ఓటు విలువ తెలుసుకో..!

దేశవ్యాప్తంగా జరగనున్న ఈసార్వత్రిక ఎన్నికలు`2019చర్చినీయాంశంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా డబ్బుకు, ఇతర ప్రలోభాలకు లోబడి ఓటు వేసే పరిస్థితులు దాపురించాయి. సోషల్‌ మీడియా హవ్వా కూడా ఓటరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ ఎన్నికలు నాటికీ నేటికీ భిన్నంగా కన్పిస్తున్నాయి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చఉన్న చోట ఇవేచర్చలు. ప్రస్తుతం17వ సారి లోకసభ, 14వ సారి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పట్లో ఓటరు స్వచ్చంధంగా వచ్చి స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకొనేవారు. ఆ పరిస్థితులకు విరుద్దంగా మారింది. దేశవ్యాప్తంగా రాజకీయం ఒక వ్యాపార సంస్థగా మారిపోయింది. నేడు కులం, డబ్బు, మాత్రమే ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయాలు చాలా నీచమైన స్థాయి లోకి దిగజారిపోయాయి. ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టగల వ్యక్తులను మాత్రమే పార్టీ అభ్యర్ధులుగా బరిలో దిగారు. అవినీతి కూడా కొలమానంలో లేదు. సామాన్యుడితో ఐదునిమిషాలు ముచ్చటించి ఓటు అడిగే రోజులు పోయాయి. సమాజంలో విలువలకు, విశ్వసనీయత లేని రాజకీయ వ్యవస్థగా మారుతోంది. అంతా ప్రలోభాలు, డబ్బుమయంగా మారింది. అన్యాయాన్ని ఎదురించడానికి, అవినీతిని పారదోలడానికి మనిషి సృష్టించిన బలమైన ఆయుధమే ఓటునే విషయాన్ని విస్మరించి అమ్ముడుపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి.
ఐదేళ్లకు ఒక్కసారివచ్చి, మన జీవితాలను, తలరాతను మార్చేది ఎన్నికలు. మనం వేసే ఓటుతోనే నవసమాజం నిర్మితమౌతుంది. అందుక నుగుణంగా ఓటు అవశ్యకత, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్ర గురించి యువ ఓటర్లను చైతన్యం చేయాలి. ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ప్రజలే పరిపాలకులు. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడ నిర్ణయిస్తాయి. కానీ మన దేశంలో ఎన్నికల పరిస్థితి దారుణంగా ఉంది. ఎన్నికల సమయంలో దేశం మొత్తంలో 60శాతం పోలింగ్‌ కూడా నమోదు కావడం లేదు. 125కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సమారు 100 కోట్ల మంది ఓటర్లు ఉంటే, కేవలం 50కోట్ల లోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకొనేలా ప్రతి పౌరున్ని మేల్కోల్పాలి. ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వ పెద్దలు ఈ బాధ్యతను నిర్వర్తించాలి. అప్పుడే మనదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. ప్రస్తుత ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. బ్యాలెట్‌ పోయి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు(ఈవీఎం) వచ్చాయి ఈవీఎంలపై అపోహలను తొలగించడం, వినియోగంపై ప్రజలకు అవగాహన అవసరం. ఈవీఎం పనితీరు, వీవీ ప్యాట్‌, ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై ఓటర్లను చైతన్యం చేయాలి.
ఇకపోతే ఈ ఎన్నికల్లో ఫోకస్‌ అంతా సోషల్‌ మీడియాదే హవ్వా. ఇప్పుడంతా యాప్‌ ఏజ్‌. సోషల్‌ మీడియాదే హవా. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఇలాంటి ఆన్‌లైన్‌ సైట్లు అన్నీ ఓటరు ఆకర్షక వేదికలుగా మారాయి. ఒకప్పుడు ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావానికి లోను చేసిన వాటిల్లో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియా పాత్ర మాత్రం ఎనలేని ఆదరణ చూరగొన్నది. ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు.. తమ ఎన్నికల ఎజెండాను, ప్రణాళికలను..ఇలా అన్నిఅంశాలను సోషల్‌ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఆయుధాలుగా మారాయి. అవి ఓటర్లను ఆకర్షించే శక్తులుగా ఎదిగాయి. గూగుల్‌, ఫేస్‌బుక్‌ కూడా పొలిటికల్‌ యాడ్స్‌ను మానిటర్‌ చేయాలని ఆదేశించింది. కానీ చాలా సున్నితంగా మారిన సోషల్‌ మీడియా..లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నది.
మరో విషయం..ఈఎన్నికలు బడుగు బలహీనవర్గాల ప్రజలకు ఉపాధి కల్పనగా మారింది. ఎన్నికల ప్రచారానికి తరలించేందుకు ఒక మహిళరోజులో అరపూట జెండా పట్టుకొని తిరిగేందుకు రోజుకు రూ.300 నుంచి రూ.500 వరకు ఆయా రాజకీయ పార్టీలు చెల్లిస్తున్నారు. ఇలా పూటగడవని నిరుపేదలు పది రోజుల పాటు ఉపాధి కల్గడం హర్షనీయమే. ఇకఆటోవాలా రోజుకు రూ.3వేల నుంచి ఐదువేల రూపాయలు సంపాదించుకొవడానికి ఎన్నికలు వరంగా మారాయి. అయితే ఈ పద్దతి ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తోందో అనేది ప్రజలు అర్ధం చేసుకోవాలి. సమాజంలో డబ్బే ప్రామాణికంగా తీసుకోవడం భావ్యమా? అలాగైతే భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడుకోగలమనేది ప్రశ్నించుకోవాల్సిన అవశ్యకత ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటునేది ఓఆయుధం. ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు బాధ్యతగా ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటును వినియోగించుకుని మంచి ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి. భవిష్యత్తులో భావితరాలకు ఈవ్యవస్థను సరిదిద్దాలి. రాజకీయ వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. నవతరాన్ని ప్రోత్సహించాలి. రాజకీయ కురువృద్దుల స్థానంలో యువతరానికి చోటనివ్వాలి. అప్పుడే రాజకీయ వ్యవస్థ పెఢరిల్లుతోంది. వ్యక్తి అస్థిత్వాన్ని గుర్తించి వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. మంచి నాయకత్వం లేకుండా మంచి సమాజం ఏర్పడదు. రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా.. సాంఫీుక, ఆర్ధిక, సమానత్వాన్ని సాధించాన్నా, భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే యువతరాన్ని ప్రొత్సహించి వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది!- రెబ్బాప్ర‌గ‌డ ర‌వి,ఎడ‌టిర్