సామాజిక విప్లవకారిణి సావిత్రిభాయి ఫూలే

తలపై ముసుగు ధరించిన ఓ యువతి బడిలో పాఠాలు చెప్పడానికని వడివడిగా నడిచి వెళ్తోంది. ఆమెను చూసిన ఒక బ్రాహ్మణ స్త్రీ ఆగ్రహంతో అసలిదేంపని? అంటూ అవమానిస్తూ… పేడ ముద్దలు విసిరారు. కుల ప్రసక్తి లేని – ఒక బాలికల పాఠశాలను ప్రారంభించేందుకు వెళుతున్న సందర్భంగా 1851వ సంవత్స రంలో సావిత్రిబాయికి ఎదురైన అనుభవం ఇది. అయినా ఆమె భయపడలేదు. తన లక్ష్యసాధన కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనడానికైనా సిద్ధపడిరది. సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి 186వ జన్మదినం సందర్భంగా జనవరి 3న ‘గూగుల్‌ ’ ఆమెకోసం ప్రత్యేకంగా నివాళి అర్పించటం ఆమెకే కాదు.. మన దేశానికే గర్వకారణం.
పశ్చిమ మహారాష్ట్రలోని సతారా జిల్లా నయ్‌గావ్‌ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3వతేదీన సావిత్రీబాయి జన్మిం చారు.ఆనాటి సంప్ర దాయం ప్రకారం ఆమెకు తొమ్మిదోవ ఏటనే జ్యోతీరావుతో వివాహమైంది. భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె పూర్తి విద్యావం తురాలైంది. సామాజిక పరివర్తనను సాధిం చింది. తన భార్య జ్ఞానం కుటుంబానికే పరిమితం కారాదనీ, ప్రజలందరికీ విద్యనం దించగల శక్తిగా ఆమె అవతరించాలనీ జ్యోతీరావుపూలే ఆశించారు.1848లో జ్యోతీరావుపూలే ‘పూనే’లో తొలి బాలికా పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలకు సావితత్రీబాయి ప్రధానోపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఈ పాఠశాలను నిర్వహి స్తున్నందుకు అన్ని సామాజిక వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీ బాయి దంపతులను గృహ బహిష్కారానికి గురి చేశారు.1852వ సంవత్సరంలో ‘మహిళా సేవామండల్‌’ అనే మహిళా సంఘాన్ని సావిత్రీబాయి స్థాపించారు. అనంతరం 1853లో అనాధలుగా మారుతున్న శిశువుల కోసం ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ స్థాపన శరణా లయాన్ని స్థాపించారు. దిక్కులేని స్త్రీలకు, పిల్ల లకు సావిత్రీబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారిపోయింది. బాల్యంలోనే వైధ వ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్ల లకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవ తులైన వారికి పురుళ్లు పోసివారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దే వదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకు న్నారు.యశ్వంత్‌గా నామకరణం చేసి తమ ఆశ యాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేశారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచి,క్షురకులను చైతన్యపర్చి,వితంతువులకు శిరోముండనం చేయ బోమంటూ క్షురకుల చేత1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి.తరువాత 1873 సెప్టెంబరు 24న‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక,ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావి త్రీబాయి నేతృత్వంలో నడిచేది.వివాహాలు వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపిం చారు. పండుగలు, పబ్బాలు వంటి ఆర్భాటాల కోసం శక్తిని మించిన ధనాన్ని ఖర్చుచేస్తూ కుటుంబా లను నెడుతాయో, కుటుంబాలను ఎంతగా నాశనం చేస్తాయో తెలియజేస్తూ ఆమె రాసిన వ్యాసాలు 21వ శతాబ్ధానికి కూడా నిత్య నూతనంగానే కనపడతాయి. కరువు బారిన పడిన కుటుంబాలలోని అనాథ బాలల కోసం 52 పాఠశాలలను వాళ్లు నిర్వహించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతి రేకంగా పోరాడారు. జ్యోతీరావుపూలే.1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు.తన భర్త పూలే చితికితానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.1897లో ప్లేగు వ్యాధి,పూణే నగరాన్ని వణికించింది. నగర మంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్‌ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.చివరికి ఆప్లేగు వ్యాధే ఆమెను మార్చి10,1897లో కబళిం చింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రి యలు జరిపించారు. ఆనాటి ప్రజల స్థితిగతు లు,అవిద్య,సాంఘిక దురాచారాలు,సతీ సహగ మనం,బాల్యవివాహలు సావిత్రీబాయిని కదిపే శాయి. వీటిని నిర్మూలించడానికి అవసరమైన చైతన్యం పెరగాలంటే విద్య అందరికి అందు బాటులోకి రావాలని విశ్వసించారామె. బాలి కల కోసం పాఠశాలలు ఏర్పాటు చేయడం మొదలెట్టారు. తద్వారా సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కృషి చేశారు. తన దగ్గర చదువుకున్న పిల్లలు,పెద్దలు స్వేచ్ఛ కోసం స్వాతంత్య్ర పోరాటంలో ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో విద్యా వ్యాప్తికి చేపట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అక్షరాస్యతను సాధించలేక పోయినా,విద్య బలోపేతానికి ప్రభుత్వమే బాధ్యత పడిరది. కాని ప్రస్తుత సమాజంలో ఫూలే ఆశించిన లక్ష్యా లకు తూట్లు పొడుస్తున్నారు. రెండు దశాబ్దాలు గా చేపడుతున్న విద్యా సంస్కరణలు వ్యాపార వర్గాలకు లాభాలు చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలుతో పాఠశాలల మూత,క్లస్టరైజేషన్‌, మతతత్వ ధోరణులు సిలబస్‌లో జొప్పించడం,విద్యా హక్కు చట్టాలను నిర్వీర్యం చేయడం,రాష్ట్రాలవిద్యాహక్కు చట్టాలపై పెత్తనం వంటి వాటికి పూను కుంటున్నది. నేటి విద్యారంగ సంస్కరణలు బడుగు, బలహీన సామాజిక వర్గాల వారికి మరలా విద్యను దూరం చేసేవిగా ఉన్నాయి. మాతృభాషలో శూద్ర కులాల వారికి పాఠ శాలలు పెట్టించిన ఫూలే ఆశయానికి భిన్నంగా నేడు పాఠశాలలు మూసివేస్తున్నారు. వెరసి బాలికలు పెద్ద సంఖ్యలో చదువుకు దూరం అవుతున్నారు. అవిద్య, బాల్య వివాహాలపై పోరాటం,సతీ సహగమనం వంటి వాటిపై చైతన్య పరిచి, నిషేధించడం వంటివి సమా జానికి మేలు చేసిన సంఘటనలు. సామాజిక దురాచారాలను తిప్పి కొట్టాలంటే చదువే కీలకమని నిరూపించింది సావిత్రీబాయి ఫూలే. నేడు నూతన రూపాల్లో మతం,కులం, సంప్ర దాయాల పేరుతో స్త్రీలపై, బాలికలపై జరుగు తున్న దాడులు చూస్తున్నాం. దుస్తులు, హిజాబ్‌, సంప్రదాయాలు, ఆహారం పరంగా ఆంక్షలను గమనించినట్లయితే ఇవన్నీ సమాజాన్ని మను వాదం లోకి తీసుకెళ్తున్నాయి. మరలా ఇటు వంటి ఘటనలు ప్రజాస్వామ్య భారత దేశంలో పునరావృతం అవుతున్నాయంటే స్త్రీలకు వ్యతి రేకంగా నిర్ణయాలు చేస్తున్నారనే అర్థం.ఫూలే స్ఫూర్తితో ఇటువంటి విధానాలపై పోరాటాలకు సిద్ధపడాలి.సమకాలీన సమాజంలో సామాజిక అంతరాలను పెంచే విధానాలపై కళారూపాల ద్వారా చైతన్యపరచాలని,సాంస్కృతిక,జానపద అంశాలలో మహిళా టీచర్లజోక్యం పెరగాలని, మూఢ విశ్వాసాలను పారదోలడానికి జానపదాలను ఎంచుకోవాలని, సాంఘిక దురాచారాలపై నిరంతరం పోరాడాలని ఆచరణలో చూపించారు సావిత్రీ బాయి ఫూలే. కాని ప్రస్తుత బిజెపి ప్రభుత్వ విధానాలు పాఠ్యపుస్తకాలలో మతతత్వాన్ని చొప్పిస్తున్నాయి. లౌకిక, రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నాయి. బాలికా విద్య కోసం, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు, కుల మత తత్వాలకు వ్యతిరేకంగా సావిత్రీ బాయి పోరాడారు.
సామాజిక వైతాళికురాలు ప్రపంచవ్యాప్తంగా జాతి విముక్తి పోరాటాలు జరుగుతున్న రోజులవి.మన దేశం కూడా బ్రిటీష్‌ పరాయిపాలనలో ఉన్నప్పుడు ఎక్కడి కక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం ఉద్యమాలు ఊపందు కున్నాయి.ఆ కాలంలోనే అనేకమంది సంస్కరణల కోసం ప్రాణాలుఅర్పించారు. భారత తొలి మహిళా ఉపాధ్యాయినిగా, సామాజిక వైతాళికురాలిగా…బాలికావిద్య కోసం,బడులు పెట్టడం కోసం సావిత్రీబాయి ఫూలే చేసినత్యాగాలు,కనబరచిన పట్టుదల మనందరికీ ఆదర్శనీయం.విద్యా వ్యవస్థపట్ల, విద్య సమాజానికి దారి చూపే తీరుపట్ల ఆమెకు ఎంతోస్పష్టత ఉంది. 1881లో లార్డ్‌ రిప్పన్‌, హంటర్‌ అధ్యక్షతన విద్యాకమిషన్‌ను నియ మించేటప్పుడు మాతృభాషలో విద్య అందిం చాలని, శూద్ర,అతిశూద్ర కులాల వారికి పాఠశాలలు పెట్టాలని,పేదరికం వలన దిగువ కులాల పిల్లలకు 12సంవత్సరాల వయసు వరకు ఉపకార వేతనం మంజూరు చేయాలని మహర్‌,మాంగ్‌ (గిరిజన తెగ) కులస్థులకు ప్రత్యేక పాఠశాలలు పెట్టాలని ప్రతిపాదనలు పెట్టారు ఫూలే. సమాన హక్కులు నినాదంతో అట్టడుగు వర్గాలవారికి బడులు పెట్టి విద్యనం దించేందుకు కృషి చేశారు. స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటిష్‌ పాలకుల ఎజెండాలో, స్వాతం త్య్రం వచ్చాక మన రాజ్యాంగంలో పైఅంశాల న్నింటికీ చట్టబద్దత కల్పించాలని,సమసమాజం స్థాపించాలని సావిత్రీ బాయి ఫూలే ఆశిం చారు.ఆకృషి ఫలితమే నాటి సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బాలికల పాఠశాలలు. కాని నేటికీ విద్యాభివృద్ధికి కుల వ్యవస్థ ఆటంకంగానే ఉంది. కులతత్వాన్ని, మతత త్వాన్ని పెంచి పోషించే విధానాలను ప్రస్తుతం చూస్తున్నాము. ఇప్పటికీ బడుగు వర్గాల పిల్లలు చదువుకి దూరంగా ఉన్నారు. మొత్తం అక్షరాస్యతలో మహిళల అక్షరాస్యత 64 శాతం మాత్రమే. ఇటువంటి గణాంకాలు దేశ అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడవు. విద్యకు దూరంగా ఉండే ప్రాంతాలు, వర్గాల వారు నిరంతరం దోపిడికి గురవుతారని అనేక అంశాలు సూచిస్తున్నాయి. బాల్య వివాహాలు, అత్యా చారాలు, లైంగిక వేధింపులు, ఉపాధి, కార్మిక శక్తిలో 34 దేశాలతో పోల్చుకుంటే 24వ స్థానంలో ఉన్నాం. సరికొత్త సమస్యలు విద్యారం గంలో మొదలయ్యాయి. ఈ అవశేషా లను రూపుమాపాలంటే సావిత్రీబాయి సూచించిన సామాజిక ఉద్యమాలను నిర్మించాలి. అది మనందరి కర్తవ్యం.స్త్రీలు చదువు నేర్చుకోవడమే అరుదైన కాలంలో బాలికలకు పాఠశాలలో విద్య నేర్పడానికి తన భార్య సావిత్రిని విద్యా వంతురాలిని చేసి దేశానికి తొలి ఉపాధ్యా యురాలిని అందించారు జ్యోతిరావు ఫూలే. విద్యపై, ఉపాధ్యాయులపై, విద్యార్థులపై ఎంతో ప్రభావితం చేయగలిగిన ఆమె స్ఫూర్తిదాయక చరిత్ర మన దేశానికి ఎంతైనా అవసరం. సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పెద్దలు ఆమె విగ్రహాలకు పూలమా లలు వేసి సరిపెట్టుకుంటే సరిపోదు. ఆమె ఆశ యాలకు కార్యరూపం ఇవ్వవలసిన బాధ్యత చేపట్టాలి. అలాగే ఆమె జయంతి రోజును జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి.-(కె.విజయగౌరి)