యవ్వ మాట..కోయభాష

కంజాతి (వినండి).. తిరియాటి (మాట్లాడండి).. సదవాటి (చదవండి).. రాసాటి (రాయండి).. లిపిలేని కోయ భాషలోని పదాలివి. ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యార్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఇకపై గిరిజన పాఠశాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ.. లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పించింది.నీ పేరు ఏంటి అనడానికి ‘మీ పేదేరు బాత’, మీది ఏమి కూర అని అడగడానికి ‘మీ వాది బాత కూసీరి’, ఇటురా అని పిలవడానికి ‘ఇలావా’ అంటారు. ఇవన్నీ కోయ భాష పదాలు. అతి ప్రాచీన భాషలలో ఇది ఒకటి. మన తెలుగు భాషలాగే ద్రావిడ భాష నుంచి పుట్టింది. అందుకే ‘మన కులతూరు భాష సాయిమంతే..’ అని కోయ తెగవారు మురిసిపోతుంటారు. అంటే మన కోయ భాష మంచిది అని అర్థం..
భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన తెగల్లో కోయ తెగ ప్రధాన మైనది. వీరి భాష,సంస్కృతి,సంప్ర దాయ విధానం భిన్నంగా ఉంటుంది.కోయల భాషలో యాస అనేది స్పష్టంగా కనిపిస్తుంది. జిల్లాలో కోయ తెగ వాసులు ఎక్కువగా చింతూరు, వి.ఆర్‌.పురం,బుట్టాయగూడెం,పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు,జీలుగుమిల్లి మండలాల్లో ఉన్నారు. కోయలను రెండు విధాలుగా చెప్పుకుంటారు.మొదటి వర్గం దొరల సట్టం(కోయ తెగల్లో ఉన్నతులు-దేవుని వర్గం),రెండో వారు పుట్టదొరలు(నిజమైన దేవుళ్లుగా చెప్పుకుంటారు). గోండుల మాదిరి గానే తమను తాము వారి పరిభాషలో ‘‘కోయతూర్లు’గా చెప్పుకుంటారు. అలాగే కోయలు వారి వృత్తులను బట్టి రాచకోయ, గుమ్మకోయ,కమ్మరకోయ,ముసరకోయ, గంపకోయ,పట్టెడకోయ, వడ్డెకోయలు అనే 7వర్గాలుగా ఉన్నారు. అలాగే కోయలుగా గుర్తింపు పొందిన మరో నాలుగు తెగలు ఉన్నట్టు భాషా పరిశోధ కులు చెప్తున్నారు. డోలు కోయలు,కాక కోయలు, మట్ట కోయలు,లింగకోయలు అనే 4 తెగలను గుర్తించారు. అయితే కోయవారు కోయతూర్‌ భాషలో మాట్లాడతారు. కోయ భాషలో అన్నం తిన్నామా అనడానికి ‘‘దూడ తింతినే,నీ పేరు ఏంటి అనడానికి ‘‘మీ పేదేరు బాత’,మీది ఏమి కూర అని అడగడానికి ‘‘మీ వాది బాత కూసీరి’, నీకు జ్వరం వచ్చిందా అనడానికి ‘‘మీకు ఎరికి వత్తే ‘,ఇటురా అని పిలవడానికి ‘‘ఇలావా’ అని వారి భాషలో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఒక నాడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే కోయలందరూ మాట్లాడ గలిగినా నేడు కొందరు మాత్రమే ఈ భాషలో మాట్లాడు తున్నారు. మరికొందరు భాష వచ్చినా మాట్లాడ టానికి సిగ్గుపడుతున్నారని ఆ తెగకు చెందిన వారే చెప్తున్నారు. దీనికి కారణం అభివృద్ధి పేరుతో పరుగులు పెట్టడమేనని అంటున్నారు. జిల్లాలో గిరిజనులు సుమారు 97,929 వరకూ ఉండగా వీరిలో 70శాతం కోయ భాషమాట్లాడే వారు ఉన్నారంటూ ఆ తెగకు చెందిన పెద్దలు చెప్తున్నారు.వీరిలో ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 60వేల మంది వరకూ గిరిజనులు నివసిస్తున్నారు.
గోండు అనేది సమాజం కోయతూర్‌? అనేది తెగ
ఒక్క తెలంగాణలో తప్ప దేశవ్యాప్తంగా గోండులు కోయలంతా కోయతూర్‌?లు గానే చెప్పుకుంటారు. దీనిని గోండి కోయ పురాణ లలో చూడవచ్చు, మధ్య భారతంలో 1నుండి 12 రకాల గొట్లు (సగా) లుగా నేడు ఆదివాసీ లున్నారు. అందులో తెలంగాణలో 3 నుండి 7 వరకు ఉన్నవి, మిగతావి ఇతర రాష్ట్రాలలో చూడవచ్చు వీరంతా కోయతూర్‌?లు గానే పిలుచుకుంటారు. కొమరం భీమ్‌ పోరాటం తరువాత ఆదిలాబాద్‌లో నిజాం రాజు ఏర్పాటు చేసిన ఆస్ట్రియా దేశస్తుడు అయిన ప్రో.హైమండార్ఫ్‌ కమిషన్‌ హైద్రాబాద్‌ రాష్ట్రంకి ఇచ్చిన నివేదికలో గోండు అని రాయటం మూలంగా తెలంగాణలో గోండు, కోయ వేరు అనే పరిస్థితులు వచ్చాయి. 8వ షెడ్యుల్‌లో గోండు భాషను అధికారికంగా గుర్తించాలి ప్రధానంగా ఈ దేశంలో హిందీ ప్రధాన భాషగా ఎక్కువ రాష్ట్రాలలో ఉండటం తో పూర్తి చేసిన ఈ డిక్షనరి మొదటగా దేవన గరి స్క్రిప్ట్లో ముద్రణలో చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో స్థానిక భాషలలోకి అనువాదం జరుగుతుంది. ఈ ప్రయత్నంతో రాష్ట్రాలు వేరు అయినా,ఈ దేశం ఆదివాసీ లను విభజన చేసినా,విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం జరిగిన ఒక గొప్ప ప్రయత్నంగా ఈ డిక్షనరీనీ చూడొచ్చు.ఈ డిక్షనరీ ఆదివాసి మేధావులు తయారు చేయటం వెనుక ఉన్న ఆకాంక్ష ఏమిటి అంటే పార్లమెంట్‌లో కోట్లాది కోయతూర్‌? ప్రజల అస్థిత్వానికి సంబంధించిన భాషకు రాజ్యాంగబద్ద ఆమోద ముద్ర 8వ షెడ్యూల్‌లో జరగాలి అని,హోం మంత్రిత్వ శాఖ అధికారిక పత్రం ప్రకారం గోండుభాషతో సహా 38 భాష లను చేర్చాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. 2004లో నాలుగు బాషలకు బోడో,డోగ్రి మైథిలి, సంతాలికి 22 భాషలతో కూడిన 8వ షెడ్యూల్‌?లో జోడిరచబడ్డాయి.కానీ గోండు భాషకు స్థానం కల్పించలేదు. గోండుభాష అంటే కేవలం సంభాషించే మాధ్యమం మాత్రమే కాదు, భౌగోళిక, పాక్నతిక, సామా జిక, చారిత్రక, ఇతిహాసాల సమగ్ర స్వరూపం, పురాతన మౌఖిక సాహిత్యం, ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానంతో ముడి పడి ఉన్నందున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలి. కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతంగా జరగాలి. ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో ఈ డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధ మిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూనివర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి.భాషాశాస్త్ర వేత్తలు,బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు,ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి.కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‌లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుంది. లేదంటే భవిష్యత్‌లో పరాయి మతాల యొక్క బాషల ప్రభావం పడి కోయ తూర్‌ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం.
అతి ప్రాచీన భాషల్లో ఒకటి
తాము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకోవడమే తప్ప తమ భాష, సంస్కృతి, సంప్రదాయం, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారుతోందని కోయ గిరిజనులు భావించలేక పోతున్నారని పలువురు కోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోయ భాష అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి. ద్రావిడ భాష నుంచి కోయ భాష పుట్టిందని చరిత్ర చెబుతోంది. అయితే కోయభాషను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కోయ భాష మీద ప్రధాన భాషల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆతెగకు చెందిన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరికత పేరుతో జరుగుతోన్న అభివృద్దిలో భాగంగా భాషలకు ముప్పు వాటిల్లుతుందని, ఆ ప్రభావం కోయభాషపై కనిపిస్తోందని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో కోయ భారతి విద్య
కోయ భాషకు లిపి లేనప్పటికీ కేఆర్‌పురం ఐటీడీఏ ఆధ్వర్యంలో 2005లో కోయ భాషలో గిరిజన విద్యార్థులకు విద్యాబోధన జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. అనుభవజ్ఞులైన గిరిజన ఉపాధ్యాయుల ద్వారా కోయ భాషకు సంబంధించిన తెలుగు పదాలతో కోయ భారతి అనే పుస్తకాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకూ ప్రధాన భాషలతో పాటు కోయ భాషను కూడా బోధించే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఈ విధానం వల్ల కోయ విద్యార్థులో విద్యపై ఆసక్తి పెరుగుతుందని, ప్రాథమిక విద్యాభ్యాసం సులభతరం అవుతుందని అధికారులు అంటున్నారు. అయితే కోయ భాషకు లిపి లేనందున భాషా సంస్కృతి క్రమంగా తగ్గిపోతోందని ఆదివాసీ కోయతెగల మేధావులు అంటున్నారు. తమ తెగకు ప్రధానమైంది భాషేనని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆదివాసీ గిరిజనులపై ఉందని పేర్కొంటు న్నారు.కొండకోనల్లో అంతరించి పోతున్న అరుదైన కోయ భాషలకు రాష్ట్ర ప్రభుత్వం ఊపిరిలూదుతోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సహజంగా గిరిజన తండాల్లో మూడొంతుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. ఈ కారణంగా వారు విద్యకు దూరమై సమాజంలో వెనుకబాటుకు గురవు తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, వారి జీవితాల్లో విద్యా సుగంధాలు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గిరిజ నులు మాతృభాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసించేలా వినూత్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాన్ని చేపట్టింది.
6 భాషలు..920 పాఠశాలల్లో అమలు
రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమలు చేయను న్నారు. ఈ విధానాన్ని ‘కోయ భారతి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవ డంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది.ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ),శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో (సవర),విశాఖపట్నం జిల్లాలో (కొండ,కువి, ఆదివాసీ),కర్నూలు,అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1నుంచి 3వ తరగతి వరకూ తెలుగు,గణితం,పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60లక్షల వ్యయంతో పాఠ్యాంశాలు రూపొందించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా 920 పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేనిచోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు.
యవ్వ.. ఇయ్య భాషలోనే..
కోయ భాషలో అమ్మను యవ్వ అని..నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా..అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని..కోడి పుంజును గొగ్గోడు అని..పిల్లిని వెరకాడు అని పిలుస్తారు. కూడికేకు (కూడిక), తీసివేతాకు (తీసివేత), బెచ్చోటి (ఎంత పరిమా ణం), దోడ తిత్తినే (అన్నం తిన్నావా),బాత్‌ కుసిరి (ఏంకూర),దెమ్ము (పడుకో),ఏరు వాట (నీరు ఇవ్వు,పెట్టు),మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి) వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతా ల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి. ప్రాథమిక విద్యార్థులకు వారు మాట్లాడే మాతృ భాషలోనే బోధన చేయడం వల్ల వారిలో అభ్యసన స్థాయిని పెంచడంతో పాటు వారి భాష, సంస్కృతి,సంప్రదాయాలను చెక్కు చెదరకుండా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధించడమనేది ఇతర భాషలపై పట్టు సాధించేందుకు ఎంతో దోహదపడుతుంది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను రూపొం దించారు.మాతృభాషలో బోధన వలన డ్రా పౌట్లు కూడా తగ్గుతాయి. మాతృభాషలో బోధనకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసు కుంది. ప్రాథమిక స్థాయిలో గిరిజన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అక్షరం ముక్కలు రాక అన్ని రకాలుగా వెనుకబాటుకు గురవుతున్న గిరిజనులకు ఇది సువర్ణావకాశమనే చెప్పాలి. కొత్తగా పాఠశా లలకు వెళ్లే పిల్లలకు వాడుకలో ఉన్న కోయ భాషలో బోధన ఎంతో అవసరం. ఇతర భాషలు నేర్చుకోవాలంటే వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. కోయభాషలో పాఠాలు చెబు తుంటే మా పిల్లలకు సులువుగా అర్థమవు తుంది. కోయభాషతో పాటు తెలుగులో కూడా చెబుతుండటం బాగుంది.
కోయతూర్‌ బాట సాహిత్య కార్యశాల
కోయతూర్‌ల అస్థిత్వ మూలాలు,వారి కోయ భాష క్రమక్రమంగా అంతరించే దశకు చేరుకు న్నాయని ఆ తెగ ను, వారి కోయ భాష ను పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని కోయతూర్‌ బాట వ్యవస్థపాకలు జి. యాద య్య పిలుపు నిచ్చారు.చింతూరు మండలం రామన్నపాలెంలో కోయతూర్‌బాట, సమత నిర్వహణలో కోయ బాల సాహిత్యం అనే అంశం పై ఐదు రోజులపాటు ఆదివాసీ యువకులు, పాఠశాలలో ని విద్యార్థులకు నిర్వహించిన కార్యశాల (వర్క్‌ షాప్‌ )నిర్వహించారు.సదస్సులో ఆయన మాట్లాడారు. ఒకే భాషగల ప్రజలు ఒకే మూలం నుండి వచ్చిన ప్రజలు భాష కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.భాషా శాస్త్ర వేత్తలు,బాషా శాస్త్ర పరిశోధన సంస్థలు, ప్రత్యేక దృష్టి పెట్టాలి. బాష ప్రాధాన్యతను పెంచాలి. కోయ భాష ఆత్మగౌరవంనీ తెలియచేయాలి. అప్పుడే కోయతూర్‌లకి ఈ దేశంలో మనుగడ సాధ్యమవుతుందని తెలిపారు. లేదంటే భవిష్యత్‌లో పరాయి బాషల ప్రభావం పడి కోయతూర్‌ల అస్తిత్వ మూలాలు ధ్వంసమయి ఆదిమ జాతులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోవడం అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజమని స్పష్టం చేశారు. ఆదివాసీల హక్కులు, వనరులు పరిరక్షణ పై పని చేస్తున్న సమత కో-ఆర్డినేటర్లు గునపర్తి సైమన్‌, కందుకూరి సతీష్‌ కుమార్‌లు మాట్లాడుతూ భాష ప్రయుక్త రాష్ట్రాలుగా,ఒరిస్సా,మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌,ఆంధప్రదేశ్‌,మహారాష్ట్ర,ఒరిస్సా,కర్ణాటకలుగా విభజించటంతో ఆయరాష్ట్రాలలో ఈ కోయతుర్‌ భాషకు ప్రాధాన్యత లేక,66ఏళ్ళుగా,కోయ భాషకు మరాఠి,ఒడియ,హింది,కన్నడ తెలుగు భాష ప్రభావం పడి,కోయభాష యాస,ప్రాసలు కూడ మారియన్నారు.దాంతో కోయ పదాలన్ని స్థానిక భాష పదాలు అని చెప్పుకునే క్రమం తగ్గి పోతుందాన్నారు.విచ్ఛిన్నం చేసినా కోయ భాష మూల పదాలు భద్ర పరచటం కోసం ఇది ఒక గొప్ప ప్రయత్నమని తెలిపారు. ఆదివాసీ అస్థిత్వ మూలాలు, సంస్కృతి సాంప్ర దాయాలు, జీవన విధానంతో ముడిపడి ఉన్నం దున రక్షణకు దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం జరగాలన్నారు.కోయ భాష విస్తృతికి ఇంకా పరిశోధనలు విస్తృతం చేయాల్సి న బాధ్యత, ఆవశ్యకత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు.ప్రతి రాష్ట్రంలో ఆదివాసి పాఠశాలలో డిక్షనరీ పదాలు చేర్చి ప్రాధమిక విద్య అందించాలి. సెకండరీ విద్యా, యూని వర్సిటీ స్థాయిలో కోయ భాషకి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలన్నారు.నాలుగు రోజుల వర్క్‌ షాప్‌లో కోయతూర్‌ బాట అకాడమీక్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పాండు ఆధ్వర్యంలో కోయ భాష పదాలు గుర్తించడం, విద్యార్థులు తో పదాలు పలికించడం వంటి అంశాలపై చర్చగోష్టి ఆసక్తికరంగా సాగింది.ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన కోయుతూర్‌ తెగల ఆనాటి జీవనవిధానం,వారు ధరించే వస్త్రాలు,పనిముట్లు ఇతరాత్ర అంశాలపై ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది.సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న గిరిమిత్ర సంస్థ కార్యదర్శి బండి గంగరాజు,వినియోగదారుల సంఘం కార్యదర్శి చిట్టిబాబు,కృష్ణ,దుమ్మిరి వెంకన్న బాబు,సున్నం ఈశ్వర్‌ కుమార్‌,జి రాఘవ,దుమ్మిరి భీమమ్మా,కట్టం కిరణ్‌ యువతీ యువకలు,గిరిజన పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -గునపర్తి సైమన్‌