అడవి బిడ్డల ఆత్మి చిత్రం

ప్రతి రచయిత తన రచనలు వెలు వరించడానికి అనుభూతి లేదా ఆవేదన ఒక్కోసారి రెండు కావచ్చు అలా ఆవిర్భ వించిన రచనలకే పట్టుత్వం వుండి, పదికాలాల పాటు ప్రజల అక్షర హృదయాలలో నిలిచిపోతాయి. అలా కాక ఊహాత్మకత కోసమో. సానుభూతి కోసమో, సందర్భోచితమో అయిఉండి వ్రాసే రచనలకు బోలెడు బలహీనతలు ఉంటా యి.రచయిత డా.దిలావర్‌ ఉద్యోగ రీత్యా ఉపాధ్యాయుడు,ఉపన్యాసుడుగా…సుమారు పాతికేళ్లు అచ్చంగా అడవి బిడ్డల ఆవాసాల నడుమ జీవనం చేసిన అను భవం తాలూకు అనుభూతులతో రాయబడిరది ఈడజను కథల ‘కొండ కోనల్లో….’ కథా సంపుటి,దీనిలో ప్రతికథ ఓగిరిజన ప్రాంతం జీవన్మరణగోస, సమస్య చూస్తూ రాయకుండా ఉండలేనితనం రచ యితది.ఈ కథలు వెలువటానికి అది కూడా ఓకారణం!!.రచయిత డా:దినార్‌ విశ్రాంత తెలుగు ఉపన్యాసకుడైన రచయిత,భిన్నమైన ప్రక్రియలు చేపట్టినా కథా రచయితగా చేయి తిరిగిన వ్యక్తి, 2014 సంవత్సరంలో వెలువరించిన ఈ కొండ కోనల్లో…కథా సంపుటిలోని కథలన్నీ గిరిజనుల జీవితాలకు, సాంఘిక పరిస్థితులకు అద్దంపడ తాయి. కారడివిలో కాంతికిరణం,పాటకు మరణం లేదు, వేట,తునికాకు,చెట్లు కూలుతున్న దృశ్యం,అరణ్య రోదన,కొండ కోనల్లో… మొదలైన కథలన్నీ గిరిజన జాతుల బతుకు చిత్రాలను నింపుకున్నాయి.ఈ కథల్లోనే ప్రాంతాలు పాత్రలపేర్లు అన్ని ఇలా స్వీయ పర్యటనలు అనుకోవాలి అలాగే కథల్లో వాడిన జాతీయాలు,సామెతలు, ఉపమా నాలు, అన్నీ అందమైన అటవీ వాతావరణం అన్వయించి రాయడం ద్వారా రచయితలోని పరిణితి అనుభవం తేటతెల్లం కావడంతో పాటు, సుందర శైలి ఆసక్తికర అధ్యయ నానికి ఆయువుగా నిలుస్తాయి.అసౌకర్యాలకు నిలయమైన అడవుల్లోని అడవి బిడ్డల జీవితాల్లో అన్ని చక్కగానే అనిపిస్తాయి, ఆరోగ్య సమస్యలు రవాణా సదుపాయాలు లేమి తప్ప.!! వీటి వల్లే అన్ని కాలాల్లో కన్నా ‘వానాకాలం’లో అధిక సంఖ్యలో అడవి బిడ్డలు అనారోగ్యాల పాలై సకాలంలో సరైన వైద్యం అందక పిట్టల్లా రాలిపోతున్న ‘అనారోగ్య సమస్యలు’ అడవుల్లో అంతటా అగుపిస్తాయి.ఈ నేప థ్యంలో సాగిన కథ ‘‘కారడివిలో కాంతి కిరణం’’ వెంకటాపురం మండలంలోని ఒక గిరిజన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‌గా వచ్చి న కిరణ్‌ అనే యువ వైద్య విద్యార్థి తన కార్యదీక్షతో అక్కడి గిరిజనుల ఆలోచనలో ఎలాంటి ధైర్యాన్ని, మార్పును, పెంపొందించ గలిగాడో తెలిపిన కథ ‘‘కారడివి లో కాంతి కిరణం’’, పిల్లలైనా, అడవి బిడ్డలైన,ఉపన్యా సాలు విని ప్రేరణ పొంది మారరు, కేవలం ఆచరణా త్మకమైన కార్యాల ద్వారానే మార్పుకు దారులు వేయవచ్చు అని చెబుతారు ఈ కథ ద్వారా రచయిత దిలావర్‌. కొత్తగా డాక్టర్‌ ఉద్యోగంలో చేరిన కిరణ్‌ గిరిజన గుడాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆధునిక వైద్యం వైపు కాక పాత వైద్య విధానాలకు, పసరు వైద్యాలకు, వారు ఎందుకు మొగ్గు చూపుతున్నారు, చేతబడి, దేవర్ల పూనకాలను ఎందుకు నమ్ముతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథలో దొరుకుతాయి. ‘‘గిరిజనుల వద్దకే సర్కారు వైద్యం’’ అన్న నినాదం నీరుగారడానికి గల కారణాల్లో శాఖ పరమైన అవినీతి, ఉద్యోగుల్లో అలసత్వం, ప్రధానంగా చూపిస్తారు. గిరిజన గుడేల్లో ప్రభుత్వాలు ఆనాడు చేపట్టిన మొక్కుబడి వైద్య విధానాల వల్లే గిరిజనులు తమనాటు వైద్యాల నుంచి బయటపడలేక పోతున్నారనే సత్యాన్ని కూడా ధైర్యంగా చెబుతారు ఇందులో. కిరణ్‌ తనదైన అంకిత భావంతో చేసిన పనులు ముఖ్యంగా గిరిజనగుడేనికి చెందిన సారమ్మ అనే గిరిజన గర్బిణి నిండు వానాకాలంలో ప్రాణాపాయ పరిస్థితిల్లో నుండి గూడెం యువకుల సాయంతో ఆమెను వాగు దాటించి సరైన సమయంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం అక్కడ తను పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం ఈ కథలోని సారం, ఆ గర్భి ణీని తనదైన ఆధునిక వైద్యం ద్వారా కిరణ్‌ ఎలా కాపాడాడో ప్రత్యక్షంగా చూసిన గిరిజనుల ఆలోచనల్లో మార్పు రావడమే ఈ కథకు ప్రాణప్రదమైన ముగింపు.కాయకష్టాలకు చిరునామాదారులైన గిరిజనులు సంఘటిత కార్మికులు కాదు, భరోసా లేని సాధారణ కూలీలే,!! వారి వారి పనుల్లో అటవీ ఉత్పత్తుల సేకరణ సమయాల్లో జరిగే ప్రమాదాలకు ఎందరో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న వైనం దానికి స్వార్థపరులైన కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారుల కారణం గురించి రచయిత ‘‘తునికాకు’’ కథలో చక్కగా చెబుతూ అందరిలో ఆలోచన కలిగించారు. గిరిజనులకు కన్నతల్లి తర్వాత తల్లి వంటి అడవిని సంరక్షించుకోవడం వారి ఆచార సంప్రదాయాల్లో అంతర్భాగంగా మొదటి నుంచి వస్తుంది, కానీ ఆధునిక సమాజంలో అడుగడుగునా మోసులెత్తుతున్న అవినీతి, స్వార్థం, సాయంగా అంతరించిపోతున్న అడవులు తద్వారా దెబ్బతింటున్న పర్యావరణ సమతుల్యం, గురించి ఓ గిరిజన యువకుడి ఆవేదన సాయంగా కళ్ళకు కట్టారు ‘‘చెట్లు కూలుతున్న దృశ్యం’’ లో కథా రచయిత. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలపై పరిశోధన చేసిన ‘‘తేజ’’ అనే యువకుడు తన భార్య ఉష ఇతర మిత్రుల కుటుం బాలతో భద్రాచలం – పాపికొండల విహారయాత్రకు వెళ్లిన వైనం విహార యాత్ర సంబంధంగా భార్య ఉషకు జాతీయ,అంతర్జాతీయంగా గిరిజనుల చరిత వారి జీవన విధానం గురించి సహేతు కంగా చెబుతూ…కొమరం భీము నుంచి నేటి తరం గిరిజన పోరాట వీరుల దయాగుణం గురించి చెబుతూ.. పాపి కొండలు, పేరంటాలపల్లి, తదితర స్థల ప్రాసస్థ్యాల గురించి రచయిత ఈకథలో చక్కగా వివరించారు. అంతేకాక భద్రా చలం ఆలయానికి రామదాసుకు, తూము నరసింహదాసుకు, ఇచ్చిన ప్రాధాన్యత రామ కథకు కారణభూతురాలు అయిన గిరిజన మహిళ శబరికి ఎందుకు ఈయలేదనే ధర్మసందేహంతో పాటు అనేక పాత్రల స్వభావాలను పరామర్శిస్తూ వ్రాసిన చక్కని చరిత్రాత్మక విషయాల మేళవింపు గల కథ ‘‘కొండకోనల్లో…..’’ ఇంత చక్కని ప్రాముఖ్యత గల ఈ ‘‘మన్య సీమ’’ పోలవరం ముంపుతో అంతర్థానం అయిపోయినట్టు కలగన్న తేజ మానసిక స్థితి గురించి తన భావాలు జోడిరచి ఎంతో హృద్యంగా చెబుతారు రచయిత. ఇంచుమించు అదే భావనతో వ్రాసిన ఆ ‘‘ఏడు మండలాలు’’ కథ, పోలీసుల దాష్టి కాలకు అమాయకపు గిరిజ నులు బలవుతున్న వైనం తెలిపే ‘‘పాటకు మరణం లేదు’’ మృగ్యమవుతున్న అటవీ సంపద గురించిన ‘‘వేట’’ ‘‘బొందల గడ్డ’’ తదితర కథలు వేటికవే భిన్నంగా ఉండి గిరిజన సంస్కృతి,అందాల అడవిని, అంతే అందంగా అక్షరీకరించారు రచయిత డా: దిలావర్‌ . కథల్లో ఉపయోగించిన భాష, వ్యాకరణాం శాలు, సంస్కృతి,తదితర అంశాల ద్వారా రచయిత యొక్క పరిశీలన గుణం,సంస్కృతి శైలి వెల్లడవుతాయి. మనిషి శరీరంలోని నరాల్లా అడవి దేహం నిండా అల్లిబిల్లిగా అల్లుకున్న కాలిబాటలు, వాగు పలుపు విడిచిన లేగ దూడలుగా…. సుడులు,సుడులు,తిరిగి ప్రవహిస్తుంది, వాగులు వంకలు ఎండిపోయి అస్తిపంజ రాల్ల పడిఉన్నాయి, వంటి ఉదాహ రణలు మచ్చుకు కొన్ని మాత్రమే…!! ఇలా ప్రతి అంశాల్లో, విశేషాలు, కల్పనలు, వెరసి ఈ కథా సంపుటం నిండా అచ్చమైన అడవి వాతావరణం ఆవిష్కరించబడిరది. సందర్బో Ûచితమైన సంభాషణ శైలి రచయిత యొక్క విధివిధానాల గుండా ఈ కథలను అధ్యయనం చేయడం ద్వారా చక్కని వైజ్ఞానిక, సామాజిక, సమాచారం అందుకోవచ్చు.
పుస్తకం :- కొండుకోనల్లో..- (ఆదివాసి కథలు)
పేజీలు:152, ధర:-100/-
రచయిత: డా: డిలావర్‌,
సెల్‌:986692329.
సమీక్షకుడు : డా:అమ్మిన శ్రీనివాస రాజు 7729883223.