చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు

పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్న పాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృ భాష లోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసి వేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే..అంత మంచిది. అంకెలు తెలి యని వాళ్లు కూడా తక్కువేమీ లేరు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా..ప్రతి క్లాస్‌లో ఇలాంటి పిల్లలు ఉన్నారని.. అసర్‌ రిపోర్ట్‌ తేల్చింది. దీంతో.. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య అంటూ ప్రభు త్వాలు చేస్తున్న ప్రచారమంతా ఉత్తిదేనని తేలి పోయింది. ప్రాథమిక విద్యా ప్రమాణాలు ఇంత దారుణంగా పడిపోవటానికి కారణమేంటి?
దేశంలో..ఈమూల నుంచి ఆ మూలదాకా..ఏప్రభుత్వ పాఠశాలను తీసు కున్నా..ఇదే పరిస్థితులుఉన్నట్లు తేల్చింది అసర్‌ రిపోర్ట్‌. అక్కడో..ఇక్కడో ఎందుకు..మన తెలు గు విద్యార్థుల గురించే తెలుసు కుందాం. అందరి మాతృభాష తెలుగే అయినా.. కొంద రికి తెలుగు చదవడమే రావట్లేదు. ఇంకొం దరు..తెలుగు అక్షరాలను కూడా గుర్తు పట్టడం లేదు. పోనీ.. ఇంగ్లీషే మైనా ఇరగదీస్తున్నారా? అంటే..అదీ లేదు. తెలుగు చదవడంలో.. రెండురాష్ట్రాల విద్యా ర్థులు కొంత వెనుకబడి నట్లు తెలుస్తోంది. ప్రముఖ రీసెర్చ్‌ ఆర్గనై జేషన్‌..యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌..అసర్‌ రిలీజ్‌ చేసిన రిపోర్టులో..ఈ విష యాలు బయటపడ్డాయి. ఆ సర్వే ప్రకారం.. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా చాలా మంది పిల్లలు..చదువులో బాగా వెనుకబడి పోయినట్లు తేలింది. దాదాపు ప్రతి తరగతిలోనూ తెలుగు కంటే ఇంగ్లీషులో విద్యార్థులు కొంత మెరుగ్గా ఉన్నారు.మూడో తరగతి స్టూడెంట్స్‌ విషయానికొస్తే..అక్షరాలు చదవగలుగుతున్నా.. పదాలు చదవలేకపోతున్నారు. పదాలు చదివే వాళ్లు..ఒక మోస్తరు వాక్యాలను, పేరాలను చద వలేని స్థితిలో ఉన్నారు. ఇక.. గణితం విషయాని కొస్తే.. మూడో తరగతి విద్యార్థు ల్లో చాలా మందికి అంకెలు కూడా గుర్తించలేక పోతున్నారు.99 దాకా అంకెలే తెలియడం లేదు. సగానికి సగం పిల్లలు.. తీసివేతలు చేయలేకపోతున్నారు.మెజారిటీ విద్యా ర్థులకు భాగాహారాలు ఎలా చేయాలో కూడా తెలి యడం లేదని.. అసర్‌ రిపోర్ట్‌ తేల్చింది. చివరికి.. ఎనిమిదో తరగతిలోనూ..అంకెలు గుర్తించలేని విద్యార్థులున్నారు.ఇంగ్లీషుపదాలుచదవలేక పోతున్న విద్యార్థులశాతం కూడా భారీగానే ఉంది. సులభ మైన పదాలు గుర్తించడంలోనూ పిల్లలు బాగా వెనుకబడిపోయారు.ఈజీ వర్డ్స్‌తెలిసినా.. సులభ మైన వాక్యాలు తెలియని పిల్లలు కూడా ఎంతో మంది ఉన్నారు. దీంతో.. ప్రభుత్వ పాఠశా లల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారం..కొన్ని పాఠశాలలకే పరిమి తమైందని అర్థమవుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. ప్రభు త్వాలు చెబుతున్నా.. చాలా మంది ప్రైవేటుగా ట్యూషన్లకు వెళ్తున్నారని తేల్చింది అసర్‌ రిపోర్ట్‌. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి దాకా..కనీసం 15 శాతం మంది విద్యార్థులు డబ్బులు చెల్లించి ట్యూషన్లలో పాఠాలు చెప్పించుకుంటున్నారు. ఓవరాల్‌గా.. దేశం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో..30శాతానికి పైగా ప్రైవేట్‌ ట్యూష న్లు చెప్పించుకుంటున్నారని తేల్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం.. 2018తో పోల్చుకుంటే 2022లో దారుణంగా పడిపోయింది. దేశవ్యాప్తంగా.. అన్ని రాష్ట్రాల్లో 7లక్షల మంది విద్యార్థులతో సర్వే నిర్వహిం చారు.దాని ప్రకారం.. మూడో తరగతి విద్యా ర్థులు..రెండో తరగతి పాఠాలను తప్పుల్లే కుండా చదవగలిగే వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు తేల్చారు.5,8వ తరగతి విద్యార్థులు కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. మ్యాథ్స్‌ లోనూ చాలా మంది విద్యార్థులు వెనుకబడిపోయా రని తేలింది. సక్రమంగా లెక్కలు చేసే స్టూడెంట్స్‌.. ప్రతి క్లాసులో చాలా తక్కువగా ఉన్నారు. 2012, 2014,2016లో నిర్వహించిన సర్వేలతో పోలిస్తే.. గతేడాది చేసిన సర్వేలో..విద్యార్థులఅభ్యసన ప్రమా ణాలు బాగా పడిపోయాయ్‌. ప్రతిరోజూ పాఠ శాలలకు హాజరైన వారి సంఖ్య కూడా 72 శాతమే. నాలుగో వంతు మంది విద్యార్థులు.. ఏదో ఒక కారణంతో..స్కూళ్లకు వెళ్లడం లేదు. అయితే.. హాజరుశాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇక..అతిచిన్న ఇంగ్లీష్‌ వాక్యాలను కూడా విద్యా ర్థులు చదవలేకపోతున్నట్లు సర్వేలో తేలిం ది.ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో..వేర్‌ ఈజ్‌ యువర్‌ హౌజ్‌,ఐ లైక్‌ టు ప్లే లాంటి వాక్యాలను చదివి.. అర్థం చెప్పలేని వారు 37శాతంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 14శాతం బడుల్లో తాగునీటి సౌకర్యం లేదని, 20 శాతం పాఠశాలల్లో సదుపాయం ఉన్నా తాగునీరు లేదని అసర్‌ నివేదిక తెలిపింది. పద్నాలుగున్నరశాతం పాఠశాల్లో మరుగుదొడ్లు ఉన్నా..అవి నిరుపయోగంగా ఉన్నా యని తెలిపింది.20శాతం పాఠశాలల్లో లైబ్రరీ లు లేవని, 76శాతం స్కూళ్లలో కంప్యూటర్లు లేవని.. 19 శాతం బడుల్లో పీఈటీలు లేరని అసర్‌ నివేదిక వివరించింది.
ఉపాధ్యాయులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా ?
విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ జాతీయ స్ధాయి కంటే మెరుగ్గా ఉన్నట్లు ఇటీవల విడుదలైన ‘అసర్‌ నివేదిక-2022’ తెలియజేసింది. పూర్వ ప్రాథమిక స్కూళ్లలో జాతీయ సగటుకు మించి ఎ.పిలో చిన్నారుల చేరిక వుండటం,బాలికల డ్రాపౌట్లు అతి తక్కువగా ఉండటం,ఆంగ్లం సామర్థ్యంలో జాతీయ సగటుకు మించి ఫలితాలుండడం మనం గమనించవచ్చు. జాతీయ సగటును మించి వున్నాం కదా అని సంతోషించేలోగా…ప్రైవేటు ట్యూషన్లకు డిమాండ్‌ పెరగడం కూడా నివేదికలో కన్పిస్తుంది. పైగా అభ్యసనా సామర్ధ్యం తీవ్రంగా ప్రభావిత మైందని ఈ నివేదిక తెలియజేసింది.కరోనా కార ణంగా దాదాపు రెండేళ్లపాటు పాఠశాలలు మూత పడడంతో అభ్యసనంలో గతంలో సాధించిన మెరుగుదల కూడా దెబ్బతిన్నట్టు నివేదిక పేర్కొంది. బాల బాలికల అభ్యసనా సామర్ధ్యం చదవడం లోనూ,గణితం(కూడిక, తీసివేత, గుణించడం, భాగించడం)లోనూ 2012 స్థాయికి దిగజారింది. కచ్చితంగా ఒకదశాబ్ద కాలంపాటు వెనక్కు పోయా మంటే కరోనా మహమ్మారి దెబ్బ తీవ్రత ఎంతలా వుందో విశదమవుతోంది. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు ఎన్ని అతిశయోక్తులు చెప్పినా, ఈ ప్రమా ణాలు,ప్రాతిపదికలు, గణాంకాలు శాస్త్రీయంగా, హేతుబద్దంగా ఆసమాజ స్థితిని నిర్ధారిస్తాయి. సమాజంలో విద్యారంగం ఎలా ఉందనేది అటు వంటి ప్రమాణాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌ లోనూ అభ్యసన సామర్ధ్యాలు 2012 సంవత్సరం స్ధాయికి పడిపోవడాన్ని నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వం మాత్రం వినూత్న పథకాలతో విద్యావిప్లవం వచ్చిందని గొప్పగా ప్రకటించడం మనం చూస్తున్నాం. విద్యా కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్‌ వివరాలను,విద్యా ర్థులకు అందజేసిన సంక్షేమ పథకాలను,వాటి వల్ల బడిలో చేరినపిల్లల గూర్చి,మన బడి,నాడు-నేడు పథకంతో పాఠశాలల కార్పొరేట్‌ రూపాన్ని… గణాంకాలతో సహా ఆర్భాటంగా చెప్తారు. కానీ ఉపాధ్యాయుల నియామకాల గురించి మాత్రం స్పందించరు. ప్రతి సంవత్సరం డియస్సీ నిర్వహిస్తా మన్న ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయరు. ఈ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు గడిచి పోయినా, ఇప్పటికీ మెగా డియస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారని ఎదురుచూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల భవిష్యత్తు గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. భారత పార్లమెంట్‌లో ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 50,277 టీచర్‌ పోస్టులు ఖాళీగా వున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యా యుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ కొత్తగా ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. పైగా ఉన్న ఉపాధ్యాయులనే సర్దుబాటుచేసి, జీవో 117,124 లను అనుసరించి పాఠశాలలను విలీనం చేసి పాఠశాలల సంఖ్యను కుదించడం వేగంగా జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ లో డియస్సీ నియామకాలు జరిగి సుమారు 5 సంవత్సరాలు అయ్యింది. 2018లో అప్పటి ప్రభు త్వం 7000 పోస్టులతో నిర్వహించింది. ఈ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత విలీనం పేరుతో పాఠశా లల కుదింపు,ఉపాధ్యాయ విద్యార్ధి నిష్పత్తిని పెంచడం ద్వారా ఉపాధ్యాయ పోస్టులను తగ్గిం చింది. గత ప్రభుత్వాల కాలంలో 1996,1998, 1999,2000,2001,2002,2003,2018 సంవత్సరాలలో వరుసగా డియస్సీలు నిర్వహించి లక్షా నలభై అయిదు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. అంటే ఇప్పుడు సర్వీసులో ఉన్న 70శాతం మంది ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో నియమింపబడినవారే. ఈ ప్రభుత్వ హయాంలో ఈ నాటికీ ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ కాలేదంటే వీరి చిత్తశుద్ధిని శంకించాల్సిందే. విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా అమ్మ ఒడి పథకం అమలు చేయడం, జగనన్న విద్యా కానుక పేరుతో ప్రతి విద్యార్ధికి మూడు జతల యూనిఫాం, స్కూలు బ్యాగ్‌,పాఠ్యపుస్తకాలతో పాటునోట్‌ పుస్తకాలు, బూట్లు,సాక్సులు,బెల్టు,ఇంగ్లీషుడిక్షనరీ,ఈ సంవత్స రం ఎనిమిదవ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇవ్వడం, జగనన్న గోరుముద్ద నిజంగా విద్యార్థుల పాలిట వరం లాంటివే. పాఠశాల రూపురేఖల్ని మార్చడం, అవసరమైన అన్ని మౌలిక వసతుల కల్పన నిజంగా మెచ్చుకోదగినవే. కానీ విద్య కోసం బడ్జెట్‌ కేటాయిం పులు చూస్తే మాత్రం ఎక్కడో వుంటాం.ఢల్లీి ప్రభు త్వం 2022-23 సంత్సరానికి తమబడ్జెట్‌లో 23. 50శాతం కేటాయించి ప్రథమస్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 12.70శాతం కేటా యించి 21వస్థానంలోఉంది.
బడ్జెట్‌ కేటాయింపుల పరంగా చూస్తే మన ప్రభుత్వం విద్యారంగానికి ఎంత తక్కువ కేటాయించిందో మనం గమనించవచ్చు. రూ. వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలకు తగిన సౌకర్యాలు కల్పించి నూతన హంగులు సమకూర్చి నప్పటికీ విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయులను నియమించకపోతే విద్యా నాణ్యత పెరిగేనా?విద్యా విప్లవం వచ్చేనా? కేంద్రం తీసు కొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం-2022ను దేశంలోనే అత్యుత్సాహంతో మొట్టమొదట అమలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.తరగతుల విలీ నంతో గ్రామగ్రామాన ప్రాథమిక పాఠశాలలు అల్లకల్లోలమయ్యాయి. ఒక కిలోమీటర్‌ పరిధిలో ఉన్న పాఠశాలలను విలీనం చేసిన ప్రభుత్వం, మళ్ళీ పది మందికన్నా తక్కువ విద్యార్థులున్న పాఠ శాలల విలీనానికి పూనుకున్నది.
వ్యాసకర్త : ఎ.పి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి-(జిఎన్‌వి సతీష్‌/ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌)