థింసా దారిలో……!

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకులు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ తెలుగు సాహితీలోకానికి సుపరిచితులైన యువ సాహితీవేత్త ‘శంభాన బాల సుధాకర మౌళి ’ కథా రచన ‘ థింసా దారిలో…’ కథా చదవండి..! – సంపాదకులు
ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లా వాసి ఉపాధ్యాయ కథారచయిత, తాను నిత్యం చూస్తున్న అడవి బిడ్డల జీవనాన్ని చిత్రిక పట్టి వ్రాసిన సంపూర్ణ సంస్కృతి సంబంధ గిరిజన కథ థింసాదారిలో… ఇది ఏప్రిల్‌ 2012 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో తొలి సారిగా ప్రచురించబడిరది. ఉత్త రాంధ్ర మాండలిక భాషలో సంభాషణ యుతం గా సాగిన ఈకథద్వారా,రచయిత గిరిజన సంప్రదాయ పండుగలోని అంతరార్థం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
అడవి బిడ్డలు జీవనంలాగే వారిసంస్కృతి, సాంప్రదాయాలు,అబ్బురపరిచే విధంగా ఉంటాయి.సూక్ష్మంగా పరిశీలిస్తే అంతర్గతంగా ఏదో ఒక జీవనసూత్రం అందులో ముడిపడి కనిపిస్తుంది.బయటకు అంత త్వరగా కనిపిం చని ఆ జీవన సూత్రాలు తెలుసుకోవాలి అంటే గిరిజన బ్రతుకు చిత్రాన్ని అంతే చేరువుగా చూసిన వారికే సాధ్యం.
ఉత్తరాంధ్ర ప్రాంతం విజయనగరం జిల్లా వాసి ఉపాధ్యాయ కథారచయిత,‘‘శంభాన బాల సుధా కర మౌళి’’ తాను నిత్యం చూస్తున్న అడవి బిడ్డల జీవనాన్ని చిత్రిక పట్టి వ్రాసిన సంపూర్ణ సంస్కృ తి సంబంధ గిరిజన కథ ‘‘థింసాదారిలో…’’ ఇది ఏప్రిల్‌ 2012 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో తొలిసారిగా ప్రచురించబడిరది. ఉత్త రాంధ్ర మాండలిక భాషలో సంభాషణ యుతం గా సాగిన ఈకథద్వారా,రచయిత గిరిజన సంప్రదాయ పండుగలోని అంతరార్థం ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక కథ విషయానికొస్తే….అందమైన అడవి, సుందర సోయగాలను వర్ణిస్తూ మొదలైన ఈ కథలోని పాత్రల పేర్లు,ఊర్ల పేర్లు,ఉపయో గించిన భాష,జాతీయాలు,అన్ని స్థానికతకు అగ్రతాంబూలం ఇచ్చాయి.‘‘గుమిడిగూడ’’ గిరి జన గూడెంపెద్ద ‘‘ఉంబయ్య’’,అతని మొదటి భార్య ‘‘భూదేవమ్మ’’,ఆమె కొడుకు‘‘బుదరయ్య’’ రెండో భార్య కూతురు‘‘సుకిరి’’తల్లులు వేరైనా ఒకేతండ్రిబిడ్డలు కనుక అంతేగారాబంగా జీవిస్తూ ఉంటారు. గిరిజన గూడేల్లో ఏ సామూ హిక పండుగలు చేయాలన్న అందరూ ఒకచోట చేరి ముందుగా ప్రణాళిక చేసుకుంటారు.ఇది ఆ గ్రామ పెద్దల సమక్షంలో…ఇకపోతే ‘గుమిడిగూడ’గ్రామ పెద్ద‘ఈడ ఉంబయ్య’ రెండు తరాలుగా వస్తున్న ఆ గ్రామ పెద్ద మనిషి. తగువులు పంచాయతీ తీర్చడమే కాదు వైద్య సేవలు కూడా అందిస్తాడు. పాము కరిచిన, తేలు కుట్టిన,పసరు పోస్తాడు.చూడటానికి బానకడుపుతో లావుగా,నల్లగా,ఉంటాడు.
చెవికి బంగారు బావిలి, మొలతాడుకి ఒకపక్క చుట్టలు పెట్టుకోవడానికి వెదురు గొట్టం, మరో పక్క కత్తి పెట్టుకోవడానికి వరలాంటి రెండు జానల పొడవైన మరో వెదురు గొట్టం,అది అతడి అవతారం. అతను వాడే కత్తి లాగే మాట కూడా పదునే….!! ఆ గ్రామాన్ని రక్షిస్తున్న ‘కొండ భైరవుడు’ పంపిన రక్షకుడిగా ఉంబయ్యను నమ్ముతారు అక్కడి గిరిజనులు. అతని మాటే వేదం ఎవరు అతని మాట కాద నరు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎవరికి ఏకష్టం వచ్చినా ముందుండేది ఆ గ్రామ పెద్ద ఉంబయ్య. కూతురు సుకిరి‘అయ్య రమ్మంటున్నాడు’ అని చెప్పిన చిన్న మాట తోనే…గూడెం లోని ఇంటికొకరు అంత రాత్రి చీకటిలో వాన ముసురు కూడా లెక్కచేయకుండా గూడెం పెద్ద పిలుపును గౌరవిస్తూ అతని ఇంటి ముందుకు చేరుకుంటారు.దీని ద్వారా అడవి బిడ్డలు లోని క్రమశిక్షణ, నిజాయితీ తీరు తెన్నులు అర్థమవుతాయి. వచ్చిన వారిని అంద రినీ పలకరిస్తూ క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్న ఉంబయ్య ప్రవర్తన ద్వారా అతనిలోని అసలైన నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. కొండ మీద నివసించే గిరిజనులు ప్రత్యేక అవసరం పడితే తప్ప కొండ దిగి ‘దిగువకు’రారు వారి ప్రయాణాలు కూడా సామూహికంగా,సమైక్యంగా సాగుతాయి. అలాంటి సాధారణ ప్రయాణానికి పండుగ సంప్రదాయం అన్వయించి చెప్పిందే ఈ‘థింసా దారిలో…’ కథ. ఈ కథరాయడంలో రచయిత సుధాకర్‌ మౌళి రెండు అంశాలను సూచించి నట్లు అనిపిస్తుంది, అందులో ఒకటి గిరిజనుల్లో గల భిన్నసాంప్రదాయాల్లో ఒకటైన థింసా ఆటకు,సంక్రాంతి పండుగకు గల అవినాభావ సంబంధం తెలపడం ఒకటి. పండుగ పేరుతో దిగువ ప్రాంతాలకు వెళ్లి అక్కడి మనుషుల్లోని చెడు బుద్ధులను నేర్చుకో వద్దని, సాంప్ర దాయాలను కలుషితం చేసుకోవద్దని మరోకటి. ముఖ్యమైన ఈహెచ్చ రికను నర్మగర్భంగా చెప్పే ప్రయత్నం రచయిత చేశారు అనిపిస్తుంది.ఇక ఈ థింసానృత్యం కథా శీర్షికగా,వస్తువుగా, రచ యిత ఎంచుకోవడంలో అతని రచన ప్రతిభ వెల్లడవుతుంది.చిన్న వస్తువు సాయంగా పెద్ద విషయం వెల్లడి చేయడం అనేఉత్తమ రచయిత భావాలు కూడా ఇందులో కనిపిస్తాయి.ఉత్తరాం ధ్ర ప్రాంతానికి చెందిన కొండదొర,గదబ, గిరిజనుల సాంప్రదాయాల నృత్య కేళి‘‘థింసా’’ సంక్రాంతి పండుగ రోజుల్లో ఈనృత్యాలు చేస్తూ కొండల మీద నివసించే కోయలు,దిగువ ప్రాంతాల్లోని గ్రామాల్లో తిరుగుతూ వారి థింసా ఆటపాటలతో అక్కడి వారికి ఆనందం అందిస్తారు.మైదాన ప్రాంత ప్రజలు అబ్బుర పరిచే ‘‘థింసా’’ సోయగాలు చూడటానికి ఆరు నెలల ముందు నుంచే ఎదురు చూస్తారు. ప్రకృతి సైతం అడవిబిడ్డల పాద స్పర్శ కోసం పరవశంతో ఎదురు చూస్తోందట!! అనుచరులు డప్పులు,పినలగర్రలు,కిరిడి,సన్నాయి, పిల్లన గ్రోవి,జోడుకొమ్ములు,వాయిద్యాలు వాయిస్తూ, చూపరులకు వీనులవిందు అందిస్తారు. సాధారణంగా దీపావళికి మొదలైన థింసా ఆటలు,పుష్య,పాల్గున,మాసాల్లో ముగుస్తాయి. పుష్యమాసపు సంక్రాంతి రోజుల్లో దీనికి ఉత్త రాంధ్రలో అధిక ప్రాధాన్యత ఉంటుంది. వాయిద్యాలకు అనుగుణంగా 14గతులలో గిరిజన జీవితాన్ని అభినయించేదే థింసా నృత్యం.
ఇక కథలోకి వెళితే….ఉత్తరాంధ్రకు చెందిన ‘గుమిడిదూడ’ అనే గిరిజన కొండ గ్రామంకు చెందిన గ్రామ పెద్ద కొడుకు ‘బుదరయ్య’ అతని సావాసగాడు ‘సువ్వాయి’ అడవికి కట్టెలకు వెళ్లి కట్టెలతో ఇంటి ముఖం పట్టి, దారిలో వర్షానికి తడిసి ఇల్లు చేరతాడు, తల్లి భూదేవమ్మ కొడుకును మందలిస్తుంది, ఆరోగ్యం పాడవు తుందనే భయంతో.!! కొండ దేవుడు భైరవుడు ఉండగా తన ఆరోగ్యానికి ఏమీ కాదంటూ తల్లికి భరోసా చెప్పి చెల్లెలు ‘‘సుకి రి’’ని బువ్వ పెట్ట మంటాడు.గోడకాని చెల్లి సిబ్బిలో పెట్టిన బువ్వ తింటాడు. సందకాడ వర్షం జోరు తగ్గాక సుకిరి గూడెంలోని వాళ్లకు తండ్రి చెప్ప మన్నా కబురు చెప్పి వస్తుంది.గ్రామపెద్ద‘ఉంబ య్య’ పిలుపు అందుకున్న వారంతా అక్కడికి చేరతారు, తాము ప్రతి సంక్రాంతి నెలలో చేయబోయే థింసా ప్రయాణం గురించి చెప్పగ అందరూ అందుకు సమ్మతించి,దానికి సంబం ధించిన సూచనలు, విని ఎవరి ఇళ్లకు వారు వెళతారు. తెల్లారి పొద్దుపొదుపు అయ్యాక ఉంబయ్య నాయకత్వంలో ఆగిరిజన గూడెం మగవాళ్ళంతా తమతమ వాయిద్యాలతో థింసా ఆటకు కొండదిగువ గ్రామాలకు ప్రయాణం అవుతారు.వారు ఇళ్లకు తిరిగి రావడానికి వారం పది రోజులు పట్టవచ్చని అంతవరకు ఇళ్ళల్లో ఉండే ఆడవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామ పెద్ద చెబుతాడు. ఆడ వాళ్ళంతా ఒకరి చేతులు ఒకరు జట్టుగా పట్టు కుని మీరు వచ్చేవరకు అందరం గుట్టుగా ఉంటామంటూ వాళ్ల భర్తల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాటిస్తారు.మగాళ్లంతా తమ తమ వాయిద్యాలతో కొండ దిగువకు పయనం కట్టడం వారి నాయకుడు కొండభైరవుడికి మొక్కి ప్రయాణం ప్రారంభిస్తూ ‘కొండ దిగువకు పోయేది అక్కడి రుచులు తినడానికి,తాగ డానికి, డబ్బులు సంపాదనకు కాదు,మన థింసాఆట ఉనికి అందరికీ పంచడానికి’ అంటూ అసలు విషయం చెప్పడంతో కథ ముగుస్తుంది.‘సాంప్రదాయాన్ని కొనసాగించే దారుల్లో కొండ బిడ్డలు’అన్న రచయిత ముగింపు వాక్యం తో ముగిసిన ఈ కథ ఆద్యంతం అంద మైన అటవీ వాతావరణంతో సాగుతూ గిరి బిడ్డల జీవన చిత్రాన్ని కళ్ళకు కడుతుంది. ఏమండి క్యారేజీ ఉండదని రచయిత శైలి కూడా భిన్నంగా అనిపిస్తుంది. కథలో సందర్భోచితంగా వాడిన ‘‘చేటలో చెరిగిన మెత్తని పిండిలా వెన్నెల పల్చగా కాస్తంది’’ వంటి జాతీయాలు రచయిత నూతనత్వానికి అద్దం పడతాయి. ఇక కథద్వారా రచయిత చెప్పదలుచుకున్నది ‘థింసాఆట’ద్వారా గిరి బిడ్డ లు తమ జీవన గతిని ప్రదర్శిస్తూ తమ సాంప్ర దాయ సంస్కృతులను కాపాడుకుంటూ,అందరికీ ఆనందం అందిస్తారు తప్ప తద్వారా వచ్చే డబ్బులు,ధాన్యాల కోసం ఆశ పడి చేసే‘‘యాచక పని’’ఎంత మాత్రం కాదు,అని ఉద్ఘాటిస్తారు.అదే విధంగా వారం పది రోజుల పాటు తమకు సొంతమైన అడవులను,కొండలను, భార్యా బిడ్డలను, వదిలి ఉండలేమనే భావంతో వెళ్లే సమయంలో ‘‘ఆ మగాళ్ళు కన్నీరు పెట్టు కున్నారు’’ అన్న వాక్యం ద్వారా అడవి బిడ్డలు తమ నివాసాల మీద ఎంతటి మమకారం కలిగి ఉంటారో రచయిత చెప్పకనే చెప్పారు. ఈ మమకారం మనుషులం దరికీ ఉంటుంది, కానీ అధికారులు,పాలకులు,అభివృద్ధి,ప్రాజెక్టులు, నెపంతో అడవి బిడ్డలను వారి జన్మభూమికి శాశ్వతంగా దూరం చేసే ప్రయత్నాలు చేయడం వల్ల వారి మనసుఘోష ఎలా ఉంటుందో ఎవ రికి వారు మనుషులుగా ఆలోచించుకోవాలి. చిన్ని ఇతివృత్తానికి అందమైన సృజన శైలి జోడిరచి ఆసక్తికరమైన కథనంతో కథను ఆసాంతం ఆహ్లాదంగా నడిపించడంలో రచ యిత ‘‘బాలసుధాకర్‌ మౌళి’’ కృషి అభినం దనీయం, వర్తమాన కథా రచయితలకు ఆచర ణీయం.
(వచ్చే నెల బలివాడ కాంతారావు గారి ‘‘నైజరు తేనె’’ కథా విశ్లేషణ మీకోసం)