అంతరించిపోతున్న భాషల సంరక్షణ

శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాతృభాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచీకరణ, సరళీకృత, ఆర్థిక విధానాలు, మరో ప్రక్క అమెరికన్‌ సామ్రాజ్య వాద సంస్కృతి తాకిడికి బలవుతున్న మాతృభాషల ఉనికి, మనుగడ కనుమరుగవక తప్పని పరిస్థితి దాపురించింది. ఆంగ్ల భాష నేడు అంతర్జాతీయంగా రూపాంతరం చెందడం కూడా వారి చలువే నన్నది జగమెరిగిన సత్యం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో మాతృభాషలు అంతరించి పోతున్నాయి. అందుకు నిలువెత్తు సాక్షంగా ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాలల్లో తెలుగు భాషను ఆంగ్ల భాష అధిక మించినట్లు, తెలుగు కూడా అదే రీతిలో ఇతర భాషలను గిరిజన భాషలను సైతం అధిక మిస్తున్నాయి. ఆదిమ గిరిజన భాషలకు నేటికీ గుర్తింపు లేదు. లిపి లేదు. వీరు మాట్లాడే భాషలు మౌఖికంగా నోటికే పరిమితం కావడం మూలాన అత్యంత నిరాదరణకు గురవుతు న్నాయి. పర్యవసానంగా ఆదివాసీ తెగల ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.
ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆదివాసీలు ఆస్ట్రేలియా (అబోరి జన్లు), న్యూజిలాండ్‌ (మావోరీలు),జపాన్‌ (అయినీలరు),ఉత్తర దక్షిణ అమెరికా (రెడ్‌ ఇండియన్‌) ఉత్తర యూరప్‌ (సామీలు), ఆఫ్రికా (బుష్‌మెన్‌), ధృవ ప్రాంతాలు (ఇన్‌ విత్‌), అండమాన్‌, నికోబార్‌ (జారువా),ఇండియా (ఆదివాసీ గిరిజనులు),అరేబియా,మలేసియా, సూడాన్‌,అమెజాన్‌,రొడీసియా,ఇండోనేసియా, లక్షద్వీప్‌ మొదలైన 70దేశాలలో5వేల తెగలకు చెందిన 37కోట్ల మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 6700భాషలను మాట్లాడుతున్నారు. ఆఫ్రికా,ఇండోనేసియా,అండమాన్‌,నికోబార్‌ వంటి దీవుల్లో నివసించే బుష్‌మెన్‌, జారువా వంటి ఆదిమ తెగల వారి సంస్కృతితో పాటు భాషలు, ఉనికి అంతరించిపోతున్నాయి.భారత రాజ్యాంగంలోని 5,6 షెడ్యూల్‌లో పేర్కొన్న గిరిజన రాష్ట్రాల్లో 698 తెగలకు చెందిన 10 కోట్ల మంది జనాభా వుంది. మన దేశంలో మొత్తం 1652 భాషలుండగా, గిరిజనులు మాట్లాడే భాషలే సుమారుగా 600 దాకా ఉన్నాయి.భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్‌లో ఇప్పటికి 22 భాషలు అధికా రికంగా గుర్తించబడగా, అందులో గిరిజనులు మాట్లాడే మణిపురి, డోంగ్రీ, బోడో, కొంకిణి, సంథాలీ భాషలకు మాత్రమే చోటు దక్కింది. మిగిలిన ఆదిమ భాషలు అంతరించే దశలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు ప్రజలతో పాటు అటవీ సమీపాల్లో, కొండకోనల్లో నివసించే సవర,గదబ,జాతపు, గోండు,కోలాం,పర్ధాన్‌,తోటి,కోయ,కొండ, రెడ్లు, చెంచు,నాయక్‌ పోడు,యానాది మైదాన ప్రాంతాల్లో బంజార,ఎరుకల,నక్కల,కుర్వికరన్‌, పైకో పుతియా వంటి 35 తెగలు,మరో 30ఉప తెగలకు చెందిన 59,64,680 మంది (2011 జనాభా లెక్కల ప్రకారం) గిరిజనులు ఉన్నారు. వీటిలో చాలా గిరిజనతెగలకు వారి వారి మాతృభాలున్నాయి.కొన్ని భాషలకు (సవర, గోండీ, ఆదివాసీ,ఒరియా) అరుదుగా లిపి ఉన్నాయి.భాషకు,సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంది.కాని వారి మాతృ భాషలకు లిపికి ఎటువంటి సంబంధం లేదు. అయినా ప్రపంచంలో సంస్కృతీ సాంప్రదాయాలు పాటి స్తున్నది కేవలం ఆదివాసీలేనన్నది ఆది(మ) సత్యం. భాష ద్వారానే సంస్కృతీ సాంప్రదా యాలు ఆచారాలతో ఆదివాసులు అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నారు. కాని పాలక వర్గాలు ఆదిమ జతుల భాషలకు లిపి లేదన్న సాకుతోనే ఇతర భాషలను వారిపై రుద్దడంతో విద్యా భివృద్ధికి, సమగ్రాభివృద్ధికి దూరమవుతున్నారు. ప్రపంచీకరణ పేరుతో పాలక వర్గాలు ఆదిమ జాతుల ఉనికిని ఆటంక పరుస్తూ ఒకే స్థాయి సంస్కృతిని స్థాపించడానికి నిరంతరం ప్రయత్ని స్తున్నారు. అందువల్ల మాతృభాషల,ఆదిమ భాషల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒక భాషను, మరొక లిపిలోనూ రాయవచ్చు. ఆ భాషా భివృద్ధి నిర్దిష్ట ప్రణాళిక, చిత్తశుద్ధితో అమలు పరచడం అవసరం. మాతృభాషల సంరక్షణలో భాగంగా నిజాంరాజు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆదివాసీల ప్రత్యేక సంస్కృతిని గుర్తించి పాఠశాల స్థాయిలో తెలుగు లిపిలోనే శిక్షణ నిప్పించి మొదట గోండు భాషను పరిచయం చేశాడు. అప్పటి నిజాం ప్రభుత్వంలో మానవ పరిణామ శాస్త్రవేత్త హైమండార్ప్‌ పరిశోధనా కృషి ఫలితంగా గోండు భాష శిక్షణ కోసం ఆదిలాబాద్‌ జిల్లా జైనూరు మండలంలోని మార్లవాయిలో ‘టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌’’ స్థాపించబడినది.1956 హైదరాబాద్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాత ఆదివాసీ గిరిజన పిల్లల మీద తెలుగు బలవంతంగా ‘రుద్ద’బడిరది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ల క్రితం రాజీవ్‌ విద్యామిషన్‌ (ఆర్‌.వి.ఎం)ద్వారా గోండు, కోయ,సవర,చెంచు,ఒరియా,కొలామి,కొండరెడ్డి, బంజార వంటి భాషలలో తెలుగు లిపితో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు వాచకాలను ముద్రించి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పింది. ఆయా భాషా సంబంధ బోధకు లను కూడా నియమించింది. కాని కొన్ని సాంకే తిక లోపాల వల్ల నేడు పాఠశాలలు పని చేయడం లేదు.
గోండీ భాష లిపి
గోండు గిరిజనులు మాట్లాడే భాషగోడీ.గోండు అంటే జంతువును కాపాడేవాడు అని అర్థం. మధ్య భారత దేశంలో గోండ్వానా రాజ్యాన్ని ఏలిన గోండు గిరిజనుల జనాభా సుమారు 20 లక్షలు. మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, రాష్ట్రాల్లో సగం మంది గోండులు నేటికీ గోండి భాషలోనే సంభాషి స్తున్నారు. ఇది వారికి అమ్మ భాష. లిఖిత భాషను గర్భ భాష అంటారు. వీరి సాంస్కృతిక నృత్యం గుస్సాడీ గిరిజన గోండి భాషపై అలనాడు ప్రాకృతం, ఆ తర్వాత సంస్కృతం, అరబీ, పారసీకం, ఉర్దూ, హిందీ, మరాఠీ, తెలుగు భాషలు పెత్తనం చెలాయించాయి. అందుకు సాక్షమే.. గోండీకి లిపి ఉందనే అక్షర సత్యం. 2014 మార్చి నెలలో ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూరు మండలం గుంజాల గ్రామంలో 12 పురాతన గోండీ లిపి రాత ప్రతులు అభ్యమయ్యాయి. దాదాపు పది వేల సంవత్సరాల క్రితం సింధూ నది పరివాహక ప్రాంతంలో విలసిల్లిన హరప్పా, మొహంజ దారో కాలం నాటి నుంచి గోండులకు లిపి, ప్రత్యేక సంస్కృతి ఉన్నట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఈ రాత ప్రతులలో ఆదిమ గిరిజనుల సంస్కృతీ,సాంప్రదాయాలు,ఆచార వ్యవహారాలు,చరిత్ర,గణితం,జ్యోతిష్యం,కథలు, గోండు రాజుల పాలన,గోండీ సాహిత్యం, దేశంలో ఆంగ్లేయుల పాలన,రాంజీ గోండు పోరాటం వంటి వివరాలున్నాయి. ఈరాతలను చదివే పెద్ద మనుషులు ప్రస్తుతం ముగ్గురు (కొట్నాత్‌ జంగు, అర్క జయవంతరావు, పెంథోల్‌ భీం రావు) మాత్రమే ఉన్నారు. గోండీ భాషాధ్యయన కేంద్రాన్ని రాష్ట్ర రాత ప్రతుల సంస్థ పూర్వ సంచాలకులు ఆచార్య జయధీర్‌ తిరుమల రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కోయ భాష లిపి
కోయ గిరిజనులు అనగానే తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర గుర్తుకొస్తుంది. ఇది ఆసియాలోనే కోయ గిరిజనులు జరుపుకొనే అతి పెద్ద జాతర. కాకతీయుల కాలం (13 శతాబ్దం)లో కోయ గిరిజనులు వారికి కప్పం కట్టలేని పరిస్థితుల్లో సమ్మక్క సారక్కలు కాకతీయ సైన్యాన్ని ఎదిరించారు. ఆ పోరులో వీరత్వం పొందిన తరువాత సమ్మక్క సారక్క, జంపన్నలు దైవత్వం పొందారని కోయ గిరిజనుల ప్రగాఢ నమ్మ కంతో జాతర నిర్వహిస్తున్నారు. కోయ గిరిజ నులు ఒక నిర్దిష్టమైన తెగ.చరిత్రకారులు చెబుతున్నట్టు కోయ జాతి మూలాలు క్రీ.పూ. 25,000 నుండి 10,000 లోపల, మధ్య శిలా యుగంలోనే ఉన్నట్లు శిలా యుగపు అవశేషాలు కొన్ని ఖమ్మం జిల్లాల్లో (200708 మధ్య) లభించాయి. దీని ద్వారా ఆస్ట్రలాయిడ్‌ జాతికి చెందిన కోయ, సవరలకు చెందిన ఆదివాసీలు గిరిజన జాతులుగా పరిణమించాయి.గోదావరి నదికి అనుసంధానమైన శబరి,కిన్నెరసాని, మున్నేరు,పాలేరు వైరా వంటి ఉప నదులు గల సారవంతమైన ప్రాంతాల్లో కోయ,కొండరెడ్ల తెగలు స్థిరపడినవి.వీరి మాతృభాష కోయ భాష. రేలా అనేది వీరి సాంస్కృతిక నృత్యం. వరంగల్‌,ఖమ్మం,కరీంనగర్‌ దండకారణ్యంలో నివసించే వీరి జనాభా 20లక్షలదాకా ఉం టుంది. ప్రస్తుతం వీరి భద్రాచలం,చింతూరు, కూనవరం,పోచారం,బూర్గుంపాడు,పినపాక, అశ్వాపురం, మణుగూరు ప్రాంతాల్లో వున్న కొందరు మాత్రం (20శాతం)కోయ భాష మాట్లాడుతున్నారు. కాకతీయుల కాలంలో సాగు భూములకు శిస్తులు కట్టలేకపోవడంతో ఇతరులకు తెలియని కోయ భాషను అంతరింప జేశారనేది ఒక వాదన. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర పెత్తందార్ల వలసలు పెరిగిపోవ డంతో అర్థం కాని కోయ భాషపై దాడి జరిగిం దనేది మరొక వాదన. ఏదేమైనా ఈ మౌఖిక భాషకు లిపిగాని, ముద్రణగాని లేకపోవడంతో ఆదివాసీ భాషలు అంతరించిపోతున్నాయి అనే భాషావేత్తల అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం తెలుగు నేల మీద ప్రభుత్వం గుర్తించిన 34 ఆదివాసీ తెగల భాషలు అంతరించే దశకు చేరుకున్నాయి. ఈ భాషలకు లిఖిత రూపం లేకపోవడం వల్ల నోటి భాషలుగా మిగిలి పోతున్నాయి. వీటికి తోడు ముద్రణ, నిరంతర భాషణం ఉంటేనే భాషకు సజీవత్వం ఉం టుంది. ప్రభుత్వం గాని, భాషా పండితులు గాని,రాష్ట్ర రాత ప్రతుల సంస్థగాని ఈ పురా తన ఆదిమ భాషల పరిరక్షణఖు అధ్యయనం జరపటం లేదు. 2013 తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల ఫలితంగా ప్రభుత్వం తెలుగు భాషకు ప్రత్యేక సాంస్కృతిక, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం శుభ పరిణామం. కాని ప్రాంతీయ భాషలు, మాతృభాషల లిపి గురించిన ప్రస్తావన రాలేదు. తక్షణావసరంగా వాంఛనీయమైన ప్రాంతీయ భాషలను మాతృభాషలుగా, అధికార భాషలుగా గుర్తించాల్సిన అవసరమున్నది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మాతృభాషల్లోనే ముఖ్య పరిపాలనా వ్యవహారాలు కొనసాగాలి. న్యాయ స్థానాల్లోనూ కోర్టు తీర్పులు వారివారి మాతృభాషల్లో వెలువడినట్లయితే గ్రామీణులు, ఆదిమ తెగల గిరిజనులు సైతం న్యాయం పొందుతారు. నేడు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అంత రించిపోతున్న కోయ, గోండీ, రోలాం,సవర, చెంచు, గడబ, కొండరెడ్ల భాషల లిపి, భాషా భివృద్ధిపై పరిశోధన చేసే వారికి ప్రభు త్వం చేయూత నివ్వాలి. కనీసం ప్రాథమిక స్థాయి నుండి మాధ్యమిక స్థాయి వరకు విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించుటకు తగిన నిధులు కేటాయించాలి. ఆయా భాషలకు చెంది న బోధకులను నియమించి,ప్రత్యేక ఆశ్రమ పాఠ శాలలు నెలకొల్పితే ప్రయోజనం ఉంటుంది.
సవరి భాషలిపి భారతావనిలో ఆదిమ జాతుల పేరు చెప్పగానే గుర్తుచ్చేది ఆది తెగ సవర.ఆర్యుల మన దేశా నికి రావడానికి పూర్వమే ఈ గిరిజన తెగ మధ్య భారతదేశంలో నివసించేరని చారిత్రక, పురావస్తు ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో సుమారు ఐదులక్షల మంది సవరల జనాభా ఉంది నేడు సవరలు ఇతర గిరిజన తెగలతో కలసి మిశ్ర జాతిగా ఏర్పడ్డారు. సవరల నృత్యంను,థింసా అని,చిత్రకళను ఎడిసింగ్‌/తింగోర్‌ అని అంటారు. ఆదిమ సవరల భాష అతి ప్రాచీన భాష. సవరభాషకు లిపి నిఘంటువుని రూపొం దించిన గిడుగు రామ్మూర్తి పంతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సవరలకు అక్షర బ్రహ్మగా వెలుగొందారు. బాహ్య సమాజం అంటే ఏమిటో తెలియని ఆదిమ ప్రపంచం సవరలది. వీరు ఆధునిక సమాజంలో జీవింమచాలంటే వీరి భాషలనే బోధించాల్సి ఉంటుందని గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. సవర వాచకా లను,కథలపుస్తకాలను,పాటల పుస్తకాలను, తెలుగుసవర,సవర`తెలుగు నిఘంటవులను తయారు చేశారు. 1911లో ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం ఈ పుస్తకాలకు పారితోషికం ఇవ్వజూపితే ఆడబ్బుతో ఒక మంచి బడిపెట్ట మని ప్రభత్వాన్ని కోరారు. ఆయన కోరిక ప్రకారమే ప్రభుత్వం ప్రత్యేక సవర శిక్షణా పాఠశాలలను ప్రారంభించింది.సవర గిరిజ నులు, గిరిజనేతరులు కలిసి నివసిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని పర్లాకిమిడి పట్టణానికి 200 గ్రామా లను 1935లో తెలుగు రాష్ట్రం నుంచి ఒడిషా రాష్ట్రంలో చేర్చడాన్ని గిడుగు నిరసించారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం తెలుగు నేల మీద ప్రభుత్వం గుర్తించిన 34 ఆదివాసీ తెగల భాషలు అంతరించే దకు చేరుకున్నాయి.ఈ భాషలకు లికిత రూపం లేకపోవడంవల్ల నోటి భాషలుగా మిగిలిపోతున్నాయి. ప్రభుత్వంగానీ, భాషా పండితులుగాని,రాష్ట్రరాత ప్రతుల సంస్థగాని,ఈ పురాతన ఆదిమ భాషల పరిరక్షణకు అధ్యయన జరపట లేదు. తక్షణా వసరాలుగా వాంఛనీ యమైన ప్రాంతీయ భాషలను మాతృభాషలుగా, అధికారభాషలుగా గుర్తించాల్సిన అవసర ముంది. నేడు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలోని ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో అంతరించిపోతున్న కోయ,గోండీ, కోలాం, సవర,చెంచు, గదబ, కొండరెడ్ల భాషల లిపి,భాషాభివృద్ధిపై పరిశోధన చేసేవారికి ప్రభుత్వం చేయూత నివ్వాలి.ఆయా భాషలకు చెందిన బోధకులను నియమించి ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు నెల కొల్పతే ఆదిమ భాషలు సజీవంగా ఉంటాయి.
భాషను రక్షించుకునే సామాన్యులు
అయితే, అంతరించిపోతున్న తమ భాషలను సంరక్షించుకునేందుకు కొన్ని కమ్యూనిటీలు కూడా బాధ్యత తీసుకుంటాయి. అలాంటి ఒక ప్రయత్నాన్ని ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఓ గ్రామానికి చెందిన రైతు వాంగ్లంగ్‌ మొసాంగ్‌ చేపట్టారు. మొసాంగ్‌ ఈశాన్య భారతదేశంలోని అనే సినో-టిబెటన్‌ భాష కుటుంబానికి టాంగ్సా అనే భాషను మాట్లాడే తెగకు చెందిన వారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని టాంగ్సా తెగ 40 ఉపజాతులుగా కనిపిస్తుంది. ప్రతి ఉపజాతికి దాని సొంత యాస ఉంటుం ది.టాంగ్సా కమ్యూనిటీ జనాభా దాదాపు 100,000.అయితే విభిన్న మాండలికాల కార ణంగా భాషా అంతరించిపోయే ప్రమాదంలో పడిరది.కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2013 లో అంతరించిపోతున్న భాషల రక్షణ, సంరక్షణ పథకం (ఎస్‌పిపిఇఎల్‌)ను ప్రారంభించింది. అంతరించి పోతున్న, భవిష్యత్తులో అంతరించి పోయే ప్రమాదం ఉన్న భాషలను డాక్యుమెంట్‌ చేయడం దీని లక్ష్యం.అంతరించిపోతున్న భాష లను డాక్యుమెంట్‌ చేయడానికి అలాంటిదే ఒక ప్రోగ్రామ్‌ను సిక్కిం యూనివర్సిటీలోని అంత రించిపోతున్న భాషల కేంద్రం తీసుకుంది. ఈ కేంద్రాన్ని 2016లో స్థాపించారు.
-జిఎన్‌వి సతీష్‌