ఈ ఇబ్బందులతో చదువు సాగేదెలా?

భారత రాజ్యాంగం విద్యను రాష్ట్రాల హక్కుల్లో పెట్టింది. ఇందిరా గాంధీ ఉమ్మడి జాబితాకు మార్చింది. ఇపుడు మోడీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో గల విద్యను స్వాధీనం చేసుకొని శిశు విద్యతో సహా మొత్తం సిలబస్‌ తానే నిర్ణయించి రాష్ట్రాలపై రుద్దుతున్నది. మా హక్కుపై నీ పెత్తనం ఏమిటని కేంద్రాన్ని నిలదీయడానికి బదులు జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయి బిజెపి ముదనష్టపు విద్యావిధానాన్ని మన రాష్ట్రంలోనే తొలుత అమలు చేస్తున్నది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ప్రజలు, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారి బాధ్యత. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, నాణ్యమైన విద్య కోసం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.
విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఫిబ్రవరి18నుండిమార్చి ఐదో తేదీ వరకు శ్రీకా కుళం నుండి అనంతపురం వరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన జాతా నిర్వహించడం జరిగింది. యాత్ర ప్రారంభానికి ముందు 17వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీకాకుళం పట్టణ ఎస్‌ఎఫ్‌ఐ కార్యా లయంలో ఉన్న నాయకత్వాన్ని ఈడ్చుకుంటూ పోలీ సులు అరెస్ట్‌ చేశారు. స్టేషన్లో పిడిగుద్దులు గుద్ద డంతో జిల్లా కార్య దర్శి రాజు స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యారు. జాతా నిర్వహించడానికి పర్మిషన్‌ లేదంటూ యాత్ర కోసం అద్దెకు తీసుకున్న మినీ బస్సును 18 ఉదయం 10 గంటలకు పోలీసులు సీజ్‌ చేశారు.వాహనంలోఉన్న పుస్తకాలు, కర పత్రాలు, పోస్టర్లు, బ్యానర్లను పోలీసులు కాల్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం విధించినా విద్యార్థులను కలిసి సమస్యలు తెలుసుకుంటామని ఆర్‌.టి.సి బస్సులో ప్రయాణం చేసి పార్వతీపురంలో సభ జరిపారు. పోలీసులు మరలా రాత్రి 9 గంటల వరకు నాయకత్వాన్ని ఆఫీసులో నిర్బంధించారు. ఆర్‌.టి.సి బస్సులో విజయనగరం చేరుకొని విద్యా ర్థులు ర్యాలీ చేస్తే అడుగడుగున నాయకత్వాన్ని అరెస్టులు చేశారు. విజయనగరంలో విద్యార్థులు యాత్రలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు ముం దస్తుగా ప్రతి కాలేజీ దగ్గరా పోలీసులను కాపలా పెట్టారు. నిర్బంధాన్ని అధిగమించి వందలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొ న్నారు. విశాఖ పట్నంలో అడుగడుగునా చెకింగ్‌ చేసినా రాత్రి9 గంటలకు ఆంధ్ర యూని వర్సిటీ హాస్టల్‌ కి వెళ్లి మీటింగ్‌ పెట్టాము. రాజ మండ్రిలో ర్యాలీ మీటింగ్‌ పెట్టుకోడానికి అనుమతి లేదు. మీవాళ్లు ఏ వాహ నంలో వస్తున్నారో చెప్పండి అరెస్ట్‌ చేస్తామని స్థానిక నాయకత్వానికి పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు. భీమవరం నుండి ఏలూరు వచ్చే దారిలో మమ్మల్ని పట్టుకోవడం కోసం పోలీసులు ఎనిమిది చెక్‌పోస్టు లు పెట్టారు. ప్రతి వాహనాన్ని చెక్‌ చేశారు. పోలీ సుల నుండి తప్పించుకుని రాత్రికి ఏలూరు చేరు కున్నాం. అనేక నిర్బంధాల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర సాగింది. ప్రభుత్వం విద్యార్థుల మీద ఎందుకు ఇంత నిర్బంధం విధిస్తోంది? ప్రతిపక్ష నాయకునిగా జగన్‌ మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేయటానికి ప్రజాస్వామ్యం ఉంది. విద్యార్థి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూ యాత్ర చేస్తే అది అప్రజాస్వామ్యమా?
వసతులు లేవు.. టీచర్లు లేరు.. చదువుకునేదెలా?
అరకులో ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటు చేసి నాలుగేళ్లు అవుతోంది. సొంత భవనం లేదు. ప్రిన్సిపాల్‌ ఒక్కరే ఉన్నారు. లెక్చరర్లు లేరు. పాడేరు బాలికల కళాశాల హాస్టల్లో 250 మంది విద్యా ర్థులు ఉన్నారు. ఒక్కో గదిలో 30 మంది విద్యార్థులు ఉంటున్నారు. మరుగుదొడ్లు లేవు. ఉన్న మరుగు దొడ్లకు తలుపులు లేవు. కాకినాడ ఐటిఐ కాలేజీలో వెయ్యి మంది విద్యార్థులున్నారు. 80 మంది అధ్యా పకులు కావాలి. కానీ 50 మంది ఉన్నారు. ఏలూరు జిల్లా కేంద్రం డిగ్రీ కాలేజ్‌ స్థాపించి పన్నెండేళ్లు అవుతుంది. 250 మంది చదువుతున్నారు. సొంత భవనం లేదు. చెట్ల కిందే పాఠాలు. రేపల్లె ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ సొంత భవనం లేక ఫస్టియర్‌ సెకండియర్‌ విద్యార్థులు ఒకేక్లాసురూములో చదువు కోవాల్సిన పరిస్థితి. బాపట్లలో ఇంటర్మీడియట్‌ కళాశాల నాలుగు రూముల్లో క్లాసులు జరుగు తున్నాయి. హెచ్‌ఇసి, సిఇసి గ్రూపులకు ఒకే రూము లో క్లాసులు జరుగుతున్నాయి. సివిక్స్‌, కెమిస్ట్రీ సబ్జె క్టులకు అధ్యాపకులు లేరు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వడిగ్రీకాలేజిస్థాపించి 31ఏళ్ళు అవుతుంది. సొంత భవనంలేదు. ఒక్క బిఏ కోర్సు మాత్రమే ఉంది. విద్యార్థులు ఇతర డిగ్రీ కోర్సులు చదవాలంటే అనంతపురం, కర్నూలు వెళ్లాలి.
సంక్షేమ హాస్టల్‌లో మెనూ అమలు చేయాలి
పేదవాళ్లు, తల్లిదండ్రులు లేని విద్యార్థులు హాస్టల్‌లో వుండి విద్యనభ్యసిస్తున్నారు. మెనూ ప్రకారం భోజనంలో వారానికి ఆరు సార్లు గుడ్లు వడ్డించాలి. కానీ మూడుసార్లు ఇస్తున్నారు. గుం టూరు బీసీ హాస్టల్‌లో ‘’మీరాకతో మంచి భోజనం అన్న’’ అన్నారు. పాడేరు గిరిజన బాలికల కళాశాల హాస్టల్‌లో ఉదయం పులిహోర పెట్టాలి. కానీ పసుపు అన్నం పెట్టారు. ప్రతిరోజు అరటి పండ్లు ఇవ్వాలి కానీ ఇవ్వటం లేదు. ప్రభుత్వం విద్యార్థికి రోజుకి 46 రూపాయలు ఖర్చు చేస్తుంది. విద్యార్థి మెస్‌చార్జి నుండి వర్కర్‌ జీతం కింద ఐదు రూపా యలు కట్‌ చేస్తారు. 41రూపాయలతో మూడు పూటలు భోజనం పెట్టాలి. ఎలా సాధ్యం? గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. మెస్‌ ఛార్జీలు పెంచి నేటికి ఐదు సంవత్సరాలవుతుంది. నిత్యావసర ధరలు 300 శాతం పెరిగాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ణాల ప్రకారం రోజుకి 2300కిలో క్యాలరీల శక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్య వంతులుగా ఉంటారని ఆ సంస్థ చెబుతుంది. ఈ మధ్యకాలంలో విశాఖ ఏజెన్సీ 11మండలాల్లో హాస్టల్‌లో చదువుతున్న బాలికలకు రక్తపరీక్ష చేస్తే 8 శాతం కంటే ఎక్కువ హిమోగ్లోబిన్‌ లేదు. రక్తహీ నతతో ఉన్నారని ఐటీడీఏ అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఎలా ఉంటారు? ఎలా బాగా చదువుకోగలరు? అందుకనే ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు పెంచాలి. బాపట్ల బాలికల ఉన్నత పాఠశాలలో 576 మంది విద్యార్థులు ఉన్నారు. చాలీచాలని 12 రూముల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆట స్థలం లేదు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా చుట్టుపక్కల ఉన్న 8 ప్రాథమిక పాఠశా లల్లోని 3,4,5 తరగతుల 500 మంది విద్యార్థుల్ని వచ్చే విద్యా సంవత్సరం ఇక్కడికి పంపిస్తారట. ఇప్పటికే ఆ స్కూల్లో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులతో చదువు తుంటే అదనంగా విద్యార్థు లను జాయిన్‌ చేసుకుంటే ఎలా చదువుకునేది? నెల్లూరు సిటీలో మున్సిపల్‌ (కెఎన్‌ఆర్‌) పాఠశాలల్లో 2 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 20 క్లాస్‌రూములు ఉన్నాయి. రూములు చాలక ఉదయం 8,9తరగతులు మధ్యాహ్నం 6,7 తరగ తులు క్లాసులు నిర్వహిస్తున్నారు. టెన్త్‌ క్లాస్‌ విద్యా ర్థులు 370మంది 7 ఏడు సెక్షన్లు ఉన్నాయి. 25 మంది టీచర్లు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం1:30 ప్రకారం 66 మంది ఉపాధ్యాయు లు కావాలి. కానీ 25 మంది ఉన్నారు. కొందరపు, వీరపడుము, కొండపాయి, కొండపాయి మెన్‌ ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగతులకు చెందిన 500 మంది విద్యార్థులను స్కూల్‌కి తరలిస్తున్నారు. మొత్తం 2,500 మంది విద్యార్థులు అవుతారు. చాలామంది విద్యార్థులు ఇబ్బందిపడి డ్రాపౌట్లు అవుతారు. ఇలా18వేల ప్రాథమిక పాఠ శాలలు మూసివేసి అక్కడున్న విద్యార్థులను హైస్కూ ల్‌కు తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్లో చాలీచాలని రూముల్లో అరకొర టీచర్లతో నడుస్తున్న స్కూళ్లలో ఇంకా విద్యార్థుల సంఖ్య పెరిగితే నాణ్యమైన విద్యరాకపేద వాళ్లు చదువుకు దూరం అవ్వాలి. లేదా ప్రైవేట్‌ పాఠ శాలలో డబ్బు చెల్లించి చదువుకోవాలి.
రోగం వస్తే ఎవరికి చెప్పుకోవాలి?
సంక్షేమ హాస్టల్లో విద్యార్థికి అనారోగ్యం వస్తే వారి సంక్షేమం చూడటానికి ఒక ఏఎన్‌ఎం ని నియమించేవారు. ఈ ప్రభుత్వం ఆ అవకాశాన్ని తొలగించింది. గురుకులాల్లో ఏఎన్‌ఎంఉన్నా…విద్యార్థికి జ్వరం ఇతర వ్యాధులు వస్తే ఏ జ్వరం వచ్చిందో టెస్ట్‌ చేయడానికి కూడా కిట్లు లేని పరిస్థితి. గతంలో గురుకులాల్లో హెల్త్‌ కోసం ప్రభు త్వం లక్ష రూపాయలు ముందుగానే బడ్జెట్‌ కేటా యిం చింది. నేడు జీవో నెంబర్‌ 99విడుదల చేసి ఆరోగ్యం కోసం ఆ విద్యాసంస్థల యాజమాన్యం చేసుకోవాలని తెలిపింది. దీంతో ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యం పాలైనా వారు తినే భోజనంలో కోత విధించి ఆ డబ్బుతో వైద్యం చేస్తున్నారు. పిఠాపురం ఎస్‌.సి గురుకులంలో పనిచేస్తున్న టీచర్‌, సిబ్బంది తమకు అందే జీతంలో రెండు వందల రూపా యలు తీసి విద్యార్థుల ఆరోగ్యం కోసం ఖర్చు పెడు తున్నారు. గతంలో విద్యార్థికి ప్రతి నెలా కాస్మొటిక్‌ ఛార్జీలు ఇచ్చేవారు. వాటితో అవసరం ఉంటే విద్యార్థి తీసుకునేవాడు. నేడు అమ్మ ఒడి పథకంతో 15 వేల రూపాయలు ఇస్తున్నాం కదా అని కాస్మొ టిక్‌ ఛార్జీలు కూడా ఇవ్వట్లేదు. దీంతోచాలా విద్యా సంస్థల్లో విద్యార్థులు జబ్బు పడిన సంద ర్భంలో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతూనే ఉంది.
తెలుగు మీడియం కావాలి
మాతృభాషలో బోధించాలని విద్యాహక్కు చట్టం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇంగ్లీష్‌ మీడియంలోనే అంటోంది. డిగ్రీ మొదటి సంవ త్సరం ఇంగ్లీష్‌ మీడియం చేయడం వల్ల ఇప్పటి వరకు ఇంటర్మీడియట్‌ తెలుగు మీడియం చదువు తున్న వాళ్ళు డిగ్రీలో ఇంగ్లీష్‌ చదవడం కష్టంగా ఉంది.ప్రభుత్వ ఉపాద్యాయుల్లో బోధన అర్హతలున్నా ఆంగ్లంలో చెప్పేంత సామర్ధ్యం వారిలో లేకపోవడంతో ఆంగ్ల విద్య పడకేసింది. నాడు`నేడు కార్యక్రమంలో పాఠశాలల అభివృద్ధిలో అవినీతి రాజ్యమేలుతోంది. దీనిపై అధికార్లు కన్నెత్తి చూడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్షలు మాతృ భాషలోనే పరీక్షలు నిర్వహి స్తుంది. నీట్‌ పరీక్షలను ప్రభుత్వం12 భాషలలో నిర్వహిస్తుండగా…మనం మాతృ భాషలో తరగతులు నిర్వహిస్తే తప్పేంటి?
జీవో నెంబర్‌ 77-పేదలు ఉన్నత విద్యకు దూరం
క్రిస్మస్‌ రోజున జగన్‌ ప్రభుత్వం జీవో నెం. 77 తెచ్చి ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో పి.జి, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన నిలిపి వేసింది. యూనివర్సిటీ అనుబంధ కాలేజీ ల్లో ఎం.ఏ, ఎం.ఎస్సీ, ఎం.కామ్‌ వంటి సాధారణ పి.జి 22,830 మంది చదువుతుంటే… ప్రైవేట్‌, ఎయిడెడ్‌ కాలేజీల్లో 32,562 మంది చదువుతున్నారు. ఎం.టెక్‌, ఎం.సి.ఏ, ఎం.బి.ఏ, ఎల్‌.ఎల్‌.బి వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు ప్రభుత్వ సంస్థల్లో 12,020 మంది చదువు తుంటే ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో 1,63,810 మంది చదువుతున్నారు.ఈజీవో వలన మొత్తం 1,96, 372 మందికి విద్యాదీవెన, వసతి దీవెన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. పేదల పిల్లలు వేలు, లక్షల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేటు రంగంలో ఉన్నత విద్య ఎలా చదవగలరు?
ఫీజులు భారం
ప్రభుత్వం గతంలో స్కాలర్‌షిప్‌ను కళాశాల యాజమాన్యం అకౌంట్లో కొంత వేసేది. మరికొంత ఫీజు విద్యార్థి అకౌంట్లో జమ చేసేది. నేడు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో సంవత్సరానికి 20 వేల రూపా యలు విద్యార్థి అకౌంట్లో జమ చేస్తామని తెలి పింది. కాబట్టి కళాశాల యాజమాన్యం విద్యా ర్థులపై ఫీజులు ముందుగానే చెల్లించాలని ఒత్తిడి తీసుకు వస్తున్నాయి. ప్రభుత్వం నుండి సకాలంలో విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిస్థాయిలో రాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లి స్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్లో గతంలో 2500 రూపాయలు మెస్‌ బిల్లు వచ్చేది. నేడు ఒక విద్యార్థికి 3500 రూపా యలు వస్తుంది. రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో ఫీజులు చెల్లించలేదని150మంది విద్యార్థులను యూని వర్సిటీ రిజిస్ట్రార్‌ బయటికి పొమ్మన్నారు. భారత రాజ్యాంగం విద్యను రాష్ట్రాల హక్కు ల్లో పెట్టింది. ఇందిరా గాంధీ ఉమ్మడి జాబితాకు మార్చింది. ఇపుడు మోడీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో గల విద్యను స్వాధీనం చేసుకొని శిశు విద్యతో సహా మొత్తం సిలబస్‌ తానే నిర్ణయించి రాష్ట్రాలపై రుద్దు తున్నది. మా హక్కుపై నీ పెత్తనం ఏమిటని కేంద్రాన్ని నిలదీయడానికి బదులు జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయి బిజెపి ముదనష్టపు విద్యా విధానాన్ని మన రాష్ట్రంలోనే తొలుత అమలు చేస్తున్నది. మన హక్కును కేంద్రం స్వాధీనం చేసుకోవడాన్ని, జగన్‌ కేంద్రానికి లొంగిపోవటాన్ని టిడిపి, జనసేన ఖండిరచక మేమంతా ఒకటేని చెప్పకనే చెబుతున్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ప్రజలు, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వారి బాధ్యత. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, నాణ్యమైన విద్య కోసం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. – ( ఎ.అశోక్‌ )