మన్యంలో కాసులు కురిపిస్తున్న మిరియాల సాగు

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది. కాఫీలో అంతరపంటగా విశాఖ మన్యానికి పరిచయమైన ఈ మిరియాలు గిరిజనులకు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. ప్రధాన పంట అయిన కాఫీకంటే రెట్టింపు లాభాలను ఈ పంట ద్వారా పొందుతుండటంతో రైతులు మిరియాల సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏలు కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగామిరియాల సాగు, విస్తీర్ణం,వినియోగం,ఎగుమతుల్లో భారతదేశం మొదటిస్థానంలోఉంది.సంప్రదాయ సాగు ప్రాం తాలైన కేరళ,కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల్లో వీటి ఉత్పత్తి అధికంగా ఉంది. సంప్రదాయేతర ప్రాంతం అయినా అల్లూరిజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు,నేల,శీతలవాతావరణం వం టివి అనుకూలంగా ఉన్నాయి.ఈపరిస్థితుల్లో చింత పల్లి,గూడెంకొత్తవీధి,పాడేరు,అరకు,అనంతగిరి వంటిప్రాంతాల్లోకాఫీలోఅంతరపంటగా మిరి యాల సాగు జరుగుతోంది.ప్రస్తుతంమన్యం వ్యాప్తం గా1.56లక్షలఎకరాల్లో కాఫీసాగు జరుగు తుండ గా అందులో అంతరపంటగా మిరియాలు50 వేల ఎకరాల్లో వేస్తున్నారు.ఏటా 3,300 మెట్రిక్‌ టన్నుల మిరియాల ఉత్పత్తిజరుగుతోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏటాఉద్యాన నర్సీరీల ద్వారా 9లక్షల మిరియాల మొక్కలను సిద్ధం చేసి గిరిజన రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.లి కేజీ కాఫీ గింజల ధర మార్కెట్‌లో రూ.100వరకూఉంటే అదే కేజీ మిరియాల ధర రూ.500 వరకూ ఉంది. ప్రధాన పంట అయిన కాఫీ కంటే నాలుగైదు రెట్లు ధరలు పలుకుతుండటంతో రైతులూ క్రమేణా మిరియాల సాగుపట్ల ఆసక్తి పెంచుకున్నారు. ఎకరా విస్తీర్ణంలో కాఫీతోటల ద్వారా150కేజీల కాఫీని ఉత్పత్తి చేస్తు న్నారు. అదే తోటల్లో అంతరపంటగా వేసిన మిరి యాలవల్ల వంద కేజీల దిగుబడి వస్తోంది. అంటే సగటున ఎకరాకు ఒక్కో రైతుకు కాఫీ వల్ల ఏడాదికి రూ.15,000,మిరియాలవల్ల రూ.50వేల వరకూ ఆదాయం వస్తోంది. కాఫీ తోటల్లో అంతర పంట లుగామిరియాలతోపాటుకమలా,నేరేడు,సీతా ఫలం,జాఫ్రా,అనాసపనస వంటివి పండిస్తు న్నారు. ఇవి కాఫీతోటలకు ఇటు నీడనిస్తూనే రైతులకు ఉద్యానఫలాలను అందిస్తున్నాయి.ప్రభుత్వ ప్రోత్సా హం..మన్యంలో కాఫీ సాగుకు సంబంధించి గత ప్రభుత్వం పదేళ్లకాలవ్యవధితో కూడిన భారీ ప్రాజె క్టుకు శ్రీకారం చుట్టింది. దీనికోసం గిరిజన ఉప ప్రణాళికద్వారారూ.526.160కోట్ల భారీ వ్య యంతోఈప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. 2015-2016లో మొదలైన ఈప్రాజెక్టు కాలపరిమితి 2024-2025వరకూ అమల్లో ఉంటుంది. ప్రస్తు తంఉన్న1.50లక్షల ఎకరాల్లో కాఫీ సాగుకు అదనంగావచ్చే ఐదేళ్లలో మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణ లక్ష్యంగా ప్రాజెక్టు అమలవుతోంది. కాఫీతోపాటు అనుసంధానంగా అంతరపంట అయి న మిరియాలసాగునూ ప్రోత్సహిస్తున్నారు. ఇందు లో భాగంగా ఏడాదికి పదివేల ఎకరాల చొప్పున కాఫీ తోటలను విస్తరించుకుంటూ వెళుతున్నారు.
జాతీయ ఉద్యాన మిషన్‌ సహకారంతో..
కేరళలోని కాలికట్‌లో అఖిల భారత సుగంధ ద్రవ్య పరిశోధనా కేంద్రం ఉంది. చింత పల్లి కేంద్రంగా ప్రత్యేకంగా సుగంధ ద్రవ్య పంట లపై పరిశోధనల నిమిత్తం ఉద్యాన పరిశోధనా స్థానం పనిచేస్తోంది. దీని పరిధిలో సుగంధ ద్రవ్య సమన్వయ పరిశోధనా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులోభాగంగా మిరియాల్లో కొన్ని మేలు రకా లను గుర్తించివాటిని అభివృద్ధిపర్చి రైతులకు అంది స్తున్నాం.మిరియాల్లో17రకాలు అల్లూరి సీతా రామ రాజు జిల్లాలోని మన్యానికి అనుకూలమని అధిక దిగుబడిని ఇచ్చేవిగా గుర్తించి వాటిని సిఫార్సు చేస్తున్నాం. పన్నియూర్‌-1, 2, 3, 5, 6, 7, 8, 9రకాలతోపాటుశ్రీకర,శుభకర,పంచమి,పౌర్ణమి, మలబారు ఎక్సెల్‌,శక్తి,గిరిముండా,ఐఐఎస్‌ఆర్‌ దీపమ్‌, ఐఐఎస్‌ఆర్‌ శక్తి వంటి రకాలను మేలైనవిగా గుర్తించాం.
అదాయవనరుగా సాగు
మిరియాలుపంట కొండవాలు ప్రాంతా లు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనా భివృద్ధిసంస్ధ గిరిజనరైతులను మిరియాల సాగువైపు మిరయాల సాగుకు పెట్టింది పేరు కేరళ..ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖ మన్యంలో మిరియాలు పంట సాగవుతుంది. మన్యంలో పండుతున్న మిరియాలు కేరళ మిరి యాలకు ఏమాత్రం తీసిపోవటంలేదు. దిగుబడితో పాటు నాణ్యత విషయంలోను మన్యం మిరియాలు ప్రముఖ స్ధానాన్ని ఆక్రమించాయి. ఎలాంటి క్రిమి సంహార మందులు వినియోగించకుండానే కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు సాగు చేస్తు న్నారు. కాఫీ తోటలతో ఎకరానికి 25వేల నుండి 40వేల వరకు అదాయంసమకూరుతుండగా, దానిలో అంతరపంటగా వేస్తున్న మిరియాల పంట తో40వేల నుండి60వేల వరకు అదనంగా అదా యం సమకూరుతుంది.ఈ ఏడాది ఒక్క మిరి యాల పంట ద్వారానే 150కోట్ల రూపాయల అదాయంన్ని మన్యంలోని గిరిజనరైతులు ఆర్జించారు. మిరియాల సాగుకు మన్యం ప్రాంతంబాగా అనుకూలంగా ఉండటంతో ఇక్కడి గిరిజన రైతులకు మంచి అవకా శంగా మారింది. పస్తుతం 98వేల ఎకరాల కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాలు పంట సాగవుతుంది. కొండవాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటున్నాయి. గిరిజనాబివృద్ధి సంస్ధ గిరిజన రైతులను మిరియాల సాగువైపు ప్రోత్స హిస్తోంది. కాఫీతోటల్లో నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ చెట్ల వద్ద మిరియాల మొక్కలు నాటుతున్నారు. ఎకరాకు 60 నుండి 70కిలోల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో మిరియాల ధర 500 నుండి 600 రూపాయలు పలుకుతుంది.ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు4వేల మెట్రిక్‌ టన్నుల మిరి యాల దిగుబడి వచ్చింది.3.2 కిలోల పచ్చి మిరి యాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ.150కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరి యాలతో సమకూరింది. అనే మిరియాల రకాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. కోజికోడ్‌ లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ నుంచి వేర్వేరు రకాల మొక్కలను తెచ్చి చింతపల్లి నర్సరీల్లో అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.- గునపర్తి సైమన్‌