ఎవ‌రి క‌న్న బిడ్డ‌రా..ఎక్కి ఎక్కి ఏడ్చింది!

ఇట్లొచ్చిండ్రు, అట్ల బొయిండ్రు.. రెండొందలు సంపాదించిండ్రు.. ‘కూలోన్ని మేపేటందుకే ఉంది ఈ పథకం. కూలోడు ఒక్కడన్నా మాట ఇంటుండా! మన చుట్టూ కూలోడు తిరగుతలేడు! మనమే కూలోడి చుట్టూ తిరుగుతున్నం!’ ‘అసలెందుకు ఈ చట్టం? పీకి పారెయ్యక!’ పాపం! తమ కష్టాల‌కీ, నష్టాల‌కీ అసు కారకులెవరో తొసుకోలేని రైతు సోదయి గ్రామీణ ధనిక వర్గానికి తోడై వెళ్ళగక్కే ఆక్రోశాలు ఇవి. ‘’ఎక్కడ గిట్టుబాటవుతుందండీ కూలి! ఎండా కాం టాంకర్లలో నీళ్ళు తీసుకుపోయి తడిపితేగాని గడ్డపార దిగడం లేదు. ఊరికి ఆమడ దూరంలో చెరువులోకి నడిచిపోయేసరికి సగం ఓపిక సచ్చిపోద్ది. ఇంకోపని దొరక్క కరువు పనిలో కుదురుకున్నాం.’’ ఇదీ కూలీ ఘోష. ఏది వాస్తవం! ఏది అపవాదు! మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం… అనేక పోరాటా తరువాత ఈ చట్టం మెగు చూసింది. ‘పనైనా చూపాలి! తిండైనా పెట్టాలి!’ ఈ నినాదం ఎన్ని సభు, సమావేశాల్లో మరెన్ని ప్రదర్శనల్లో మార్మోగిందో లెక్కించలేం.. ఈ పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణ ఫలితమే ఈ ఉపాధి హామీ చట్టం. ఇదేదో యూపీఏ ప్రభుత్వం అప్పనంగా చేతిలో పెట్టిన పథకం అనుకుంటే పొరపాటే. అయితే గడచిన కాంలో పథకం అము ఎలా ఉంది. చూద్దాం…
‘కరువు పనలు’ అని జనం నోళ్ళలో నానే ‘ఉపాధి పనలు’ మండు వేసవిలోనే జరుగుతాయి. ఉన్న మారాజు ఏసీలు, కూల‌ర్లు, అధమం ఫ్యాను పెట్టుకొని సేద తీరే రోజుల్లో… గ్రామీణ శ్రామికులు పని కోసం వెంపర్లాడుతూ… పుగు, పారా, తట్ట చేత పట్టుకొని, దాహార్తికి ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీళ్ళు పట్టుకొని బయల్దేరతారు. అదే ఆడవాళ్ళయితే ఉదయాన్నే ఇంటెడు చాకిరీ చేసుకొని ఊరికి ఆమడ దూరంలో ఉన్న చెరువు, కుంటు, క్వాల్లో మట్టి తవ్వి కట్టు పోయడానికి బయల్దేరతారు.


ఈ కార్మికలు ప్రధాన సమస్య వేతనం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రెండు తొగు రాష్ట్ర ప్రభుత్వాు ఉపాధి హామీ పనుకు రూ.237గా రోజు వేతనం నిర్ణయించాయి. అది కూడా 8గంటు పని దినం, ఎండాకాం అత్యధిక కేరీు, ఒంట్లో శక్తి ఖర్చయ్యే శారీరక శ్రమకు ఇవే ప్రభుత్వాు వ్యవసాయ కార్మికు వేతనాు నిర్ణయించేటప్పుడు దుక్కి దున్నడానికి 5గంటు పని దినంగాను, ఇతర వ్యవసాయ పనుకు 6గంటు పని దినంగాను నిర్ణయించాయి. గతంలో మహిళా కార్మికు నాట్లు, కోత పనుకు ఉదయం 9-10 గంట మధ్య పోయి సాయంత్రం 5గంటకు తిరిగి వచ్చేవారు. శారీరక శ్రమతో కూడిన కరువు పను చేసి బతకడం తప్ప వేరే మార్గంలేని గ్రామీణ పేద ఆరోగ్య పరిస్థితి, దేహదారుఢ్యం, ఒంట్లో సత్తువ ఇవి ఏ కొంచెమైనా అధినేత, అధికార్ల మెదళ్ళలో ఉన్నాయో లేదో తెలియదు. ఉపాధి పనుకు 8గంటు పనిదినం నిర్ణయించేశారు. నిర్ణయం చేసే ముందు ఏ ఒక్క అధికారి, అధినేత అయినా శ్రామికుడు, శ్రామికురాలితో చర్చించారా! అది జరగని పని కదా! అసు చర్చించాని అనుకోవడమే మన వెర్రిబాగుతనమేమో! ఓట్ల కోసం జనం దగ్గరికి పోయే నాయకు, జనానికి సంబంధించిన నిర్ణయాు చేసేటప్పుడు ఎందుకు జనం దగ్గరికి పోరో?
రోజు వేతనం మరీ అన్యాయంగా నిర్ణయించారు. నైపుణ్యంలేని కార్మికుకు జిల్లా కలెక్టరు రోజు వేతనం నిర్ణయిస్తారు. ఆ లెక్కన విశాఖపట్నంజిల్లాలో రూ.439 నిర్ణయించారు. ప్రతి జిల్లాలో అలాగే ఉంటుంది. కానీ ఉపాధి పథకం కార్మికుకు రెండు తొగు రాష్ట్రాల్లో రూ.237 నిర్ణయించారు. ఇదేనా పేదను ఉద్ధరించే తీరు. ఈ పథకం ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనయి, నీటి వనయి పెరిగాయని అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కూడా. చెరువు, పశువు కుంటు, పంట కాుమ, చెక్‌ డ్యామ్‌ు, పొలా మధ్య బోదు, మురుగు క్వాల్లో పూడికతీత వంటి పను వ్ల నీటి వనయి పెరుగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో ట్రెంచీు తవ్వి నీటి వనరు భ్యత పెంచుతున్నారు. సామాజిక అడవు పెంపకం ఒక ముఖ్యమైన పని. తెంగాణ, రాయసీమ జిల్లాల్లో రైతు పొలాల్లో కంప చెట్లు కొట్టి మొదళ్ళతో సహా తవ్వి పారేస్తున్నారు. పడావుగా ఉన్న రైతు భూము సాగులోకి వచ్చి పత్తి వంటి వ్యాపార పంటు పండిస్తున్నారు. రైతు భూము మివ పెరిగింది. ఎంత చేసినా ఉపాధి పథకానికి కేటాయించిన డబ్బు ‘పే పిండి చందమే’. ప్రజాధనం వధా చెయ్యడమే అని గగ్గోు ఎందుకు? కుక్కని చంపాంటే అది పిచ్చిదని ముద్ర వెయ్యాలి. కాబట్టి జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన వేతనం రూ.439 కన్నా దిగ్గోసి అందులో దాదాపు సగం వేతనం రూ.237 నిర్ణయించి, ఇక చాల్లే! నోరుమూసుకుని పని చెయ్యండి అన్న సంకేతాలి స్తున్నారు. పోనీ అదయినా అమవుతోందా! చూద్దాం!
డి.వెంకటక్ష్మి అనంతపురం జిల్లా రెడ్డిపల్లి గ్రామవాసి. ఆమె పేస్లిప్పు ప్రకారం 6రోజు పని చేసింది. ఆరు రోజుకు రూ.428 వేతనం ఇచ్చారు. పేస్లిప్పులో ‘పని చేసిన దినము -6’ అని… మర కింద…’ పని దినము -2’ అని రాశారు. పని చేసిన దినము అంటే ఏంటి? పని దినము అంటే ఏంటి? అధికార్లనడిగితే వచ్చిన జవాబు ఏమంటే ‘’క్యూబిక్‌ మీటరుకు రూ.237 ఇస్తాం. క్యూబిక్‌ మీటరు ఒక్క రోజులో తవ్వుతారా…10 రోజుల్లో తవ్వుతారా అనేది కూలీ ఇష్టం. మీరు ఎన్ని రోజు పని చేసినా క్యూబిక్‌ మీటరు రూ.237 లెక్కన మాత్రమే ఇస్తాం. అంటే ఒక క్యూబిక్‌ మీటరు తవ్వకానికి మూడు రోజు శ్రమ అవసరమయితే, ఈ మూడు రోజుకు కలిపి రూ.237 మాత్రమే ఇస్తాం’’ ఇది అధికార్ల జవాబు. మరి ఆ లెక్కన రోజుకు రూ.80 కూడా గిట్టుబాటు కాదు కదా! అన్న మన ప్రశ్నకు మనమే జవాబు చెప్పుకోవాలి. అది అధికార్లకు, ప్రభుత్వానికి సంబంధంలేని వ్యవహారం అని మనం అనుకోవాలి. మర వెంకటక్ష్మి విషయానికి వద్దాం. ఆమె ‘పేస్లిప్పు’ ప్రకారం 6రోజు పనికి రూ.428 ఇచ్చారు. ఆదివారం శెవుదినంతో కుపుకుంటే 7రోజు పనికి గాను రూ.428. ఒక్క రోజు పనికి అక్షరాలా రూ.61.14 పైసు. బోధపడిరది కదా! రోజుకు రూ.60, రూ.70 కూలి పడుతోందని ఉపాధి కార్మికు మొత్తుకోడానికి గ కారణాలివి.
ఇప్పటి ప్రభుత్వం వారి లెక్కకే వద్దాం. వెంకటక్ష్మికి పని చేసిన దినము ‘6’ అయినా క్యూబిక్‌ మీటర్ల లెక్కన పని దినము ‘2’ అని లెక్కగట్టి రూ.428 చేతిలో పెట్టారు. అంటే ప్రభుత్వం వారి లెక్కన రూ.214 రోజు వేతనం చెల్లించారు. మరి ప్రకటించిన రూ.237 కూడ ఎందుకు ఇవ్వలేదు? మరో ఉదాహరణ. తోక క్ష్మి జాబ్‌ కార్డు ప్రకారం 45రోజు పని చేసిన దినాకు మొత్తం రూ.6,918 వేతనం ముట్టింది. 45రోజుతో భాగిస్తే రోజు కూలి రూ.153.73 పైసు. తోక భాస్కర్‌ జాబ్‌ కార్డ్‌ ప్రకారం 34రోజు పనికి రూ.5,149 ముట్టింది. అంటే ఒక్క రోజు వేతనం రూ.151.44 పైసు. ఇక్కడ ఆదివారం వేతనంలో కూడిన సెవు దినంగా ప్రకటించి లెక్కిస్తే వేతనం ఇంకా తగ్గిపోతుంది. తెంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్‌ ప్రకారమే ప్రభుత్వం చెల్లించిన వేతనం రూ.169.30
ఇప్పుడాలోచించి చెప్పండి ? ఇట్టెల్లి, అట్టొచ్చి రూ.200 తెచ్చుకునేది నిజమా? గ్రామీణ పేద పట్ల ఎందుకీ అపవాదు. ఎందుకీ కక్ష. సోషల్‌ ఆడిట్టు మరో ‘సిత్రం’. చెరువు, కుంటు వగైరా మట్టి పని చేసిన సంవత్సరానికి గాని సోషల్‌ ఆడిట్‌ బందం పరిశీలించదు. ఫలితంగా రెండు నష్టాు ఉన్నాయి. వేసవిలో తవ్వకం పని పూర్తయితే జూలై నుంచి పడే వర్షా వ్ల వర్షపు నీళ్ళకు కొట్టుకు వచ్చిన మట్టి చేరుతుంది కదా! మరి చేసిన పను అంచనా ఎలా కడతారు? కాబట్టి టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు తాము ఎక్కడ సోషల్‌ ఆడిట్‌ అధికార్ల ఆగ్రహాకు గురువుతామోనని భావించి ఉపాధి కార్మికుతో అదనంగా పని చేయిస్తారు. కార్మికు శ్రమకు మివలేదు కదా! తిలాపాపం తలా పిడికెడు అంటే ఇదే. రెండవ నష్టం పని దినాు. సోషల్‌ ఆడిట్‌ బృందం ఫ్డీు తనిఖీ చేసే వరకు మరలా ఆ పని చేపట్టడానికి లేదు. గ్రామంలో సరాసరి 45రోజు కన్న ఎక్కువ పని కల్పించలేదు. మిగిలిన 155రోజుకు నిరుద్యోగ భృతి ఇచ్చారా అంటే అదీ లేదు. పథకం అములో కీకపాత్ర పోషించే మేట్ల వ్యవస్థను తెంగాణ ప్రభుత్వం మొత్తానికే తొక్కిపెట్టింది. మొత్తం కార్మికులో సామాజిక పొందిక చూస్తే…దళితు, గిరిజను 40శాతం, మహిళు 59శాతం ఉన్నారు. అనగా జనాభాలో దళితు, గిరిజను, మహిళ శాతం కన్నా ఉపాధి కార్మికుల్లో వారి సంఖ్య ఎక్కువ ఉంది. సమాజంలో వెనక్కి నెట్టివేయబడ్డ వర్గాలే ఉపాధి కార్మికుల్లో అత్యధికుండగా వారి ఉద్ధరణ పేరుతో అటు ప్రభుత్వం మరోసారి మోసగిస్తోంది. ఇటు సమాజం మరోసారి తన అక్కసు వెళ్ళగక్కుతోంది. గ్రామీణ శ్రామికును సంఘటితం చేసే సంఘాకు కొదవ లేదు. అయినా ఉపాధి హామీ కార్మికు గతి ఇలా ఉంది. కారణం వారు అట్టడుగు భాగంలో ఉండి గొంతు మూగబోయిన గ్రామీణ పేదు కావడమే. ‘’ఎవరుకన్న బిడ్డరా! ఎక్కిఎక్కి ఏడ్చింది’’ అన్నట్టయింది వారి పరిస్థితి.
(వ్యాసకర్త – ఎస్.పుణ్య‌వ‌తి, ‘ఐద్వా’ జాతీయ కోశాధికారి, నవతెంగాణ సౌజన్యంతో)