వారికి నిర్ణీత సమయంలో చికిత్స అందిస్తే కోలుకునేవారు. సెకండ్‌వేవ్‌లో వచ్చేవారంతా ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ రోగులే అధికమయ్యారు. విశాలమైన భారత దేశంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను మెరుగు పరచాలి. సెకెండ్‌ వేవ్‌లో ప్రభుత్వాలు ముందుస్తు ప్రణాళికలు, హెచ్చరికలు చేయక పోవడం వల్ల కరోనా మహమ్మారి లక్షలాది మందిని బలితీసుకుంది.

మన దేశంలో ప్రజా ఆరోగ్యవ్యవస్థ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఆరోగ్య సంరక్షణ అనేది దేశంలో ముఖ్య విభాగం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చందుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది కేవలం వ్యాధి నివారణ,పరీక్షలు,చికిత్సలకే కాదు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడే విధంగా పనిచేయాలి.కానీ సెకెండ్‌వేవ్‌ కరోనా వ్యవహారంలో ప్రభుత్వాలు తగిన సమయంలో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించలేక పోవడం వల్లే అధికంగా ప్రాణనష్టానకి గురయ్యాం. భారత దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లు విదేశాలకు ధారదత్తం చేశాం. ప్రమాదఘటికలు మన దేశానికి సంబంధించినప్పడు వాక్సిన్లు పూర్తిస్థాయిలో దేశ ప్రజలకు వేయించలేని దుస్థితి దాపురించింది. ప్రజల నుంచి పన్నుల రూపంలో తీసుకున్న డబ్బునే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఖర్చు చేస్తుంది. ముందుస్తు ప్రణాళికలు లేక పోవడం,వ్యాక్సినేషన్‌ క్షేత్రస్థాయిలో వేయక పోవడం వల్ల కరోనా సెకెండ్‌ వేవ్‌ విస్తరించింది. పైకి మాత్రం ప్రభుత్వాలు కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేంద్రమే చెబుతోంది. కానీ,విధాన నిర్ణేతలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో వినడంగానీ,తెలుసుకోవడంగానీ చేయక పోవడం బాధాకరం.కరోనాపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ‘ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి తాత్కాలికంగా, రోజువారీ పోరాటం కుదరదని.. స్పష్టమైన విధానం ఉండాలని స్పష్టం చేసింది. గ్రామీణ భారతంలో పరిస్థితి డిజిటల్‌ ఇండియా నినాదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. జార్ఖండ్‌లో నిరక్షరాస్యుడైన ఓ కూలీ.. రాజస్థాన్‌లో టీకా వేయించుకోవడానికి ఎలా రిజిస్టర్‌ చేయించుకోగలడు? దేశంలో ఏం జరుగుతోందో, క్షేత్ర స్థాయి పరిస్థితేంటో ప్రభుత్వం తెలుసుకోవాలి. తదనుగుణంగా విధానం మార్చుకోవాలి’ అని వ్యాఖ్యానించింది.’

అజాగ్రత్త వద్దు

కరోనాపై ప్రజల్లో అవగాహన మరింతగా పెరిగాలి. వ్యాక్సిన్లు వచ్చాయన్న ధైర్యం కావొచ్చు.. మన దాకా వైరస్‌? రాదన్న ఓవర్‌? కాన్ఫిడెన్స్‌? కావొచ్చు..చాలా మంది మాస్కులే పెట్టుకోవట్లేదు. భూతిక దూరాన్ని పాటించట్లేదు. కరోనా వ్యాక్సిన్లు వచ్చినా ఇప్పుడే అందరికీ అందవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరిదాకా అది చేరాలంటే ఇంకో ఏడాదైనా పట్టొచ్చు. అప్పటిదాకా కరోనాను ఎదుర్కొనే మందు, ఆయుధాలు మాస్క్‌?, సోషల్‌? డిస్టెన్స్‌?లే. ఈ బేసిక్‌? కరోనా రూల్స్‌?పై చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనా సెకండ్‌? వేవ్‌? జోరుమీదుంది. కాబట్టి అంతా మాస్క్‌? పెట్టుకుంటూ, కనీస దూరం పాటిస్తేనే మనల్ని మనం కాపాడుకోగలమని నిపుణులు చెప్తున్నారు. చివరిగా..శానిటైజర్‌? లేదా సబ్బుతో చేతులు కడుక్కోవడం కూడా మరచిపోవద్దు! ప్రభుత్వాలు కూడా కేవలం వీటిపైనే కాకుండా కాలుష్యాన్ని నివారించే చర్యలపై దృష్టి సారించాలి. వ్యవసాయరంగంలో రసాయనిక ఎరువులు తగ్గిస్తూ సేంద్రియ ఎరువులపట్ల రైతులకు అవగాహన కల్పించాలి. అదే విధంగా నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. – రెబ్బాప్ర‌గ‌డ ర‌వి