ఉపాధి హక్కుల లక్ష్యంగా మహిళా ఉద్యమం

పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినెక్కాయి. పనులు, ఉద్యోగాలు కాపాడబడాలంటే విద్య, వైద్యం, పరిశ్రమలు, రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి. ఉద్యోగం, ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి. ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులు పెంచాలి. వారికి వేతనాలు పెంచడమే కాదు, 100 రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధి చట్టం రావాలి.
ధరల మోతతో,ఇంటా బయటా సాగు తున్న హింసతో బతకడమే సవాలుగామారిన నేప థ్యంలో రాష్ట్ర మహిళల వేదనకు ప్రతిబింబంగా నెల్లూరులో రాష్ట్ర మహిళా వజ్రోత్సవ మహాసభలు జరిగాయి.ఐద్వా15వ రాష్ట్ర మహాసభలు జయ ప్రదంగా జరిగాయి. హింస నుండి,దోపిడి నుండి, భద్రతతో,గౌరవంగాజీవించే హక్కు అమలు,ఉపాధి లక్ష్యాలుగా మహాసభ పిలుపునిచ్చింది.ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలను,కష్టజీవులను అందులోనూ మహి ళలను నిలువు దోపిడీ చేస్తున్నాయి. మద్యం మహ మ్మారి మను షులను రాక్షసులను చేస్తుంది. బిడ్డలు మృగాలుగా మారి తల్లిదండ్రులను చంపుతున్న ఘోరా లను చూస్తున్నాము. మహిళల నిస్సహాయ తను ఆసరా చేసుకుని అత్యాచారాలు పెరుగుతు న్నాయి.వ్యాపార లాభాపేక్షతో విశ్రాంతి లేని జీవితా లు.రిక్రియేషన్‌ పేరిట బూతు.పనిచేసేచోట ఉద్యో గినులపై,పాఠశాలల్లో విద్యార్థినులపై ఎందెందు వెదికినా వేధిం పులే! మరి మార్గం ఏమిటి? ఈ దుస్థితికి కారణం ప్రభుత్వవిధానాలే! వీటిని ప్రశ్నిం చాలి! ప్రతిపక్ష పాలక పార్టీలుకూడా మహిళలపై హింసను నివా రించటానికి, అరికట్టడానికి ఏం చేస్తాయో నిలదీ యాల్సిందే! ఇందుకోసం నవం బరు 25నుండి డిసెంబరు 10వరకు సాగే హింసా వ్యతిరేక పక్షోత్సవం ప్రచారంగా మాత్రమేగాక కర్ర సాము,కరాటేలాంటి ఆత్మరక్షణ శిబిరాల నిర్వ హణకు పూనుకోవాలి.ఉన్నఉద్యోగాలు పోవడం,పని దొరకక పోవడం, అన్ని ఖర్చులు పెరగడం…ఇంటి పనికి పరిమితమైన మహిళలనుకూడా వీధుల్లోకి తెచ్చిం ది.పనులు దొరక్క గంటల కూలీకి పచారీ షాపుల్లోనో మరోచోటో వెతుక్కుంటున్నారు. సుదూర ప్రాంతాలకు మాత్రమే కాదు,దేశ దేశాలకు ప్రయాణి స్తున్నారు. ఒళ్ళమ్ముకుని బతకాల్సిన స్థితిలో కూడా నెట్టుకొస్తున్నారు.పని దొరికితే బతకొచ్చు. పథకా లతో కాదు. పనితో బతకాలన్నది యువత ఆకాంక్ష. పంతులమ్మలు కూరగాయలు, పల్లీలు అమ్ముకుని బతికే దుస్థితి. వ్యవసాయ భూములు లాక్కుంటూ, పరిశ్రమలను ప్రైవేటు వాళ్ళకు అమ్ముతూ ఉపాధి, ఉద్యోగాలను హరిస్తున్న ప్రభుత్వాలు మన నెత్తినె క్కాయి. పనులు,ఉద్యోగాలుకాపాడబడాలంటే విద్య, వైద్యం,పరిశ్రమలు,రైల్వేలు వీటన్నింటిని ప్రైవేటు వారికి అమ్మడాన్ని ప్రతిఘటించాలి.
ఉద్యోగం,ఉపాధి ప్రాథమిక హక్కుగా మారాలి.ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి పథకానికి నిధులుపెంచాలి.వారికి వేతనాలు పెంచడమే కాదు,100రోజులు పని ఇచ్చే వరకు పోరాడాలి. పట్టణప్రాంతాలలోకూడా ఉపాధి చట్టంరావాలి. సాంప్రదాయాల పేర సంకెళ్ళు! వర కట్నం, బాల్య వివాహాలు, ఆడపిల్లను గర్భంలోనే చిదిమి వేసే వారసత్వపు వాసనలు. ఋతుస్రావాన్ని అంటరా నిదిగాముట్టరానిదన్న ఆచారాలు, వితంతు దురా చారం లాంటి దుస్సాంప్రదాయాలను అంత మొం దించాలన్న స్ఫూర్తిని ప్రజలకు,యువతకు అందిం చేందుకు పూనుకోవాలి.నేడు యువత, మహి ళలు విద్య,వైద్యం,మత్తుమందులు,మౌలిక సదు పాయాలు లాంటి అనేక సమస్యలను ఎదుర్కొం టున్నారు. చదువులలో,ఆటపాటలలో సమస్త రంగాలలో పట్టుదలతో సమర్ధవంతంగా పని చేస్తున్న యువ తుల సంఖ్య బాగా పెరుగుతున్నది.కానీ అదే సమ యంలో పెట్టుబడిదారీ క్షీణ విలువల ప్రభా వంలో యువత శలభాల్లా మాడిపోతున్నది. వీటి నుండి రక్షించుకోవాలి. యువత శక్తి సామర్ధ్యాలను ఉపయోగించుకోవాలి.వారిని సామాజిక,రాజకీయ ఉద్యమాలలో సమీకరిం చాలి. అందుకు సాంస్కృతిక కార్యక్రమాలను విస్తృతపరచాలి.సమానతకు ఆటం కంగా ఉన్న మనువాద భావజాలాన్ని అడుగడు గునా ఎదిరిం చాలి. స్వాతంత్య్రోద్యమ చరిత్రను, సమానత్వం కోసం సాగిన త్యాగాలను రంగరించి శిక్షణా తరగ తులను ముమ్మరంగా నిర్వహించాలి.
ఇవన్నీ తీర్మానాలతో, సంకల్పాలతో మాత్రమే అమలు జరుగవు.ఈరోజు కనీసం మనిషి మాదిరి బతకాలంటే ఉపాధి ఉండాలి.ఇంటా బయ టా రక్షణ, భద్రతఉండాలి. ఇది మహిళా సంఘం లో ఉన్నవారు మాత్రమే సాధించ గలిగేది కాదు. అన్ని రంగాలలో పని చేస్తున్న మహిళ లందరూ ఏకం కావాలి. మనతోపాటు కష్టంలో ఉన్న రైతు కూలీలు, కార్మికులు, ఉద్యోగులు భుజం కలపాలి. యువత ముందు పీఠిన నిలవాలి.సంస్థలతో, వ్యక్తులతో ఐక్య వేదికలను ఏర్పాటు చేసు కోవాలి. వర్తమాన కాలంలో మహిళలు అన్ని రకాల పోరా టాలలో వేలసంఖ్యలో పాల్గొంటున్నారు. తక్షణ వేతనాలు, భద్రత కోసమేగాక ప్రభుత్వ విధానాల మార్పు కోసం ఉద్యమించాలి.అందుకు అందరం కలవాలి,కలుపుకోవాలి.అందుకు మహిళా సంఘం ఉత్ప్రేరకంగా మారాలి. వేలాది మంది పాల్గొనడ మేకాదు, అనుసరించే అనుయాయులుగా మాత్రమే కాదు,ఊయలలూపే చేతులు,ఇంటిని నిర్వహణ చేసే సమర్థత ఉన్నమహిళలు ఉద్యమా లలో ముం దుడి దానికి నాయకత్వంవహించే నైపు ణ్యాన్ని సముపార్జించుకోవాలి.అందుకోసం అధ్య యనం-ఆచరణను మహాసభలక్ష్యాలుగానిర్ణ యించుకున్నది.
పైలక్ష్యాల సాధనకు ప్రతి సందర్భాన్ని సాధనంగా మలచాలి. స్త్రీలశక్తి సామర్ధ్యాలకు చిహ్నంగా ప్రజలు జరుపుకునే దసరా సంబరాలు సంబరాలుగా మాత్రమే కాదు, సంకల్ప వేదికలుగా మారాలి.మార్చుకోవాలి. నవంబరు 14 బాలల పండుగ.బాలలకు బంగారు ప్రపంచాన్ని ఉత్సా హంగా,ఆనందంగా జీవించగలిగే సమాజాన్ని అందించేందుకు కార్యాచరణకు అడుగు వెయ్యాలి. ఇవి తక్షణ కర్తవ్యాలుగా అమలుకు పూనుకోవాలి. దిగ్విజయంగా, ఫలప్రదంగా జరిగిన ఈ మహా సభలు75సంవత్సరాల వజ్రోత్సవాల సభగా జరగ డం మరో ప్రత్యేకత. అన్ని జిల్లాల నుండి ప్రాతి నిధ్యంతో 55 మందితో రాష్ట్ర కమిటీని మహాసభలు ఎన్నుకున్నాయి. ఎన్నికైన రాష్ట్ర మహిళా సంఘం నూతన కమిటీ పైలక్ష్యాల సాధనలో నాయకత్వం వహించనున్నదివ్యాసకర్త : ఐద్వా రాష్ట్ర కార్యదర్శి – (డి.రమాదేవి)