ప్రకృతితో మమేకం..ఆదివీసల జీవనం

గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 18 వేల మందిగిరిజనులకు అటవీ సాగుహక్కు పత్రాలను అందజేసింది.ఏటా గిరిజన రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అంద జేస్తోంది. గిరిజన గూడలను కలిపేలా రోడ్లు నిర్మి స్తోంది. వరదల భారి నుంచి రక్షించేలా 114 రక్షణ గోడలను నిర్మించింది. రక్తహీనతతో బాధపడే గర్భి ణులు, బాలింతలు, చిన్నారులకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణప్లస్ పథకాల కింద పౌష్టికాహారం అందజేస్తోంది. గిరిజనుల వైద్యంకోసం పార్వతీపురం మన్యం జిల్లాకు వైద్యకళాశాలను మంజూరు చేసింది. సీతంపేట,పార్వతీపురంలో సూపర్ స్పెషాలిటీ ఆస్ప త్రులు నిర్మించింది. రోగులను అత్యవసరవేళ ఆస్పత్రు లకు చేర్పించేందుకు 108వాహనాలతో పాటు బైక్ అంబులెన్స్లు ఏర్పాటుచేసింది.గిరిజన గ్రామాల ప్రజ లకు సెల్ సిగ్నల్ సమస్యలకు పరిష్కారం చూపు తోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియంను సీతంపేట పీఎంఆర్సీలో ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఆదివాసీ జీవన విధానం ప్రతిబింబించే చిత్రాలు, విగ్రహాలను అమర్చుతోంది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది.
జీవనం విభిన్నం.. వైవిధ్యం
లి ఆదివాసీలు అటవీ సంస్కృతికి ప్రతీకలు. ఘన చరితకు వారసులు. వారి ఆధ్యాత్మిక చింతన వినూ త్నం. వారి కట్టూ బొట్టూ చూడనలవిగా ఉంటాయి. తెల్లారితే కొండపోడు తాళాలు వంటి వస్తువులను తయారు చేసి నృత్యాలకు ఉపయోగిస్తారు.
లి ఆదివాసీలు ప్రధానంగా దంపుడు బియ్యం, గంటె, జొన్న, కొర్ర, జీలుగ పిండితో జావ చేసుకుని తాగుతారు. అడవిలో లభించే ఆకు కూరలు, దుంప కూరలను ఆహారంగా వినియోగిస్తారు. బొదండం కూర, చిట్టికూర, గురుంకూర, పుల్లేరుగుడ్లను కూరగా వండి తింటారు.
- అక్షరాలను ఆరాధ్యదేవతలుగా పూజిస్తారు. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. ప్రతి గురువారం ఆలయాల్లో పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
- ఆదివాసీ ప్రాంతాల్లో వివాహ ఆచారం వింతగా ఉంటుంది. మైదాన ప్రాంతంలో వరకట్న భూతం వెంటాడుతున్న నేటి రోజుల్లో ఇందుకు భిన్నంగా ఆదివాసీ గ్రామాల్లో వరుడు కుటుంబ సభ్యులు వధువు కుటుంబానికి ఓలి (తిరిగికట్నం) ఖర్చుల నిమిత్తం ఇచ్చే ఆచారం ఉంది.
ఆదివాసీలు నిరంతర శ్రమ జీవులు.అయినా తీరిక వేళల్లో మాత్రం ఆటపాటలు, ఆనందాలకు ప్రాధాన్యం ఇస్తారు.పండగలన్నీ ప్రకృతి, ఫలసాయాల సేకరణ, గ్రామదేవతలకు సంబంధిం చినవే ఉంటాయి. కందికొత్తలు,ఆగం,టెంక పండగలను డప్పుల వాయి ద్యాలతో గ్రామాల్లోని గిరిజనులంతా ఏకమై నిర్వహి స్తారు.
అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం
సాలూరులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం సీతంపేట ఐటీడీఏలోనూ ఆదివాసీపండగకు ఏర్పాట్లు గిరిజనాభివృద్ధికి కృషి నాలుగేళ్లలో గిరిజనుల అభివృ ద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోంది. గిరిజన పండగల నిర్వహణకు అధిక ప్రాధాన్య మిస్తోంది. రాష్ట్రస్థాయి ఆదివాసీ పండగను సాలూరు లో నిర్వహించడం, సీతంపేట ఐటీడీఏలోను ఆదివాసీ పండగను వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉంది.
విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఐటీడీఏ ద్వారా గిరిజనులకు క్షేత్రస్థాయిలో పకడ్బం దీగా పథకాలు అమలు జరిగే చర్యలు తీసుకుంటు న్నాం.గిరిజనకళల అభివృద్ధిలోభాగంగా సవర పెయింటింగ్ కళాకారులకు సీడాప్ ద్వారా శిక్షణ ఇప్పించనున్నాం. గిరిజన అటవీఉత్పత్తులకు మార్కె టింగ్ సదుపాయం కల్పిస్తాం. గిరిజన యువతకు స్కిల్ కళాశాల, స్కిల్స్టాబ్ వంటివి ఏర్పాటు చేశాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
- కల్పనాకుమారి, ఐటీడీఏ పీఓ
గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు
రాష్ట్రంలోని గిరిజనులు సరైన గూడు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా గిరిజనులకు అందించ లేదు. రాష్ట్రంలో నిర్మిస్తున్న కొద్దొగొప్పో ఇళ్లు కేంద్రం మాంజూరు చేసినవే.అయితే గత ప్రభుత్వాలు గిరిజ నుల ఇళ్ల కోసం నిర్వహించిన పథకాలు, కార్య క్రమాలన్నీ ఇప్పటి అధికార ప్రభుత్వం నీరుగార్చింది.
జగన్ తాను అండగా ఉంటానంటే నమ్మి గెలిపించిన గిరిజనులు ప్రస్తుతం ఆయనను నమ్మె స్థితిలో లేరు. తమ నియోజకవర్గాల్లో ఆయన పార్టీనే గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేసినట్లే వారినీ ముంచేశారు జగన్. తాను మాత్రం ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకున్న జగన్, గిరిజనులకు గూడు మాత్రం కల్పించలేకపోయారు.
లక్షల్లో స్థలాలిచ్చాం. ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారని, వారికి సొంతగూడు కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపిం చడం లేదు.సొంతగూడు కల్పించాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా కనీస స్పందన లేదు. రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలోని 52 వేల మంది పీవీటీజీలకు పక్కా గృహమే లేదని కేంద్రం తేల్చింది.రాష్ట్ర ప్రభు త్వం క్షుణ్నంగా సర్వే నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత జగన్ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. పైగా గిరిజనులను ఉద్ధరించేసినట్టుడాంబికాలు మాత్రం పలుకుతున్నారు. ‘‘ఆదివాసీ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేక వారు పూరి గుడిసెల్లో,పెంకుటిళ్లలో,రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్నారు. సరైన ఇంటి వసతి లేక రాత్రి పూట నిద్రిస్తున్న సమయాల్లో పాముకాటుకు గురై మర ణించిన ఘటనలున్నాయి.’’`రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు
శంకుస్థాపన-పూర్తి చేయ కుండానే మధ్యలో నిలిపివేత
జిల్లాల విభజన వేళ గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేటాయించినట్టు గొప్పలు చెప్పారు.కానీ,నాలుగున్నరేళ్లుగా అక్కడ సొంత ఇల్లు లేని అభాగ్యులకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి.6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 17వేల ఇళ్లు మంజూరు చేసేంత వరకు వారి గోడు వినేవారే లేరు. ఈ పథకం కింద మంజూరైంది కూడా కొంతమందికే. ఇంకా అక్కడ దాదాపుగా 32 వేలమంది సొంతింటి కోసం ఇప్పటికీ ఎదురు చూస్తు న్నారంటే ఆదివాసీలపై జగన్కు ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది. ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆదివాసీలు జీవనం సాగిస్తుంటారు.వాటిని గుర్తించిన గత టీడీపీ ప్రభు త్వం సొంతిల్లు కట్టుకునేందుకు వీరికి అదనపు సాయాన్ని మంజూరు చేసింది. అప్పట్లో గ్రామీణ పేదల కోసం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని అమలుచేసి ఇంటి నిర్మాణం కోసం ఎస్టీలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇందులోనూ ఆదివాసీలకు మరింత తోడ్పాటు నిచ్చింది.మైదాన ప్రాంతాల్లో నివ సించే ఎస్టీలకు 2లక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి 2.25లక్షలు, ఆదివాసీలకు 2.5లక్షల సాయాన్ని అందించింది. సాధారణ వర్గా లకు అందే సాయం తో పోలిస్తే లక్ష రూపాయలు అదనంగా ఇచ్చింది.కానీ వైఎస్సార్సీపీ హాయంలో రాష్ట్రంలో గ్రామీణుల కోసం గృహనిర్మాణ పథకాన్నే అమలు చేయలేదు. ప్రస్తుతం అమలయ్యే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి ఆదివాసీల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించాలని ప్రభుత్వానికి నివేదించినా జగన్ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్నీ కొనసాగించలేదు. ఆపథ కాలనే రద్దుచేసి గిరిజనులకు మొండిచేయి చూపిం చారు. ‘‘గత ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసింది. ఈ ప్రభుత్వం పీఎంకేవీవై కింద ఇస్తున్న నిధులకు, వైఎస్సార్సీపీ కొంత మొత్తం కలిపి ఇస్తోంది. అది ఏ మూలనా సరిపోవడం లేదు.’’ -దీసారి గంగరాజు, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గత టీడీపీ హయంలో చాలా ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మధ్యలో ఆగిన ఇళ్లకు బిల్లుల చెల్లించలేని స్థితిలో ఉంది.’’-దొన్నుదొర,