బాలోత్స‌వ్

బాల్యం నుండే విద్యార్థుల్లో ప్రకృతి,పర్యావరణం, దురాచారాు మూఢనమ్మకాు, సాంఘిక దురాచారాు, ఆచార వ్యవహా రాు మొదలైన అనేక అంశమును తెలి యజేసి విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే ఉద్దేశంతో విద్యార్థు కోసం ప్రారంభిస్తున్న కొత్త శీర్షిక ‘థింసా బా వినోదం. ప్రదర్శన యోగ్యమైన చేతి బొమ్మలాటు, ఘునాటికు,నాటికు ఏక పాత్రాభి నయం మొదగు ప్రక్రియ ద్వారా ధారా వాహికగా అందిస్తున్నాం. ఈశీర్షిక మీ అందరి మనసు ఆనందంతోపాటు, విజ్ఞా నం,వినోదం కలిగిస్తుందని భావించే ఈ శీర్షికను చిత్తూరు జిల్లా రిషివ్యాలి స్కూల్లో ఉపాధ్యా యుగా పనిచేస్తున్న తెలుగు పండితులు శ్రీ గోమఠం రంగాచార్యులు బాల కోసం అందిస్తున్న ప్రత్యేకమైన కొత్త శీర్షిక.

-రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడిట‌ర్

‘ఉదయం బాల దినోత్సవం సభ ప్రారంభోత్సవంజరిగిన చోటేరాత్రి 8గం.రిషీవ్యాలి గ్రామీణ విద్యార్థుచే తోుబొమ్మ ప్రదర్శన వుంటుంది’’ అని చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఈతోుబొమ్మలాట ప్రదర్శనచూచా! మళ్లీ50సంవత్సరా తరువాత! అను కుంటూ మాబడిప్లితో వారుపాల్గొనాల్సిన స్టేజీ దగ్గరకు తీసుకు వెళుతున్నానన్న మాటేగాని ఎప్పుడు చీకటి పడుతుందా?ఎప్పుడు రాత్రిఅవుతుందా?అనే ధ్యాసతోనేమౌనంగా ప్లితో కలిసి నడచి భరతనాట్యం జరిగే స్టేజికి చేరుకున్నాం.ప్లిు ఎక్కువగాలేరు కానీ ఉన్నవారంతాభరతనాట్యం డ్రస్‌లో మేకప్‌ వేసుకుని చూడముచ్చటగా వున్నారు.’ మా పిల్ల‌లు పాల్గొనే కథారచనకి ఇంకా ఓగంట సమయం వుండటంతో కాసేపు అందరం అక్కడున్న కుర్చీల్లో కూర్చున్నాం. ఈ భరతనాట్యం మాప్లికు సరిగా నచ్చినట్లులేదు.‘‘జానపద నృత్యానికి వెళదాం సార్‌!’’అని అన్నారు.‘‘అక్కడ మాత్రం మీకు నచ్చుతుందన్న ఆశ నాకు లేదు. ఒకచోట కుదిరికగా కూచోలేకపోతే ఎలా?’’అని నేను అంటుండగానే మైక్‌లో..‘‘నెం.27అన్నమాచార్య కీర్తనకు నృత్యంతో మీముందుకు రాబోతోంది!’’అని వినపడగానే అందరితో’’ఈడాన్సుచూచి వెళదాం! అన్నా. వారిలో రవిఅనే ప్లివాడు‘‘అదేమిటి సార్‌! ఆఅమ్మాయికి పేరులేదా? ఖైదీల్లాగా నెంబరు 27అనిచెపుతున్నారు! అని ప్రశ్నించాడు.‘‘స్కూు పేరు,వూరుపేరు,ప్లిపేర్లు చెపితే ఆవివరా ప్రభావం న్యాయనిర్ణేతపైవుంటుంది. అందుకే ఎవరు..ఎవరు అన్నది ఎవరికీ తెలియకుండ వుండటానికని అలాకోడిరగ్‌..డీకోడిరగ్‌లో నెంబరు యిస్తారు! అన్నాను.

నా సమాధానం విన్నాక నిశ్శబ్దంగా ప్లిు కూర్చున్నారు.
నాట్యం చక్కగా చేసింది ఆఅమ్మాయి. 
మా ప్లిు కూడాచప్పట్లు కొట్టారు.
ఆ కార్యక్రమం అయ్యాక అందరూ లేచారు.
‘‘సార్‌! జానపద నృత్యంకి వెళదాం! అని అన్నారు. 
వారితోపాటు నేనూ నడిచాను.
నా అందం చూడు బావయ్యో సిరిస్లి చీర సిద్ధిపేట రైక భువనగిరి బొట్టు గజ్జ్వెల్లి గాజు
జడను చూడు జడ అందం చూడు  
జడకున్న జడగంటు చూడు
మెడను చూడు మెడ నెకలేసును చూడు..

16 మంది చేసిన ఆ జానపద నృత్యానికి చప్పట్లతో చుట్టుపక్క ప్రాంతం అంతా దద్దరిల్లింది. డ్రస్‌కోసం,మేకప్‌ కోసం,సెట్టింగ్‌ కోసం బాగానే ఖర్చు పెట్టారు ప్లిు.
అక్కడ నుండి నిదానంగా బయుదేరి కథారచనా ప్రాంగణానికి చేరుకున్నాం. మాకంటే ముందుగా వచ్చినవారు అట్టు,పెన్ను,కాగితాతో సిద్ధంగా వున్నారు. మా ప్లిూ నిదానంగా వెళ్లి కూచున్నారు. అక్కడకు దగ్గరలోనే వున్న ఓచెట్టుకింద కూర్చున్న ఓవ్యక్తిపై నాదృష్టిపడిరది. నడుచు కుంటూ ఆయవ దగ్గరకు వెళ్లి ‘‘నమస్కారమండి! మీరు?’’
‘‘నేను టీచరుని. ఇక్కడకనిపించే వాళ్లలో టీచర్లు,పేరెంట్స్‌,ప్లిు తప్ప యింకెవ్వరూ వుండరండీ!’’అన్నారు ఆయన సమాధానానికి నేను వుండ బట్టలేక ‘‘మీరు ఎన్ని సంవత్సరాు నుండి వస్తున్నారండీ?’’అనిఅడిగాను.‘6సం.రానుండి వస్తున్నా.చదువు అనే చెరసా నుండి ప్లికు విముక్తి కలిగించే యీ బాల దినోత్సవం అంటే నాకెంతో యిష్టం’’ అని ముక్తసరిగా సమాధానం చెప్పి అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు.
వచ్చేపోయే వాళ్లు చాలామంది ఆయన్ని పకరిస్తూ,నమస్కరిస్తూ, షేక్‌ హేండ్‌ చేస్తూ రెండు,మూడు మాటు మాట్లాడుతూ ఉల్లాసంగా ఉన్నారు. ఇంతలోనే మైకులో ప్లిు కథు ఎలా రాయాలి అన్నవిషయం గూర్చి ఇద్దరు ముగ్గురు కథా రచయితు వివరించి టాపిక్‌ ఎనౌన్స్‌ చేశారు. 

అబ్బా!మధ్యాహ్నం 12గంటలేనా! ఎప్పుడుతోుబొమ్మలాట చూస్తానా? అన్న ఆలోచన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అంతలోనే మా పాఠశా నుండి నాతో వచ్చిన టీచర్లు ‘‘సార్‌ మీరు రూంకి వెళ్లివిశ్రాంతి తీసుకోండి. కథారచన పూర్తి కాగానే ప్లిల్ని తీసుకుని మేం డైనింగ్‌ హాుకి వస్తాం ఆటైంకి మీరు అక్కడికి రండి’’ అనిచెప్పి నన్ను రూంకి పంపారు. సూర్యు డి అస్తమయం చంద్రోదయం తరువాత రాత్రి వెన్నెలో 8గం. సమ యానికి తోుబొమ్మలాట కోసం అంద రం వెళ్లాం. ఇసకవేస్తేరానంతగా ప్లి తో, పెద్దతో నిండిపోయింది స్టేడి యం. మాకిప్పుడ ర్థమైంది అనుకున్న సమ యం కంటే ఓపదినిముషాు ముందుం డాలి. నిశ్శబ్దం,చీకటి కోసం లైట్లన్నీ ఆర్పే శారు. ‘‘కేతిగాడు అబ్బ బ్బ బ్బ బ్బా! అయ్యో...మీకు సింహాన్ని చూడాని వుంది కదూ! చూపిస్తా చూడండి’’ అంటు న్న మాట తీరుకు, ఆ కేతిగాడి బొమ్మ కుకుడుకు ప్లి నవ్వుకు, ఆనం దానికి హద్దుల్లేవు. సింహం గర్జిస్తూ తెర మీదకు రాగానే నిశ్శబ్దంగా మారిపోయింది వాతావరణం ‘‘చిక్కని అడవిలో నేను మగసిరి వాడను నేను’’ అంటూ పాట శ్రావ్యంగా జానపదబాణిలో సాగింది. ఏనుగు,నక్క,పులి,కోతి,పాము,పావురం,బంగారక్క, చిట్టికుందేుతో కథ సాగింది. ‘‘అమ్మఒడిలో బొమ్మలాగా ఆటలాడే వయసు నాది’’ అంటు భయంతో కుందేు బొమ్మ పాట, నడక ప్లిల్లో ఓవిధమైన గుఋ చోటు చేసుకుంది. మొత్తం మీద పాడుబడ్డ బావిలో సింహాన్ని కుందేు దూకించటం, బంగారక్క, కేతిగాడి హాస్యం ఆబావృద్ధు పర్యంతం రంజింప జేసింది.
అంతకుముందు 4గం.ఎ.సి ఆడిటోరియంలో ఓబుడతడు ‘‘విజయనగర సామ్రాజ్యాధీశ్వరుని కుమారుడు ఆగర్భ శ్రీమంతుడు..కాు కింద పెట్టనీయకుండా పెంచారు దాసదాసీ జనసందోహం.. బంగారు పళ్లెర ములో భోజనం’’..అంటూ అత్యద్భుతంగా బారాయు ఏకపాత్రలో జీవించాడు. 
చప్పట్లతో విద్యార్థు ప్లివాడిని ఉత్సాహపరిచారు. 
ఇంతలో మా స్కూు రవి ‘‘వాళ్లకు రాజు భాష ఎలా వచ్చండీ?’అని అమాయకంగా అడిగాడు. 
మైకులో ‘రిషీవ్యాలి గ్రామీణ విద్యార్థి మధుకు చిత్రలేఖనంలో తృతీయ బహుమతి’ అని ప్రకటన వింటూ రాత్రి భోజనానికి భోజనశాకు చేరాం.
మేమున్నది ఓ కల్యాణ మండపంలో. మాతోపాటు10స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థు,ఉపాధ్యాయు కూడ ఉన్నారు. భోజన,నివాస,ప్రయా ణాకు ఏయిబ్బందీ లేకుండ బాలోత్సవ్‌ నిర్వాహకు చూచుకుంటున్నారు.
 
‘ఒరేయ్‌! రాఘవ ఆ ప్లిలేరా నిన్న రాత్రి తోుబొమ్మలాడిరచింది. వాళ్ల టీచర్లు కూడ ఉన్నారు’ అన్న మాటకు మేమంతా వాళ్ల దగ్గరకు చేరి పరిచయం చేసుకున్నాం. 
నేను ‘‘వుండబట్టలేక మా ప్లితో ఓనాటకం వేయించాంటే బ్రహ్మదేవుడు దిగివచ్చినంత పనౌతుంది. మీరు’’...అంటున్న నాప్రశ్నకు సమాధానంగా త్లెగ నెరిసిన గడ్డం టీచరు ‘‘మీరంతా కూచోండి. క్లుప్తంగ మీ అనుమానాు తీరుస్తా’’ అంటూ ... ‘మదనపల్లెలో జన్మించిన జిడ్డుకృష్ణమూర్తిగారు చిన్నప్పటి విద్యా విధానంతో విసిగిపోయారు. పెద్దై తత్వవేత్త ఐన తరువాత ప్లిల్లో భయం లేకుండ, చక్కని వాతావరణంలో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి వుండేఉపాధ్యాయుతో రిషీవ్యాలి పాఠశా స్థాపించారు. దానికి అనుబంధంగా గ్రామీణ విద్యార్థుకోసం గ్రామీణ విద్యాయాు స్థాపింపజేశారు. అక్కడ ప్లికు పరీక్షంటూ వుండవు. జీవితంలో చదువు ఓభాగం.’’ 
‘‘సార్‌! చదువు లేకుండా ఈతోుబొమ్మలాటు,నాటకాు, ఏక పాత్రు,భరతనాట్యం,సంగీతాలే చెపుతారా?’’అని ఉండబట్టలేక అడిగాడు రవి.
‘‘చదువుతోపాటు ఈకళలేకాదు వడ్రంగం,మట్టిపని కూడ నేర్పుతాం! బట్టీపట్టించటం,పరీక్షు రాయించటం లాంటివి వుండవు.’‘ఆప్‌ా! అదిరా స్కూంటే’’ అని టక్కున మావిద్యార్థి రమేష్‌ అనేశాడు. చిరునవ్వుతో గడ్డం మాస్టారు రమేష్‌ భుజం మీద తట్టి ‘‘ఏతరగతి చదువుతున్నావ్‌!’’ అన్నాడు. బట్టీపట్టి ప్రశ్నకు సమాధానం చెప్పినట్లు ఏకబిగువున మొత్తం చెప్పేసాడు.
ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తిగారికి ఒకరితో ఒకరిని ప్చోటం అస్సు నచ్చదు.ఈ ప్చోటం వల్లే ప్లిల్లో ఎక్కువ తక్కువ అనే అభిప్రాయాు కలిగి ద్వేషబీజాు పడతాయి.
నేనేదో అడగబోయేలోపలే ‘‘మాపాఠశాల వేసవి సెవుల్లో ప్రతి పాఠశా నుండి పదిమంది చొప్పున ఒకచోటికి చేర్చి గురుకు పద్ధతిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాు నేర్పి చుట్టుప్రక్క గ్రామాల్లో 2.1/2 గం. పోగ్రాం యిప్పిస్తారు’’.
‘‘ఎవరో ప్లివాడు ఎన్నిరోజు నేర్పిస్తారు? ఎంతడబ్బు తీసు కుంటారన్న’దానికి 15రోజు నేర్పిస్తాం. అంతా ఉచితంగానే.‘శాకా హారం పెడతారా? మాంసాహారమా?’’అన్న ఓఉపాధ్యాయుని ప్రశ్నకు 
‘‘రాగిసంగటి,చిరుధాన్యాతోపప్పు,సాంబారు,ఆకుకూరు పెడ తారు. ఉదయం బ్లెం వేసిన రాగిగంజి యిస్తారు. ఇలా బయటకు తీసుకువచ్చి ప్లికు బయట ప్రపంచం ఎలా వుందో చూపిస్తాం. పిక్నిక్స్‌,విహారయాత్రకు కూడా తీసుకు వెళతాం అంటూ గ్రామీణ విద్యాయా పుట్టుపూర్వోత్తారన్నీ చెపుతూ1970వసం.లోస్థాపించబడిన యీ విద్యాయం 12శాటిలైట్‌ స్కూళ్లుగా పద్మనాభరావుగారి ఆధ్వర్యంలో నిర్వహింప బడుతున్నాయి’’.
మేం చిత్తూరుజిల్లా వాసుమేనండీ! ఏర్పేడు,భాకారాపేట, మంద డం,కాళహస్తి నుండి వచ్చాం! కానీ మాకిలాంటి విద్యావిధానంతో సాగే పాఠశాలు వున్నాయన్న సంగతి మీరు చెపితేకానీ తెలియలేదండీ! మీ పాఠ శాకు మేంవచ్చి చూడచ్చా! అని ఏర్పేడు పాఠశా ఉపాధ్యాయుడు పరాంకుశం అడిగారు. 
‘‘ఓతప్పకుండా రావచ్చు. చుట్టుప్రక్క ఉన్న బెసెంట్‌ దివ్యజ్ఞాన కళాశా(బి.టి.కాలేజి) హార్సిలీహిల్స్‌,రిషికొండ, సోంపాలెం కూడ చూడదగ్గవే. ఇలా బయటకువస్తే కదాయిలాంటి విషయాు తెలిసేది! మీరెప్పుడన్నా వెన్నె రాత్రుల్లో విహరించారా? మా పాఠశా విద్యార్థును ఉదయం సూర్యోదయం ముందు, వెన్నె రాత్రులో బయటకు తీసుకువెళ్లి ప్రకృతి అందం చూపిస్తాం. లేగదూడు చెంగుచెంగున ఎగిరే దృశ్యాు, రైతు పాటు పాడుకుంటూ పొలాకు వెళ్లే దృశ్యాు చూస్తారు. తగిన రీతిలో స్పందిస్తారు’’.
‘తోుబొమ్మలాటకు పాఠశాలకు సంబంధం ఏంటనీ?’ ఒక  ఉపాధ్యాయు ప్రశ్నించారు.
‘‘ఇది సినిమాు,నాటకాు రాకముందున్న నాటి ప్రాచీన జానపద కళ. నేడు అది అంతరించిపోతోంది. ఈకళను ప్లికు పరిచయం చేయటం గూర్చి పంచతంత్ర కథు తోుబొమ్మలాటుగా తీర్చిదిద్దాం. ఐతే ప్లి పుస్తకాల్లోవున్న పాఠాు కొన్నింటిని తోుబొమ్మలాటలా ప్లిలే మార్చి వ్రాసుకుని సింథటిక్‌ పప్పెట్స్‌ తయారుచేసి తరగతిగదిలో ప్రదర్శిస్తారు. అలానే నాటకాు, ఏకపాత్రువ్రాయిస్తారు మాఉపాధ్యాయు. విద్యార్థుల్లో ఎక్కడో అంతర్గతంగా దాగివున్న కళను యీవిధంగా బయటకుతీసే ప్రయత్నం చేస్తాం! ప్రభుత్వ పాఠశాలు లేనిచోటమాత్రమే మదనపల్లె పరిసరాలో ఈశాటిలైట్‌ స్కూళ్లు  ఏర్పాటుచేసి విద్యాభివృద్ధికి మాచేయూతనిస్తాం!’’ అనే సార్‌ మాట ముగించీ ముగించకుండానే ‘‘మాపాఠశా ఉపాధ్యాయు,విద్యార్థు ముక్త కంఠంగా ఈసారి తప్పకుండ రిషీవ్యాలిపాఠశా,గ్రామీణ పాఠశాలు చూద్దాం సార్‌!’’ అన్నారు. 
నామనస్సులోవున్నది మీరు బయటకు చెప్పారనుకుంటూ తప్పకుండా వెళదాం అన్నాను. నామటుకు నాకు బాలోత్సవ్‌ మధురానుభూతు వర్ణింప లేనంత ఆనందం కలిగించాయి. 
ఈ బాలోత్సవ్‌లో ప్లిు, ఉపాధ్యాయు, తల్లిదండ్రు ఆనందో త్సాహాు వర్ణనాతీతం. తీపిజ్ఞాపకా దొంతరు నెమరు వేసుకుంటూ బాలో త్సవ్‌ ముగింపు కార్యక్రమం చూచి మావూరికి,మాపాఠశాకు నేను మా విద్యార్థుం, ఉపాధ్యాయుం సుఖంగా చేరాం. పండిట్‌ జవహర్లాల్‌ నెహ్రూ జన్మదినోత్సవాన్ని ‘‘బాలదినోత్సవంగా’’ పాఠశాల్లో జరుపుకుంటారు. నేటి విద్యార్థు క్షణం తీరిక లేకుండ చదువు బట్టీపట్టడంలో,పరీక్షతో మానసిక వత్తిడికి లోనగుచున్నారు.

ఈమానసిక వత్తిడిని దూరం చేసి విద్యార్థుల్లో దాగివున్న సృజనా త్మకతను బైటకు తీసుకురావానే ఉద్దేశం ‘‘కొత్తగూడెం క్లబ్‌’’ వారికి కల్గింది. 20కి పైగా అంశాలో 3రోజు పోటీు నిర్వహించి విజేతకు బహుమతి ప్రధానం చేసేవారు. పండుగ వాతావరణంలో వేలాదిమంది విద్యార్థు పాల్గొనే ఈ‘‘బాలోత్సవ్‌’’ కన్ను పండుగే! డా.వాసిరెడ్డి రమేష్‌ బాబుగారి ఆధ్వర్యంలో 1991నుండి 2017వరకు 25సం. కొత్తగూడెం క్లబ్‌ వారు బాలోత్సవ్‌ నిర్వహించి ఇపుడు విరమించుకున్నారు. వారి స్ఫూర్తితో భద్రాచం, కాకినాడ,గుంటూరు,అనంతపురం మొ.పట్టణాల్లో ఈ‘‘బాలోత్సవ్‌’’ నిర్వహిస్తూ బాబాలికను సృజనాత్మకత వైపుకు మళ్లించి ఉత్సాహ పరుస్తున్నారు. మానసిక వత్తిడినీ దూరం చేస్తున్నారు. ఆ బాలోత్సవ్‌లో పాల్గొన్న ఉపాధ్యాయు, విద్యార్థు గూర్చి వ్రాసిన కథే ‘బాలోత్సవ్‌’’.