మహిళల్లో పెరుగుతున్న ఎనీమియా సమస్య

ఐరన్‌లోపం ఉండడంవల్ల ఎనీమియా మొదలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీ స్తుంది. ఐరన్‌ తక్కువగా ఉండటంవల్ల తల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు,అలసట మొదలైన సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చెప్పిన దాని ప్రకారం ఐరన్‌ లోపం 33శాతం మహిళల్లో కనబడు తుందని 40శాతం గర్భిణీలలో..42శాతం పిల్లల్లో కన బడుతోందని మనకి తెలుస్తోంది. అందుకనే నిపుణులు ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదా ర్థాలు గురించి తెలియజేశారు. కనుక ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్‌ డైట్‌లో తీసు కుంటే మంచిది. చాలా మంది ఐరన్‌ ఏ కదా అదే వస్తుందిలే అని టెక్‌ ఇట్‌ ఈజీగా తీసుకుం టారు. కానీ అలా చెయ్యడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆరోగ్యం విషయం లో ఎప్పుడు కూడా లైట్‌ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే సమస్య చిన్నగా ఉంటేనే సాల్వ్‌ చెయ్యడానికి కుదురుతుంది. పెద్దది అయితే దాని నుండి బయటకి రావడం నిజంగాకష్టం. ఇది ఇలా ఉంటే ఐరన్‌ లోపం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని తెలుసుకోవాలి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నా రు. మరి ఆలస్యం ఎందుకు ఐరన్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ఐరన్‌ ఎందులో ఉం టుంది అనే దాని గురించి తెలుసుకుందాం.! -జిఎన్‌వి సతీష్‌
ఆహారం కంటే ముఖ్యమైనది మంచి నీళ్లు.నీళ్ళే కదా అని పట్టించుకోవడం మానేయద్దు. నీళ్లు నిజంగా బాడీకి చాలా అవసరం.ఎక్కువగా నీళ్లు తీసుకోవాలిఅని చాలా మంది చెప్తూ ఉం టారు అయితే నిజంగా నీళ్లు అంత ముఖ్యమా అని ఆలోచిస్తున్నారా..? అవునండి మనం తీసుకునే నీళ్లు కూడా మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్‌ చేస్తాయి. సరిగ్గా నీళ్లు తీసుకుని హైడ్రేట్‌గా ఉంటే ఎనిమియా సమస్యకు దూరంగా ఉండ వచ్చు. ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బులెటిన్‌ రీసె ర్చర్లు చెప్పిన దాని ప్రకారం చూస్తే…మంచి నీళ్లు తీసుకోవడం వల్ల ఐరన్‌ లోపం కలగదని అంటున్నారు కాబట్టి హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం అని తెలుసుకుని..ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగండి. మీరు కనుక వట్టి మంచి నీళ్లు తాగ లేకపోతే నీటి యొక్క ఫ్లేవర్‌ని మార్చుకోవచ్చు. ఉదాహ రణకు అందులో రెండు తులసి ఆకులు వేసు కుని రుచి మార్చుకోవచ్చు లేదా పుదీనా, నిమ్మ రసం ఇలా ఏదైనా మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా నీళ్ళని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉం డొచ్చు. పైగా చాలా సమస్యలు మీకు రావు. ముఖ్యంగా ఐరన్‌ సమస్యలు కూడా ఉండవు.
ఆకుకూరలు తీసుకోండి:
చాలా మంది ఆకు కూరలు అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆకు కూరల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు తరిమికొ ట్టొచ్చు. అయితే ఆకు కూరల్లో ఐరన్‌ కూడా ఉంటుంది అని గ్రహించండి. పాలకూర కాలే మొదలైన ఆకు కూరల్లో ఫోలేట్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది.కాబట్టి వీలైనంత వరకు ఆకు కూరలను కూడా మీ డైట్‌ లో చేర్చండి. ఆకుకూరల తో మనం వివిధ రకాల రెసిపీస్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు పాల కూర తో పాలక్‌ పన్నీర్‌ వంటివి ఎంతో రుచిగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కొత్త కొత్త రెసిపీలని కూడా ఆకు కూరలతో ప్రయత్నం చేసి ఏదో రూపం లో తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. తద్వారా ఆరోగ్యం గా ఉండొచ్చు. అకాడమీ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటటిక్స్‌ ప్రకారం సమతుల్యమైన ఆహారం తీసు కోవడం చాలా ముఖ్యం. అందులో విటమిన్‌ సి కూడా తప్పక ఉండేటట్లు చూసుకోండి. ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో పాటు విటమిన్‌ సి కూడా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా విటమిన్‌-సి ని తీసుకోవ డంవల్ల ఐరన్‌ లోపం కలగదు అని చెబుతు న్నారు. కాబట్టి విటమిన్‌ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా మీరు డైట్‌లో తీసుకోండి. ఎనిమియా సమస్య లేకుండా వుండండి.
మాంసం మరియు పౌల్ట్రీ
చికెన్‌, మటన్‌ మొదలైన వాటిలో ఐరన్‌ ఎక్కువ గా ఉంటుంది. అదే విధంగా వాటిలో ఫోలేట్‌ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా ఐరన్‌ లోపం కలగకుండా కూడా ఇది జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి వీటిని కూడా తప్పకుండా డైట్‌ లో తీసుకోండి.
ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కాల్షియంతో పాటు తీసుకోకండి
ఈ తప్పు కనుక మీరు చేస్తుంటే సరిదిద్దుకోండి. ఎందుకంటే ఐరన్‌ తో పాటు క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఐరన్‌ తీసుకో వద్దు. అదే ఐరన్‌ ఉండే ఆహార పదార్థా లను తీసుకుంటే కాల్షియం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఐరన్‌ ఎక్కువ గా ఉండే ఆహారపదార్థాలను క్యాల్షి యం ఉండే ఆహార పదార్థాలతో కలిపి తీసుకో వడం వల్ల క్యాల్షియం ఐరన్‌ యొక్క అబ్సర్ప్షన్‌ని బ్లాక్‌ చేస్తుంది కాబట్టి ఈ తప్పులు చేయొద్దు. మరి నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను చూశారు కదా మరి ఈ ఆహార పదార్థాలను తప్పక తీసుకోండి ఐరన్‌ వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఐరన్‌ ఉండే ఆహార పదార్థాలను రెగ్యులర్‌గా తీసుకోండి. తద్వారా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉం డచ్చు. ఎనిమియా వంటి సమస్యలకి కూడా దూరంగా ఉండచ్చు.
దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఎనీమియా బాధితులు` ఎన్‌ఐఎన్‌అధ్యయనంలో వెల్లడి
దేశంలోని ప్రజలు తీసుకొనే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయి. పేద, ధనిక తేడాలే కుండా కడుపు నిండేందుకు ఏదో ఒకటి తినేస్తు న్నారు. కానీ, అవి శరీరానికి తగినంత పోష కాలను అందించడం లేదు. సరైనపోషకా హారం లేక అనారోగ్య సమస్యల బారిన పడుతు న్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్లో లోపిస్తున్న పోషకాలు వారీ జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తేలింది. జాతీయ పోషకాహార అధ్యయన సంస్థ (ఎన్‌ఐఎన్‌) దేశ వ్యాప్తంగా ఉన్న ఆహారపు అలవాట్లు, పోషకా లపై పరిశోధించి దేశంలోని ఆయా ప్రాంతాల వారీగా సమతుల ఆహార విలువను గుర్తిం చింది. ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండగా, మైక్రో న్యూట్రియన్లు లోపించాయని సర్వేలో వెల్లడైంది.
8 రాష్ట్రాల్లో ఐరన్‌ లోపం
ఆహారంలో పోషకాలు లోపిస్తే వచ్చే రుగ్మత లపై అధ్యయనం చేయగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.18ఏండ్లు నిండిన పురుషులకు సగటున ప్రతిరోజు 8.7మిల్లీగ్రాముల ఐరన్‌ అవసరం ఉంటుంది.19-50ఏండ్ల లోపు మహిళలకు 14.8 మిల్లీగ్రాముల ఐరన్‌ను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, దేశంలోని 8 రాష్ట్రాల్లో ఐరన్‌తో కూడిన ఆహారం ఉండటం లేదని తేలింది. దీంతో ఎనీమియా(రక్తహీనత) బారిన పడుతుండగా హార్మోనల్‌ సమస్యలు తలెత్తుతున్నట్టు వెల్లడైంది. అస్సాంలో 70శాతం,ఒడిశాలో 55శాతం, మధ్యప్రదేశ్‌లో 45.4,గుజరాత్‌లో 33.8, తమి ళనాడులో 23.9,పశ్చిమ బెంగాల్‌లో 20.2, తెలంగాణలో 16.8, మేఘాలయలో 12.1 శాతం మంది ఎనీమియా బారినపడ్డారని నివే దికలో పేర్కొన్నది. ఇందులో తెలంగాణ ప్రాం తంలో ఎనీమియా సోకిన వారి కంటే బీ12 లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య 24.6 శాతంగా అధికంగా ఉన్నదని గుర్తించారు.
కార్బోహైడ్రేట్లే ఎక్కువ..
జాతీయ పోషకాహార సంస్థ 2020-21లో దేశంలోని ప్రజలు తీసుకొనే ఆహారంలో ఉన్న పోషకాలను నివేదించింది. ఈ రిపోర్టు ప్రకారం పట్టణ ప్రాంతవాసులు 1,943 కిలో క్యాలరీ లను ప్రతిరోజు తీసుకుంటుండగా, ఇందులో 289 గ్రాముల కార్బోహైడ్రేట్లు, కొవ్వులు 51.6 గ్రాములు, ప్రోటీన్లు 55.4 గ్రాములను ఆహారం లో తీసుకొంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2,081 కిలోక్యాలరీల ఆహారాన్ని తీసుకుంటే ఇందులో కార్బోహైడ్రేట్లు 368గ్రాములు, కొవ్వు లు 36 గ్రాములు, ప్రోటీన్లు 69 గ్రాములుగా ఉన్నట్లుగా తేలింది.
ఈ ఆహారాలు తీసుకోండి చాలు..
విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. ఈ పోషకాలలో ముఖ్యంగా ఐరన్‌ఉండాలి. వివిధ వ్యాధులతో పోరాడటా నికి మన శరీరంలో ఐరన్‌ చాలా ముఖ్యం. ఐరన్‌ లోపం వల్ల హిమోగ్లోబిన్‌ రక్తహీనత వంటి వ్యాధికి దారితీస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది.వాస్తవానికి, శరీరంలో ఇనుము లోపం ఉన్నప్పుడు, శరీరం లో ఎర్రరక్తకణాలు తగ్గి అనేక ఆరోగ్య సమస్య లు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిని నివారించడానికి మీరు మీ ఆహారంలో ఐరన్‌ అధికంగా ఉన్న ఆహారాలను చేర్చాలి. పాలకూ రవల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజ నాలు లభిస్తాయి. పాలకూరలో ఇను ముతో పాటు అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్క లంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ వ్యతిరేక, యాంటీ ఓవర్సిటీ లక్షణాలతో రక్తంలో చక్కెర తగ్గించే లక్షణాలను కలిగిఉంది. పాలకూరలో కనిపించే లక్షణాల కారణంగానే చాలా మంది వైద్యులు ఆహారంలో పాలకూరలో చేర్చాలని సిఫారసు చేస్తారు.అదేవిధంగా చిక్కుళ్లు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటి వల్ల గుండె జబ్బులు, హైపర్‌ టెన్షన్‌, టైప్‌ 2 మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమా దాన్ని కొంతవరకు తగ్గుతాయి. చిక్కుల్లో ఫైబర్‌, ప్రోటీన్‌,కార్బోహైడ్రేట్లు, విట మిన్‌ బి,ఐరన్‌, కాపర్‌,మెగ్నీషియం, మాం గనీస్‌, జింక్‌, ఫాస్ఫ రస్‌ వంటి పోషకాలు ఉంటాయి.
ఎండు ద్రాక్ష
మీశరీరంలో ఐరన్‌ లోపం ఉంటే మీరు ఎండు ద్రాక్ష ఆహారంలో చేర్చుకోవాలి. ఎండుద్రాక్షలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది. రక్తం ఏర్పడటానికి విటమిన్‌ బి కాంప్లెక్స్‌ అవసరం. ఎండుద్రాక్షలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌ తగినంత పరిమాణంలో కనిపిస్తుంది. అటువంటి పరిస్థి తిలో రక్తహీనత మరియు ఐరన్‌ లోపం ఉన్న వారు ఎండుద్రాక్ష తీసుకోవడం చాలా ప్రయో జనకరంగా ఉంటుంది.ముఖ్యంగాగుడ్లలో కుడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి దాదాపు అన్ని విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. గుడ్ల లో విటమిన్‌ డి,ఐరన్‌ కూడాచాలా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్‌ మరియు కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటాయి. అధికంగా గ్రామీణ ప్రాంత రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా 60 నుంచి 69శాతం మంది మహిళల్లో రక్త హీనత సమస్య ఉంది. సాధారణ మహిళల్లో ఈ స్థాయి లో రక్త హీనత సమస్య ఉండడంపై డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భిణుల్లో ఒక డెసీలీటర్‌ రక్తంలో 11గ్రాముల కంటే తక్కువ గా హిమో గ్లోబిన్‌ ఉంటే రక్తహీనతగా భావి స్తారు. సాధారణ మహిళల్లో 12 గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్‌ ఉంటే, రక్తహీన తగా భావిస్తారు. యువతుల్లో రక్త హీనత సమ స్య ఉంటే, వారు గర్భం దాల్చినప్పుడు పరిస్థితి మరింత సీరియస్‌ అవుతుందని, గర్భ స్రావం వంటి దుష్పరి ణామాలు ఎదుర్కోవలసి వస్తుం దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
న్యూట్రిషన్‌ కిట్లు
రక్త హీనత నుంచి పిల్లలు, గర్భిణులను రక్షిం చేందుకు అంగన్‌వాడీల ద్వారా పోషకాహార పంపిణీ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపిం చడం లేదు. 2015-16 నాటి నేషనల్‌ ఫ్యామి లీ హెల్త్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలోని మహిళ్లల్లో (ప్రెగ్నెంట్‌, నాన్‌ ప్రెగ్నెంట్‌ కలిపి)48.2 శాతం మందిలో రక్త హీనత సమస్య ఉంటే, 2020 నాటికి 53.2 శాతానికి పెరిగింది.దీన్ని బట్టి పోషకాహార పంపిణీ ఆశించి ఫలితాలను ఇవ్వ డం లేదన్న విషయం స్పష్టమవుతోంది.ఈ నేప థ్యంలోనే ఇప్పుడు అందజేస్తున్న పోషకాహార పథకాన్ని కొనసాగిస్తూనే, ఏటా 1.5లక్షల మం ది గర్భిణు లకు న్యూట్రిషన్‌ కిట్లను అంద జేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. రక్తహీనత సమ స్య ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ కిట్లు పంపిణీ చేయను న్నారు. నేషనల్‌ ఇనిస్టిట్యూల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సైంటిస్టులు తయారు చేసిన ఈ కిట్‌లో హిమోగ్లోబిన్‌ శాతం మెరుగయ్యేందుకు అవసరమైన ఆహార పదార్థాలు ఉంటాయని హెల్త్‌ ఆఫీసర్లు చెప్తున్నారు.