సంక్షోభంలో రాజ్యాంగ సంస్థలు

‘‘ అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీనపడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేద్కర్‌ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఫ్న్‌ సర్కారుపైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది.’’

రాజ్యాంగం సంక్షేమ సూత్రాల సమాహారం. వీటి ప్రకారం రాజ్య నిర్మాణం,ప్రజాస్వామ్య పాలన సాగుతాయి. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అతిక్రమించరాదు. రాజ్యాంగ,రాజ్యాంగేతర,ప్రజాస్వామ్య, శాసనసంస్థలు ప్రజా సంక్షేమ సంస్థలు. వీటి విధ్వంసం వినాశకారకం. రాజ్యాంగం ఏర్పర్చినవి రాజ్యాంగ సంస్థలు. వివిధ రాజ్యాంగ అధికరణల ద్వారా 20 రాజ్యాంగ సంస్థలు ఏర్పడ్డాయి. అవి: దేశ,రాష్ట్ర ఆర్థిక సంఘాలు (ఎఫ్‌సీ),వస్తుసేవల శిస్తు సంఘం, సమాఖ్య, రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్లు, దేశ,రాష్ట్ర ఎన్నికల సంఘాలు (ఈసీ), కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అటార్నీ జనరల్స్‌, భారత కంట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (సీఏజీ),జిల్లాల, మెట్రొపాలిటన్ల ప్రణాళిక సంఘాలు, అంతర్రాష్ట్ర మండలి,ఎస్సీ,ఎస్టీ,బీసీల జాతీయ కమిషన్లు, ఆదివాసీ ప్రాంతాల, ఎస్టీ, బీసీల అధికార భాష కమిషన్లు, పార్లమెంటు అధికారభాష కమిటి,మైనారిటి భాషల ప్రత్యేక అధికారి. సీఏజీ,ఈసీ,ఎఫ్‌సీ ప్రధాన రాజ్యాంగ సంస్థలు. ప్రభుత్వ కార్యనిర్వాహక తీర్మానాలు, చర్యల ద్వారా రాజ్యాంగేతర సంస్థలు ఏర్పాటవుతాయి. ఇవి:భారత రూపాంతర జాతీయ సంస్థ (నిటి ఆయోగ్‌), జాతీయ అభివృద్ధి మండలి,జాతీయ,రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ),కేంద్ర నిఘా సంస్థ(సివిసి),జాతీయ లోక్పాల్‌,రాష్ట్ర లోకాయత్‌లు,కేంద్ర,రాష్ట్ర సమాచార కమిషన్లు.
శాసన,కార్యనిర్వాహక,న్యాయవ్యవస్థలు ప్రజాస్వామ్య సంస్థలు. మాధ్యమాలను ప్రజాస్వామ్య నాల్గవ స్తంభంగా పరిగణిస్తారు. ఇవి రాజ్యాంగ సూత్రాల అమలులో, ప్రజాస్వామ్య నిర్మాణ, నిర్వహణల్లో కీలక పాత్ర పోషిస్తాయి. శాసనవ్యవస్థ,రాజ్యాంగ పరిధిలో చట్టాలుచేసే అతిశక్తివంతమైన ప్రజాప్రతినిధుల వేదిక. వ్యవహారాలు చట్టబద్దంగా, లావాదేవీల లాభార్జన న్యాయసమ్మతంగా ఉండాలి. పౌరప్రయోజనాలు పరిరక్షించబడాలి. వ్యాపార లాభాలను సమాజ ప్రయోజనానికి వాడాలి. కార్యనిర్వాహక సంస్థ రాజకీయ ప్రతినిధులు సమాజాన్ని శాసించరాదు. సమాజ నిర్మాణాన్ని, పనితీరును నియంత్రించరాదు. రాజ్యాంగం సమాఖ్య సూత్రాలను పొందుపరిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధులను నిర్వచించింది. కార్యనిర్వాహకులు సమాఖ్య పరిధి, పరిమితులు దాటరాదు. చట్టాలు రాజ్యాంగ పరిధిలో ఉండేలా చూడటం న్యాయవ్యవస్థ బాధ్యత. రాజ్యాంగ వ్యతిరేకత, పాలన అక్రమాలను ప్రశ్నించడం, న్యాయవిరుద్ధ చట్టాల నుండి ప్రజారక్షణ, వివాద పరిష్కారం న్యాయవ్యవస్థ రాజ్యాంగ అధికారాలు. వైద్య విజ్ఞాన శాస్త్రాల అఖిల భారత సంస్థ ఎఐఐఎంఎస్‌,భారతీయ వజ్రాల సంస్థ,భారత చలనచిత్ర,దూరదర్శన్‌ సంస్థ(ఎఫ్‌.టి.ఐ.ఐ),జాతీయ అధికార శిక్షణ, బొగ్గు నిర్వహణ భారతీయ సంస్థ, భారత రిజర్వు బ్యాంకు,రైల్వే,పెట్రోలియం సంస్థలు సమాఖ్య ప్రభుత్వ భాగస్వామ్య చట్టబద్ద సంస్థలలో కొన్ని.
ఇప్పుడు ఈ సంస్థలన్నీ సంఫ్న్‌ భావజాల వ్యక్తుల చేతుల్లో బందీలు.గతంలో ప్రగతిశీల కాంగ్రెసీయులు, గాంధీయన్లు, సోషలిస్టులు, వామపక్షవాదుల ఆధ్వర్యంలో నడిచేవి. వారు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునేవారు. తెరవెనుక ఏంచేసినా వేదికలపై నీతి, ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడేవారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు జంకేవారు. నేటి సంఫీుయ అధికారులకు సిగ్గు ఎగ్గు లేవు. వైదిక హైందవ ఆర్య బ్రాహ్మణత్వ ఆధిపత్య రూపాలలో సంస్థలను నడుపుతున్నారు. ఆర్థిక సంఘాలు పాలక అనుకూల ప్రతిపాదనలు చేస్తున్నాయి. వస్తుసేవా శిస్తు వ్యవస్థ కరోనా కాలంలోనూ, టీకాలకు కూడా పన్నులు తగ్గించలేదు. రాష్ట్రాల వాటాలను ఇవ్వలేదు. ఎన్నికల కమిషన్లు పాలక పక్షపాతంగా పనిచేస్తున్నాయి. అటార్నీ జనరల్స్‌ ప్రజా వ్యతిరేకంగా వాదిస్తున్నారు. వలసకార్మికులకు, కోవిడ్‌ చావుల అనాథలకు ఆర్థిక సాయంలో మానవత్వరహిత వాదనలు చేశారు. సీఏజీ ముందస్తు స్పందన, ప్రతిస్పందనల బాధ్యతలను మరిచింది. ప్రభుత్వ న్యాయవాదులు ప్రజాపక్షం కాక ప్రభుపక్షం వహించారు. ప్రణాళిక మండళ్లకు పాలకుల మాటే ప్రణాళిక. అంతర్రాష్ట్ర మండలి సంఫ్న్‌ పాలిత రాష్ట్రాల పక్షపాతిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఘాలను ప్రభుత్వం పట్టించుకోదు. లక్షద్వీప్‌ పాలనాధికారి చట్టాలు ఉల్లంఘనలకు ఉదాహరణలు. అధికార భాషాసంఘం, మైనారిటి భాషల అధికారి ఉనికి కోల్పోయారు. ప్రతిచోటా సంస్కృతాన్ని రుద్దుతున్నారు. ప్రజల మాతృభాషలను మాతృభాషలు చేస్తున్నారు. నిటి ఆయోగ్‌, అభివృద్ధి మండలి ప్రయివేటీకరణకు మద్దతు ఇస్తున్నాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టోరెట్‌, మానవ హక్కుల కమిషన్లు, నిఘా, సమాచార సంఘాలు పాలకుల జేబు సంస్థలుగా మారాయి. న్యాయస్థానాల పోరుపడలేక, అధికారం చేపట్టిన ఆరేండ్లకు, కోరలులేని పాములాంటి లోక్పాల్‌ను నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశించినా మోడీ గుజరాత్‌ లోకాయత్‌ను నియమించ లేదు. ఆ పనిచేసిన మహిళా గవర్నర్‌ను ముప్పుతిప్పలుపెట్టి ఇంటికి పంపేదాకా నిద్రపోలేదు. పదుల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి ఆ నియామక రద్దుకు కోర్టుల్లో దావాలు నడిపారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారానికి రక్షకులెవరు? ప్రజాస్వామ్య చట్టబద్ద సంస్థలు కూడా పాలక పక్షానికి వంతలుగా మారాయి. రాజ్యాంగ సంస్థల విచ్ఛిత్తితో ప్రజలకు రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య మానవత్వ హక్కులు నిరాకరించబడుతున్నాయి.
పార్లమెంటు కమిటీలను నియమించ కుండా ప్రతిపక్షాలను బెదిరించి, భ్రమపెట్టి, ఆశపెట్టి, బయటకునెట్టి ఏకపక్షంగా చట్టాలు చేశారు. రాష్ట్రాల జాబితాల్లో చొరబడ్డారు. కరోనా కాలంలో ప్రత్యామ్నాయ పక్షాలు, ప్రజా సంఘాలు నిరసన తెలుపలేని స్థితిలో, అవకాశ వాదంతో రాజ్యాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలు చేశారు. పౌరసత్వ సవరణ, కొత్త విద్య, కార్మిక, వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలు వీటిలో కొన్ని. 40మంది సంఫ్న్‌ గూండాలు 11.8.21న రాజ్యసభలో ప్రవేసించి మహిళా ఎంపీలపై దౌర్జన్యంచేసి బీమా చట్టం ఆమోదించుకున్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ ముందెన్నడూలేనంత పక్షపాతంగా వ్యవహరిస్తోంది. కోర్టు తీర్పులూ సంఫ్న్‌ పాలకులకు అనుకూలంగా ఉన్నాయి. 5, 7 మంది న్యాయమూర్తుల ధర్మపీఠాల్లో కూడా అసమ్మతి నమోదుకాదు. న్యాయం ఏకపక్షంగా మారింది. అయోధ్య, రాఫెల్‌, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తీర్పులు వాటిలో కొన్ని. ‘’కోర్టుల్లో మా అనుకూల తీర్పులు యాధృచ్ఛికంకాదని’’ బీజేపీ ప్రముఖ నాయకుడే అన్నారు. అనుమాన న్యాయమూర్తులను హత్యచేసే రాజకీయ స్థితి దాపురించింది. పూర్వ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే రెండు రోజుల్లో రిటైర్‌ అవుతారనగా న్యాయమూర్తుల తీరు మారింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రమణ వ్యాఖ్యానాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి. కాని కొట్టినవారిని శిక్షించకుండా కొట్టిన విధానం మంచిదికాదు, వాడిన ఆయుధం సరైంది కాదన్నట్లు ఉంది. చట్టాల రద్దు ప్రతిపాదించకుండా వాటి దురుపయోగాన్ని ఎత్తిచూపి లాభం లేదు. 70శాతం మీడియా ప్రభుత్వ రాజకీయ-వాణిజ్య భాగస్వామి ముకేశ్‌ అంబానీ సొంతం. మిగిలిన మీడియా సంఫ్న్‌ సంస్థల యాజమాన్యంలో, ప్రభుత్వ మీడియాగా పనిచేస్తోంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు, సమానత్వం, ప్రజాభిప్రాయం, సంక్షేమం, పౌర, మానవ హక్కుల పట్ల ప్రభుత్వ ఉల్లంఘనలను ఈ మీడియా ఎత్తిచూపదు. సమర్థిస్తుంది.
అసమ్మతి ప్రకటించే వ్యవస్థలు బలహీనపడినప్పుడు రాజ్యం రాజ్యాంగ విధ్వంసం చేస్తుంది. ఆంబేద్కర్‌ మనుస్మృతిని బహిరంగంగా కాల్చి నిరసన తెలిపారు. సంఫ్న్‌ సర్కారుపైకి పొగుడుతూనే లోలోపల రాజ్యాంగాన్ని కాల్చేస్తోంది.
-ఎస్‌.హనుమంతరెడ్డి