పోవరం ఎవరికి వరం.. ఎవరికి శాపం…!

ముంపు ప్రాంతానికి చెందిన రాము గిరిజనుడు ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘‘నాపక్క పొం లోకి నీళ్లువచ్చినప్పుడు నేను ఆనీళ్లలో నాపొం లోకి రాకుండా ఎలాఆపగను? ఇదే ప్రశ్న అధికా రుని అడిగితే తర్వాత చూద్దాం అంటున్నారు. తర్వాత చూడడానికి ఏముంటుంది? మా పక్కనే ఉన్న గ్రామాు అన్ని మునుగుతాయి అంటున్నారు. కానీ మా గ్రామాల్లో మాత్రం పొలాు మాత్రమే మునుగుతాయి అని అధికాయి చెబుతున్నారు. పొలాు మునిగితే మేము ఏమి చేసుకుని బతకాలి? మా పక్క గ్రామాన్నీ మునిగినప్పుడు మా గ్రామం ఒకటే మిగిలితే కూడా ఒక్కరమే కూడా ఎలా ఉండగము? ఒకవేళ ఉంటే , మేము వేరే ఊళ్ళకి ఎలా వెళ్లాలి? రాకపోకు ఎలా జరుగుతాయి? మా ప్లిు స్కూల్కి ఎలావెళ్తారు? అందుకని ఇప్పటి ప్రాజెక్టు నీటిమట్టం, ఎత్తు ప్రకారంత్వరగా సర్వే చేసి, మాకు అతిత్వరలో స్పష్టత ఇవ్వాని కోరుకుంటున్నాను.’’


పోవరం కొన్ని దశాబ్దాుగా కొనసాగు తున్న సుదీర్ఘ గాథ! గోదావరి మాదిరిగానే దీని ప్రయాణం లోనూ ఎన్నో ముపు. ఎన్నో అభ్యంతరాను, అవరోధాను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదాను పొందింది. అయినా కథ సాఫీగా నడవ డం లేదు. అనేక ఒడుదొడుకు మధ్య పయని స్తోంది. సకాంలో నిధు ఇవ్వడం లేదం టోంది రాష్ట్రం.ఇచ్చినవాటికి లెక్కు అడుగుతోంది కేంద్రం. తాను కోరుకున్న పద్ధతిలో పను సాగాం టోంది. ఇంతకు పోవరం ఆవశ్యకత ఏమిటి? ఆంధ్ర ప్రదేశ్‌ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోవరం స్వరూ పం ఏమిటి?దీనిద్వారా ఎటువంటిప్రయోజ నాు కగను న్నాయి. నిర్వాసితుకు అందించే నష్టపరి హారం, పునర వాసం ఎంతవరకు జరుగుతుంది వంటి ప్రశ్నకు సమాధా నాు పరిశీలిద్దాం!
పోవరం ఓ సుదీర్ఘ ప్రయాణం…. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో1941లో తొలి సారిగా పోవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబం ధించిన ఆలోచనకు బీజంపడిరది. మద్రాసు ప్రెనిడెన్సీ చీఫ్‌ ఇంజనీర్‌ దివాన్‌బహదూర్‌ ఎల్‌.వెంకటకృష్ణ అయ్యర్‌ ఈప్రాజెక్టుపై తొలిసర్వే నిర్వహించి నిర్మా ణానికి సంబంధించిన అంచనాను సిద్ధం చేశారు. ఆనాటి నుంచి పోవరం ప్రాజెక్టు నిర్మాణం వివా దా మధ్యే నలిగిపో తున్నది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ చొరవతో 1980లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్య మంత్రి టి.అంజయ్య పోవరం ప్రాజెక్టు పనుకు శంకు స్థాపన చేశారు. ఆయన తెంగాణకు చెందిన నాయకుడు. అప్పుడే పోవరం ప్రాజెక్టుకు ఇందిరా సాగర్‌ అని నామకరణం చేసింది కూడా అంజయ్యే. తరువాత 1983లోస్వర్గీయ నందమూరి తారకరామారావూ పోవరం ప్రాజె క్టుకు శిలాఫకం వేశారు. నాటి నుంచి నేటి వరకూ అధికారంలోకి వచ్చిన ముఖ్య మంత్రు తమ పానలో ప్రతి ఏటా బడ్జెట్‌లో నామమాత్రం గా నిధు కేటాయించి ఈప్రాజెక్టు ప్రతిపాదను పెంచుతూ పోయారేతప్ప ప్రాజెక్టునిర్మాణాన్ని మాత్రం చేపట్టలేక పోయారు. వైఎఎస్‌ఆర్‌ ముఖ్య మంత్రిగా పదవీబాధ్యతు నిర్వహించిన సమయం లో చేపట్టిన జయజ్ఞం పనుల్లో భాగంగా పో వరం ప్రాజెక్టునిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసు కెళ్లారు. దశాబ్దా జాప్యం తర్వాత 2004 నుంచి ఈప్రాజెక్టు నిర్మాణం వేగం పుంజుకుంది. ఇప్పటికే 5000 కోట్ల వ్యయంతో కాువ నిర్మాణం కూడా పూర్తయింది
పోవరం వివాదంగా ఎందుకు మారింది..?
రాష్ట్రాభివృద్ధిలో భాగంగా భారీ వ్యయంతో నిర్మించ తపెట్టిన పోవరం ప్రాజెక్టు ప్రారంభం నుండీ చర్చనియాంశంగా తయారై వివాదాకు కేంద్రంగా మారింది. ఈప్రాజెక్టుసాగు ప్రయోజనాు, విద్యుత్‌ ఉత్పత్తి, ముంపు సమస్యు, ఇరుగుపొరుగు రాష్ట్రా అభ్యంతరాు ఈప్రాజెక్టును చుట్టు ముట్టాయి. గోదావరి నదిపై పోవరం ప్రాజెక్టు నిర్మాణంవ్ల వ్యవసాయం, విద్యుదుత్పత్తి,త్రాగునీరు, పారిశ్రామి కాభివృద్ధే పోవరం ప్రాజెక్టు ముఖ్యోద్దేశ్యం. కానీ ఈభారీ ప్రాజెక్టుకు నిపుణు సిఫారసును పెడ చెవినపెట్టిన అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పో వరం ప్రాజెక్టు నివేదికను 1970లో తయారుచేసి, మళ్ళీ దాని స్వరూపాన్ని 1978లో మార్చింది. ఈనేపథ్యంలో ఒరిస్సాలోని మోటు, ఛత్తీస్‌గఢ్‌ లోని కొంటా తాూకాలోని గిరిజన గ్రామాు విపరీత మైన ముంపుకు గురయ్యే ప్రమాదమున్నందున బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఆరాష్ట్రాు షరతు పెట్టాయి. పోవరం ప్రాజెక్టువద్ద 36క్ష క్యూ సెక్కు వరదప్రవాహం వుంటుందని మొదటి అంచనా వేయగా,తర్వాత వెయ్యేళ్ళకు ఒకసారి వచ్చే గరిష్ట వరదప్రవాహం యాభైక్ష క్యూసెక్కు ుగా లెక్కకట్టారు. ఈ యాభై క్ష క్యూసెక్కును పరిగణలోకి తీసుకొనిముంపును అంచనా వెయ్యా ని ఒడిస్సా అంటోంది.ఈ ప్రాజెక్టువ్ల ఒరిస్సా, చత్తీస్‌ఘఢ్‌లోని ముంపు సమస్య ఏర్పడడంతో కరక ట్ట నిర్మాణం చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. 2005లో ఈ అంచనాను అనుసరించి ముంపునకు గురయ్యే స్థలాను,గ్రామాను,అడవును గుర్తించడమే కాకుండా దానికి తగ్గట్టు నిర్వాసితు పునరావాస పథకాను రూపొందించి కేంద్రప్రభుత్వ అను మతిని,కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అను మతిని పొందింది. అయితే పొరుగురాష్ట్రాల్లో ముం పునకు గురవుతున్న ప్రాంతా విషయమై ఆయా రాష్ట్రాతో సంప్రదించి, అనుమతు పొంద కుండానే ప్రాజెక్టు కాువ నిర్మాణ పను చేపట్ట డం,ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రపునర్‌ విభజనతో ఈ వివా దం మరోసారి రాజుకుని జాతీయ ప్రాజెక్టు హోదా దక్కించుకుంది పోవరం.
పోవరం ఓ వరం ..
గోదావరినదిపై పోవరం ప్రాజెక్టు నిర్మాణం వ్ల ఉభయగోదావరి జిల్లాు,విశాఖ,కృష్ణా జిల్లాల్లో మొత్తం 7క్ష 20వే ఎకరాకు సాగునీరు అందనుంది. వీటితోపాటు విశాఖజిల్లాలో తాగు నీరు,పారిశ్రామిక అవసరాకు మరో23.44 టీఎమ్‌సి నీటిని తరలించనున్నారు. అంతేకాదు, పోవరం ప్రాజెక్టు నిర్మాణంవ్ల 960మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పతి అవుతుంది. పోవరం నిర్మాణం పూర్తయితే మొత్తం 273.04టీఎంసీ నీటిని విని యోగించుకునే మీంది. ఈప్రాజెక్టు నిర్మాణం ద్వారా80టీఎంసీ నీటిని కృష్ణానదికి మళ్ళించ వచ్చు. కుడికాువద్వారా ప్రకాశం బ్యారెజీ ఎగువ భాగంలో పోవరం నీరు కుస్తుంది. అంతేకాదు బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం ఇలా మళ్ళేంచే 80 టీఎంసీలో 21టీఎంసీు కర్నాటకకూ, 14 టీఎంసీు మహారాష్ట్రకు వెళతాయి.
పోవరం ఇక జాతీయ ప్రాజెక్టు
2010-11 ధర ప్రకారం పోవరం నిర్మాణం కోసం 10 వే కోట్ల రూపాయ వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకూ సుమారు 5 వే కోట్ల రూపాయు ఖర్చు చేసింది. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయంలో తొంభై శాతం కేంద్రం భరిస్తుంది. తాజా ధర ప్రకారం మరో ఇరవైశాతం నిర్మాణ వ్యయం పెరుగుతుందని అంచనా వేసుకుంటే 10 వే కోట్లకు పైగా కేంద్రం ఖర్చు చేయాల్సి వుంటుంది.
పాపం పోవరం వారికి శాపం
ఖమ్మం జిల్లా ప్రజు పూర్తిగా పోవరం ప్రాజెక్టు ను వ్యతిరేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని గిరిజను తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. పోవరం ప్రాజెక్టు నిర్మిస్తే తెంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 278 నుంచి370 గ్రామా వరకు మాయ మవుతాయి. దాదాపుక్ష ఎకరాల్లో పంట పొలాు జ సమాధి అవుతాయి. భారీస్థాయిలో అటవీ ప్రాంతం కనుమరుగవుతుంది. ప్రకృతి ఒడిలో జీవించే గిరిజనుకు మరో జీవన విధానం తెలి యదు. అలాంటి అడవి బిడ్డకు జీవన్మరణ సమస్య సృష్టించడం అమానవీయమంటూ ప్రజాసంఘాు గత పది సంవత్సరాుగా పోరాడుతూనే ఉన్నాయి. ఇక మా రాష్ట్ర ప్రజను.. ప్రాంతాన్ని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలా విలీనం చేస్తారంటూ తెంగాణా వాదు గగ్గోు పెడుతున్నారు.
మొత్తానికి పోవరం ప్రాజెక్టును ఆంధ్ర ప్రాంత ప్రజానీకం ఆధునిక దేవాయంగా అభివర్ణిస్తుంటే తెంగాణా ప్రాంతానికి ముఖ్యంగా ఖమ్మం జిల్లా గిరిజను పాలిటశాపంగానే తయారైంది. అయితే ఇటువంటి భారీ ప్రాజెక్టుకు రూపక్పన జరిగి నప్పడు ఇటువంటి ఇబ్బందు ఎదురవడం అతి సహజం. అయితే ప్రభుత్వాు నిర్వాసితుకు తగు న్యాయం చేసే విధంగా.. వారి బతుకుకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి.
ముంపు గ్రామాలే అసు సమస్య
పోవరం నిర్మాణంవ్ల చాలా గ్రామాు ముంపు నకు గురవుతాయి. నిర్వాసితు సంఖ్య కూడా భారీగానే వుంటుంది. రాష్ట్రంలోని 274 గ్రామా ల్లోని 44,574 కుటుంబాకు చెందిన 1,77,275 మంది నిర్వాసితువుతారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 205 గ్రామాు,తూర్పుగోదావరి జిల్లాలో 32గ్రామాు,పశ్చిమగోదావరి జిల్లాలో 29 గ్రామాు ప్రాజెక్టులో కలిసిపోతాయి. ఖమ్మం జిల్లాలో నిర్వాసితు సంఖ్యలో సగానికి పైగా గిరిజనులే. అలాగే ఒడిశాలో8 గ్రామాకు చెందిన 6,316 మంది,చత్తీస్‌ఘడ్‌లో4 గ్రామాకు చెందిన 11,766మంది నిర్వాసితువుతారు. ఇంత భారీ సంఖ్యలో గ్రామాతరలింపు, నిర్వాసితుకు పునరావాసం,ప్రాజెక్టు మొత్తంవ్యవహారంలో ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.
నిర్వాసితు గోడు పట్టించుకొనేదేవరు?
ఈప్రాజెక్టు నిర్మాణంవ్ల 376 గ్రామాు ముంపు నకు గురవుతున్నాయి. ముంపుకు గురవుతున్న మండలాలో పశ్చిమగోదావరిజిల్లా పరిధిలోకి పో వరం,కుక్కునూరు, వేలేరుపాడు వస్తున్నాయి. తూర్పు గోదావరిజిల్లాపరిధిలోకిఎటపాక,చింతూరు, వి. ఆర్‌.పురం,కూనవరం,దేవీపట్నం. ప్రస్తు తం ఇవి అన్ని రంపచోడవరం ఐటీడిఏ పరిధిలో ఉన్నాయి. పాన ఐటీడిఏ ద్వారా జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈఆరు మండలాు (ఎటపాక, చిం తూరు,వి.ఆర్‌.పురం,కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు) నాటి ఖమ్మంజిల్లా పరిధిలోకి వచ్చేవి. 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈమండ లాన్నీ ఆంధ్రప్రదేశ్‌లో విలీనంచేశారు. ఈ మం డలాల్లో 90%పైగా గిరిజనులే ఉండటం విశేషం. ప్రస్తుత రికార్డు ప్రకారం 601చదరపు కిలోమీటర్లు భూమి ముంపులో ఉంది.గత రెండు నెలుగా తూర్పుగోదావరి జిల్లాలోని పు మండలాల్లో ఉన్న గ్రామాల్లో గ్రామసభు అధికా యి నిర్వహి స్తున్నారు. ఈగ్రామసభు, పోవరం ప్రాజెక్టు నిర్వా సితు భూసేకరణకి మరియు ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించినవి. ఈగ్రామసభు జరుగు తున్నతీరుపై ప్రజు తీవ్రఆందోళనకు గురవుతు న్నారు. చింతూరు మండంలోని రామన్న పాలెం అనే ఊరిలో జరిగిన భూసేకరణ మీటింగ్లో అధికాయి ఊరిలోఉన్న 698ఎకరా భూమిలో కేవం 114 ఎకరాు మాత్రమే మంపు లో ఉందని వివరిం చారు. ఆ 114ఎకరాల్లో ఉన్న వారి పేర్లను, సర్వే నెంబర్లను చదివి వినిపించారు. ఆపొలాకి ఆను కొని ఉన్న పొలాుగ రైతు,తమ పొలాు వాటితో ఆనుకుని ఉన్నాయని వాటిలోకి నీళ్ళు వస్తే తమ పొలాల్లోకి కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అధికాయి ఇది 1986లో వచ్చిన గోదావరి వరద ముంపు ఆధారంగా వేసిన ఒక అంచనా అని చెప్పారు. పోవరం ప్రాజెక్ట్‌ అథారిటీ వాళ్ళు మళ్ళీ కొత్త జాబితా పంపి నప్పుడు మీకు తెలియ చేస్తామని అన్నారు . ఇది సైంటిఫిక్‌ ప్రక్రియ ప్రకారం వేసిన అంచనా ఎంతమాత్రం కాదని స్పష్టమవుతోంది. అధికాయి ఇలా తమ భూము, ఇళ్ళపట్ల నిర్లక్ష్యం వహించి, ముంపునకు సంబంధించిన స్పష్టత ఇవ్వకపోతే, రేప్పొద్దున వరదు వచ్చినప్పుడు తమ పరిస్థితి ఏమిటని గ్రామస్తు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతానికి చెందిన రాము గిరిజనుడు ఈవిషయం గురించి మాట్లాడుతూ ‘‘నాపక్క పొం లోకి నీళ్లువచ్చినప్పుడు నేను ఆనీళ్లలో నాపొం లోకి రాకుండా ఎలాఆపగను? ఇదే ప్రశ్న అధికా రుని అడిగితే తర్వాత చూద్దాం అంటున్నారు. తర్వాత చూడడానికి ఏముంటుంది? మా పక్కనే ఉన్న గ్రామాు అన్ని మునుగుతాయి అంటున్నారు. కానీ మా గ్రామాల్లో మాత్రం పొలాు మాత్రమే మునుగుతాయి అని అధికాయి చెబుతున్నారు. పొలాు మునిగితే మేము ఏమి చేసుకుని బతకాలి? మా పక్క గ్రామాన్నీ మునిగినప్పుడు మా గ్రామం ఒకటే మిగిలితే కూడా ఒక్కరమే కూడా ఎలా ఉండగము? ఒకవేళ ఉంటే , మేము వేరే ఊళ్ళకి ఎలా వెళ్లాలి? రాకపోకు ఎలా జరుగుతాయి? మాప్లిు స్కూల్కి ఎలావెళ్తారు? అందుకని ఇప్ప టి ప్రాజెక్టు నీటిమట్టం,ఎత్తు ప్రకారంత్వరగా సర్వే చేసి,మాకు అతిత్వరలో స్పష్టత ఇవ్వాని కోరుకుం టున్నాను.’’అంటూ తనఅభిప్రాయం వ్యక్తం చేసాడు చింతూరు మండం పరిధిలో,తిమ్మిరిగూడెం ఊళ్ళోకూడా అధికాయి పొలాు మాత్రమే మునుగుతాయని చెబుతున్నారు. ఈపరిసర గ్రామా ల్లో ప్రజు కూడా ఇలాంటి ప్రశ్నతోనే సతమత మవుతున్నారు. ఇలాంటి పల్లొ ఇంకెన్నో. కొటారు గొమ్ము అనే కొండరెడ్డి గ్రామంలో ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన గ్రామసభ జరిగింది. ఈ గ్రామంలో భూసేకరణ ఎప్పుడో 10సంవత్సరా మునుపు చేశారు. నష్టపరిహారం అన్ని భూముకు ఇవ్వలేదు. కారణం ఇక్కడి గిరిజను కొండపోడు అధికంగా చేస్తారు. ప్రస్తుత ఆర్‌ ఆర్‌ పాసీలో కొండ పోడు భూముకు పరిహారం ఇచ్చేసౌకర్యం లేదు. కొటారు గొమ్ములో 70శాతం మందికి కొండపోడు భూము పట్టాలే ఉన్నాయి. కావున వీళ్ళకి ప్యాకేజీ ఇవ్వక పోతే వీళ్లంతా భూమిలేని నిర్వాసితు అవు తారు. దీనితో పాటు వ్యక్తిగత ప్యాకేజీ విషయంలో కూడా చాలా సమస్యు ఎదురవుతున్నాయి.ప్రస్తుత పాసీ ప్రకారం18సంవత్సరాు నిండిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వంరూ.686,000ఇస్తుంది. దానితో పాటు వాళ్ళకి కానీలో వేరే ఇు్ల కూడా కట్టి ఇస్తారు. దీనికి ప్రతిదికగా నోటిఫికేషన్‌ ఆధారంగా అధికా యి 2017మార్చి నె కట్టాఫ్‌ డేటు గా ప్రకటిం చారు. మార్చి2017 నాటికి 18ఏళ్ళు నిండినవాళ్ళే దీనికి అర్హుగా ప్రకటించారు. కానీ నేటికీ కూడా ఆఊరిని,కానీకి తరలించలేదు. వారికి వ్యక్తిగత ప్యాకేజీ డబ్బు కూడా చెల్లించలేదు. కావున గ్రామస్తుంతా కటాఫ్‌డేటుని ఈసంవత్సరం వరకు పొడిగించాని కోరుతున్నారు. ఇలా గడువు పొడి గించడంవ్ల దాదాపు30నుంచి40మంది ఈలిస్టు లోఅర్హులై ఈపాసీతో బ్దిపొందుతారని చెప్తు న్నారు. గ్రామసభకు వచ్చినఅధికాయి ఈ విషయా న్ని పైఅధికారు నోటిస్‌కి తీసుకెళ్తామని సమా ధానం ఇచ్చి తప్పించు కుంటున్నారు. పోవరం కోసం తమ సర్వస్వాన్ని కోల్పోతున్న నిర్వాసితుకు కటాఫ్‌డేట్‌ కూడా సరిచేసి ఇవ్వలేని ప్రభుత్వం తమకు ఎటువంటి న్యాయం చేయగదంటు ఇక్కడి ప్రజు ప్రశ్నిస్తున్నారు. కొటారుగొమ్ము గ్రామస్తు రాు క్ష్మి తన మాటల్లో ‘‘భూమిలేని ఆదివాసి రోజుకూలీగా మారడం ఖాయం. ఎందుకంటే అక్కడ మేము ప్రతిఒక్కటి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మేము ఉండే అడవిలో మాకు ఎన్నో దొరుకుతాయి.వంటకికట్టొ, కాయు, పండ్లు,దుంపు, వనమూలికు ఇలా కాలాను గుణంగా అడవి ఉత్ప త్తు భిస్తూనే ఉంటాయి. ప్రతి ఒకటి ఎంతోప్రయోజకరం. మా ఊరు గోదా వరి ఒడ్డుకి ఆను కునే ఉంటుంది. మేము రోజు గోదారి చెలిమె నించి తాగునీరు తెచ్చుకుంటాం. గోదావరిలో చేపు పట్టుకుంటాము. రోజు మా గొడ్లు వెళ్లి గోదారిలో సేదతీరి వస్తాయి వాటిని ఎవరూ మేపాల్సిన పనేలేదు. ఇంతస్వేచ్ఛగా బ్రతికే మమ్మల్ని తీసుకెళ్ళి ఆకానీలో పడేస్తే మేము ఎలా బతకాలి. ఆకానీలో ఇు్లచాలా ఇరుకుగా ఉన్నాయి. అక్కడగొడ్లను కట్టేసు కోవడానికి సరిపడా చోట కూడా లేదు.కనీసం మాకు వంట చేసుకోవ డానికి అక్కడ ప్లు కూడా దొరకవు. ప్రతి నెవంట గ్యాసు కొనాంటే మాకుచాలా ఖర్చు అవుతుంది. పైగాఅక్కడ కూలీ దొరుకు తుందో లేదో! ‘‘ అంటూ తమకు రాబోయే దుస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు అన్ని కొండారెడ్డి పల్లెల్లో ఇది పరిస్తితి. వచ్చే రెండునెలో 8పల్లెను కానీల్లోకి తరలించనున్నారు.
ఇు్ల వదిలి కానీకు చేరిన తర్వాత
ఇటీవలే దేవీపట్నం మండంలోని కొన్ని గ్రామా ను అధికాయి ఖాళీ చేయించి వారిని కానీ లోకి తరలించారు. ఇందులో కచ్చుూరు,సుద్ధ గొమ్ము,అగ్రహారం,ఏనుగుగూడెం,సీతారం ఊళ్ళు ఉన్నాయి. అందరికీ ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, ఇంటి ప్యాకేజీ ఇవ్వడం జరగలేదు. అగ్రహారం ఊరిలో 72 కుటుంబాు ఉంటే, దాదాపు 20పెండిరగ్‌ కేసు ఉన్నాయి. 18మందికి ఏకంగా ప్యాకేజీ రిజెక్ట్‌ అయింది. అయినప్పటికీ వీరిని కొత్త కానీలో నివాసం తరలించారు. కొత్త కానీలో సీసీ రోడ్డు, డ్రైనేజ్‌ వసతి,తాగునీటి వసతిలేదు. ఉన్న ఒకే ఒక్క వాటర్‌ ట్యాంకునుండి కానీకి వాడుకునే నీటిని సరఫరా చేస్తున్నారు. చాలాసార్లు సాయంత్రం అయే సరికి వాటర్‌ ట్యాంక్లో నీళ్ళు ఉండటం లేదు. ప్రజు ఈసమస్యని అధికారు సమక్షంలో లేవ లెత్తగా ఇంకొక వాటర్‌ట్యాంక్‌ కట్టిస్తాం అని అధికా యి మాట ఇచ్చి దాటవేశారు. వారి సమ స్య గురించి ప్రశ్నించినప్పుడు వాళ్ళకి ఉపాధి భించే అవకాశాు కూడా ఏవీ లేవని అగ్రహారం గ్రామ స్తు తెలియజేసారు. భూవివాదంతో చాలా మం దికి భూమికి తగ్గసాగు భూమి భించక అంతా అయోమయంలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పోవరం వీరికి శాపమే అని ఇక్కడి ప్రజు అభిప్రాయపడుతున్నరు. పాసీ పరంగా ఎటువంటి చర్యు తీసుకుంటే వీరికి కనీస న్యాయం చెయ్యొచ్చు. చరిత్రనిండా ఏంటో నష్టపోయి అడవుల్లో శరణు పొందిన ఆదివాసుల్ని, బవంతంగా కానీకు తరలించి వాళ్ళ జీవావ రణానికి ముప్పు తెచ్చినట్లు ఉంది ప్రస్తుత పరిస్తితి. ప్రాజెక్టు లాభాల్లో వాటాదాయిగా వీళ్ళని పరిగ ణించి,ఉన్నతమైన జీవనాన్ని అందించే వెసు బాటు లేనప్పుడు ప్రాజెక్ట్‌ కోసం వీళ్ల భూముల్ని, ఇళ్ళన్ని లాక్కోవడం సమంజసమేనా? ఈ కోణంలో ఆలోచించి, వీరి హక్కుని కాపాడుతూ నిర్వాసి తుకు తగ్గిన న్యాయాన్ని ఇవ్వాని డిమాండ్‌ చేస్తున్నారు ఆదివాసు. పోవరం ప్రాజెక్ట్‌ నిర్మా ణానికి పేసా (గ్రామ పంచాయతీ తీర్మాన చట్టం), ఎఫ్‌ఆర్‌ఏ(అటవిహక్కుచట్టం) చట్టాను పూర్తిగా ఉ్లంఘించిన ప్రభుత్వం, నిర్వాసితుకు కనీసం ఆర్‌ ఆర్‌ ప్యాకేజీలోని లోపాని సరిచేసి కొద్దో గొప్పో ఊరటనివ్వాని ఇక్కడి ప్రజు, హక్కు సంఘానేతు,పర్యావరణ కార్యకర్తు అభిప్రాయ పడుతున్నారు.

నివృతి.జి