ఆదివాసీల బతుకులు ఆగమైతున్నయ్‌

అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీలు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నారు. అటవీ భూము లు,సహజ వనరులపై ఆధారపడి జీవించే గిరిజనులకు మేలు చేయాల్సిన పాలకులు.. వారిని ఇంకింత భయభ్రాం తులకు గురి చేస్తున్నారు. అడవిలో మొక్కలు నాటే నెపంతో.. భూములు గుంజుకోవడం, పంటలు ధ్వంసం చేయడం, నివాసాలు ఖాళీ చేయిస్తూ.. వారి హక్కులను కాలరాస్తున్నారు. తమకు అన్యాయం చేయొద్దని ప్రశ్నించే ఆదివాసీలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అడవి బిడ్డల హక్కుల రక్షణకు గతంలో ఎన్నో చట్టాలు వచ్చినా అవేవీ అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆదివాసీల హక్కులను కాపాడాలి.
ప్రపంచవ్యాప్తంగా90దేశాల్లో దాదాపు 40కోట్ల ఆదివాసీల జనాభా ఉంది. ఏడు వేలకు పైగా భాషలు, 5 వేలకు పైగా విభిన్న సంస్కృతులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రకృతితో పెనవేసు కున్న పర్యావరణహిత సాంప్రదాయాలు ఆదివాసీ జీవనశైలిలో అంతర్భాగం.ప్రపంచవ్యాప్తంగా ఆది వాసీలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతు న్నారు. అటవీ భూములు, సహజ వనరులే వీరికి జీవనాధా రం. ఐక్యరాజ్యసమితి క్షేత్రస్థాయిలో వివిధ ప్రభుత్వ వ్యవస్థల్లో ఆదివాసీల హక్కులకు రక్షణ కవచాలు ఏర్పాటు చేశాయి.కానీ అవి వారి హక్కులను పూర్తి స్థాయిలో కాపాడటం లేదు.అభివృద్ధి,ఇతర అవస రాల పేరుతో ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వాలు, అధికారులు లాక్కోవడం పరిపాటిగా మారుతోంది. సహజ వనరులు కోల్పో వడంవల్ల వారి ఉనికి ప్రమాదంలో పడటంతో ఆదివాసీ కుటుంబాలు ఉపాధి,విద్య,ఆర్థిక అవసరా ల కోసం నగరాలకు వలస పోతున్నాయి. నగర జీవనంలో వీరికికనీస పౌరసేవలు అందడం లేదు. ఇండియాలో 2011జనాభా లెక్కల ప్రకారం దేశం లో8.6శాతం అంటే10.42కోట్లఆదివాసీలు ఉన్నారు. ఇందులో 461 రకాల ఆదివాసి తెగలు ఉన్నాయి. వీరిలో 90 శాతం గిరిపుత్రులు అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం,వేట,అటవీ ఉత్ప త్తులపై ఆధారపడి జీవిస్తున్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు కొత్త పథకాలు అమలు చేస్తున్నా వారి పరిస్థితిలో మార్పు రావడం లేదు. అత్యంత వెనక బడిన ఆదివాసీ తెగలు(పీటీజీ) నివసించే ప్రాంతా ల్లో రహదారులు కూడా లేవు. మంచినీరు, ఆరోగ్య సేవలు, విద్య తదితర సౌకర్యాలకు దూరంగా వారు దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు.
చట్టాలు ఉన్నా..
గతంలో ఆదివాసీల హక్కులపై అనేక పోరాటాలు వచ్చాయి. వీటి ఫలితంగానే ప్రభుత్వం1/70 పీసా చట్టం చేసింది.ఆనాటి యూపీఏ ప్రభుత్వం 2005 లో అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం..షెడ్యూల్డ్‌ తెగలు, తరతరాలుగా అడవిలో నివసిస్తున్న సంప్రదాయక అటవీ వాసు లకు అటవీ భూములపై హక్కులు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అటవీ చట్టం1967 ప్రకా రం.. సెక్షన్‌ 4 ప్రకటించే నాటికి ఉన్న హక్కులు గుర్తించబడతాయి. భారత అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం..2005 డిసెంబర్‌ 13 వరకు ఆక్రమణలో ఉన్న భూములపై ఆదివాసీలకు హక్కు లు ఉంటాయి. ఇతర సంప్రదాయక అటవీ వాసులు అయితే 13డిసెంబర్‌ 2005 ముందు మూడు తరాలు అంటే 75 ఏళ్లు అదే అడవిలో నివసిస్తూ జీవిస్తున్న వారికి హక్కులు సంక్రమిస్తాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన షెడ్యూలు తెగలైతే ఆతేదీ నాటికి నివసిస్తే చాలు. వ్యక్తులకు సమాజానికి ఇలాంటి అటవీ హక్కులు ఏ మేరకు ఉన్నాయో నిర్ణయించే ప్రక్రియ ప్రారంభించే అధికారం గ్రామసభలకు మాత్రమే ఉంటుంది.అటవీ హక్కులు పొందా లంటే 13 డిసెంబర్‌ 2005 నాటికి భూమి ఆక్ర మణలో ఉన్నట్టు చూపాలి. ప్రభుత్వ డాక్యుమెంట్లు గానీ, ప్రభుత్వ రికార్డులు గానీ, ఏదైనా సెటిల్‌ మెంట్‌,మ్యాపు,గూగుల్‌ మ్యాపు,వర్కింగ్‌ ప్లానులు, అటవీ ఎంక్వయిరీ రిపోర్టు లాంటిది ఆధా రాలు గా చెల్లుతాయి.రేషన్‌ కార్డు,ఓటర్‌ ఐడీ కార్డు, ఇంటి పన్ను రసీదు,ఇంటి నివాస సర్టిఫికెట్‌, కోర్టు ఆర్డర్‌, సర్వేరిపోర్టు,సంస్థానాలు ఇచ్చిన సర్టిఫికెట్లు, వంశ వృక్షాలు గ్రామ పెద్దల స్టేట్‌?మెంట్‌?ఇలా అన్ని ఆధారాలుగా చూపవచ్చు. అటవీ హక్కుల చట్టం 2005-06 ప్రకారం ప్రతిఆదివాసి కుటుం బానికీ పది ఎకరాల పట్టా ఇవ్వాలి. ఆ ప్రకారం రాష్ట్రం లో1.78లక్షల ఎకరాలు లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత చట్టాలను అమలు చేయ కుండా పక్కన పెట్టేశారు. పైగా ఆర్వో/ఎస్‌ఆర్‌ చట్టాలు ఇచ్చిన భూములను సైతం ప్రస్తుతం లాక్కుంటున్న పరిస్థితి నెలకొంది. వందలాది ఆది వాసీల మీద అక్రమ కేసులు నమోదవుతున్నాయి.
ప్రభుత్వ నియంతృత్వం..
గిరిజనులు సాగుచేస్తున్న భూమిపై ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోంది. అటవీ అధికా రులు,ప్రభుత్వం ఆదివాసీల పోడు భూములపై యుద్ధం ప్రకటించారు. వారిని భూముల నుంచి వెళ్లగొట్టడానికి కందకాలు తవ్వుతున్నారు. పచ్చని పంటలను ధ్వంసం చేస్తున్నారు.ఆపేద బతు కులపై యుద్ధం చేస్తూ ప్రభుత్వం హరితహారం పేరుమీద మొక్కలు నాటుతోంది. తమ భూముల్లో మొక్కలు పెట్టి జీవనాధారం నాశనం చేయొద్దంటూ ఆదివాసీ బిడ్డలు ఫారెస్ట్‌ఆఫీసర్ల కాళ్లు మొక్కుతున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం తమను అడ్డుకుం టున్నారన్న నెపంతో గిరిజనుల మీదకేసులు పెడు తున్నారు.తెలంగాణలోభద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,మహబూబాబాద్‌,ఆదిలాబాద్‌, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఆఫీసర్ల వేధింపులు తట్టుకో లేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 31 లక్షల75వేల మంది ఆదివాసీలు ఉన్నారు. ఆదివా సీల్లో ఉపతెగలు చాలా ఉన్నాయి. గత పాలకులతో పాటు ఇప్పుడు ఉన్న పాలకులు వాళ్లను సాటి మనుషులుగా చూడకపోవడం మాట అటుంచితే.. వారి వనరులు దోచుకోవడం, ఆవాసాలను, భూము లను లాక్కోవడం దారుణం.
హరితహారం పేరుతో..
పట్టాల కోసం ఆదివాసీలు అధికారులు, కోర్టుల చుట్టూ తిరుగుతుంటే, తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో వారు సాగు చేస్తున్న భూమి లో మొక్కలు నాటిస్తోంది. రాష్ట్రంలో 33 శాతం అడవి పెంచాలని ప్రభుత్వం అనుకుంటోంది. ప్రపంచ బ్యాంకు నిధులు రూ.240కోట్లతో మొక్కలకు శ్రీకారం చుట్టింది. ఈ లక్ష్యం మంచిదే అయినా..ఈహరితహారం ఆదివాసీలపై యుద్ధంలా మారుతోంది. ఫారెస్టు అధికారులు అత్యుత్సాహంతో గిరిజనులపై దాడులు చేస్తున్నారు.కందకాలు తీస్తు న్నారు. ఇక పంటలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వందలాది ఆదివాసీలపై కేసులు నమో దయ్యాయి. కొందరిని అరెస్టు కూడా చేశారు. మహి ళలు,వృద్ధులు అని చూడకుండా వారిపై దాడులు చేస్తున్నారు.గుండాల మండలం జగ్గయ్య గూడెంలో ఏళ్లతరబడి సాగు చేసుకుంటున్న భూముల్లో అధికా రులు దాడులు చేశారు. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనే అటవీశాఖ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆదివాసీ చట్టాలు నిర్వీర్యం అవుతున్నాయి. పోలీసులు, కోర్టుల గురిం చి స్పష్టంగా తెలియని ఆదివాసీలు భయంతో వంద లాది ఎకరాలు భూములు కోల్పోతున్నారు. టీఆర్‌ ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ కుర్చీ వేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని గతంలో చెప్పా రు. ఇంతవరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకో లేదు. ఆదివాసీల భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు, ధరణి వెబ్‌ సైట్‌లో నిషేధిత జాబితాలో ఉన్న28లక్షల ఎకరాలను అందులోంచి తీసేయాలి. లేదంటే రాష్ట్రం కోసం కొట్లాడిన ఆదివాసీలు, గిరిజ నులు మరో జల్‌,జంగల్‌, జమీన్‌ పోరాటానికి సిద్ధమవుతారు.
ఆ చట్టాలతో ఆదివాసులకు అన్యాయం
వ్యవసాయం నేడు ఆదివాసి జీవనాధారాలలో అతి ముఖ్యమైన భాగమైంది. ప్రకృతితో సహజీవనం చేస్తూ, సామూహిక జీవన విధానాలపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులు మార్కెట్‌ ప్రేరేపిత పంటల వైపు ఆకర్షితులవుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాల ప్రభావం గురించి చర్చించుకునే ముందు ఆదివాసీల రక్షణ కోసం తెచ్చిన చట్టాలకు సంబం ధించి జరిగిన ఉల్లంఘనలను పరిశీలిం చటం అవసరం. భారత రాజ్యాంగంలోని 244వ అధికర ణంలోని ఐదవ షెడ్యూల్‌ను‘రాజ్యాంగంలో రాజ్యాంగం’గా వర్ణిస్తుంటారు. షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తించిన ప్రాంతంలో ఆదివాసులు గిరిజనేతరుల నుంచి,వడ్డీ వ్యాపారం నుంచి దోపిడీకి గురి కాకూ డదని, ఆదివాసి జ్ఞానం,సంస్కృతి,పాలనావ్యవస్థ లపై ఆధారపడి అభివృద్ధి పథకాలు ఉండాలని, షెడ్యూల్‌ ప్రాంత సంరక్షకులుగా రాష్ట్ర గవర్నర్‌ వ్యవహరిస్తారని, రాష్ట్ర,కేంద్రప్రభుత్వ చట్టాలు ఐదో షెడ్యూల్‌ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే అమలు జరపాలని భారత రాజ్యాంగం నిర్దేశించింది. చట్టా ల రూపకల్పనలో రాజ్యాంగంలోని సమానత్వపు హక్కు ఆర్టికల్‌ 14,ఎలాంటి వివక్షకు గురికాకుండా కాపాడే ఆర్టికల్‌ 15(4), ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధిని ఆకాంక్షించే ఆర్టికల్‌ 19(1)(జి), గౌరవంతో జీవించేహక్కు ఆర్టికల్‌ 21లను పరిగ ణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు గిరిజనేతరులకు షెడ్యూల్డ్‌ ప్రాంతంలో భూములు లీజుకు తీసుకోవడానికి కాని, కొనడానికి కాని, అమ్మే హక్కు కానిలేవని భూపరాయీకరణ నిరోధక చట్టం1/70స్పష్టం చేస్తోంది. ప్రతి ఆదివాసి సమూ హానికి తమ గ్రామ పరిధిలోని సహజవనరులను పాలించే శక్తి గ్రామసభలకు ఉందని స్పష్టం చేసిన పీసా చట్టం 1996లో వచ్చింది. గ్రామంలో జరిగే ఎలాంటి అభివృద్ధి పథకానికైనా గ్రామసభల అను మతి కావాలి. వడ్డీ వ్యాపారాన్ని కట్టడి చేయటంలో గ్రామసభలకు అధికారం ఉంది. అలాగే తమ గ్రామ సంప్రదాయ సరిహద్దులలోని సహజ వన రుల (లఘు ఖనిజాలు,చిన్న నీటి వనరులతో సహా) నిర్వహణ, రక్షణ, యాజమాన్యం, వినియోగంలో గ్రామసభలకే అధికారం ఉందని ఈ చట్టం చెబుతు న్నది. గుర్తించిన అటవీ భూములలో డిసెంబర్‌ 2005కన్నా ముందునుంచి నివసిస్తున్న, సాగు చేస్తున్న ఆదివాసులకు, అడవిపై ఆధారపడి జీవి స్తున్నవారికి, ఆవాసాలు ఏర్పరచుకున్న పివిటిజిలకు ఉన్న హక్కులు గుర్తించి, దఖలు చేయాలని పేర్కొం టున్న అటవీహక్కుల గుర్తింపు చట్టం 2006లో అమలులోకి వచ్చింది. వ్యక్తిగత హక్కులు, అటవీ వనరులపై సామూహిక హక్కులు, ఆవాసాలపై పివిటిజిలకు హక్కులు, వాటి నిర్వహణ, యాజ మాన్యం,వినియోగం గ్రామసభ అధీనంలో ఉంటా యని ఈ చట్టం చెబుతున్నది. భూములు, అటవీ భూములను ఇతర ప్రాజెక్టులకు మరలించాలన్నా గ్రామసభల అనుమతి తప్పనిసరి అని ఈ చట్టాలు చెబుతున్నాయి. ఇంత పకడ్బందీగా రాజ్యాంగ రక్షణలతో ఉన్నా షెడ్యూల్‌ ప్రాంతంలోని ఈ అం శాలను కొత్త వ్యవసాయ చట్టాలు పట్టించు కున్నా యా?ఈ కొత్త చట్టాలు దేశంలోని అన్ని ప్రాంతా లకు సంబంధించినవి కాబట్టి వీటి ప్రభావం షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఎలా ఉంటుందో పరిశీలిం చటం అవసరం.గత 30 సంవత్సరాలుగా ఆదివా సులు తిండి కొరకు ఎంతో కొంత పంటలు పండిర చుకుంటున్నారు. మార్కెట్‌ డిమాండ్లకు అనుగు ణంగా వాణిజ్య పంటలను పండిరచే రైతులుగా వాళ్లు మార్కెట్‌ చట్రంలో ఇరుక్కున్నారు. అడవుల పెంపకం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గిం చేది లేదా వాతావరణ మార్పులకు పరిష్కారం అనే కర్బన ఉద్గారాల అమ్మకాల మార్కెట్‌ కూడా అంతర్జాతీయంగా 2000 సంవత్సరం నుంచి మొద లైంది. ఉదాహరణకు బయోడీజిల్‌ తోటల పెంప కం చేపట్టిన ఆదిలాబాద్‌ జిల్లా పవర్‌గూడా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుతో ప్రపంచబ్యాంకు కర్బన వ్యాపార ఒప్పందాలను 2003లో చేసుకోవటం గమనార్హం. భూమి నీరు, అడవి, గాలి వ్యాపారానికి సరుకులుగా మారుతున్న క్రమం మనం గమని స్తున్నాం. ఈ మధ్య రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పడి పంటలు, ఫలసాయాల సేకరణ, శుద్ధి, ప్యాకింగ్‌, అమ్మకాలు జరుగుతున్నాయి. ఆదివాసి ప్రాంతా లలో ప్రభుత్వం ఇటీవల సేంద్రియ పద్ధతిలో ఆహారపంటల ఉత్పత్తిని జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవ సాయం పేరుతో ప్రారంభించింది.మార్కెట్ల డిమాం డ్‌కు అనుగుణంగా వాణిజ్య పంటలైనా, సేంద్రియ పంటలైనా పండిరచే రైతులుగా ఆదివాసీలు మారుతున్న పరిణామం ఇది.పెట్టుబడిదారీ విధానా లు ఆదివాసి జీవితాలను సంక్షోభాలకు గురిచే స్తుంటే మరో పక్కన ప్రాజెక్టులు, గనులు, పరిశ్రమ లు,అభయారణ్యాలు, జాతీయ పార్కులు, హైవేలతో ఆదివాసులునిరంతరం నిర్వాసితులు అవుతున్నారు. బోయ,వాల్మీకి,లంబలంబాడీ,ఐతా లంబాడీ తది తర కులాలనూ ఎస్టీజాబితాలో కలపాలనే ఉద్దేశ్యం లో జస్టిస్‌ చెల్లప్ప కమిషన్‌ వేశారు. దాని మూలం గా ఆదివాసీల మనుగడ అతి దారుణంగా ప్రశ్నార్థక మౌతుంది.ఇదిరాజ్యాంగ విరుద్ధం. ఎస్టీ జాబితాలో కలపాలన్నా,తీసివేయాలన్నా రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం కావాలి. వలసవాద రిజర్వేషన్లు రాజ్యాం గ విరుద్ధం. ఇప్పటికీ ఎస్టీలో లంబాడీ, యనాదులు, ఎరుకుల కులాలను 1976లో (ఇందిరాగాంధీ) కాంగ్రెస్‌ ప్రభుత్వం కలిపింది. దీని పర్యవసానం 95శాతం ఉద్యోగాలు లంబాడీలు దోచుకున్నారు. ఆదివాసీల పరిస్థితి అన్నీవున్నా అల్లుడు నోట్లో శని అన్నట్లుగా వుంది. అందుకే జస్టిస్‌ చెల్లప్ప కమిషన్‌ రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా పోరాడుతున్నాయి.స్వాతంత్య్రమొచ్చి 68 సంవత్స రాలు కావస్తున్నా ఆదివాసీ ఐఎఎస్‌, ఐపిఎస్‌ లేడు అంటే మన ప్రజాస్వామిక వ్యవస్థ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఏ ప్రజాస్వామిక హక్కులు గురించి తెరాస అప్పుడు మాట్లాడిరదో, అదే పౌర హక్కుల ఉల్లంఘన, అదే ప్రజాస్వామిక ఉల్లంఘన నేడు పకడ్బందీగా జరుగుతున్నది.ఆదివాసీ సమా జంపై ఇంతపెద్ద ఎత్తున విధ్వంసం,హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే తెలంగాణ బుద్దిజీవులు, మేధావులు ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు.ఆదివాసీ సమాజంపై కళాకారులు, రచయి తలు, మేధావులు ఇప్పుడు నిశబ్దంగా ఎందుకు వుంటున్నారు. ఈబూర్జువా పాలకవర్గానికి మేధావు లందరూ సరెండర్‌ ఎందుకు అవుతున్నారు. నామి నేట్‌ పదవుల కోసం, కార్పొరేట్‌ పదవుల కోసం, రాజ్యాంగబద్ద పదవుల కోసం, ఎమ్మెల్సీల కోసం ఈ బుద్ధి జీవులు ఎందుకంత తహతహలాడు తున్నారు. ప్రజల పక్షం, పీడిత వర్గాల కోసం, ఆదివాసీ సమాజం కోసం నిలబడాల్సిన మేథావులు ఈ వ్యవస్థకూ, ఈ సమాజానికి ‘’అధికారం’’ కోసం తహతహలాడుతున్నారు. ప్రజాస్వామ్యం అనే ముసు గులో మైనార్టీలకూ విలువ లేకుండా పోతున్నది. నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం అవతరణ వారోత్సవాల జరుపుకుంటే ఆదివాసీలు ఆర్తనా దాలతో మరో సమరానికి సిద్ధమౌతున్నారు. సామా జిక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నారు. నవతె లంగాణలో బంగారు తెలంగాణ కోసం ఆదివాసీ లనూ బలిచేయడం అత్యంత దారుణం. అభివృద్ధి కోసం ఆదిమతెగలనూ అంతం చేయడం మహా పాపం. నిజమైన సామాజిక తెలంగాణ కోసం ఆదివాసీ,అణగారినవర్గాల పౌర ప్రజతంత్ర హక్కుల కొరకూ మరో పోరాటం చేయాల్సిన సమ యం ఆసన్నమైనది. ఆదివాసీల ఆర్తనాదాలు పట్టించుకోకపోతే ఈ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం. – జిఎన్‌వి సతీష్‌