ప్రమాద అంచుల్లో ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండడం ఎంతైనా అవసరం..పాలక పక్షం ఎలా గైతే ప్రజల పనుపున ఏలుబడి సాగిస్తుందని అను కుంటామో ప్రతిపక్షం అలాగే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా వ్యవహరిస్తుంది.ఈ రెండూ సజావుగా నడిస్తేనే పాలన..దానిని అనుసరించి అభివృద్ధి..ప్రజాసంక్షేమం తదితరాలు సక్రమంగా సాగుతాయి.అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం కేంద్రంలో,రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం నామ మాత్రంగా మిగిలిపోవడంతో పాలన ఏకపక్షంగా మారిపోయి ఇంచుమించు నియంతృత్వ పోకడలో ఏలుబడి సాగిపోతోంది.కేంద్రంలో ఈ తరహా పరిస్థితులు 2014 నాటి నుంచే కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొన్న 2019 ఎన్నికలలో చోటుచేసుకున్న పరిణామాలు గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరగని క్రొంగొత్త పోకడలకు తలుపులు తెరిచాయి..
మన దేశంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ,లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఏలుబడి తర్వాత ఇందిరా గాంధీ శకం మొదలైన పిదప తొలిసారిగా ఏకపక్ష విధా నాలు..ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడలు ఊపిరి పోసుకున్నాయి.శాస్త్రీజీ అకాల మరణం తర్వాత పగ్గాలు అందుకున్న ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజుల వరకు తాను చెప్పిందే వేదం.. చేసిందే శాసనం అనే రీతిలో ఏలుబడి సాగించారు. ప్రజల్లో తనకుగల అసాధారణమైన ఆకర్షణ కారణంగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం, తాను అనుకున్న రీతిలో పాలన సాగించడం ఇది వరకు పరిపాటిగా మారిపోయింది.అయితే అంతటి ఇందిరాగాంధీ కూడా ప్రతిపక్ష నాయకు లను విశ్వాసంలోకి తీసుకుని వారికి సముచిత రీతిన గౌరవం ఇస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసు కునే సందర్భాల్లో వారితో సలహా సంప్రదిం పులు జరుపుతుండే వారు..ఒకరకంగా ఎమర్జెన్సీ దేశానికి కొంతమేలుచేసింది.అదేమిటంటేఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత దేశంలో ఏకపక్ష విజయాలకు.. ఏలుబడులకు తెరపడిరది…అత్య వసర పరిస్థితుల అనంతరం దేశంలో తొలిసారిగా కాంగ్రేసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.అటు తర్వాత కూడా కాంగ్రెస్‌ ఆధిపత్యం తగ్గి ఇతర పక్షాలు, కూటములు అధికారంలోకి రావడం మొదలైంది. ఇక రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు ఆగమనం.. స్వరాష్ట్రంలో సంచలనాల తర్వాత జాతీయ రాజకీ యాల్లోకి ప్రవేశం అనంతరం కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దిగజారింది.అప్పటినుంచి కేంద్రంలో ఏపార్టీ కైనాగాని ఇంచుమించు పరిపూర్ణ ఆధిక్యత రావ డం.. ఏకపక్షంగా ఏలుబడిసాగడం అనేరోజులు చెల్లిపోయాయి. ఇదిగో..మళ్లీ ఆపరిణామాలు కేంద్రంలో 2014ఎన్నికల నుండి మొదల య్యాయి. వరస రెండు ఎన్నికల్లో తిరుగులేని ఆధిప త్యంతో గెలిచిన భారతీయ జనతా పార్టీ దేశంలో మరో సారి ఏకపక్ష పాలనకు,ఒంటెత్తు పోకడలకు తెర ఎత్తింది. పెద్ద నోట్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం..ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొన్నివ్యవస్థల నిర్వీర్యం,అస్మదీయులకు అవాం చిత ఉపకారాలు..రాష్ట్రాలకు కల్పించే ప్రయో జనాల విషయంలో అసమానతలు, పారద ర్శకత లోపం.. ఇలాంటి ఎన్నో కీలక అంశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణులపై ప్రశ్నించే గొంతులు కరవయ్యాయి.. చట్టసభల్లో, బయటా కూడా నిలదీసే విపక్షాల గొంతుకలను ప్రభుత్వంలోని పెద్దలు మెజారిటీ ఇచ్చిన బలంతో పట్టించు కునే పరిస్థితి గడచిన ఏడు సంవత్సరాల కాలంలో ఏదశలోనూ కనిపించలేదు..చేసిన తప్పుల వల్లనైతె నేమి..అధికారంలోఉన్న రోజుల్లో అవలంబించిన ఇదే తరహా ఏకపక్ష ధోరణుల ఫలితం అయితేనేమి కాంగ్రెస్‌ పూర్తిగా చచ్చుబడిపోయింది.ఇక కమ్యూ నిస్టుల సంగతి సరేసరి..ఎప్పుడూ వారి పోరాటాలు సరాసరే..పార్టీల కేడర్లు,శ్రేణులు బలంగానే ఉన్నా ఏ దశలోనూ చట్టసభల్లో తగినంత బలం లేకపోవ డంతో వామపక్షాలది స్వతంత్ర భారతంలో ఆది నుంచి అరణ్యరోదనే..ప్రభుత్వాలను నిలదీసే వారి గొంతు సమ్మెలు,బందులు..ఇత్యాదులకే పరిమితం అయిపోయింది. నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమ్యూనిస్టులు.. ఇతర రెగ్యులర్‌ ప్రతిపక్షాలతో సహా మొన్నటి వరకు దేశంలోనే మహాశక్తిగా విరాజిల్లిన కాంగ్రెస్‌ పరిస్థితి కూడా నానాటికీ తీసికట్టు అయిపోయింది..ఇక ఆంధ్రప్రదేశ్‌ సంగతి..ఇక్కడ ఏంజ రిగినా అడిగే నాథుడులేని పరిస్థితి దాపురిం చింది. ఈ రాష్ట్రం లో గతంలో అయితే కాంగ్రెస్‌, లేదంటే తెలుగు దేశం ప్రభుత్వాలు పెద్దశక్తులుగా అసెంబ్లీలో ఆవి ర్భవించి అధికారం చెలాయించిన సందర్భా ల్లో ప్రతిపక్షాల పరిస్థితి ఇప్పుడున్నట్టు లేదు.ఒకనాడు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు వెంగళరావు, చెన్నారెడ్డి.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటివారు ఎదురులేని సంఖ్యాబలంతో అధికారం చేసినా ప్రతిపక్షాలకు తగిన గౌరవం ఉండేది.అదే పరిస్థితి ఎన్టీ రామా రావు.నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సాగింది.ప్రతిపక్షానికి దక్కే గౌరవాన్ని మొన్న టి వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా అనుభవించిన వారే. ఇక వర్తమానానికి వస్తే.2019ఎన్నికల్లో రాష్ట్రంలోని175సీట్లకుగాను 151 సీట్లు గెలుచుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార పగ్గాలు అందుకున్న నాటి నుంచి పూర్తిగా అధికార పక్షం పెత్తనం లో ఏలుబడి సాగుతోంది. నంది అంటే నంది. తీరులో..ఏనిర్ణయం అయినా..అది ఎలాంటిదైనా మారు మాటాడే పరిస్థితి లేదు..వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వస్తూనే గత తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో పథకాలను రద్దు చేసి..కొన్ని కట్టడాలను కూల్చి వేసి గందర గోళం సృష్టించింది. పరా కాష్టగా మూడు రాజధా నుల నిర్ణయం..ఆపై ఉచి తాలు.. ఇంచు మించు రాష్ట్రప్రభుత్వం దివాలాతీసే పరిస్థితి.. వీటిపై ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం ప్రశ్నిస్తూ.. నిలదీ స్తూ.. ఆందోళనలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నా సంఖ్యాబలం లేకపోవడం సైకిల్‌ పార్టీకి అతి పెద్ద మైనస్‌ పాయింట్‌!ఒక దశలో కేవలం ప్రతిపక్షం మీద దుగ్ధతో ప్రభుత్వం అకార ణంగా కౌన్సిల్‌ను కాన్సిల్‌ చేయాలని చూసినా అడిగే దిక్కు లేకుండా పోయింది.అఫ్కోర్స్‌..అది జరగ లేదు..ప్రభుత్వం ఏం చేస్తున్నా రాష్ట్రంలో ప్రతిపక్షం అడ్డుకునే పరిస్థితి ఎటూ లేకపోయినా కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాన రావడం లేదు..దీంతో వైసిపి ప్రభుత్వం ఎదురే లేని రీతిలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుం టున్న పరిస్థితి..కోర్టు కేసులను సైతం లెక్క చేయని విధం గా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయి.
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అటు తర్వాత జరిగిన పంచాయతి.. మునిసి పల్‌ ఎన్నికల్లో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసా గిస్తూ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిం చింది..అదే రీతిలోప్రశ్నించే నాథుడే ఉండని స్థాయి లో ఏలుబడి సాగిస్తోంది.దానివల్ల రాష్ట్రంఎటు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది..అసలు ఇంచుమించు రెండు సంవత్సరాలకు పైగా రాష్ట్ర రాజధాని ఏదో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు.రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాక పోగా ఉన్నవి చేజారిపోతున్న దుస్థితి.అలాగే కేంద్రం నుంచి పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులకు నిధులు తీసుకువచ్చే పరిస్థితి లేదు.అంతేకాకుండా రాష్ట్రానికి గుండెకాయ వంటి విశాఖ ఉక్కు కర్మా గారాన్ని ప్రైవేటుపరం చేస్తున్నా అటు పార్లమెం టులో కూడా మంచి బలం ఉన్న వైసిపి అడ్డుకో లేకపోవడం విచారించదగ్గ మరో విషయం. ఇలాం టి అంశాల్లో రాష్ట్రంలోని అన్నిపార్టీలు కలిసి పోరా టాలు చేయాల్సిన అవసరం ఉంటుంది.కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు.అసలు ప్రతిపక్షాన్ని కలుపుకుపోయే ధోరణి అధికార పక్షానికి కిమ్మ న్నాస్తి..ఇక పోతే పంపిణీలపేరిట ఖజానాఖాళీ అవుతూ జీతాలు కూడా సరిగ్గా ఇచ్చుకోలేని..పెన్షన్లు సకాలంలో చెల్లించలేని దుస్థితిఏర్పడి ప్రభుత్వ ఆస్తు లు తాకట్టుపెట్టే దారుణచర్యకు సర్కారు తెగబడినా అడిగేనాథుడు లేడు..ఇది గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దయనీయ పరిస్థితి. నిజానికి మోడీ ప్రభు త్వం ప్రతిపక్ష మంటేనే లెక్కలేని విధంగా వ్యవ హరిస్తోంది. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్ని కూడా మోడీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. తీర్మానాల అంశం లోనూ ఇదే ధోరణి. పార్లమెం టులో ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే నిబం ధనలను సైతం అమలు చేయడానికి అంగీ కరిం చదు, ఖరారైన సభా కార్య క్రమాలను సస్పెండ్‌ చేసి సభ్యుడు లేదా సభ్యులు లేవనెత్తిన అంశాలను చర్చకు పెట్టే కీలకమైన అధికారాన్ని 267వ నిబంధన సభాధ్యక్షుడికి కట్టబెట్టింది.
రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో వెంకయ్య నాయుడు ఒక్కసారి కూడా ఈనిబంధన కింద చర్చకు అవకా శం ఇవ్వనేలేదు.రాజ్యసభ రికార్డుల ప్రకారం 2016 నవంబర్‌16నఈ నిబంధన ప్రకా రం రాజ్య సభలో చివరి సారిచర్చ జరిగింది. ఆగస్టు 10వ తేదికి వెంకయ్య నాయుడి పదవీకాలం ముగుస్తున్న సంగతి తెలిసిందే! ప్రతిపక్షం గొంతు ఈ స్థాయిలో నొక్కిన తరువాత ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధ మంటూ చేసే సవాళ్లకు అర్ధమేమిటి? మోడీ పాలనలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఈ స్థాయికి పడిపోయింది కాబట్టే జోక్యం చేసు కోవాలంటూ ప్రతి పక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్రపతి ముర్ముకు లేఖ రాయాల్సి వచ్చింది. 15వ రాష్ట్రపతి గా ఎన్నికైనం దుకు శుభాకాంక్షలు తెలిపిన లేఖలోనే ఈ విష యాన్ని విపక్షాలు ప్రస్తావించాల్సి రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.ముర్ముఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ప్రజా సమస్యలు కూడా చర్చకు రాకుండా మోడీ ప్రభుత్వం వ్యవ హరిస్తున్న ఈ తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒకవ్యూహం ప్రకారం,మంద బలం తో ప్రజాస్వామ్యంపై చేస్తున్న ఈదాడిని ఐక్య పోరాటాలతోనే నిలువరించగలం.ఆ దిశలో విస్తృత ప్రజానీకాన్ని సమీకరించాలి. దీనికోసం ప్రజాస్వా మ్యవాదులు, లౌకిక,అభ్యుదయ,పురోగామి శక్తులు ఏకతాటిపై కదలాలి.ప్రజాస్వామ్య పరిరక్షణకోసం జరిగే పోరాటంలో ప్రతిఒక్కరూ భాగస్వా ముల వ్వాలి. ఇలా కేంద్రంలో,రాష్ట్రంలోఅధికార పార్టీ లుపూర్తి మెజారిటీతో ఏకపక్ష ధోరణిలో పాలన సాగిస్తుంటే ప్రజాస్వామ్యం ఉనికి ప్రమాదంలో పడుతోందా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవు తున్న పరిస్దితుల్లో కొన్ని రకాలైన ప్రమాదాల అంచున మన దేశంలో వ్యవస్థలు నడుస్తున్నాయనేది నిస్సందేహం..!!-(ఇ.సురేష్‌ కుమార్‌)