ఆహరం అందితేనే ఆరోగ్యం

‘‘ తిండి కలిగితే కండ కలదోయ్‌ అని మహా కవి గురుజాడ అప్పారావు చాలా తేలికగా చెప్పేశారు గానీ.. ఈకాలంలో తిండి ఒక్కదానితోనే కండలు వచ్చేయవు. ఆ కండ లతో కలిసి ఆరోగ్యమూ సమకూ రాలంటే.. ఏం తింటున్నాం? ఎలాతింటున్నాం? ఎప్పుడు.. ఎక్కడ తింటున్నామన్నదీ ముఖ్యం. అవగాహన లోపం కొంత.. కాలుష్యం మరి కొంత కలిసి.. ఆహారం కార ణంగా కొన్ని అనారోగ్య సమస్యలను తెలి యకుండానే చవిచూస్తున్నాం. నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా కొన్ని సంగతులు..’’

ఆహారం..మనిషి మనుగడకు ప్రధా నం..ఆరోగ్యానికి ఎంతో అవసరం.. రుచులు.. రకాలను పక్కనబెడితే..శరీరానికి మంచి పోష కాలనిచ్చే పదార్థాలు ఎంతో ముఖ్యం..ఆహార లేమితో అనేక జబ్బులు తప్పవు. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఓ) వ్యవస్థాపక దినమైన 1945 అక్టోబరు 16వ తేదీని ప్రతియేటా ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయిం చింది. ప్రపంచ ఆహార దినోత్సవం సంద ర్భంగా ప్రత్యేక కథనం..
బియ్యంతోనే సరిపెట్టుకోగలమా..
రాష్ట్ర ప్రభుత్వం 2015జనవరి జనవరి ఒకటో తేదీ నుంచి ఆహార భద్రత చట్టాన్ని మార్పు లు చేసి అమలు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇప్పటి వరకు ఉన్న 4 కిలోల బియ్యానికి బదులు 6 కిలోలు ఇస్తోంది. అయితే కేవలం బియ్యంతో ఆహార భద్రతను ఊహించుకోవడం కష్టమే. రోజు రోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటే అది సామాన్యులు భరించడం కష్టంగా మారు తోంది. రేషన్‌ దుకాణాల్లో గతంలో ఇచ్చిన తొమ్మి ది సరుకులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. జగిత్యాల జిల్లా జనాభా 9,88,913ఉంది. ఇందులో ఆహార భద్రత కార్డులు 44,187,అంత్యోదయ కార్డులు 2497మాతమ్రే ఉన్నాయి. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని1981లో మొదటిసారిగా జరుపుకు న్నారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక్కో సందేశాన్ని ఇది ముందుకు తెస్తుంది. తొలిఆహార దినోత్సవం నాడు ఆహారానికి తొలి ప్రాధాన్యత అన్నది ప్రధాన లక్ష్యంగా నిర్దేశిం చారు. మరోసారి ఆహార భద్రత అన్న దానిని ప్రధాన అంశంగా తీసుకున్నారు. మరోసారి ఆకలిపై సమిష్టి పోరు జరపాలని ఎఫ్‌ఏఓ పిలుపు నిచ్చింది. ఆకలిని భూమ్మీద నుంచి సాధ్యమైనంత త్వరగా తుడిచి పెట్టాలని సూచించారు. ప్రస్త్తుతం ప్రపం చాన్ని కలవరపెడుతున్న ప్రధాన సమస్య ఆహార భద్రత. ఆరోగ్యకరమైన ఆహారం, స్వచ్ఛమైన నీరు లభించడం, వాటిని కొనుగోలు చేయగల ఆర్థికశక్తి ప్రజలకు ఉండడమే ఆహారభద్రత.‘ఆరోగ్యకరంగా జీవిం చేందుకు అవసరమైన ఆహారాన్ని అన్ని వేళలా, అన్ని వర్గాల ప్రజలకు లభింపచేయటమే ఆహార భద్రత కు అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ ఇచ్చిన నిర్వచనం. ఇందుకు అవసరమైన భతి, కొనుగోలు శక్తిప్రతి కుటుంబానికి లభిం చాలి. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌’ 1945 అక్టో బర్‌ 16న కెనడాలో నెలకొల్పారు. దాని శాశ్వత ప్రధాన కార్యాలయం రోమ్‌లో ఉంది.
వ్యవసాయరంగంపై తగ్గుతున్నప్రభుత్వ పెట్టుబడులు
70 శాతం మందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పులు, వ్యవ సాయ రంగంపై చూపుతున్న ప్రతికూల ప్రభావాలు ఆహార భద్రతను మరింత సంక్షోభంలోకి నెడుతు న్నాయి. ఆకలి,పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతా ల్లో వ్యవసాయ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహిం చేందుకు ఈ రంగంలో పెట్టుబడులు పెంచాల్సిన అవసరముంది.
మూడు పూటలు తినలేని వారెందరో..
ఆహారం లేనిదే జీవంలేదు.కానీ తగి నంత ఆహారం లేకుండా ఎంతోమంది ఉన్నారు. నాగరిక సమాజంలో మానవులు తమకు అవసర మైన ఆహారాన్ని సంపాదించుకునే వీలుకూడా లేని ప్రదేశాలు ఇంకా ఉండడం మన అభివద్ధికి అవ మానం. ప్రకతితో సహజీవనం చేస్తున్నప్పుడు సమ స్యలు తరచూ అనూహ్యంగా వస్తుంటాయి. అటు వంటి సందర్భాల్లో కూడా ఆహారం లభించడం ముఖ్యం. ఆదిశలో ‘పాలకుల’ధ్యాస ఉండాలి. ప్రణాళికలు తయారవ్వాలి. ప్రయత్నాలు ము మ్మరం చేయాలి. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నట్టనిపిస్తున్నా ఎక్కడో ఏదోలోపం ఉందనిపి స్తుంది. కారణం కరువుకావచ్చు. వరదలు కావచ్చు. ఆర్థికంగా వెనుకబాటుతనమూ కావచ్చు.
రోజురోజుకు పెరుగుతున్న జనాభా
రాబోయే కాలంలో ఆహారోత్పత్తి కంటే జనాభా పెరిగిపోయే ప్రమాదముంది. మారుతున్న వాతావరణ,సామాజిక, ఆర్థిక సమతుల్యతల వల్ల అనూహ్యరీతిలో ఆహార సమస్య ఎదురయ్యే ప్రమాద ముందని నిపుణులు అంటున్నారు. ఆదిశలో సంప్ర దాయేతర ఆహారాన్ని అలవాటు చేసుకోవలసిన అవసరం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. సముద్రాల్లోని ఆల్గే నుంచి పౌష్టికాహారం తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ‘స్పిర్సులీనా’ అనేది రూపొందింది. కానీ ప్రజలం దరూ తినగలిగినం త మోతాదులోనూ, ఇష్టపడే రుచిలోనూ ఇంకా రావలసిఉంది. మాంస కత్తుల నిధిగా ప్రచారం చేసిన సోయా చిక్కుళ్లు అనుకు న్నంత ప్రాచుర్యం పొందలేదు. ఉన్న వరి పొలాలు నీరు లేక కొంతా,నీరు ఎక్కువై కొంతా నష్టపోతు న్నాయి. లాభాలు కనిపించక రైతులు వ్యవసాయం మానుతున్నారు. ఇటు జనాభా ఏమాత్రమూ తగ్గే దిశలో లేదు. ఆహార సమస్య (డబ్బున్న వాళ్లకి లేకపోతే పోవుగాక) మాత్రం తీవ్రమయ్యే ప్రమా దం కనిపిస్తోంది. ఆహారంలో అంతగా ఉపయోగ పడని టమాటాలూ,ఉల్లిపాయలూ ధరలు పెరిగితే వాటిని మానేయలేనంతగా అలవాటుపడ్డ మనం నిజంగా ఆహార సమస్య వస్తే తట్టుకోగలమా?
పథకాల అమలు అంతంతే..
అందరికి పోషకాహారాన్ని అందించ డానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడు తున్నా..ఆతర్వాత వాటిఅమలుపై శ్రద్ధ పెట్టకపోవడంతో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు.ఆహార భద్రతచట్టం ప్రకారం కేవలం బియ్యం, ఇతర కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే ఇవ్వడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. పాఠ శాలలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నా.. నాణ్యత లోపిస్తూ సరైన పోషకాలు వారికి అందడం లేదు. అంగన్‌ వాడీ కేంద్రాలకు సరుకులు సక్రమంగా సరఫరా చేయకపో వడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చిన్నారు లు,బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అంద డం లేదు.
ఆహారం అందకపోవడానికి అనేక కారణాలు
మూడు పూటలా తిండి.. పోషకాలున్న ఆహారం అందకపోవడానికి ముఖ్యమైన కారణం పేదరికం.. పేదరికానికి కూడా అనేక కారణాలు న్నాయి.. వ్యవసాయం అధ్వాన్నంగా ఉండడం, చిన్న కమతాలు అధికంగా ఉండడం, వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడటం,మార్కెట్‌ సౌక ర్యాలు సన్నగిల్లడం, ఆహార ధాన్యాలు అంతర్జా తీయంగా జీవ ఇంధన తయారీకి మరలటం, ప్రకతి వైపరీత్యాలు, ఉత్పత్తి తరుగుదల, ఆహార ధాన్యాల నిల్వలు తగ్గడం,డిమాండ్‌ పెరగటం,ముడి చమురు పెరిగి దాని ప్రభావంతో అన్ని వస్తువుల ధరలు పెరగటం,ప్రజాపంపిణీ వ్యవస్థలో లోపాలు, వ్యవ సాయంలో పెట్టుబడులు పెట్టకపోవటం, సెజ్‌లకు వ్యవసాయ భూములు మళ్లించడం,గహ నిర్మాణం, రహదారుల వెడల్పు, పరిశ్రమలకు పంట భూము లు మళ్లించడం వంటి అనేక కారణాలవల్ల ఉత్పాదకతతగ్గి ప్రజలకు ఆహార సమస్య ఉత్పన్నమ వుతున్నది.
దృష్టి పెడితేనే పరిష్కారం..
ఆహార భద్రతకు వ్యవసాయ పెట్టు బడులు భారీగా పెంచడం ఒక్కటే పరిష్కారమని పరిశీలకులు చెబుతున్నారు. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దష్టిపెట్టి అధికంగా నిధులు కేటాయించని పక్షంలో ఆహారంకోసం అలమటించేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుందని నిపుణులు సూచి స్తున్నారు. వ్యవసాయ భూమిని ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయేతర కార్యకలాపాలకు ఉపయోగించ కూడదు. వ్యవసాయ రంగానికి అదనపు పెట్టుబడు లతోపాటు పరిశోధక, మౌలిక సదుపాయాల కల్పన నీటిపారుదల,నిర్వహణ,మార్కెటింగ్‌ సదుపా యాలు, ఆహార ధాన్యాల నిల్వలకు సరిపడ గిడ్డం గులు, కూరగాయలు, పండ్ల నిల్వలకు శీతల గిడ్డం గులను ఏర్పాటుచేయాలి. వ్యవసాయదారులకు, వినియోగదారులకు లబ్ధి కలిగించడానికి మధ్య వర్తుల ప్రమేయం తొలగించాలి. భూగర్భ నీటి నిల్వను పెంచడానికి వర్షపు నీటిని నిల్వచేయడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణను ప్రోత్స హించాలి. వ్యవసాయ గిట్టుబాటుధర లభించేలా చర్యలు తీసుకోవాలి. కత్రిమ కొరతలను నివారిం చాలి. వ్యవసాయ బడ్జెటు రూపకల్పన చేయాలి. మేలి విత్తనాలు,కొత్త పద్ధతులు, యాంత్రీకరణ ఉపయోగాలు,పంటల భీమాపథకం మొదలైన చర్యలతో వ్యవసాయాన్ని పునరుద్దీప్తం చేయాలి. జనాభా స్థిరీకరణ,భూ వనరుల పెంపు, నీటి భద్రత, సామాజిక అడవుల పెంపకం,జీవ వైవిధ్యం పెంపు తదితర చర్యలు చేపట్టాలి. తిండి గింజల లభ్యత తోనే సరిపోదు. ఆరోగ్యంగా జీవించడానికి, దేహాని కవసరమయ్యే అన్ని పోషకాలను అందివ్వగల సంపూర్ణాహారం లభ్యమైనప్పుడే ఆహార భద్రత చేకూరినట్టవుతుంది.
ఆహార భద్రత… అందరి వ్యవహారం
తినే తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి, పర్యాటకానికి సాయపడటం లక్ష్యం. మనం తినే ఆహారం సురక్షి తంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలు కొని,విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఫలితంగా కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల భారం తగ్గి సమాజం అభివృద్ధి చెందుతుందని అంచనా.
వీటితో ఆరోగ్యానికి చేటు
ఆహారం కలుషితమయ్యేందుకు, తద్వా రా అనారోగ్యం కలిగేందుకు బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్న జీవులు కారణం. అధిక మోతాదులో వాడే రసాయనిక ఎరువులు, నిల్వ చేసేందుకు, రుచి కల్పించేందుకు ఉపయోగించే రసాయనాలు కూడా చేటు చేసేవే. సాల్మనెల్లా,కాంపీలోబ్యాక్టర్‌, ఈ –కోలీ వంటి బ్యాక్టీరియా ఏటా కొన్ని కోట్ల మందిని అస్వస్థులుగా చేస్తోంది. ఈబ్యాక్టీరియా కారణంగా తలనొప్పి,వాంతులు, తల తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుడ్లు, కోళ్లు, జంతు సంబంధిత ఆహారం ద్వారా సాల్మనెల్లా బ్యాక్టీరి యా వ్యాపిస్తుంది. కాంపీలోబ్యాక్టర్‌, ఈ-కోలి పచ్చి పాలు, సక్రమంగా వండని కోళ్ల ఉత్పత్తులు, నీటి ద్వారా వ్యాపిస్తాయి. పూర్తిగా ఉడికించని సముద్రపు ఉత్పత్తుల ఆహారం ద్వారా హెపటైటిస్‌-ఏవైరస్‌ వేగంగా వ్యాపించడమే కాకుండా.. కాలేయ వ్యాది óకి కారణమవుతుంది. కొన్ని రకాల పరాన్నజీవులు చేపల ద్వారా,మరికొన్ని ఇతర ఆహార పదార్థాల ద్వారా వ్యాపిస్తాయి. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడంవల్ల లేదా తేమ ఎక్కువ ఉన్న చోటనిల్వ చేయడం వల్ల వచ్చే బూజు (ఆఫ్లా టాక్సిన్‌)తోపాటు అనేక ఇతర సహజసిద్ధమైన రసా యనాలు కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తా యి. ఈవిషపదార్థాలు దీర్ఘకాలం శరీరంలోకి పోతే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో పోగుపడే వాతావరణంలోని కాలుష్యాలు పాలీ క్లోరినేటెడ్‌ బైఫినైల్స్‌,డయాక్సిన్స్‌లు జంతువుల ద్వారా మన శరీరాల్లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవి పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయి. సీసం,కాడ్మియం,పాదరసం వంటి విష తుల్యమైన రసాయనాలు కూడా ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలు దెబ్బతినేం దుకు కారణమవుతున్నాయి.
ఇలా చేస్తే ఆరోగ్యానికి మేలు
ఊ మీ ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉందా? మీ ఆహారం మీకు సమస్యలు సృష్టించకుండా ఉండేందుకు దీన్ని తగిన రీతిలో వాడుకోవడం చాలా అవసరమని చెబుతోంది జాతీయ పోషకాహార సంస్థ. ఇంకా ఏం సూచిస్తోందంటే..
ఊ వండిన, వండని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో వేర్వేరుగా ఉంచాలి.
ఊ ఆకుకూరలను నిల్వచేసే ముం దే.. వాటి వేళ్లను తొలగించి శుభ్రంగా కడిగి ఉంచడం మేలు.
ఊ కోడిగుడ్లను మూత ఉన్న కాగితపు అట్ట డబ్బాలో ఉంచి నిల్వ చేయాలి.
ఊ వండిన ఆహార పదార్థాలను నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉంచరాదు.
ఊ మూతతో కూడిన చిన్నచిన్న పాత్రల్లోనే వండిన ఆహారాన్ని ఉంచాలి.
ఊ వండిన ఆహార పదార్థాలను కూడా గది ఉ ష్ణోగ్రతలో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.
ఊ ఫ్రిడ్జ్‌లో నిల్వచేసిన పదార్థాలను తినే ముందు వేడి చేసుకోవడం అవసరం.
ఊ ఆహారం వండే క్రమంలో ఇతర కాలుష్యాలేవీ అందులోకి చేరకుండా చూడాలి.
ఊ అన్నింటికంటే ముఖ్యం.. ఆహా రం వండే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉన్న నీటితో కాకుండా.. నల్లా కింద చేతులు పెట్టి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఊ కాయగూరలు, పండ్లను తినేముందు కూడా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.
ఊ ఆహారం వండేటప్పుడు వీలైనంత మేరకు శు భ్రమైన నీటినే వాడాలి. ా సురక్షితమైన మంచినీటి వ్యవస్థ లేనప్పుడు ఆ నీటిని మరిగించి వాడొచ్చు.
ఊ వంటపాత్రలోకి నీరు పోసేందుకు విడిగా గ్లాసుల్లాంటివి వాడటం మేలు.
ఇల్లు, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి.
జి.ఎన్‌.వి.సతీష్‌