విశాఖలో అడ్డగోలుగా భూ ఆక్రమణ

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్నప్పుడే భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదారులను కాపాడే పనిలో నిమగమ య్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలం దరూ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వకుండా పరస్పరం సహకరించు కుంటున్నారు.
పరిపాలనా రాజధాని ప్రకటనకు ముందు,తరువాత విశాఖలో భూకబ్జాదారుల ఆగ డాలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల కాలంలో భూకబ్జాలలో రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బంధం మరింత పెనవేసుకుంది. అది వైసిపి లేదా టిడిపి ఏపార్టీ అధికారంలో వున్నా భూ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తి తమ వ్యాపారాలను మూడు పువ్వులు,ఆరు కాయలుగా అభివృద్ధి చేసుకుం టున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా భూ కుంభకోణా లకు నిలయంగా మారింది. రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ తమ ఆస్తులు, బంధువుల ఆస్తులు పెంచుకొనే పనిలో నిమగమై వున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఉమ్మడి విశాఖలో ఒక్కొక్కటిగా భూ కుంభకోణాలు బయట కొస్తున్నాయి. చివరకు భూ కుంభకోణాలు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి లోకా యుక్త సుమోటోగా తీసుకుందంటేనే భూ కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయో మనం అర్ధం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూము లను కాపాడాల్సిన అధికార పార్టీ పెద్దలే కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వరంగ కేంద్రంగా,ఆర్థిక రాజ ధానిగా ఉన్న విశాఖలో భూ కబ్జాదారులు స్వాహా చేసిన భూముల వివరాలు క్లుప్తంగా పరిశీలిద్దాం.
రుషికొండ విధ్వంసం
విశాఖలో రుషికొండ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం. గతంలో ఈ కొండ చుట్టూ టూరిజం డిపార్టుమెంట్‌ ఆధ్వర్యం లో అనేక రిసార్టులు నడిచాయి. పచ్చని ప్రకృతి నిలయాలుగా ఉన్న ఈ రిసార్టులు దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించేవి. నేడు ఈపచ్చని కొండలను తవ్వి పర్యా వరణ విధ్వంసానికి కారకులయ్యారు. ఈ కొండల విధ్వంసంపై హైకోర్టు అనేక దఫాలు హెచ్చరించి నా రాష్ట్ర ప్రభుత్వం, భూకబ్జాదారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనిని పరిశీలించ డానికి వచ్చిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది కె.ఎస్‌.మూర్తిపై అక్రమ కేసులు బనాయించారు. కొండల విధ్వంసం కొనసాగుతూనే వుంది. అదే రుషికొండ స్వర్ణభారతి నగర్‌ సర్వే నెంబర్‌ 17/1,2,5లో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యుఎస్‌ స్కీం కింద400 మందికి 60గజాల చొప్పున లేఅవుట్లు వేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వీటితో పాటు పార్కులు,రోడ్లు తదితర మౌలిక సదుపాయా లకు కేటాయించిన భూమి సుమారు 1.5 ఎకరాలు కబ్జాకు గురైంది.
దసపల్లా భూములు ప్రభుత్వానివి కావట !
దసపల్లా భూములు ప్రభుత్వ భూములు కావని స్వయానా ఎం.పి విజయసాయిరెడ్డి చెబుతు న్నారు. అత్యంత ఖరీదైన ఈ 15ఎకరాల భూముల విలువ సుమారు రూ.2000కోట్లు.దసపల్లా భూ ముల యజమానులుగా చెప్పుకుంటున్న 64 మంది ఒకే మాటపై వచ్చి తమకు 29శాతం వాటా, బిల్డర్‌కు 71శాతం అని అంగీకరించారు. దసపల్లా భూములు సీలింగ్‌ భూములు. సీలింగ్‌ భూము లంటేనే ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు కానప్పుడు దశాబ్దాలుగా ప్రభుత్వం ఎందుకు కోర్టులు చుట్టూ తిరిగింది?ఆ భూములకు 22(ఎ)గా ఎందుకు ప్రకటన చేసింది? సుప్రీం కోర్టు తీర్పు ఆ భూములను భూ యజమానులకు కట్టబెట్టాలని చెప్పిందా? తీర్పు రాకముందే దసపల్లా భూములకు సంబంధించి 22(ఎ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది? దశాబ్దాలుగా ఈ భూములు కొనుగోలు చేసిన యాజమాన్యాలు ఏదోరకంగా సమస్య పరిష్కారం అయితే మంచిదని భావించిన తరుణం లో ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌సి సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? 22 (ఎ) భూముల సమస్య ఒక్కవిశాఖలోనే కాదు, రాష్ట్రంలో అనేకప్రాంతాల్లో వుంది. ఆ ప్రాంతాల్లో 22 (ఎ) ఎత్తివేయకుండా దసపల్లా భూముల విషయంలోనే ఎందుకు ఎత్తివేసి ఇంతప్రేమ చూపించారు? ఇతర భూములలో వున్న వారు ప్రజలు కాదా? దసపల్లా భూముల వ్యవహారం ఇలా వుంటే…విశాఖ ఎం.పి కూర్మన్నపాలెంలో నిర్మిస్తున్న భారీ వెంచరు కథ మరోలా వుంది. భూ యజమానులకు కేవలం 1 శాతం మాత్రమే వాటా ఇచ్చి తమ డెవలప్‌మెంట్‌ వాటాగా 99 శాతం తీసుకున్నారు. ప్రజాసేవకు అంకితం అవ్వాల్సిన ఎంపీలు ప్రజల ఆస్తులను లూటీ చేయడం ఎంతవరకు సమంజసం !
దబ్బంద గ్రామ భూములు స్వాహా
ఆనందపురం మండలం, మామిడి లోవ పంచాయతీ దబ్బంద గ్రామం సర్వే నెంబర్‌ 23లో 1970వ దశకంలో ప్రభుత్వం 120 మంది పేదలకు 80ఎకరాల సాగుకోసం భూమిని కేటా యించింది. 2015లో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం దళితులు, గిరిజనులైన వీరి నుండి ఈ భూమిని తిరిగి ల్యాండ్‌ పూలింగ్‌ చేసింది. వీటిలో 66 ఎకరాలను టిడ్కో ఇళ్లు మరియు అర్బన్‌ హౌసింగ్‌ కోసం కేటాయించారు. మిగతా 14ఎకరాలను ఒక బడా వ్యక్తి స్వాధీనం చేసుకొని తోటలు వేసుకొని అనుభవిస్తున్నాడు. వీటితోపాటు సర్వేనెంబర్‌ 10లో ఉన్న నరసింహ చెరువును ఆక్రమించి సుమారు 6.8 ఎకరాల్లో జీడి, మామిడి, కొబ్బరి తోటలు వేశాడు.సర్వే నెంబర్‌9/1, 12/4,13/1,13/2,14/2లో సుమారు12.50ఎకరాల భూమి ఈ పెద్ద మనిషికబ్జాÛలోనే ఉన్నది. ఇవి దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన భూములు.
కుసులవాడ భూములపై పెద్దల కన్ను
ఆనందపురం మండలం కుసుల వాడలో 1970వదశకంలో ల్యాండ్‌ సీలింగ్‌ మిగు లు భూమి సుమారు 43 ఎకరాలు సర్వే నంబరు 98,108లో ఎస్‌సి,బిసిలు43కుటుంబాలకు ప్రభు త్వం కేటాయించింది.పద్మనాభం,శొంఠ్యాం ప్రాం తాల మధ్య ఉన్న ఈభూమి విలువ సుమారు రూ. 100కోట్లు ఉంటుంది. వీటిపైఅధికార పార్టీ పెద్దల కన్ను పడిరది. పేదలను బెదిరిస్తూ ల్యాండ్‌ పూలిం గ్‌కు పథకం వేశారు.పేదలను లొంగదీసుకొని ఎక రాకు రూ.13లక్షల చొప్పున చెల్లించి భూములు లాక్కోవాలని చూస్తున్నారు.
బయ్యవరం భూముల బలవంతపు కొనుగోళ్లు
ప్రస్తుత అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్స న్నపేట పరిసర ప్రాంతాల్లో సుమారు500 ఎకరాల డీపట్టా, అసైన్డ్‌ భూములను రైతుల నుండి బలవం తంగా కొనుగోలు చేయడమే కాకుండా ఈ భూము ల చుట్టూ ఉన్న వాగులు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించారు. అక్కడున్న కొండలను కూడా అక్రమంగా తవ్వేశారు. సర్వే నెంబరు 624లో రెండు కొండల మధ్య ఉన్న వాగును పూడ్చేశారు. ఆ ప్రాంతంలో 403ఎకరాల భూమిలో 230 మౌంట్‌ విల్లాలు పేరుతో రిసార్ట్స్‌ నిర్మించాలనే లక్ష్యంతో భూ వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని నాడు ఆర్డీవో,గనులశాఖఏ.డి,తహశీల్దార్‌, ఇనాం తహ శీల్దార్‌ గుర్తించారు.అందులో నీటి వాగులు, గోర్జీలు వంటివి కూడా కబ్జాకు గురి అయ్యాయని తెలియ జేశారు. అసలు అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ఆ భూములకు సంబంధించి ఎటువంటి అమ్మకాలు, కొనుగోలు జరపరాదు. దీనికి భిన్నంగా విస్సన్న పేటలో జరిగిందని, రాజకీయ నాయకుల ప్రమే యం వుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోలేదు.
రెండు సిట్‌ నివేదికలు బహిర్గతం చేయాలి
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్న ప్పుడే విశాఖఅర్బన్‌,రూరల్‌ మండలాలు, భీమిలి, ఆనందపురం,పెందుర్తి,గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం,పరవాడ,అనకాపల్లి ప్రాంతాల్లో 1 లక్ష 6వేల 239ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. మాజీ సైనికుల భూములకు జిల్లా కలెక్టర్లు ఎన్‌ఒసిలు ఇచ్చారనే కథనాలు వచ్చాయి. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారం లోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదా రులను కాపాడే పనిలో నిమగమయ్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలందరూ భాగస్వాము లుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వ కుండా పరస్పరం సహకరించుకుంటున్నారు. డి-ఫామ్‌ పట్టా భూములకు ఎంత రక్షణ ఉందో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు కేటాయించే భూములకు అన్ని నిబంధనలూఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి సిఫార్సుతో ఎన్‌ఓసిలు ఇచ్చి భూములు అమ్మకాలు,కొనుగోళ్ళు జరిగాయని రెవెన్యూ మంత్రి పై ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. అనేకచోట్ల మంత్రులు,ఎమ్మెల్యేలు బినామీలతో భూములు అక్ర మంగా స్వాధీనం చేసుకుంటున్నారు. కబ్జాలకు గురైన భూముల వివరాలను రెండు సిట్‌ కమిటీలకు సిపిఎం ఆధారాలతో సహా ఇచ్చింది. పారదర్శకత కోసం రోజూ మాట్లాడే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే వెంటనే రెండు సిట్‌ నివేదికలను బహిర్గతం చేస్తే భూకబ్జాదారులెవరో ప్రజలకు అర్ధ మౌతుంది. ఉమ్మడి విశాఖ నగరానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్‌ పూలిం గ్‌లో కూడా అనేక భూబాగోతాలకు పాల్పడ్డారు.
ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న విశాఖ నేడు భూ బకాసురుల కంబంధ హస్తాల్లో చిక్కుకొని వుంది. దాని నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షించే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకు పోయిన పేదల భూములన్నింటినీ తిరిగి పేదలకు అప్పగించాలి.
వందేళ్ల సమస్యకు పరిష్కారం
బ్రిటీష్‌ హయాంలో రీసెటిల్మెంట్‌ ఖాతా పేరుతో భూ కేటాయింపులు యాజమాన్య హక్కులే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే రీ సెటిల్మెంట్‌ బుక్స్‌ నుంచి భూముల డిజిటలైజేషన్‌ భూ సమస్యలకు సీఎం జగన్‌ చరిత్రాత్మక పరిష్కారం చూపించారు. స్వాతంత్య్రం రాక ముందు కేవలం సాగు చేసుకునే తాత్కాలిక హక్కుతో కేటాయించిన భూములు అవి. సదరు భూములపై ఇప్పటికీ రైతన్నలకు యాజ మాన్య హక్కులు లేవు. వందేళ్లు గడిచిపోయినా యాజమాన్య హక్కులకోసం నిత్యం రెవెన్యూ కార్యా లయాల చుట్టూ రైతన్నల పడిగాపులు కాస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. తరాలు మారుతున్నా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్యకు పరిష్కారం మాత్రం చూపలేకపోయాయి. కానీ ఆర్థిక అవసరాలకోసం క్రయవిక్రయాలకు వీలులేని అసైన్డ్‌భూములు (22ఏ) సమస్య పరిష్కా రం కోసం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నడుం బిగిం చింది. సీఎం జగన్‌ దార్శనికతతో చిక్కుల్లేని భూ రికార్డుల కోసం సమగ్ర భూసర్వే పథకాన్ని తీసు కొచ్చారు. దీంతో అసైన్డ్‌ భూముల నిజమైన హక్కు దారులకు యాజమాన్య హక్కుల లభించనున్నాయి.
బ్రిటీష్‌ హయాంలో భూముల కేటాయింపులు
ప్రస్తుతం మార్కెట్‌ లో భూముల క్రయ విక్రయాల ప్రక్రియ 1908 రిజిస్ట్రేషన్‌ చట్టం ప్రకాం మే జరుగుతోంది.బ్రిటీష్‌ పాలనలో రైతులకు సాగు కోసం షరతులతో కూడిన భూమలను కేటాయిం చారు. ఈ భూములు కేవలం సాగు చేసుకునేలా మాత్రమే రికార్డుల్లో నమోదు చేశారు. భూయాజ మాన్య హక్కులను రైతులకు కల్పించలేదు. బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో 1930 వరకు షరతులతో కూడిన భూ పట్టాల పేరుతో వివిధ వర్గాల రైతులకు భూ కేటాయింపులు జరిగాయి. ఆయా భూములను రకరకాల కేటగిరీల పేరుతో రికార్డుల్లో చేర్చారు. మెట్ట,తరి,డొంక,వంక,వాగు,గ్రామ కంఠం, ప్రభు త్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నా రు1932 నుంచి1934 మధ్యలో రికార్డులన్నీ కూడా రీసెటిల్‌మెంట్‌ బుక్స్‌లో చేర్చారు. పట్టా దారుల భూముల వివరాలను,సర్వే నంబర్లను ఈ పుస్తకాల్లో నమోదు చేశారు. అటువంటి భూములను 1932-34 నుంచి రైతుల తరాలు అనుభవిస్తు న్నారు. ఏళ్ల కొద్దీ సాగు చేస్తున్నా ఈ భూములపై రైతన్నలకు యాజమాన్య హక్కుల లభించడం లేదు.
ప్రత్యేక కమిటీలతో పరిశీలన..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పెండిరగ్‌ లో ఉన్న ప్రతి కేసును కూలంకుషంగా అధ్యయనం చేస్తాయి. వాటికి సంబంధించి ఉన్న అన్ని రికార్డులను అధికారుల సమక్షంలో పరిశీలి స్తాయి. కమిటీలు గుర్తించిన అంశాలతో నివేదికలు రూపొందించి జిల్లా కలెక్టర్లకు సిఫారసు చేస్తాయి. కలెక్టర్‌ స్థాయిలో పరిశీలించి వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా సిఫార్సులు ఉండాలి. ఒకవేళ కలెక్టర్‌ స్థాయిలో పరిష్కరించలేనివి ఉంటే వాటిని ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. అదే విధంగారూ.50కోట్లకు పైగా విలువైన భూ ములుంటే వాటిని సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వానికి తెలపాలి. ఈవిధంగా వందేళ్లుగా పెండిరగ్‌లో ఉన్న అసైన్డ్‌ భూముల సమస్యలను పరిష్కరించి, నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిం చాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం పని చేస్తోంది. తద్వారా లక్షలాది మంది తమ భూముల క్రయవిక్ర యాల కోసం రిజిస్ట్రేషన్ల విషయంలో ఎదుర్కుం టున్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. అతి త్వరలో ప్రభుత్వం నియమించిన కమిటీలు సమావేశమై యుద్ధప్రాతిపదికన ఫిర్యాదులను పరిశీలించి నివేదికలు రూపొందించనున్నాయి.
శాశ్వత పరిష్కారమే ధ్యేయం
ప్రభుత్వం మాత్రం అన్ని రకాల అవకా శాలను పరిశీలించి వందేళ్ల చుక్కల భూముల సమస్యకు శాశ్వతపరిష్కారం కల్పించాలని నిర్ణయిం చింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జోన్లవారీగా కమిటీలు నియ మించి,క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశిం చారు. తొలి దశలో విజయవాడ, తిరుపతి, విశాఖ పట్నం కేంద్రాలుగా ఈ కమిటీలు అధ్యయనం చేయనున్నాయి.ఈ కమిటీల్లో విశ్రాంత జిల్లా న్యాయ మూర్తి, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌, భూరికార్డులశాఖ విశ్రాంత ఏడీ, సర్వే విభాగం ఏడీ, సంబంధిత జిల్లాల జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌ లేదా ఆర్డీవో, జిల్లాల రిజిస్ట్రార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు.ఈ కమిటీలకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించేలా జీవో 681ని విడుదల చేశారు. ఈ భూముల రీసర్వే కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురుకాదు ఏకంగా15 వేల మందిని సర్వేయ ర్లను రిక్రూట్‌ చేసి, కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశారు. అంతే కాకుండా ఆధునిక టెక్నాలజీ.. కోర్స్‌(కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ సిస్టం) బేస్‌ సిస్టంను తీసుకొచ్చి, విమానాలను, హెలీకాప్టర్‌లను, డ్రోన్లను, రోవర్లను ఉపయోగిస్తున్నారు. రీ-సర్వేలో భాగంగా హద్దు లను మళ్లీ కొత్తగా మార్కు చేసి, రికార్డులన్నింటినీ అప్‌డేట్‌ చేసి,సబ్‌డివిజన్‌లు,మ్యుటేషన్స్‌ పక్కాగా చేపట్టనున్నారు.రాష్ట్రంలో మొత్తం 17వేలకు పైగా గ్రామాలుండగా నవంబరులో 1500 గ్రామాలలో సర్వే పూర్తి చేసి,హద్దులు రీమార్క్‌ చేసి,అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి అందరికీ భూహక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ పూర్తి చేసి అక్కడే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం కూడా గ్రామాల్లో ఉండేటట్టుగాఅడుగులు వేస్తోంది. నవంబరు నుంచి 1500 గ్రామాల్లో మొదలుపెట్టే ప్రతి నెలా కొన్ని వందల గ్రామాలను చేరుస్తూ వచ్చే ఏడాది(2023) చివరి నాటికి మొత్తం 17 వేల పై చిలుకు గ్రామాల్లో పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది.
2023 చివరికల్లా సంపూర్ణంగా రీ సర్వే..
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి కానుంది. అనంతరం షరతులు గల పట్టా పేరుతో నిషేధితజాబితాలో అంటే 22(ఏ)1 లో ఉన్న ఈభూముల సమస్యలను పరిష్కరిస్తూ.. రైతు లకు క్లియరెన్స్‌ పత్రాలను జారీ చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 355గ్రామాలలో 22 (ఏ) నిషేధిత జాబితాలో ఉన్న18,889 సర్వే నం బర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపింది. అవనిగడ్డలో ఆయా భూముల్లో సాగుచేసుకుంటున్న 22,042 మంది రైతులకు తమ భూములపై వారికి హక్కు కల్పించడం జరిగింది. వ్యాసకర్త :సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు-(కె.లోకనాథం)