ప్రాంతీయ అసమానతలు` పరిణామాలు

ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకు ఉపయోగించు కొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
మనదేశంలో కొన్ని రాష్ట్రాలు అభి వృద్ధి చెందితే మరికొన్ని వెనకబడి వున్నాయి. ఒకే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది మరికొన్ని వెనకబడిఉన్నాయి.భారతదేశ అభి వృద్ధి సమైక్యతకు మూలాధారం సంతులిత ప్రాం తీయాభివృద్ధి. అందుకే ప్రణాళిక రూపకర్తలు ప్రణాళికాలక్ష్యాల్లో సంతులిత ప్రాంతీయాభి వృద్ధిని ఒక లక్ష్యంగా ఎంచుకున్నారు.
కారణాలు..
సహజసిద్ధ అంశాలు
చారిత్రక అంశాలు
సహజ వనరులు
ప్రభుత్వ విధానం
కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడి
ప్రాంతీయ ప్రభుత్వాల పాత్ర
పాలనా వ్యవస్థ
హరిత విప్లవం
అసమానతలు-కొలమానాలు
1) రాష్ట్ర తలసరి ఆదాయం 2) పేదరిక స్థాయి 3) మానవ అభివృద్ధి సూచిక 4) పారిశ్రామిక-ఉద్యోగిత 5) సహజ వనరుల లభ్యత, నీటి పారుదల సౌకర్యాలు 6)పట్టణీకరణ,7) విద్యు చ్ఛక్తి వినియోగం 8) బ్యాంకు డిపాజిట్లు
పారిశ్రామికాభివృద్ధి-ఉద్యోగిత మన దేశంలో పారిశ్రామికాభివృద్ధిలో తీవ్రమైన అసమానతలున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తర్వాత పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు. పారిశ్రామిక స్థిర మూలధనంలో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర,గుజరాత్‌ల్లో 34. 60%,పశ్చిమబెంగాల్‌24.65%అనగా 59.25% కలిగి ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాలు 63.03% ఉద్యోగిత,63.95%పారిశ్రామి కోత్ప త్తి కలిగిఉండటం తీవ్రమైన అసమానత లను తెలియజేస్తుంది. సహజ వనరుల లభ్యత,నీటి పారుదల సౌకర్యాలు పంజాబ్‌,హర్యానామొదలైనరాష్ట్రాల్లో నీటి పారుదల సౌకర్యాలు,సహజ వనరులు ఎక్కువ గా అందు బాటులో ఉండటం వలన వ్యవసా యం అభివృద్ధి చెందింది.ఆంధ్రప్రదేశ్‌,ఉత్తరప్ర దేశ్‌ల్లో కొన్ని ప్రాం తాల్లో కూడా వ్యవసాయం అభివృద్ధి చెందింది.
పట్టణీకరణ
అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో పట్టణీ కరణ జరిగి పట్టణ జనాభా ఎక్కువగా ఉంటు న్నది.జాతీయస్థాయిపట్టణ జనాభా31.2% కాగాతమిళనాడు(48.4%),మహరాష్ట్ర(45. 2%),గుజరాత్‌(42.6%),కర్ణాటక (38. 6%), పంజాబ్‌ (37.5%)మొదలైన రాష్ట్రాల్లో పట్టణ జనాభా ఎక్కువగా ఉంది.బీహార్‌ (11.3%), అసోం(14.1%)ఒడిశా (16.7%), ఉత్తరప్రదేశ్‌ (22.3%) వంటి రాష్ట్రాల్లో పట్టణజనాభా తక్కువ గా ఉంది.
విద్యుచ్ఛక్తి వినియోగం
తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం ప్రాం తీయ అసమానతలను తెలియ జేస్తుంది. 2009-10 గణాంకాల ప్రకారం జాతీయ స్థాయి తలసరి విద్యుచ్ఛక్తి వినియోగం121.2కిలో వాట్లుకాగా ఢల్లీి 508.8,పంజాబ్‌257.3,తమిళనాడు 208.5కిలో వాట్లు ఉండగా బీహార్‌లో20.5,ఉత్తరప్రదేశ్‌ 83.4,మధ్యపదేశ్‌73.4కిలోవాట్లు మాత్రమేఉంది.
వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు
జాతీయస్థాయిలో తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు 2011మార్చి నాటికి రూ. 33,174వుండగాఢల్లీి రూ.2,85,400, మహ రాష్ట్ర రూ.82,380 కలిగి ఉండగా బీహార్‌ రూ. 9,667,అసోంరూ.16,393 తలసరి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు కలిగి ఉన్నాయి.
ప్రాంతీయ అసమానతలు -ప్రణాళికలు
దేశంలోని వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు మళ్లించడానికి వీలుగా ఆప్రాంతాల్లో సంస్థలు స్థాపించే పెట్టు బడిదారులకు తగిన ప్రోత్సాహకాలను కల్పించ డమే గాకుండా అవస్థాపనా సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం,నీటివసతి,నైపుణ్యంగల శ్రామి కుల లభ్యత మొదలైన సౌకర్యాలను అందు బాటులోనికి తేవలసి ఉంటుంది. ఇందుకు ప్రభు త్వం అనేక కార్యక్రమాలను చేపట్టాలి. మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల గురించిన ప్రస్తాన లేనప్పటికీ,రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రాంతీయ అసమానతల తగ్గింపు అవస రాన్ని గుర్తించినారు. ఇందులో వెనుకబడిన ప్రాం తాల్లో పెట్టుబడులు కొనసాగించి సంతులిత ప్రాంతీయాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. మూడో పంచవర్ష ప్రణాలికలో సంతులిత ప్రాంతీ యాభివృద్ధి కొరకు 9 వఅధ్యాయాన్ని ప్రత్యేకంగా పేర్కొనారు.నాలుగో పంచవర్ష ప్రణాళికలో గ్రామీ ణ పేదలకు ప్రయోజనం చేకూర్చడానికి వీలుగా మొద లైన కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు.ఐదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగిం చడం కోసం నాలుగో పంచవర్ష ప్రణాళిక లోని కార్యక్రమాలని కొనసాగించినారు. ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలను తొలగించ డానికి సమగ్ర విధానాన్ని రూపొందించారు. ఇం దులో భాగంగా ప్రాంతీయ ప్రణాళికలు,ఉప ప్రణాళి కలను అమలుచేసి జాతీయ అభివృద్ధి ప్రణాళికలతో అనుసంధానం చేశారు. ఏడో పంచ వర్ష ప్రణాళికలో ప్రాంతీయ అభివృద్ధి స్థాయికి రెండు అంశాలను గుర్తించినారు.1)వ్యవసాయ ఉత్పా దకత,మానవ వనరుల సామర్థ్యం పెంపు2) ప్రాంతాల మధ్య అసమానతలను తగ్గించడం. వీటికి అనుగుణంగా కార్యక్రమాలను రూపకల్పన చేయ డం.ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రణాళికా వ్యూహం సూచనాత్మక ప్రణాళికకు (Iఅసఱషa్‌ఱఙవ ూశ్రీaఅఅఱఅస్త్ర) మారడం మూలాన ప్రాం తీయ అసమానతల తగ్గింపునకు చూపే చొరవ తగ్గిన ప్పటికీ దీని కొరకు కొన్ని ప్రత్యేక కార్యక్రమా లను అమలు చేశారు. తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో ప్రాంతీయ అసమా నతలను తొలగించడానికి ప్రయివేటు పెట్టుబడులు దోహదపడలేదని కనుక తక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కొరకు ప్రభుత్వ పెట్టుబడుల అవసరమని పేర్కొన్నారు. పదో పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయాభివృద్ధి కోసం రాష్ట్రాలవారీగా వృద్ధి లక్ష్యాలను నిర్ణయిం చారు.పదకొండో పంచవర్ష ప్రణాళికలో వెనుక బడిన ప్రాంతాల కొరకు ఏర్పాటు చేశారు. పన్నెండో పంచవర్ష ప్రణాళికలో నిధుల వినియోగం కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొం దించారు.పారిశ్రామికంగా అభివృద్ధి చెందని ప్రాం తాల్లో,వ్యవసాయం,దాని అనుబంధ పరిశ్ర మలలో, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి కార్యక్ర మాల్లో నిధులను వినియోగించాలని పేర్కొన్నారు.
వెనుకబడిన ప్రాంతాలు – అసమానతలు!
ప్రాంతీయ అసమానతలు,ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు.నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజ ల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకుఉప యోగించుకొంటున్నారు.అవశేష ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడా నికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేత లూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రా న్ని కోరుతుంటారు. అంతవరకు బాగానే ఉన్నా… అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లా లతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్కపైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46(3)లో రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పొందు పర్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2014ఫిబ్రవరి 20వ తేదీ రాజ్య సభలో మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లా లకు బోలంగీర్‌ కలహండి తరహాలో ప్రత్యేక ప్యాకే జీ ఇస్తామన్నారు.కాగామధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌లో వ్యాపించివున్న బుందేల్‌ ఖండ్‌ తరహాలో ఈప్యాకేజీ వుంటుందన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభు త్వం రూ.24,350 కోట్లతో ప్రతిపాదన లు కేంద్రా నికి పంపితే ముష్టిగా జిల్లాకు రూ.50 కోట్లుచొప్పున మూడేళ్లు ఇచ్చి తర్వాత ఎగ్గొట్టారు. ఇప్పటికీ సవా లక్ష కొర్రీలు వేస్తున్నారు. విభజన చట్టం సెక్షన్‌ 94 (3)మేరకు వెనుక బడిన జిల్లాల్లో భౌతిక సామాజిక వనరులు అభివృద్ధి చేయాలి.ఈచట్ట బద్దహక్కులు హుష్‌ కాకి అయ్యాయి.ఇక ప్రత్యేక హోదా వుండనే వుంది. నాణేనికి ఇది ఒకవైపు అయితే మరో వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల ఫలితంగా ప్రజల్లో నివురు గప్పిన నిప్పులాగా వున్న అసంతృప్తిని కొందరు నేతలు తమ రాజకీయ అవసరార్థం ఉపయోగించు కొంటున్నారు. వాస్తవంలో ఆయా వెనుకబడిన ప్రాంతాల భౌతిక పరిస్థితులు ప్రజల అవసరాలు వీటితో పాటు వారి వాంఛలు ఆధారం చేసుకొని ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయా లి.కాని ఆదిశగా చర్యలు లేక పోవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు గాని రాయలసీమలో కొందరు నేతలే కాకుం డా ప్రత్యేకిం చి ఒకసెక్షన్‌ యువత వేర్పాటు వాదం తెర మీదకు తెస్తున్నది. ఉత్తరాంధ్రలో విస్తారమైన సముద్ర తీరం వున్నందున పైగా విశాఖలో నౌకాదళం కేంద్రం వున్నందున మిగతా జిల్లాలతో పోల్చుకొంటే విశాఖ జిల్లా కొంత మెరుగ్గా వుంది. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా వున్నప్పుడే వైయస్‌ రాజశేఖర రెడ్డి హ యాంలోఉత్తరాంధ్ర సుజల స్రవంతిరూపుద్దు కున్నది. ఈ పథకం అమలు జరిగితే ఉత్తరాంధ్రలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు 30లక్షల మందికి తాగునీటి వసతి ఏర్పడుతుంది. విజయ నగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు శ్రీకాకుళం జిల్లాలో0.85లక్షల ఎకరాలకు సాగునీరు అందు తుంది. ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడైనా మంత్రు లు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావులు ఈ పథకం అమలు జరగలేదని మంత్రి పదవులకు రాజీనామాకు సిద్ధమై వుంటే వీరి చిత్తశుద్ధి శంకించ లేము. కాని భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొట్టేం దుకు మంత్రి పదవులు త్యాగం చేస్తామంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి అనుసం ధానం ఏళ్ల కొద్దీ ఎందుకు నానుతుంది? వంశధా రపై నెరెడి బ్యారేజీ నిర్మాణంగుర్తు వుందా? వ్యవ సాయంపై ఆధారపడే లక్షలాది మంది ఉత్తరాంధ్ర రైతులకు సాగునీరు కావాలా?ఇవేవీ లేకుండా పరిపాలన రాజధాని కావాలా?పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖ తాగునీటికి23.99 టియం సిలు నీరు కేటాయించారు. పోలవరం గాలిలో దీప మైంది!
రాయలసీమ పరిస్థితి మరీ దుర్భరంగా వుంది.ఈ ప్రాంతంలో విస్తారమైన బీడు భూములు న్నాయి. ఎక్కువ భాగం వర్షాధార పంటలైనందున మొత్తంగా నీళ్లు,నీళ్లు అని ప్రజలు తుదకు తాగు నీటికి తపిస్తుంటారు. ఈ ఏడు విస్తారంగా వర్షాలు పడ్డాయి. కాని గ్రామాల్లో ఉపాధి లేక గ్రామాలకు గ్రామాల ప్రజలు వలసలు పోతున్నారు. మరీ దారుణమేమంటే కెసి కెనాల్‌ కింద ఆయకట్టులో పెట్టిన పంటలకు నీళ్లు అందే అవకాశం లేదని నేడు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే హంద్రీనీవా కింద కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం లో పంటలు ఎండిపోయాయి.
బచావత్‌ ట్రిబ్యునల్‌ కెసి కెనాల్‌కు తుంగభద్ర నుండి39.9టియంసిలు నీరు కేటాయిం చినది. దురదృష్టం ఏమంటే దశాబ్దాలు గడుస్తున్నా 2.65 లక్షల ఎకరాలు ఆయకట్టుగల కెసి కెనాల్‌ కు 1.25 టియంసిలు సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీ తప్ప నీళ్లు నిల్వ చేసే వసతి లేదు.2.965 టియంసిలు నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అలగ నూరు రిజర్వాయర్‌ లో నీరు నిల్వ చేసే అవకాశం లేక పశువుల మేత పొరంబోకుగా వుంది. బచా వత్‌ ట్రిబ్యునల్‌గాని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గాని సుంకేసులబ్యారేజీ నుండి(21ం10) టియం సిల నీరు మాత్రమే శ్రీశైలం జలాశయం చేరు తుందని తేల్చారు. కాని ఏటా వందల టియంసిలు కలుస్తున్నాయి. ట్రిబ్యునల్‌ కేటాయింపులు అరకొరగా వున్నా చట్టబద్దతగల నీళ్లువర్షపు నీరునిల్వ చేసుకొనే ఏర్పాట్లు జరిగి వుంటే రాయలసీమలో కొంతలో కొంత నీటి కొరత తీరేది.కెసి కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన గుండ్రేవుల రిజర్వాయర్‌ హుళక్కి అయింది. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం న్యాయ రాజధాని రెండు పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి రాయలసీమను కోనసీమ చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం కోర్టు వివాదంలో చిక్కుకున్నది. న్యాయ రాజధాని కాదు కదా తుదకు కృష్ణ యాజ మాన్య బోర్డు కార్యాలయం గతి లేకపోయింది. ఈ మధ్య సీమ రైతులు రోడెక్కి సిద్దేశ్వరం కోసం పోరాటం మొదలు పెట్టారు. దురదృష్టమేమంటే రాయలసీమలో చిన్న కాలువ తవ్వాలన్నా తెలం గాణ ఇంజనీరింగ్‌ చీఫ్‌ యాజమాన్యం బోర్డుకు రేఖరాసి అడ్డుకొంటున్నారు. ఇరువురు ముఖ్య మంత్రులు బాగానే వున్నా (చంద్రబాబుతో పోల్చితే) రెండు రాష్ట్రాల మధ్యగల అంతర్‌ రాష్ట్ర జల వివాదాలు సామరస్యంగా పరిష్కారానికి కృషి జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోం ది. కాగా గత ప్రభుత్వం ఏంచేసింది అనేది పక్కన పెడితే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల కాలం లో సాగునీటి రంగంలో 19 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిందంటే ఇందులో వెనుక బడిన ప్రాం తాల భాగం అతి స్వల్పమే. రాష్ట్రంలో వెనుకబడిన ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరంగా వున్నాయి. ప్రాంతీయ అసమానతలు నెలకొన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పరిష్కార మార్గాలు చూడ కుండా పాలకులు కాలం వెళ్లదీస్తే కుదరదు. -వ్యాసకర్త : విశ్రాంత పాత్రికేయులు- (వి.శంకరయ్య)