మారుతున్న ఉపాధి సంబంధాలు

సంపద సృష్టికర్తలు కార్మికులు అని, ఉత్పత్తి సంబంధాలన్నీ కార్మికులకు ఉత్పాదక శక్తులకు ఉంటాయని ప్రపంచవ్యాప్త పరిశోధనాత్మక నిర్ధార ణలు అనేక దశాబ్దాలుగా ప్రజా బహుళ్యంల్లో ఉన్నవి. కానీ పెట్టుబడి ప్రభావం పెరిగిన తర్వాత సంపద సృష్టికర్తలు కార్మికులు కాదు పెట్టుబడు దారులే అంటూ స్వయానా ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే ప్రకటిస్తుంటే, కార్మికుల పాత్రను నామమాత్రం చేస్తూ సమాజం ఒక విపరీత ధోరణిని తీసుకుంటున్నది. అ ఈ రకమైన ప్రకటన ద్వారా కార్మికులను ద్వితీయ శ్రేణికి తోసి వేయడమే కాకుండా డబ్బు మాత్రమే సమకూర్చిన పెట్టుబడిదారులకు పెద్దపీట వేయడం జరుగుతుంది.
ఇలా జరగడానికి ప్రధాన కారణం రాజకీయాలను, ప్రభుత్వాల ఏర్పాటును పెట్టుబడిదారులు శాసించగల స్థాయికి చేరుకోవడమే. అయితే ఇలాంటి భావనలు దారి తీయడానికి మరో కారణమేమంటే ఒకప్పుడు ఉత్పత్తి ఒకచోట ఒక కర్మాగా రంలో లేదా ఒక కాంప్లెక్స్‌లో ఉండే అనేక కర్మ గారాలలో వర్కర్లందరూ కలిసి ఉత్పత్తి చేసేవారు అందుచేత పిరియాడికల్‌గా బయ టకు వస్తున్న ఉత్పత్తి ఎంతో అందరికీ కనిపించేది.మారిన పరిస్థితులలో ఒక వినియోగ వస్తువుకు సంబంధించిన ఉత్పత్తి ఒకచోట జరగడం లేదు. ఒకే రకమైన నైపుణ్యం గల వ్యక్తుల ద్వారా కాకుండా వివిధ నైపుణ్యం గల వ్యక్తుల ద్వారా,వివిధ ప్రదేశాలలో వివిధ రకాల విడిభాగాలన్నీ వేరువేరుగా ఉత్పత్తి చేయబడి, అంతిమ వినియోగ వస్తువు మరోచోట తయారవుతుంది. దీని ద్వారా జరిగిన మార్పు ఏమంటే,ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వర్కర్లు ఒకే చోట,ఒకే సమయానికి, ఒకే సారూప్యతతో పని చేసే అవకాశం లేకపోవడం వల్ల ఎవ్వరూ ఐక్యతగా ఏర్పడి యాజమాన్యాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయింది. అనగా ఉపాధిదారులు క్రమం తప్పకుండా ఒకేచోట పని చేసే అవ కాశం లేకపోవడంవల్ల సంఘటిత పడే అవకా శాన్ని కోల్పోయి యాజమాన్యాలతో సంబంధాలు తెగిపోయాయి. ఇక మరో రకమైన మార్పు ఏమంటే వర్క్‌ ఫ్రం హోం అనే కాన్సెప్ట్‌ మొదలైన తర్వాత ఉద్యోగులు ఎవరూ ఆఫీసు లకు వెళ్లవలసిన అవసరం లేకుండా పోయి, కేవలము కంప్యూటర్ల ద్వారా కమ్యూని కేషన్లు తీసుకొని,నెట్‌ బ్యాంకుల ద్వారా జీతభ త్యాలు స్వీకరించి,తమకు కేటాయించిన పనిని పూర్తి చేయడం వలన ఉద్యోగికి యజమానికి సంబంధాలలో విపరీతమైన మార్పులు వచ్చాయి. అనేక సందర్భాలలో నెలలు సంవత్సరాలు ఒక కంపెనీకి సేవలు అందించిన ఉద్యోగులు చాలామంది, యజమాని పేరు తప్ప భౌతికంగా వారిని చూసిన పరిస్థితులే లేవు. అనేక మంది వుద్యోగులు తమకు నష్టం జరగనంతవరకు యాజమాన్యాన్ని తెలుసుకోవాలన్న ఊసే ఎత్తడం లేదు.ఒక దేశంలో ఉన్న వ్యక్తి వేరొక దేశంలోని కంపెనీకి సేవలు అందించడం, పారితోషికాన్ని తీసుకోవడం చక చక జరిగిపోతున్నాయి. దీనివల్ల నైపుణ్యానికి తగిన ప్రతిఫలం వస్తుందని సదరు ఉద్యోగి భావిస్తూ ఉండవచ్చు కానీ అటువంటి పనికి విపరీతమైన పోటీ ఉద్యోగికి కనిపించ కుండానే సృష్టించి, ఎక్కువ నైపుణ్యం గల వారికి తక్కువ చెల్లిస్తూ శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఎంతోమంది పెట్టు బడిదారులు మోసం చేస్తున్న సంగతి గుర్తించే అవకాశం లేకుండా ఉన్నది. ఇలాంటి పని విధానంలో మహిళలని ఎక్కువగా విని యోగించుకుంటారు. వర్క్‌ ఫ్రం హోం కొంతమేర మహిళలకు అనుకూలంగా ఉండడం వలన మరియు బీరమడే శక్తి తక్కువగా ఉండడం వలన మరియు సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉండటం వలన మహిళలు ఏమాత్రం నైపుణ్యానికి తగిన ప్రతిఫలం కోసం బేరమాడకుండా ఇలాంటి ఉపాధికి ఒకరకంగా బలౌతున్నారు. అందుచేత మారుతున్న పని పద్ధతులలో మహిళలు సమిధలవుతున్నారు. ఉపాధి కాంట్రాక్టీకరణ నుండి జాబు కాంట్రాక్టీకరణ అనే పద్దతులకు పరిస్తితి ఇప్పుడు మారింది. అనగా ఒక ఉద్యోగిని నిర్ణిత పనికి కాంట్రాక్టు పద్ధతిన నియమించుకునే వ్యవస్థను నూతన ఆర్థిక విధానాల మొదలైన తర్వాత చూసాము. ఇప్పుడు ఉద్యోగిని నియమించుకోకుండా అలాంటి వ్యక్తులకు పనిలో కొంత భాగాన్ని కాంట్రాక్టుకు ఇచ్చి పని చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుచేతనే శ్రమకు, శ్రామికుడికి గతంలో వున్నంత విలు8వ గుర్తింపు ఇప్పుడు లేవు. సెమీ సంఘటిత రంగంగా భావింపబడుతున్న నైపుణ్యాలతో పని జరిగే చోట కూడా శ్రామికునికి ప్రాధాన్యత కరువైంది.నూతన ఆర్థిక విధానాల అనం తరం శ్రమ దోపిడి ఎక్కువౌతది, శ్రామికులు కూడా వస్తువులుగా వాడబడతారు అని వాదించిన అభ్యుదయ వాదనను చాలా మంది నమ్మలేదు. అంతే కాకుండా అవకాశాలు మెరుగౌతాయని వాధించి, ప్రపంచీకరణలో భాగంగా విస్తరిం చిన అవకాశాలను చూపించి ఎద్దేవా కూడా చేశారు. ముప్పైఏళ్ళ తర్వాత గానీ దాని విశపూరిత ఫలితాలు అర్థమౌతున్నాయి. అసంఘటిత రంగంలో మొదటి నుంచీ మహిళలకు ద్వితీయ శ్రేణి గుర్తింపే. ఎందుకంటే భౌతిక శక్తి తక్కువగా వుండటం వల్ల తక్కువ ప్రాధాన్యతనిస్తూ తక్కువ చెల్లిస్తారు. ఈ సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. అయితే సంఘ్హటితమై పోరాడిన చోట ఫలితాలు మెరుగైన మాట కూడా వాస్తవమే. అయితే వలస కార్మికుల తాకిడి పెరిగిన తరువాత స్థానిక మహిళా కార్మికులకు ఉపాధి కరువైన మాట వాస్తవం. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, తాలూకా మండల స్థాయిల్లోని నూనె, రైస్‌, నూలు వంటి ఇండస్ట్రీలలో ఈ ఇతర రాష్ట్ర వలస కార్మికులను కుటుంబాలతో సహా తెచ్చుకుని పెట్టుకోవడం వల్ల తక్కువ పారితోషికానికి పని గంటలతో నిమిత్తం లేకుండా ఎక్కువ పని చేయించుకుని దోపిడీ చేస్తున్నారు. కుటుంభం మొత్తాన్ని పనిలో పెట్టుకోవడం వల్ల మహిళల శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదు. అయితే ఈ నియా మకాలు కూడా ఒక సబ్‌ కాంట్రాక్ట్‌ పద్దతిన యజమానికి వర్కరుకు మధ్యన ఒక దళారీ వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఏరకమైన రాతపూర్వక ఒప్పందాలూ వుండవు.ఫ్యాక్టరీ యాజమాన్యంతో సహా కుటుంబ యజమాని దాష్టీకానికి అబలలు బలౌతున్నారు. అంతే కాకుండా స్థానికులైతే సంఘటితమౌతారని, ప్రమాదాలకు నష్టపరిహారమడుగుతారనీ మరియు సంఘాలు-రాజకీయాలు కలుగజేసు కుంటారని కూడా ఈ యాజమా న్యాలు భావిస్తున్నాయి. గత్యంతరం లేని కారణంగా స్థానికులు మరో ప్రాంతానికి వెళ్ళి ఇదే రకమైన దోపిడికి గురౌతున్నారు. సిఐటియు అగ్ర నాయకులు ఎస్‌. వీరయ్యగారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల గల పారిశ్రామిక వాడల్లో జరిపిన పాద యాత్ర సందర్భంగా ఈ వాస్తవాలు అనేకం బయట పడ్డాయి. వలస కార్మికులపై సమగ్ర విధానం ప్రభుత్వాలు పాటించకపోవడం వల్ల ఈ దుస్థితి దాపు రిస్తుంది. ఇక సంఘటిత రంగంలోని మహిళలు, ముఖ్యంగా కుటుంబభారం పైబడిన వారిని టార్గెట్‌గా చేసుకుని కంపెనీల సతాయింపులుంటున్నవి. ప్రస్తుత మాంద్య పరిస్తితుల్లో అత్యధిక పారితోషికాన్ని పొందు తున్న వారిని మొదటగా తొలగించి వారి స్థానాల్లో అవసరం మేరకే కొత్తవారిని నియమించుకుంటున్నారు. సహజంగా కొత్తవారు తక్కువ జీతానికి అందుబాటులో వుంటారుగా! గత ఆరు నెలల కాలంలో ప్రైవేటు ఉపాధి కోల్పోయిన కారణంగా ఆత్మహత్యలు పెరిగి పోయాయని ఎన్‌.సి.ఆత్‌.బి తెలిపింది. రిపబ్లిక్‌ డే ఉపన్యాసంలో గవర్నర్‌ తమిళిసై తెలంగాణా సర్కారుపై అక్కసుతోనే చెప్పి9నప్పటికీ ఆత్మహత్యల్లో పెరుగుదల వుండటానికి కారణం అసంబద్దమైన తొలగింపులే. అయితే భాజపా అధికారంలో ఉన్న కర్నాటకా,మహారాష్ట్రల్లోనూ మరింత ఎక్కువగా ఈ ఆత్మహత్యలుండటం పాలనతో పాటు వైపరీత్యపు పెట్టుబాడిదారి వ్యవస్థ లోపాలకు అద్దం పడుతుంది.ఎక్కువె క్కువ ప్యాకేజీలతో,విపరీత పోటితత్వంతో ఈ అనిశ్చితితో(ప్రికేరియస్‌) కూడిన వ్యవస్థను బలపరుస్తున్నది కూడా నైపుణ్యంగల యువతనే. అయితే కొంత కాలం గడిచాక,బాధ్యతలు పెరిగాక గాని దీనిలో లోపాలనూ,సంఘ్హటిత ఐక్యతనూ వారు గుర్తించటం లేదు. కాంట్రాక్టు వ్యవస్థలో 27 రకాలున్నాయంటే దోపిడి కోసం దాని తీవ్రత చూడండి. వ్యక్తిని నియమించు కోకుండా పని(జాబ్‌)లోని కొంత భాగానిఇకి మాత్రమే అంగీకారానికి రావడంతో వివిధ రకాల విడిభాగాల పనికి దళారీ వ్యవస్థ పెరిగి వుద్యోగికీ యజమానికీ సంబంధాలు ఏర్పడే అవసరమే లేదు.ఉదాహరణకు మొబైల్‌కు సంబంధించిన విడిబాగాల ఉత్పత్తిలో ఈ పద్దతి కళ్ళకు కట్టిన సత్యం.పది పదేహేను దేశాల్లో ఉత్పత్తౌతున్న విడిబాగాలన్నీ కలిపితే ఒక సెల్‌ఫోని తయారౌతుంది. అలాంటప్పుడు ఆప్పిల్‌, వన్‌ప్లస్‌ వంటి కంపేనీల వుద్యోగులను ప్రత్యేకంగా గుర్తించే అవకాశమే లేదు. నియామ కాలు తొలగింపుల్లో పాటించవలసిన ప్రభు త్వాల నిభందనలను తప్పించుకునేందుకు దళారీ వ్యవస్థ కంపెనీలకు బాగా ఉపకరి స్తుంది. గత్యంతరం లేక నిరుద్యోగులు వారిని ఆశ్రయించాల్సి రావడం, దళారీల కమీషన్‌ పోగా మిగిలిందే తీసుకోవాల్సి రావడం తప్పని పర్స్థితిగా ఏర్పడిరది.ఈ క్రమంలో విదేశాల్లో విద్యాభ్యసించిన యువత ముఖ్యంగా మహిళలు తమ బ్యాంకు ఋణాల తీర్చే క్రమంలో ఇలాంటి దోపిడీలకు బాగా గురౌతున్నారు. వెరసి- కాంట్రాక్టీకరణ, ఔట్‌?సోర్సింగ్‌, ప్యాకేగీ వర్క్‌…వంటి పని విధానాలతో ఉద్యోగీ యజ మానీ మధ్య ఉపాధి సంబంధాలు కనీస స్థాయిలో వున్నవి. పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడికి ఇవి మరింత దోహద పడుతున్నవి. ప్రపంచీకరణను ఎదుర్కునేందుకు పోరాటాలనూ ప్రపంచీకరించినట్లుగానే కార్మికుల ఐక్యతకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిందే.
సంస్కరణతో ఇబ్బంది
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా కేంద్ర ప్రభు త్వం తీసు కొచ్చిన సంస్కరణలు కూలీలకు ఇబ్బందిగా మారుతున్నాయి. గతంలో ఉపాధి కూలీలకు వేసవి భృతి లభిస్తుండగా సంస్కరణతో వేసవి భృతికి చెక్‌ పడిరది.ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫర్‌మెటిక్స్‌ సెంటర్‌) ద్వారా ఉపాధి పనుల్లో పూర్తి పారదర్శకత కోసం నేషనల్‌ మోబైల్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మే 21న ప్రారం భించగా, రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అధికారులు అమలు చేస్తున్నారు. తాజాగా రెండు పూటల పనిదినాలు అమలు చేయాలని ఆ దేశాలు రావడంతో ఉదయం 7నుంచి 11గంటల వరకు ఉపాధి కూలీలు పనిచేసే ఫొటో, మళ్లీ మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకు కూలీలు పనిచేసే ఫొటోను విధిగా మేటీలు, పంచాయతీ కార్య దర్శులు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎంతమంది కూలీలు పనులకు వచ్చారనే విషయాన్ని మేటీలు ఉదయం, మధ్యాహ్నం మస్టర్లలో నమోదు చేయాలి. కాగా ఈ వెబ్‌సైట్‌ లో కూలీలు పనిచేసే చోట 20మందికి పైబడి ఉంటేనే ఫొటో అప్‌లోడ్‌ అవుతోంది. ఫొటోతో పాటు హాజరైన కూ లీల పేర్లు, పనుల వివరా లు సమగ్రంగా క్రోడికరిం చాల్సి ఉండ డంతో ఉపాధి కూలీల అక్రమాలకు చెక్‌ పడే అవకాశ ముంది. వేసవి దృష్యా మధ్యాహ్నం పనిచేస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముందని అందుకు మినహాయింపు కల్పించాలని కూలీలు కోరుతు న్నారు. నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 1,02,328 జాబ్‌ కార్డులు ఉండగా అందులో 32,101 యాక్టివ్‌ కార్డులు ఉన్నాయి. మొత్తం 280 గ్రామ పంచాయతీలకు గాను ఈనెల 19న 21,319 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ప్రతీ గ్రామ పంచా యతీలో 76మంది కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. రోజు కూలి రూ.257 పడాల్సి ఉండగా గరిష్ఠంగా జిల్లాలో మాగనూర్‌, నర్వ మండలాల్లో రూ.174, కనిష్ఠంగా మక్తల్‌ మండలంలో రూ.119 కూలి పడుతోంది. వేసవి అలెవెన్స్‌ 30శాతం రాయి తీ కూడా తొలగింపుతో కూలీల సంఖ్య కూడా తగ్గి గిట్టుబాటు కావడం లేదని వెంటనే వేసవి అలెవె న్సును పునరుద్ధరించాలని కూలీలు డిమాండ్‌ చేస్తున్నారు.దినసరి కూలి రూ.200 తగ్గకుండా ఉండేలా ఎంపీడీవోలు,ఎంపీవోలు, ఏపీవోలు,ఈసీలు,కార్యదర్శులు,టీఏలు, మేటీలు క్షేత్రస్థాయిలో కూలీలకు మార్కౌట్‌ ఇచ్చి పనులు జరిగేలా చూడాలని డీఆర్డీ వో గోపాల్‌నాయక్‌ తాజాగా నిర్వహించిన టెలీకా న్ఫరెన్స్‌లో దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం రోజుకూలి రూ. 257గా నిర్దేశించింది. కృష్ణ మండలంలో రోజుకూలి రూ.125, ధన్వాడలో రూ.127, పేటలో రూ.135,కోస్గిలో రూ.138, మద్దూర్‌లో రూ.167,దా మరగిద్దలో రూ.151,మరికల్‌లో రూ.155,ఊట్కూర్‌లో రూ.156,మాగనూర్‌,నర్వలో అధికంగా రూ.174కూలి పడుతోంది. గ్రామ పంచాయతీ స్థా యిలో నారాయణపేట మండలంలో 28 గ్రామ పంచాయతీలకు 3020 కూలీలు పనులు చేయగా రోజు కూలి రమారమిగా రూ.107 గరిష్ఠంగా ఉండగా అత్యల్పంగా మాగనూర్‌లో 16 పంచాయతీ లకు 819మంది కూలీలు పనుల్లో పాల్గొనగా రమారమి రూ.51 కూలి కనిష్ఠంగా పడుతోంది. -జి.తిరుపతియ్య