ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు-2022-2023


సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీలో ఆంధ్రప్రదేశ్‌ గణనీయమైన పురోగతి సాధించి టాప్‌ -5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 2018లో కేవలం 64 పాయింట్లను మాత్రమే సాధించిన ఏపీ తాజాగా 72 స్కోర్‌ పాయింట్లను పొందడం, అగ్రశ్రేణి కోవలో నిలవడం, పలు అంశాల్లో టాప్‌ స్కోర్లను దక్కించుకోవడం రాష్ట్రం సత్తాను, అభివృద్ధి పథంలో పరుగులను రుజువు చేస్తోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 75 శాతం స్కోర్‌తో కేరళ మొదటి స్థానంలో నిలవగా 74 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. 72 శాతం స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. మూడో విడత ఎస్డీజీ సూచీ నివేదికను నీతిఆయోగ్‌ గురువారం ఢల్లీిలో ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగింపు, జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ఇతోధికంగా దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్‌ ప్రశంసించింది.
పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా..
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవర త్నాలు పేదరిక నిర్మూలనతో పాటు ఆహార భద్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్‌ ప్రశంసించింది. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా అవతరించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా అడుగులు వేస్తోందని నివేదికలో పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిదైన పేదరిక నిర్మూలనలో ఆంధప్రదేశ్‌ 81 శాతం స్కోర్‌ సాధించి అగ్రగామి ఐదు రాష్ట్రాల సరసన నిలిచింది. ఆరోగ్యం,సంక్షేమంలో రాష్ట్రం 77శాతం స్కోర్‌ సాధించింది. అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తూ అసమానతలను రూపు మాపుతున్నారని నీతి అయోగ్‌ ప్రశంసిం చింది. పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వంలో రాష్ట్రం 58 శాతం స్కోర్‌తో అగ్రగామి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అసమానతలు రూపుమాపడంలో 74 శాతం స్కోర్‌తో దూసుకెళ్తోంది.ఏపీలో 2020లో వృద్ధి కనిపించిన ఇండికేటర్లు ఆకలి లేని స్థాయి లక్ష్యంలోని ‘వ్యవసాయ రంగంలో స్థూల అదనపు విలువ’లో పెరుగుదల నమోదు చేసుకుంది. ఆరోగ్యం, సంక్షేమం ఇండికేటర్‌లో ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు తగ్గుదల, హెచ్‌ఐవీ కేసుల సంఖ్య తగ్గుదల నమోదైంది. ప్రతి పది వేల జనాభాకు వైద్య సిబ్బంది పెరుగుదలలో వృద్ధి కనిపించింది. లింగ సమానత్వం కేటగిరీలో మహిళలపై నేరాల సంఖ్య ఇండికేటర్‌లో తగ్గుదల నమోదైంది. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం పెరిగింది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరా పెరిగింది. హత్యలు, వివిధ రకాల కేసుల సంఖ్య తగ్గింది.
సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌లో అగ్రగామి..
2019 డిసెంబరు 30న ఆవిష్కరించిన ఎస్డీజీ సూచీలో ఆంధ్రప్రదేశ్‌ 67 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 2018 మొదటి ఎస్డీజీ సూచీలో 64 పాయింట్ల స్కోరుతో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా మూడో విడత సూచీలో చౌక, సురక్షిత ఇంధన శక్తిలో వందకు వంద పాయింట్లు సాధించి టాప్‌లో నిలవడం గమనార్హం. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో అగ్రగామిగా నిలిచింది.
అత్యున్నత ప్రమాణాలతో విద్య.. నాణ్యమైన వైద్యం
అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేస్తోందని నీతి అయోగ్‌ వెల్లడిరచింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు -నేడు ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చి దిద్దారు. ఆరోగ్యశ్రీతోపాటు ప్రభుత్వ ఆసుపత్రు లను అభివృద్ధి చేయడం, వైద్య సిబ్బందిని భారీ ఎత్తున నియమించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని.. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడమే అందుకు తార్కాణమని పేర్కొంది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ.. సుపరిపాలన ద్వారా ప్రజలకు సామాజిక భద్రత చేకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబర్చుతోందని విశ్లేషిం చింది. 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన వైపుగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని పేర్కొంది.
పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానం.. నీతి ఆయోగ్‌ ఎస్టీజీ నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానంలో కొనసాగు తోందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. 2022-23 సంవత్సరపు వార్షిక బడ్జెట్‌ ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన.. విద్యా, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నాడు-నేడుతో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి విద్య, ఆరోగ్యాన్ని అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. అంతే కాకుండా 99.5 శాతం కాన్పులు స్థానికంగానే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని వంద శాతం కుటుంబాలకు విద్యుత్‌ అందు తోందన్నారు మంత్రి. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి గానూ 2,56,257కోట్లు రూపా యలతో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,08,261 కోట్లు, మూలధన వ్యయం అంచనా 47,996 కోట్లు, 2022-23 సంవత్సరంలో రెవెన్యూ లోటు 17,036 కోట్లు, ద్రవ్య లోటు 48,724కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్రి జీఎస్డీపీ లో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్య లోటు 3.64శాతంగా ఉండవచ్చని తెలి పారు. గత మూడు సంవత్సరాలలో ప్రభుత్వం నవరత్నాలు, ఇతర మేనిఫెస్టో పథకాల ద్వారా రాష్ట్రంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతేగాక ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి, సంస్థాగత బలోపేతం, సామాజిక చేరకల వల్ల అన్ని ఏస్జీజీలలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్ధానం దిశగా పయనిస్తోంది. అంతకు ముందు వార్షిక బడ్జెట్‌కు సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. శాసనసభలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, మండలిలో మంత్రి సీదిరి అప్పల రాజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. శాసనసభ లో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్న బాబు, మండలిలో వేణుగోపాలకృష్ణ ప్రవేశపెడ తారు. కేబినెట్‌ భేటీకి ముందుఆర్థిక మంత్రి ఛాంబర్‌లో బడ్జెట్‌ ప్రతులకు మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కల్తిసారా మరణాల,పెగాసెస్‌ల పై దద్దరిల్లిన అసెంబ్లీ
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై మూడోరోజు శాసనమండలి దద్దరిల్లింది. శాసనసభను తప్పుదోవ పట్టించేలా అసత్యాలు చెప్పిన సీఎంపై సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనీ, దీనిపై ప్రవేశపెట్టిన వాయిదా తీర్మాణం చర్చకు అనుమతించాలని ప్రతిక్ష నేతలు పట్టుపట్టడంతో సభ సంభించింది. అలాగే పెగాసస్‌పై అసెంబ్లీ భగ్గుమంది. ఇప్పటికే దేశమంతా మార్మోగినన ఈఘటనపై అసెంబ్లీలో అధికార పార్టీనేతలు ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. పెగాసస్‌ స్పైవేర్‌తోపాటు వివిధ రకాలుగా నిఘా పెట్టారని అసంబ్లీ వ్యవహా రాలశాఖ మంత్రి బుగ్గన విమర్శించారు.
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు తమ ప్రాధాన్యత కోల్పోతున్నాయి. కేంద్ర బడ్జెట్‌ విషయంలోనూ ఇది స్పష్టంగా కనిపించింది. రాష్ట్రం కూడా అదే బాటలో నడుస్తున్నది. బడ్జెట్‌ అంటే కేవలం జమాఖర్చుల చిట్టా మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాలు, ప్రజాసంక్షేమం,అభివృద్ధి ప్రాధాన్యతలు ఇందులో ప్రతిబింబిస్తాయి. అభివృద్ధి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. ఈ రంగా న్ని బడా కార్పొరేట్‌ సంస్థలకు వదిలేసింది. వారికి కావలసిన సదుపాయాలు, ప్రోత్సాహం ఇవ్వడం ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరిం చింది. దానికే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని పేరు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో పోటీ పడడానికి ప్రోత్సా హకాలను ఇస్తున్నది. మరోవైపు అభివృద్ధికి మూలాధారంగా ఉన్న ప్రణాళికా సంఘాన్ని కేంద్రం రద్దు చేసింది. కార్పొరేట్‌ బోర్డుల తరహాలో నీతి అయోగ్‌ను నియమించింది. గతంలో ప్రభుత్వ రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌,విశాఖ, బెంగుళూరు లాంటి నగరాలు ప్రభుత్వ రంగం పునాదిగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు నగరాల నిర్మాణాన్ని కూడా ప్రైవేటు రంగానికి వదిలేశారు. రియల్‌ ఎస్టేటే పట్టణాల అభివృ ద్ధిని శాసిస్తోంది. అందువల్ల బడ్జెట్‌లో అభివృద్ధి నిధులు క్రమంగా తగ్గిపోయి నిర్వహణా వ్యయా లు మాత్రమే మిగులు తున్నాయి. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు చివరిదాకా అలాగే ఉంటాయని గ్యారెంటీ కూడా లేదు. రివైజ్డ్‌ బడ్జెట్‌ పేరుతో అన్నీ తలక్రిందులవుతుంటాయి. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా నిధుల కేటాయింపులు అధికారంలో ఉన్న పార్టీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి జరుగుతున్నాయి. ఇది పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థను బలహీనపరిచే పరిణామం. ఈ బడ్జెట్‌తోనైనా ఈ ఒరవడికి స్వస్తి చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున గవర్నర్‌ ప్రసంగం పాలక పార్టీ ఆలోచనలకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పథకాల చిట్టాను ఆయన చదివేశారు. సంక్షేమ పథకాలతో ప్రజలు బ్రహ్మాండంగా జీవిస్తున్నారని, సంతృప్తికరంగా ఉన్నారని పాలక పార్టీ భ్రమల్లో ఉంది. అందువల్లే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను గాలికి వదిలేసింది. సంక్షేమ పథకాల నిర్వహణకు అదనపు ఆదాయాలను సమకూర్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదాయ కోటాలను ఇచ్చింది. డబ్బులు రాబట్టడానికి వారు ప్రజల మెడపై కత్తి పెట్టి వసూలు చేయాలని చెబుతోంది. ఈ మధ్యకాలంలో సంక్షేమ పథకాలతోపాటు ప్రజల నుండి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ‘’ప్రభుత్వ ధనార్జన స్కీము’’లను కూడా ప్రవేశపెట్టింది.– జె.వి.శ్రీనివాసరావు