గిరిజన ఉద్యమాల దర్పణం

ఆదివాసీలు అంటే అడవుల్లో నివశించే శారీరకశక్తి వనరులు మాత్రమేకాదు. కృషి,త్యాగం,బలిదానం,మొదలైన పరోపకార బుద్ధి నిలయాలు, కూడా అని నేటి ఆధునిక నగరవాసులు గుర్తించాలి, అన్న లక్ష్యంతో పనిచేస్తున్న సంస్థ ‘‘వనవాసి కళ్యాణ పరిషత్‌’’ భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా ఆదివాసీ స్వాతంత్ర సమర యోధులు,సంస్కర్తలు,గురించి ప్రామాణిక సమాచారం అందించాలనే సత్సంకల్పంతో వెలువరించిన అపూర్వ పుస్తకం ‘తెలంగాణ – గిరిజన స్వాతంత్ర సమరయోధులు సంస్కర్తలు.’ దీని రచయిత డా:ద్యావనపల్లి సత్యనారాయణ, నిత్యం గిరిజన ఆవాసాల పర్యటనలు, అందుబాటులోని అన్ని భాషల గిరిజన సాహిత్యాలను ఆధ్యయనం చేసిన అనుభవం సారంతో,‘కొండ అద్దం ముందు కొంచమైనట్టు’ అన్న చందంగా ఈచిరు పుస్తకాన్ని పాఠక లోకానికి అందించారు రచయిత. ఈ పుస్తకం పరిధి కేవలం తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి పరిమితమైన, ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది. రచయిత తన ముందుమాటలో పేర్కొన్నట్టు ఈ చిరు సమాచారం ప్రామాణికంగా భావి తరాల విజ్ఞులకు,పరిశోధకులకు,ఎంతో ఉప యోగంగా ఉంటుంది.ఈ పుస్తకాన్ని ‘స్వాతంత్ర సమరయోధులు`సంస్కర్తలు’ అని రెండు భాగా లుగా విభజించి వ్రాశారు,అనుబంధంగా బీర్సా ముండా పోరాటం వివరణ ఇచ్చారు.ఈ విభ జన లోనే రచయిత పరిశో ధనా దృష్టి,పటిమ, కనిపిస్తున్నాయి. స్వాతం త్ర సమరయోధులు విభాగంలో రాంజీ గోండ్‌,కొమరం భీమ్‌,రౌంట కొండల్‌, కొమరం సూరు,వెడ్మ రాములను పేర్కొ న్నారు.సంస్కర్తలుగా సమ్మక్క, సేవాలాల్‌, పులాజిబాబా,హైమండార్ప్‌, ఎస్సార్‌ శంకరన్‌లను చెప్పడంలోనే రచయిత పారదర్శకత సుస్పష్ట మవుతుంది. ఇకవ్యాసాల తీరును పరిశీలిస్తే అనేక ప్రామాణిక విషయాలు అర్థమవుతాయి. తెలంగాణ గిరిజన పోరాట యోధులు అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ‘కొమ రంభీమ్‌,’కానీ అతనిలోని శక్తి సామర్థ్యాలు గుర్తించి ప్రోత్స హించి అతడిని అంతటి నాయకుడిని చేసింది అతని అనుచరుడు మొదటి నుంచి చివరి వరకు అతనితో కలిసి నడిచిన వాడు ‘రౌట్‌ కొండ’అని చాలా మందికి తెలియని సత్యం. ఉద్యమానికి నాయకుడు ఎంత అవసరమో! నాయకునికి అనుచరులు అంతే అవసరం !! అన్న నిండు నిజాన్ని రచయిత డా:సత్యనారాయణ ఎంతోచక్కగా విశ్లేషించి వివరిస్తూ నేటి తరానికి తెలియని నాటి గిరిజన సమర యోధుడు ‘‘రౌట కొండను’’ పరిచయం చేశారు. అదేవిధంగా కొమరం భీమ్‌ పోరాటంలో వార్త హరుడుగా సహకరించిన మరో యోధుడు కుమరం సూరు. జీవిత విశేషాలు, గెలిచిన పోరాటంలో అతని పాత్ర గురించిన వివరణ కూడా కూలంకషంగా వివరించారు మరో వ్యాసంలో.‘జోడే ఘాట్‌’పోరాటంలో విరోచిత పోరాటం చేసి అమరుడై అందరికీ తెలిసిన ‘‘భీమ్‌’’ పోరాటంలో సంపూర్ణ సహకారం అందిం చినవారు అనేకమంది ఉన్న అందులో అతనికి కుడి భుజంగా ‘‘కుమ్రం సూరు’’ తుడుం దెబ్బ మోగిస్తే, ఆయనకు ఎడమ భుజంగా ఉన్న ‘‘వెడ్వ రాము’’ తూత కొమ్ము ఊది చుట్టు పక్కల12గ్రామాల గిరిజనులను యుద్ధానికి సిద్ధం చేసేవాడు, అతని పరిచయం కూడా వ్యాస రచయిత ఇందులో పొందు పరిచారు. అలా ఆదిలాబాద్‌ కేంద్రంగా సాగిన ఆదివాసీ పోరాటం ద్వారా గిరిజనుల త్యాగం,వీరోచి తత్వాన్ని, ప్రపంచానికి చాటిన జోడేఘాట్‌ పోరాటయోధుడు,కొమరంభీమ్‌ కు సాయపడిన వ్యక్తుల సంక్షిప్త జీవిత చరిత్రల వ్యాసాలు ఇందులో పొందుపరచడం ద్వారా వ్యాస రచయిత సత్యనారాయణ గారి నిశిత పరిశీలన, పరిశోధనా పఠిమ,ప్రతిపాటకుడికి ఆవగతం అవుతాయి. ఇక ప్రధాన యోధుడు భీమ్‌కు సంబంధించిన ప్రథమ వ్యాసంలో జల్‌,జంగల్‌,జమీన్‌ల సాధనలో గిరిజనుల ఐకమత్య పోరాటం,నాయకుడు చేసిన కృషి, ఐక్యత యొక్క విలువ,చాటమే కాక వందల సంవత్సరాల క్రితం గిరిజనుల స్థితిగతులను కళ్ళకు కడుతుంది. భీమ్‌ వ్యాసంలో రచయిత వ్రాసిన ప్రతి వాక్యంలో ప్రామాణికత కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన ఘట్టాలకు సంబంధించిన విషయాలు అలాంటి సంఘ టనలు ప్రత్యక్షంగా చూసిన వారి అనుభవాలు, ప్రభుత్వం చూపిన అధికారులు లెక్కలు, అప్పటి పత్రికలో వచ్చిన వార్తలు సాయంగా రాయడం వల్ల సంపూర్ణ ప్రామాణికత కనిపిస్తుంది. జోడెన్‌ ఘాట్‌ గిరిజన పోరాటంలో అమరులైన వారి సంఖ్యలోగల సందిగ్ధత కూడా రచయిత సహేతుకంగా వివరించారు, అలాగే కుమ్రం భీమ్‌ మరణించిన రోజులోని వివాదం కూడా వివరించే ప్రయత్నం చేశారు,ఇక భీమ్‌కు ఆదర్శనీయుడు,భారత ప్రధమ గిరిజన స్వాతం త్య్ర సమరయోధుడు రాంజీ గోండు వీరోచిత త్వాన్ని వివరించిన తొలి వ్యాసంతో మొదలై, వెడ్మ రాముతో మొదటివిభాగ మైన సమరయో ధులు ముగుస్తుంది. ఇక రెండవ భాగంను గిరిజన సంస్కర్తలుగా పేర్కొని, ఇందులో మా’’నవ’’దేవతలు సమ్మక్క- సారక్కలు, సేవాలాల్‌,పులాజీ బాబా,హైమన్‌ డార్ప్‌, ఎస్‌.ఆర్‌,శంకరన్‌ల సేవా సంస్కరణలు వివరిం చారు.సమ్మక్క వంశ చరిత్ర, చారిత్రక విషయా లతో,పాటు సమ్మక్క వీరోచిత పోరాటం తది తర విషయాలతో, సమ్మక్కను చారిత్రక సంస్కర్త గా చిత్రిస్తు నాటి గాధలకు సాక్ష్యంగా నిలిచే నేటి గ్రామాలను ఆధారంగా చూపిస్తూ ఈ వ్యా సం కొనసాగించారు. లంబాడి సామాజిక వర్గ గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజించే ‘సేవ లాల్‌’ జన్మించింది అనంతపురం వద్ద గల గుత్తి,సమీప గ్రామం గొల్లలదొడ్డి,అయినా అతని సేవా తత్పరత ఎక్కువగా సాగింది తెలంగాణ ప్రాంతంలోనే, కనుక అతడిని తెలంగాణ గిరిజన జాతి సంస్కర్త గానే రచయిత పేర్కొన డం అతని సహృదయతకు చిహ్నం. విగ్రహారా ధన, జంతు బలి, మూఢనమ్మకాలకు, వ్యతిరేకి అయిన సేవాలాల్‌ లంబాడాలకు ఎలా ఆరాధనీ యుడు అయ్యాడో ఈ వ్యాసం వివరణఇచ్చింది. పూర్తి మాంసాహారులైన గిరిజనుల్లో శాఖాహార తత్వాన్ని అలవర్చిన గొప్ప శాఖాహార సంస్కర్త ‘‘పులాజి బాబా’’ అతని తపస్సు, ధ్యానం, వివ రాలు వెల్లడిరచడంతోపాటు అతడు గిరిజ నులను తన బోధనల ద్వారా తీర్చిదిద్దిన తీరు ఇందులో గమనించవచ్చు. ఇక గిరిజనుల జీవితాలకి వెలుగులు అద్ది వారి జీవితాలు విద్యా ఉద్యోగాలకు ఆర్థిక ఎదుగు దలకు సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేయడమే కాక ,అమలుకు కృషి చేసిన ఆదివాసులు ఆత్మబం ధువు ‘‘హైమన్‌ డార్ప్‌’’ కృషి గురించిన వ్యాసం. గిరిజన వికాసానికి పాటుపడే వారందరికీ ఉపయుక్తం.అడవి బిడ్డల సంక్షేమానికి పర్యాయ పదంగా నిలిచే మరో ఐ.ఏ.ఎస్‌ అధికారి ఎస్‌.ఆర్‌. శంకర్‌,కృషిని వివరించే వ్యాసం కూడా ఇందులో చదవవచ్చు. అనుబంధంగా ‘‘బిర్సా ముండా’’ పోరాటం గురించిన వ్యాసం లో అతని జీవితం,కృషి,సూక్ష్మంలో మోక్షంగా సరళంగా, సూటిగా,వివరించబడిరది, కేవలం వ్యాసాలే గాక ఆయా యోధుల, సంస్కర్తల, ఫోటోలు కూడా ఈ పుస్తకానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి, తెలంగాణ ప్రాంత గిరిజన సమరయోధులు, సంస్కర్తలపై భావి తరంలో జరగాల్సిన సంపూర్ణ పరిశోధనలకు ఈచిరు పుస్తకం చక్కని దారి దీపం కాగలదు. – డా. అమ్మిన శ్రీనివాసరాజు (సెల్‌ : 7729883223)