సంక్రాంతి శోభ

సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది..పల్లెటూళ్ళు…ఆవు పిడకు, పాత సామా ను వేసి చలి కాచుకునే భోగిమంటు, మగవాళ్ళ కోడిపందేు, ఆడవాళ్లపిండి వంట హైరానా. కొత్త అు్లళ్లకు రాచమర్యాదు, రాజభోగాు, మగప్లి గాలి పటాు, ఆడప్లిు ముచ్చట గొలిపే పట్టు పావడాు, వాకిట్లో వేసే ముగ్గు, అందులో గొబ్బెమ్ము, చుట్టూ చామంతి, బంతిపూ రేకు, సాయంత్రంకాగానే పసిప్లికు పోసేభోగి పళ్ళు.. అమ్మో అంతా సందడే సందడి. ముత్తైదు వు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకునే వాయన తాం బూలాు, సంక్రాంతి,కనుమ రోజుల్లో ఎక్కువగా కనపడే హరిదాసు…వారి తంబరు నాదస్వరాు ఉత్తరాయణ పుణ్యకాంలో వినడం శుభ సూచి కం..కనువిందుగా అరించిన గంగిరెద్దు విన్యాసాు, అన్నీ మన తొగు వారి సొంతం. దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోనికి సూర్యుడు ప్రవేశించే పుణ్యకాం సంక్రాంతి. ఆ రోజున పెద్దకు చేసే పూజు భావితరాకు ఆచారణీయం… పుణ్యపద్రం…కనుమ నాడు పశువును పూజించడం ఆచారంగా వస్తుంది. సేద్యం లోకి దుక్కి దున్నడంలో రైతుకు ఎంతో సహాయం చేసే పశువును, పశుసంపదను గౌరవించడం హిందూ సంప్రదాయం. ఆకాశంలోని చుక్కన్నీ నే మీదకు చేరే రోజు సంక్రాంతి..పాముంత, చెట్టుమీద పిట్ట, చేతిలో పూబుట్ట… కాదేదీ ముగ్గుకి అనర్హం!! చుక్కతో చుక్కు కుపుతూ చుక్కకే చుక్కు చూపించే గాలి పటాు, తీయ ని చెరకు గడు, కనువిందు చేసే కుమ, పూసిన పద్మాు, మల్లెమొగ్గు, గుమ్మడిపూు, అందమైన సీతాకోకచిుకు, నేమీద ఈదే చేపు, ఏనుగు అంబారీు, రాచహంసు, చిట్టి చిుకు, గంధం గిన్నొ,విస్తరాకు,కోటు,రధాు,స్వర్గ ద్వా రాు…ఎన్నో ఎన్నెనో ముగ్గు..వాకిట్లో వినోదా వింతు. ఆ ముగ్గు చుట్టూ మగువ కోలాటాు, ఎంత చెప్పుకున్నా తరగని పండుగ సంక్రాంతి. ఆకాశంలోని హరిమ్లి నేమీదకు వాలి రంగవల్లి అయినట్లు అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? ఎటు చూసినా ఆనందం సౌభాగ్యంకు చిహ్నం.
` డా.దేవుపల్లి పద్మజ

శాంతి,సౌభాగ్యం,ఐకమత్యం కగ లిసినదే పం డుగ. అందరూ పండుగగా వ్యవహరించే ఉత్సవాు వ్యక్తిగతంగాను, కుటుంబపరంగాను, బంధుగతంగాను జరుపుకుంటూ ఉంటాము. అంతవరకు వున్న కష్టాు మరచి అందరితో కసి మెసి ఆనందం పంచుకునే దినమే పండుగ. ఈపండుగ క్రమంలో వచ్చే ముఖ్య మైన పండుగలో సంక్రాంతి ఒకటి. సూర్యుడు తన ప్రయాణంలో ఒక రాశినుండి మరొక రాశి లోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనుస్సురాశినుండి మకరరాశిలోనికి ప్రవేశిస్తే మకర సంక్రమణం సంభవించి, ఉత్తరాయణ పుణ్యకాం ఆరంభమయి, మనం ఆచరించే ‘‘సంక్రాంతి’’ పండుగ వస్తుంది. సూర్యగమనం ఉత్తరాయణ, దక్షిణాయనాు నిర్ణయిస్తే, చంద్రగమనం మాసాు నిర్ణయిస్తుంది. సూర్యుడు ధనుస్సురాశిలో సంచరిస్తుండగా ధనుర్మాసం జరుగుతుంది. ఈ ధనుర్మాసం ముగియగానే సంక్రాంతి శోభు ప్రారంభమవుతాయి. కాచక్రంలోని రాశులో మకరరాశి సర్వశ్రేష్టమైనది. శ్రవణానక్షత్రములో ఉద్భవించిన శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభునిగా బ్రహ్మకు సాక్షాత్కరించినది శ్రవణానక్షత్రములో. ఈ నక్షత్రము మకర రాశికి చెందినది. ఈకారణం చేత శ్రీమహా విష్ణువుని యొక్క రాశి మకరరాశి. దీనిని మానవుని శిరస్సుగా భావిస్తారు. అటువంటి మకరరాశిలోకి సహస్రకిరణుడైన సూర్యభగ వానుడు ప్రవేశించే మహత్తర పుణ్యదినం కాబట్టి, ప్రతీవ్యక్తిలో ఆధ్యాత్మిక భావను పెంపొందించటానికి అత్యంత అనువైన కాం. వేదకాంనుంచి శిష్యు సరైన గురువు కోసం అన్వేషించటం, గురూపదేశం పొందడం, వేదపారాయణు సాగించటం వంటివి ఈ సమయంలోనే ఆరంభమవుతాయి. జగత్తు జమjైునప్పుడు శ్రీమన్నారాయణుడు ఆదివరాహమూర్తిగా అవతరించి భూమిని ఉద్ధరించిన రోజు సంక్రాంతి. వామనావతార ఘట్టములో వామనుడికి బలిచక్రవర్తి మూడడుగు భూమిని దానం చేసినది, వామనుడి పదఘట్టనతో పాతాళానికి చేరినది ఈరోజే. దీనికి సంకేతంగా మనం సంక్రాంతి పర్వదినం జరుపుకుంటాము. ఈపండుగ భోగి, సంక్రాంతి, కనుము అని మూడు రోజుగా జరుపుకునే పర్వదినం.
భోగిపండుగ
భోగి పండుగ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి భోగిపళ్ళు, భోగిమంటు. ఆవుపేడతో పిడకు తయారుచేసి యఙ్ఞదేవతను తుచుకుంటూ, పాపప్రక్షాణన జరిపించమని వేడుకుంటూ, ధర్మమార్గ పయనానికి సమాయత్తమవుతూ మంటలో సూర్యోదయం సమయంలో వీటిని వేస్తారు. ప్లిు, పెద్దు అందరూ ఈ మంట చుట్టూ చేరి ఆనందోత్సాహలలో మునిగిపోతారు. ఈ మంటలోనే పాతపడిన సామానును కూడా వేసే సాంప్రదాయం కూడా కనబడుతుంది. నూతనత్వానికి ఆహ్వానం పుకాంటే పాతదనాన్ని విడనాడాలి. ఈ మంటు వేదకామునాటి ఋషు తాము సంవత్సరారంభములో వ్రేల్చిన ‘ఆగ్రాహాయణి’ హోమాగ్నికి ప్రతిరూపం. హోమ భస్మం మంత్రసారము, అతి పవిత్రమైనది. మంటు శాంతించిన తరువాత ఈ హోమ భస్మాన్ని దైవప్రసాదంగా భావించి నుదుటిన ధరిస్తారు. ప్లికుకూడా నుదుటిమీద ఉంచి వారి ఆయురారోగ్యాకై ప్రార్థిస్తారు. దేవతారాధన, నూతన వస్త్రధారణ, పిండివంటతో భోజనము వగైరా పూర్తిచేసుకుని సాయంకాం ‘‘భోగిపళ్ళ’’ వేడుక జరుపుతారు. ప్లిను ఆశీర్వదిస్తూ పెద్దంతా వారి శిరస్సుపై రేగిపళ్ళను పోస్తారు. రేగిచెట్టును సంస్కృతంలో బదరీ వృక్షం అని పిుస్తారు. ఈవృక్షం విష్ణు ప్రీతికరమైనది. ఈ రేగిపళ్ళతోపాటు చ్లిరపైసు, నానపెట్టిన శనగు, పువ్వు ప్లి తలపై పోస్తూ, శ్రీమహావిష్ణువులాగా తేజరిల్లాని ఆశీర్వదిస్తారు. తరువాత ముతైదువుకు తాంబూలాు ఇచ్చి సంతోషపరుస్తారు.
సంక్రాంతి పండుగ
రెండవ రోజైనది సంక్రాంతి పండుగ. పండుగలో ప్రతీ రోజుకు ఒకప్రత్యేకత ఉంటుంది, వ్యవహార నియమ నిబంధన ుంటాయి. స్నానాదికాు ఎలా ఆచరించాలి, ఎటువంటి పూజు ఆచరించాలి,ఎటువంటి దానధర్మాు చేయాలి అనేవి మన శాస్త్రాు విపుంగా వివరించాయి. ఇవిశారీరిక ధారు ఢ్యాన్ని పెంపొందించి, వాతావరణ సమత్యుత కాపాడుతూ, సమతను పెంపొందిస్తాయి. నువ్వు నూనెతో అభ్యంగన స్నానం శారీరిక రుగ్మతను నివారిస్తుంది. నువ్వు సేవించటం వన ఆరోగ్య సమస్యు తగ్గుతాయి. ఈరోజు జరిపే శాంతి హోమాు, మృత్యుంజయ హో మాు, అభిషేకాు, వివిధ దైవారాధను ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించి, భగవ దానుగ్రహానికి తోడ్పతాయి. పితృదేవత స్మరణ వారి అఖండ ఆశీర్వచనానికి దోహదం చేస్తాయి. మన పెద్దు మనకిచ్చిన జన్మకు కృతజ్ఞత ప్రకటించటం ప్రతీ ఒక్కరి కర్తవ్యం. వారిని స్మరిస్తూ తగిన విధంగా తర్పణాు విడవటం, వారి ఙ్ఞాపకార్థం దాన ధర్మాు చేయటం శాస్త్ర విధి. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. సుగంధ ద్రవ్యాతో, పంచా మృతముతో చేసే అభిషేకాకు చక్కటి ఫలితాుంటాయి. విష్ణువు అంకార ప్రియుడు. రకరకా పూమాలతో అంకరిస్తే, ఆయన అవ్యాజ కరుణ మనపై కుగుతుందని పురాణ ప్రవచనం. అపాత్ర దానం పనికిరాదు. తగిన వారికి తగినట్లు దానం చెయ్యాలి. ఎవరి అవసరాన్ని బట్టి వారికి దానం చెయ్యాలి. పేదకు కంబళ్ళు, వస్త్రాు దానమివ్వాలి. యోగ్యులైన బ్రాహ్మణుకు శక్తిననుసరించి సువర్ణ, రజిత, కాంస్య దానాు ఇవ్వాలి. ఈప్రకృతిలో భించే ప్రతీ వస్తువు ప్రతీ ఒక్కరి సొంతం అనే నిర్వచనానికి ప్రతీకలే దాన ధర్మాు. పౌష్య,మాఘ మాసము సంధిలో వచ్చే అమావాస్యనాడు సూర్యుడు మకరరాశిలో ప్రవేశం చేస్తే అట్టి సంక్రమణ కామే అర్దోదయకాము. ఇది పగటి పూట వస్తే ప్రశస్తము. మధ్యాహ్నమునకు పూర్వమే సంభవించే అర్ధోదయకామే పూర్తి ఫలితాన్నిస్తుంది. ఆ సమయంలో ఏ కొంచెము దానమిచ్చినా మేరు పర్వతమంత ఫుణ్య మిస్తుంది. అర్ధోదయకాంలో ‘‘ఏ బ్రాహ్మణడైన బ్రహ్మతో సమానం’’. ‘‘ఏపుణ్య జమైనా గంగతో సమానం’’ అని శాస్త్ర వచనం, వేదవచనం. ఈ నాడు పాయస దానము, కాంస్య పాత్ర దానము, సువర్ణలింగ దానము, కూష్మాండ దానము, పెరుగు దానము ప్రశస్తమైనవి. గొబ్బిళ్ళ సందడి సంక్రాంతి పం డుగు వేడుకలో మరొక ప్రధానమైనది. కన్నె ప్లిు చక్కటి వస్త్ర ధారణతో, తమకు కలిగిన ఆభరణాతో చూడచక్కగా అంకరించు కుంటారు. తొగుదనం ఉట్టి పడే కన్నె ప్లిను చూచి కుటుంబ సభ్యు మురిసి పోతారు. వివాహ వయస్సుకు వచ్చినారని చెప్పకనే చెబుతారు. పెద్దవారికి ఇది ఒక హెచ్చరికలాటిది. ఆవుపేడతో గుండ్రముగా బంతువలె తయారుచేసి, ఇంటి ముంగిటి రంగమ్ల మధ్య అమరుస్తారు. వాటిపై బంతిపూవు, ఇతర రంగు రంగు పూను అంకరించి, వాటి చుట్టూ తన తోటివారితో, స్నేహితుతో వయాకారంగా తిరుగుతూ, గొబ్బిపాటు పాడుతూ, యబద్ధంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతారు. ఇది సంధ్యాసమయంలో జరిగే కను పంట. చూచినవారిదే భాగ్యం. మహాక్ష్మికి ప్రీతిపాత్రమైనది. ఈవిధంగా చేయటం వన కన్నెప్లికు త్వరలోనే చక్కటి వరుడు భించి వివాహం జరుగుతుందని విశ్వాసం. విఙ్ఞానశాస్త్ర పరంగా కూడా ఇది ఎంతో మంచిది. అనేక రకా క్రిమి సంహా రకంగా ఉపయోగపడుతుంది. ప్రతీ ఇంటి ముంగిట దర్శనమిచ్చే గొబ్బిళ్ళు స్వాగతం పుకుతూ,అసు సిసలైన పండుగ వాతా వరణాన్ని తపిస్తుంది. ‘‘హరి హరి గోవిందా’’ అని కీర్తిస్తూ, యబద్దంగా చిడతు వాయిస్తూ, భుజముపైనున్న వీణను స్వరబద్ధముగా మీటుతూ, అడుగు అడుగులో గజ్జె సవ్వడి నింపుతూ విలాసంగా సాగిపోయే హరిదాసు మన సంప్రదాయ చిహ్నాు. హరి నామ సంకీ ర్తన తప్ప మరొక మాయ వారి నోటివెంట మె వడదు. రంగు రంగు వస్త్రధారణతో, మెడలో పూదండతో హుందాగా నడుస్తూ సాగిపోతారు. శిరస్సుపై చక్కగా పూవుతో అంకరించిన ఇత్తడి గిన్నెను ధరించి, ఎవరైనా తమంత తాముగా ఏదైనా సమర్పించదుచుకుంటే వంగి లేదా మోకాళ్ళపై కూర్చుండి గిన్నెలోకి స్వీకరిస్తారు.ఎందుకంటే వారి వృత్తి భిక్షాటన కాదు. భగవన్నామ సంకీర్తనా ప్రచారం వారి వృత్తి, ఆయాచితంగా వచ్చినది స్వీకరించటం వారి ప్రవృత్తి. సంప్రదాయాను గౌరవించే గృహస్తు నిత్యము వారికోసం ఎదురు చూచి, తమక కలిగినది వారి సమర్పించుకుంటూ భావితరాకు ఆదర్శవంతంగా నిుస్తారు.
కనుమ
మూడవ రోజైన పండుగ కనుమ పండుగ. కనుమ నాడు మినుము తినాంటారు. అందుకే ఆవునేతితో తయారుచేసిన మినపసున్నొ, బ్లెం గారొ వంటిని తయారుచేసుకుంటారు. నోరూరించే పదార్థాు జిహ్వను మరింత పెంచగా మానసిక సంతృప్తితో కడుపారా అస్వాదిస్తారు. వ్యవసాయదాయి తమ తమ పశువును అంకరించి వాటిని స్వేచ్ఛగా తిరిగేలా చేస్తారు. బవర్థకమైన దాణావేసి విశ్రాంతిగా ఉండేలా చేస్తారు. వ్యవసాయ క్షేత్రములో వాటి అవసరం లేకుండా పంటు పండవు. నాగరిక ప్రపంచములో యంత్రా వినియోగం ఎక్కువైనప్పటికి, పశువు వినియోగం లేకుండా సాగదు. మనకు జీవనాన్ని, జీవితాన్ని ఇచ్చిన ప్రతీ ప్రాణిని గౌరవించానే సత్సాంప్రదాయము మనది. కనుమనాడి కాకి కూడా కదదు అనే నానుడి ప్రచారంలో ఉంది.శాస్త్రపద్దతిలో ఆలోచిస్తే దీనికి తగిన కారణం కనబడుతుంది. దైనందిన కార్యక్రమాకు దూరంగా ఉంటూ, కుటుంబ సభ్యుతో కసి మెసి ఆనందంగా జీవించటానికి అవకాశం కల్పించేవే కొన్ని కట్టుబాట్లు, ఆచారవ్యవహారాు. బయటకు వెళ్ళకోడదు అనే నియమం పెడితే చక్కగా ఇంటి వద్దే వుండి సంతోషంగా గడుపుతారని దీని ముఖ్యోద్ధేశము. అంతేకాకుండా మరుసటి రోజున బంధువు తమతమ స్వస్థాకు వెళ్ళిపోతారు కనుక వారి వీడ్కోుకు కావసిన కార్యక్రమ నిర్వహణకు దోహదం చేస్తుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా కోడిపందేతో మగవారు ఆనందిస్తారు. ఒక ప్రాణిని హింసిస్తూ మనం ఆనందించటం ఎంత వరకూ సమర్థనీయమో విఙ్ఞు ఆలోచించాలి. ఈ మధ్య న్యాయస్థానాు కూడా కోడిపందేు నిషేదించాయి.
బొమ్మ కొువు ప్రతీ ఇంటా కొువుదీరుతుంది. సంవత్సరం పొడవునా సేకరించిన రకరకా బొమ్మను పు వరుసలో అంకరించి హృద్యమైన వాతావరణాన్ని తయారుచేస్తారు. వస్తుగ్రహణాశక్తిని పెంపొందించి, మానసిక శాంతిని కలిగిస్తుంది. సిరిసంపదు కుగుతాయని విశ్వాసం. బొమ్మ కొువు పేరుతో ఇంటిని అందంగా అంకరిస్తారు. పువురు విచ్చేసి అంకరణను వీక్షించి ముగ్దులౌతారు.
ఇంటిని అంకరించిన మామిడి తోరణాు, నూతన వస్త్ర ధారణు, వాకిట భోగి మంట వింత శోభు, నట్టింట్లో నిండు గర్భిణిలా ధాన్యపు గాదొ, వాకిట్లో హరిదాసు ఆపించే హరిభజను, తోటల్లో కోడిపందేు, పెరట్లో పశువు అంకారాు, అత్తింట్లో అు్లడుగారు ఎక్కే అకపాన్పు, వంటింట్లో అత్తగారు చేసే నేతి అరిసె ఘుమఘుము, అంగట్లో వస్త్రా సంబరాు, ఆయాలో దైవ పూజు, ముంగిట్లో వయ్యారి భాము దిద్దే ముత్యా రంగమ్లు, రంగమ్లపై శోభిల్లే గొబ్బిళ్ళు, దాన ధర్మా తృప్తిపొందిన దానగ్రహీతు….కగసి మన సంక్రాంతి.ఈవిధంగా మూడు రోజు నూతన వస్త్రాు ధరించి, యథాశక్తి పూజు, హోమాు సలిపి, దానాు చేసి, పశువును అంకరించి అందరితో కసియధాశక్తి పిండివంటు భుజించి అత్యంత ఆనందంగా గడుపుకుని, సంవత్సరమంతా పండుగలా గడవాని కోరుకుంటారు. ` డా.దేవుపల్లి పద్మజ
-విశాఖపట్టణము, ఫోను 9849692414.