పెరుగుతున్న అసమానతలు

ఆదాయం,సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఆర్థిక నిర్మాణాలే, వాటిని పెంచి పోషించిన ధోరణులే ఈ స్థాయిలో అసమానతలు తీవ్రం కావడానికి కారణం అన్నది అందరికీ తెలిసిందే. మన దేశ స్వాతంత్రోద్యమం బ్రిటన్‌లో వలే భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించిన ఉద్యమం వంటిది కాదు. వలస పాలనపై పోరుతో 1947 ఆగష్టు 15న దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్ణాలకు అధికార బదిలీ జరిగింది. భారత్‌లో ప్రజాతంత్ర విప్లవం జరుగలేదు కనుకనే భూ సంస్కరణలు అమలు కాలేదు. విదేశీ ఆస్తులు జాతీయం కాలేదు సరికదా, బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పెట్టుబడులకు తోడు వివిధ సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడులు దేశంలోకి చొర బడ్డాయి. సామ్రాజ్యవాద పెట్టుబడి దేశీయ స్వతంత్ర పెట్టుబడిని ఎదుగనివ్వదు. దేశీయ పెట్టుబడిని తనకు తొత్తుగా మార్చుకుంటుంది. అందువల్లనే ఏడున్నర దశాబ్దాలు గడిచినా భూస్వామ్య మత విలువలు, విదేశీ పెట్టుబడి దోపిడీ అంతం కాలేదు. అది మరింత పెరిగింది. ఫలితంగా ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం అధికారం చెలాయిస్తోంది. 1947 ఆగష్టు 15న నెహ్రూ ప్రసంగంలో పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అవకాశాలలో అసమానతలను రూపుమాపడమే దేశం ముందున్న కర్తవ్యమని ఉద్దాటించారు. మన ప్రభుత్వాలు అమలు చేసిన ప్రణాళికబద్ధ అభివృద్ధి బడా బూర్జువా,బడా భూస్వామ్య వర్గాల పురోగతికి తోడ్పడిరది తప్ప ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడలేదన్నది ఏడు దశాబ్దాల అనుభవం రుజువు చేస్తోంది,
1990వ దశకం నుంచి సామ్రాజ్య వాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు పేరుతో సాగుతున్న విధ్వంసం దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నది. పెట్టుబడిదారీ, సామ్రాజ్య వాద ధోరణులు జొరబడి మౌలికరంగాలపై గుత్తాధి వత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలన్ని భారత్‌వైపే చూస్తున్నాయి. ఇక్కడి మార్కెట్‌ను,సహజ వనరులను కొల్లగొట్టడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంతకు కొన్ని వందల రెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశ సంపదను పరోక్షంగా దోచుకుంటున్నాయి. ఇవాళ ప్రపంచ బహుళజాతిసంస్థలు,ద్రవ్యసంస్థలు భారత ప్రభుత్వంతో పలుఒప్పందాలు చేసుకుంటు న్నాయి. ప్రపంచీకరణవల్ల కార్పొరేట్‌ దిగ్గజాలకు తప్ప సామాన్యుడికి ఒరుగుతున్న లాభం ఏమీలేదు. శ్రమ దోపిడీ,పర్యావరణ విధ్వంసం మరింతగా పెరిగిపో తున్నది. దేశం అనుసరిస్తున్న విధానాలు ఈ శక్తు లను పెంచి పోషించేవిగా ఉండడం దురదృష్ట కరం. ఏడు దశాబ్దాలపైగా దేశీయ పాలనలో దేశం ఎంతో పురోగమించిందని దోపిడీ పాలకులు తొణక్కుండా ప్రకటిస్తున్నారు.కానీనానాటికీ దిగ జారుతున్న జీవన ప్రమాణాలతో శ్రామిక ప్రజానీ కం దిక్కుతోచకున్నారు. నిజానికి కరోనా సృష్టించిన సంక్షోభం కంటే మనపాలకులు,ముఖ్యంగా ఎనిమి దేళ్లుగా మోడీప్రభుత్వం అమలు చేస్తోన్న రాజకీ యార్థిక విధానాలతో ప్రజాజీవనం కకావికలౌ తున్నది. కరోనా ఆంక్షల నడుమ ప్రజా ప్రతిఘటన ఇబ్బందిని ఎదుర్కొనకుండానే ప్రజా వ్యతిరేక విధా నాలను నల్లేరు మీద నడకలా అమలు చేస్తూ పోతు న్న నేపథ్యమిది. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలైన జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు, కార్మిక చట్టాల సవరణ వంటి విధానాలన్నీ సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్లకే తోడ్బ్చడ్డాయి.
చిన్న మధ్య తరహ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిల్లర వర్తకం లోకి 100 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిం చడం, దేశానికి స్వావలంబనకు వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి విధానాలతో పాటు ప్రజా ఉద్యమాలపై, మేధావు లపై, జర్నలిస్టులపై, కళాకారులపై, ప్రజాసంఘా లపై దేశద్రోహ చట్టాన్ని,ఉపా చట్టాన్ని విచ్చల విడిగా ప్రయోగిస్తున్నారు.దేశంలో భావ వ్యక్తీకర తణ స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలో ఉంది. మీడియా, ముఖ్యంగా స్వతంత్ర జర్నలిస్టులపై అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలోని నేటి పరిస్థితులు రుజువు చేస్తున్నాయి.భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగ ణించి,విద్యార్థులు,సామాజికకార్యకర్తలు, జర్నలి స్టులపై క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టాల కింద నేరాలు ఆరోపించి కేసులు నమోదు చేస్తున్నది. పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం 2008 నుంచి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అన్ని ఖండాల్లోని పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆకలి కేకలు వినిపిస్తు న్నాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆర్థిక అసమాన తలు పెరిగాయి. భారతదేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆర్థిక సంక్షోభానికి తోడు కరోనా మహమ్మారి కాలంలో పెట్టుబడిదారీ సానుకూల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు శ్రామిక ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. 1980వ దశకంలో అట్టహాసంగా ప్రకటించిన ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు పెట్టు బడిదారీ వ్యవస్థలోని అన్ని సమస్యలకూ సర్వరోగ నివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి ఆవిధానాల డొల్లతనం ప్రస్తుత ఆర్థిక సంక్షోభ రూపంలో వ్యక్తమవుతోంది. భూములు, గనులు, అడవులు, అంతరి క్షంలోని టెలికాంస్పెక్టమ్‌లు అన్నిం టినీ కార్పొరేట్లకు అర్చించేస్తున్నారు.అందుకు చట్టాలు ఆటంకంగా ఉంటే ఆ చట్టాలనే మార్చేస్తు న్నారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఇవాళ దేశంలో పాలకవర్గ పార్టీలన్నీ తమ కండబలం, ధనబలంతో పాటు వివిధ ప్రజాకర్షక పథకాలపై ఆధారపడుతూ ప్రజ లను పరాధీనులుగా చేస్తున్నారు. దేశంలో ప్రపంచీ కరణ విధానాల దుష్ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో వైపున రైతుల,కార్మికుల ఇతర(శ్రమ జీవులహక్కులు హరించబడు తున్నా యి. మొత్తంగా ప్రజాతంత్ర, పౌరహక్కులే ప్రమా దంలో పడిపోయాయి. ప్రభుత్వం నుండి ఏక కాలంలో తీవ్రతరమైన ఈ దాడు లు దేశంలోని కార్మిక,రైతాంగ ఇతర శ్రామిక వర్గా లన్నీ ఏకమై ఎదిరించాల్సిన అనివార్య పరిస్థితులను కూడా కల్పిస్తున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల గురించి ఈ మధ్య కథనాలు చాలా వచ్చాయి.‘‘చంపుతున్న అస మానతలు’’అన్న పేరుతో ఇటీవలే ఆక్స్‌ ఫామ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2021లో84శాతం కుటుంబాల ఆదాయం పడి పోయింది. అయితే అదే సంవత్సరంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలో 100 మంది కుబేరుల సంపద అదే సంవత్సరంలో 57.3 లక్షల కోట్లకు పెరిగింది. దిగువ 50 శాతం కుటుంబాల సంపద జాతీయఆదాయంలో 6శాతం మాత్రమే కలిగి ఉన్నారు.భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. అదే సమయంలో నిరు ద్యోగం,పేదరికంపెరుగుతోంది. మన ఆర్థిక వ్యవస్థ ఉపాధి రహిత వృద్ధికి తోద్బడుతుంది. మోడీప్ర భుత్వం కార్మికులు,రైతాంగం,గిరిజనులు, యువ కులు,మహిళలు, దళితులు, మైనారిటీలు ఎదుర్కొం టున్న ఏఒక్క సమస్యను పరిష్కరించడం లేదు. రాష్ట్రంలో, కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చి నా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావడం అసాధ్యమని గతఏడున్నర దశాబ్దాల పైగా సాగిన పాలన అనుభవం రుజువు చేస్తోంది. అందువల్ల భారత పాలక వర్గాల ప్రజా వ్యతిరేక భూస్వామ్య, స్వదేశీ,విదేశీ పెట్టుబడి అనుకూల విధానాలకు, హిందూత్వ ఫాసిస్టు పాల నకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటిత కావాలి. దోపిడీ,పీడన,సామ్రాజ్యవాద ఆధిపత్యాలకు వ్యతి రేకంగా పోరాడటం తప్ప మరో మార్గం లేదు. బడా బూర్జువా,భూస్వామ్య పార్లమెంటరీ రాజకీయాలను నమ్మడం ఇకపై సాధ్యం కాదు. భారతదేశ ప్రజలందరికి స్వాతం త్య్రం నూతన పొందికతో ఆవిర్భవించాలి. ప్రజా తంత్ర ప్రత్యామ్నాయంగా కార్యక్రమం రూపొందిం చుకోవాలి. అది ప్రజల రాజకీయ, ఆర్థిక, సామా జిక విముక్తి లక్ష్యాలను కలిగి ఉండాలి. ఆ కార్య క్రమం, కార్మిక, కర్షక, యువత సంఘటిత ప్రతి ఘటన ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుంది. ప్రజా స్వామ్య,లౌకిక,అభ్యుదయ శ్రేణులు ప్రజా ఉద్య మానికి దన్నుగా నిలువాలి. – -` ఎ.నర్సింహారెడ్డి,(వ్యాసకర్త:సీనియర్‌ పాత్రికేయులు, హైదరాబాద్‌)