ప్రకృతితో మమేకం..ఆదివీసల జీవనం

గిరిజనుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసింది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 28 వేల ఎకరాల విస్తీర్ణంలో 18 వేల మందిగిరిజనులకు అటవీ సాగుహక్కు పత్రాలను అందజేసింది.ఏటా గిరిజన రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అంద జేస్తోంది. గిరిజన గూడలను కలిపేలా రోడ్లు నిర్మి స్తోంది. వరదల భారి నుంచి రక్షించేలా 114 రక్షణ గోడలను నిర్మించింది. రక్తహీనతతో బాధపడే గర్భి ణులు, బాలింతలు, చిన్నారులకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణప్లస్‌ పథకాల కింద పౌష్టికాహారం అందజేస్తోంది. గిరిజనుల వైద్యంకోసం పార్వతీపురం మన్యం జిల్లాకు వైద్యకళాశాలను మంజూరు చేసింది. సీతంపేట,పార్వతీపురంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రులు నిర్మించింది. రోగులను అత్యవసరవేళ ఆస్పత్రు లకు చేర్పించేందుకు 108వాహనాలతో పాటు బైక్‌ అంబులెన్స్లు ఏర్పాటుచేసింది.గిరిజన గ్రామాల ప్రజ లకు సెల్‌ సిగ్నల్‌ సమస్యలకు పరిష్కారం చూపు తోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన మ్యూజియంను సీతంపేట పీఎంఆర్సీలో ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఆదివాసీ జీవన విధానం ప్రతిబింబించే చిత్రాలు, విగ్రహాలను అమర్చుతోంది. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తోంది.
జీవనం విభిన్నం.. వైవిధ్యం
లి ఆదివాసీలు అటవీ సంస్కృతికి ప్రతీకలు. ఘన చరితకు వారసులు. వారి ఆధ్యాత్మిక చింతన వినూ త్నం. వారి కట్టూ బొట్టూ చూడనలవిగా ఉంటాయి. తెల్లారితే కొండపోడు తాళాలు వంటి వస్తువులను తయారు చేసి నృత్యాలకు ఉపయోగిస్తారు.
లి ఆదివాసీలు ప్రధానంగా దంపుడు బియ్యం, గంటె, జొన్న, కొర్ర, జీలుగ పిండితో జావ చేసుకుని తాగుతారు. అడవిలో లభించే ఆకు కూరలు, దుంప కూరలను ఆహారంగా వినియోగిస్తారు. బొదండం కూర, చిట్టికూర, గురుంకూర, పుల్లేరుగుడ్లను కూరగా వండి తింటారు.

  • అక్షరాలను ఆరాధ్యదేవతలుగా పూజిస్తారు. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. ప్రతి గురువారం ఆలయాల్లో పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
  • ఆదివాసీ ప్రాంతాల్లో వివాహ ఆచారం వింతగా ఉంటుంది. మైదాన ప్రాంతంలో వరకట్న భూతం వెంటాడుతున్న నేటి రోజుల్లో ఇందుకు భిన్నంగా ఆదివాసీ గ్రామాల్లో వరుడు కుటుంబ సభ్యులు వధువు కుటుంబానికి ఓలి (తిరిగికట్నం) ఖర్చుల నిమిత్తం ఇచ్చే ఆచారం ఉంది.
    ఆదివాసీలు నిరంతర శ్రమ జీవులు.అయినా తీరిక వేళల్లో మాత్రం ఆటపాటలు, ఆనందాలకు ప్రాధాన్యం ఇస్తారు.పండగలన్నీ ప్రకృతి, ఫలసాయాల సేకరణ, గ్రామదేవతలకు సంబంధిం చినవే ఉంటాయి. కందికొత్తలు,ఆగం,టెంక పండగలను డప్పుల వాయి ద్యాలతో గ్రామాల్లోని గిరిజనులంతా ఏకమై నిర్వహి స్తారు.
    అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం
    సాలూరులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం సీతంపేట ఐటీడీఏలోనూ ఆదివాసీపండగకు ఏర్పాట్లు గిరిజనాభివృద్ధికి కృషి నాలుగేళ్లలో గిరిజనుల అభివృ ద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తోంది. గిరిజన పండగల నిర్వహణకు అధిక ప్రాధాన్య మిస్తోంది. రాష్ట్రస్థాయి ఆదివాసీ పండగను సాలూరు లో నిర్వహించడం, సీతంపేట ఐటీడీఏలోను ఆదివాసీ పండగను వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉంది.
    విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే
    అర్హులందరికీ సంక్షేమ పథకాలు
    ఐటీడీఏ ద్వారా గిరిజనులకు క్షేత్రస్థాయిలో పకడ్బం దీగా పథకాలు అమలు జరిగే చర్యలు తీసుకుంటు న్నాం.గిరిజనకళల అభివృద్ధిలోభాగంగా సవర పెయింటింగ్‌ కళాకారులకు సీడాప్‌ ద్వారా శిక్షణ ఇప్పించనున్నాం. గిరిజన అటవీఉత్పత్తులకు మార్కె టింగ్‌ సదుపాయం కల్పిస్తాం. గిరిజన యువతకు స్కిల్‌ కళాశాల, స్కిల్స్టాబ్‌ వంటివి ఏర్పాటు చేశాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
  • కల్పనాకుమారి, ఐటీడీఏ పీఓ
    గూడు లేకా గోసపడుతున్న గిరిజనులు
    రాష్ట్రంలోని గిరిజనులు సరైన గూడు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా గిరిజనులకు అందించ లేదు. రాష్ట్రంలో నిర్మిస్తున్న కొద్దొగొప్పో ఇళ్లు కేంద్రం మాంజూరు చేసినవే.అయితే గత ప్రభుత్వాలు గిరిజ నుల ఇళ్ల కోసం నిర్వహించిన పథకాలు, కార్య క్రమాలన్నీ ఇప్పటి అధికార ప్రభుత్వం నీరుగార్చింది.
    జగన్‌ తాను అండగా ఉంటానంటే నమ్మి గెలిపించిన గిరిజనులు ప్రస్తుతం ఆయనను నమ్మె స్థితిలో లేరు. తమ నియోజకవర్గాల్లో ఆయన పార్టీనే గెలిపించారు. అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేసినట్లే వారినీ ముంచేశారు జగన్‌. తాను మాత్రం ప్యాలెస్‌ల మీద ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్‌, గిరిజనులకు గూడు మాత్రం కల్పించలేకపోయారు.
    లక్షల్లో స్థలాలిచ్చాం. ఇళ్లు కట్టిస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప అత్యంత వెనుకబడిన వర్గాలైన ఆదివాసీలు రాష్ట్రంలో ఉన్నారని, వారికి సొంతగూడు కల్పించాలని ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపిం చడం లేదు.సొంతగూడు కల్పించాలని నాలుగేళ్లుగా మొత్తుకుంటున్నా కనీస స్పందన లేదు. రాష్ట్రంలోని 11 జిల్లాల పరిధిలోని 52 వేల మంది పీవీటీజీలకు పక్కా గృహమే లేదని కేంద్రం తేల్చింది.రాష్ట్ర ప్రభు త్వం క్షుణ్నంగా సర్వే నిర్వహిస్తే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాత జగన్‌ సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. పైగా గిరిజనులను ఉద్ధరించేసినట్టుడాంబికాలు మాత్రం పలుకుతున్నారు. ‘‘ఆదివాసీ ప్రాంతాల్లో పక్కా ఇళ్లు లేక వారు పూరి గుడిసెల్లో,పెంకుటిళ్లలో,రేకుల షెడ్లలో జీవనం సాగిస్తున్నారు. సరైన ఇంటి వసతి లేక రాత్రి పూట నిద్రిస్తున్న సమయాల్లో పాముకాటుకు గురై మర ణించిన ఘటనలున్నాయి.’’`రాధాకృష్ణ, సీపీఎం నాయకుడు
    శంకుస్థాపన-పూర్తి చేయ కుండానే మధ్యలో నిలిపివేత
    జిల్లాల విభజన వేళ గిరిజనులకు ప్రత్యేకంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కేటాయించినట్టు గొప్పలు చెప్పారు.కానీ,నాలుగున్నరేళ్లుగా అక్కడ సొంత ఇల్లు లేని అభాగ్యులకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలు ఉన్నాయి.6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద 17వేల ఇళ్లు మంజూరు చేసేంత వరకు వారి గోడు వినేవారే లేరు. ఈ పథకం కింద మంజూరైంది కూడా కొంతమందికే. ఇంకా అక్కడ దాదాపుగా 32 వేలమంది సొంతింటి కోసం ఇప్పటికీ ఎదురు చూస్తు న్నారంటే ఆదివాసీలపై జగన్‌కు ఎంత మమకారం ఉందో అర్థమవుతోంది. ప్రతికూల పరిస్థితుల మధ్యే ఆదివాసీలు జీవనం సాగిస్తుంటారు.వాటిని గుర్తించిన గత టీడీపీ ప్రభు త్వం సొంతిల్లు కట్టుకునేందుకు వీరికి అదనపు సాయాన్ని మంజూరు చేసింది. అప్పట్లో గ్రామీణ పేదల కోసం ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని అమలుచేసి ఇంటి నిర్మాణం కోసం ఎస్టీలకు అదనపు ఆర్థిక సాయాన్ని అందించింది. ఇందులోనూ ఆదివాసీలకు మరింత తోడ్పాటు నిచ్చింది.మైదాన ప్రాంతాల్లో నివ సించే ఎస్టీలకు 2లక్షలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వారికి 2.25లక్షలు, ఆదివాసీలకు 2.5లక్షల సాయాన్ని అందించింది. సాధారణ వర్గా లకు అందే సాయం తో పోలిస్తే లక్ష రూపాయలు అదనంగా ఇచ్చింది.కానీ వైఎస్సార్‌సీపీ హాయంలో రాష్ట్రంలో గ్రామీణుల కోసం గృహనిర్మాణ పథకాన్నే అమలు చేయలేదు. ప్రస్తుతం అమలయ్యే పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వానివే. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న పుష్ప శ్రీవాణి ఆదివాసీల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించాలని ప్రభుత్వానికి నివేదించినా జగన్‌ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయాన్నీ కొనసాగించలేదు. ఆపథ కాలనే రద్దుచేసి గిరిజనులకు మొండిచేయి చూపిం చారు. ‘‘గత ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం చేసింది. ఈ ప్రభుత్వం పీఎంకేవీవై కింద ఇస్తున్న నిధులకు, వైఎస్సార్సీపీ కొంత మొత్తం కలిపి ఇస్తోంది. అది ఏ మూలనా సరిపోవడం లేదు.’’ -దీసారి గంగరాజు, అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గత టీడీపీ హయంలో చాలా ఇళ్లు మంజూరు చేశారు. అందులో కొన్ని ఇళ్లు నిర్మాణ దశలో మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మధ్యలో ఆగిన ఇళ్లకు బిల్లుల చెల్లించలేని స్థితిలో ఉంది.’’-దొన్నుదొర,

జీవన విధానం మారితేనే మనుగడ..!

పరుగుతున్న జనాభా..అందుకు తగ్గట్టుగా రెట్టింపవుతున్న అవసరాలకు మొదట ప్రభావితమవుతున్నవి అడవులే. చెట్లను నరికి వ్యవసాయ భూములు,నివాస స్థలాలుగా మారుస్తున్నారు.ఫలితంగా అటవీ విస్తీర్ణం తగ్గి జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అది పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది.చివరకు వర్షాభావ పరిస్థితులు,అధిక ఉష్ణోగ్రతలు,అతివృష్టి వంటి వైపరీత్యాలు ఎదురవుతున్నాయి. భూభాగంలో 33శాతం అటవీ విస్తీర్ణం ఉం డాల్సి ఉండగా..ఉభయ జిల్లాల్లో 22శాతం నమోదు కావడం ఆందోళనకడు ప్రభుత్వం తీసుకున్న హరితహారంతో కాస్త పచ్చదనం పెరిగింది.ప్రాణాధారమైన జలాన్ని సమర్థంగా వినియోగించు కోవడంలో మనిషి విఫలమవుతున్నాడు. ప్రధానంగా జలవనరుల ఆక్రమణతో నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేయడం,నీటి ప్రవాహ మార్గాలైన కాలువలను మూసి వేయడం వంటి చర్యలతో వాటి ఉనికిని ప్రమాదంలోకి నెడుతున్నాడు. దీనికితోడు కలుషితం చేస్తున్నాడు. విష రసాయనాలు మిళితమైన పారిశ్రామిక, నివాసాల మురుగును కాలువల్లోకి వదులుతున్నారు.అవి నదులద్వారా సముద్రంలోకి చేరు తున్నాయి వ్యర్థ జలాలను శాస్త్రీయ పద్ధతిలో పునశుద్ధి చేసి జలవనరుల్లోకి వదిలితే మేలు.చర్యలతో పీల్చేగాలి నాణ్యత దెబ్బతింది.వాహనాలు,విద్యుత్తు అతి వినియోగం వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి.వ్యవసాయంలో ఉప యోగించే రసాయనిక ఎరువులు ప్రమాదకరంగా మారాయి. సాధ్యమైనంత వరకు తగ్గించడమే మనం ప్రకృతికి మేలు చేసే చర్యలు. ఎన్ని చట్టాలు రూపాంతరం చెందినా నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తుల వినియోగం తగ్గడం లేదు.వాటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయకుండా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారు.ఈవ్యర్థాలను కాల్చడం వాతావరణ కాలుష్యానికి కారణమవుతోంది.భూమి పొరల్లోకి ప్లాస్టిక్‌ చేరి వాన నీరు ఇంకకుండా నిలువరిస్తోంది.జల వనరుల్లోకి చేరి జలచరాల హననానికి కారణమవుతోంది. నదులు, కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతోంది. ప్లాస్టిక్ను సాధ్యమైనంత వరకు దైనందిన జీవితం నుంచి నిషేధించాలి.
జీవ వైవిధ్యం..జాతుల కవచం
మనిషి విచక్షణారాహిత్యానికి అంతరించిపోతున్న జీవజాలం భూమి మీద 14మిలియన్ల జీవజాతులు పరిరక్షించుకోక పోతే ముప్పు తప్పదు.ప్రకృతిని కాపాడ డంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.మనిషి విచక్షణారాహిత్యం వల్ల రోజురోజుకూ జీవవైవిధ్యం దెబ్బ తింటోంది.ప్రకృతి విధ్వంసకర పనులవల్ల జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది.నానాటికి కాలుష్యం పెరిగిపోవడం,విస్తరించాల్సిన జీవజా తుల శాతం తగ్గిపోవడం జీవ వైవిధ్యాన్ని ప్రమాదం లోకి నెట్టేస్తున్నాయి.ఈపరిస్థితి ఇలాగే కొనసాగితే మాన వాళికి భారీమూల్యం తప్పదని హెచ్చరిస్తు న్నాయి ప్రపంచ పర్యావరణ,జీవవైవిధ్య సదస్సుల నివేదికలు.
జీవవైవిధ్యం.. ఆవశ్యకత
అవనిపై జీవించే సకల జీవరాశిని కలిపి జీవవైవిధ్యం అంటున్నారు. సరళంగా చెప్పాలంటే వివిధ రకాల జీవజాతుల సముదాయాన్నే జీవ వైవిధ్యం అంటాం. సూక్ష్మరూపంలోని తొలిజీవి ప్లాజిల్ల్లెటా అనే ఏక కణజీవి ప్రీ బయాటిక్‌ సూప్‌ అనే సముద్ర అడుగు నీటిలో పుట్టిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తొలుత వృక్షాలు,జంతుజాలం అవతరించాయి.క్రమక్ర మంగా ఉభయ చరాలు,పక్షులు పుట్టుకొచ్చాయి. ప్రస్తు తం నేలమీద ఎన్నో రకాల వృక్షాలు, పండ్లు, జంతు జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరం. కుందేళ్లు, గేదేలు,జీబ్రాలు వంటివి పచ్చని గడ్డి తింటాయి. ఈ జంతువులను మాంసాహారులైన సింహం, పులి, చిరుతపులులు ఆరగిస్తాయి.గొల్లభామలు గడ్డిని తింటే వాటిని కప్పలు భక్షిస్తాయి. ఈ చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయి. పాములు నాశనమైతే ఎలుకల సంతతి అనుహ్యంగా పెరిగిపోతుంది. దానితో ఎలుకలు పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయి. మానవుడు తన మనుగడ కోసంచుట్టూ ఉన్న పరిసరాలపై ఆధారపడి జీవిస్తాడు. ఆహారం,గాలి,నీరురక్షణ,ఆశ్రయం నిత్యావసర వస్తువు లు అన్నీ ప్రకృతి ఉత్పత్తులే. కంటికి కనబడని ఎన్నో జీవులు సైతం పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. ఇలా ఒకజీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్య క్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయి.
జీవవైవిధ్యానికి ఏం చేయాలంటే ..
అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత కావాలి. ఇంటి వద్ద ముగ్గులు పిండితో వేయాలి. అప్పుడే పక్షు లు కీటకాలకు ఆహారంగా లభిస్తుంది.భవిష్యత్‌ తరాల కోసం చెట్లు, జలవనరులను పెంపొందించుకోవాలి. రసాయనాలకు బదులు సహజ ఎరువులు వాడాలి. ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి భూగర్భ జలాల పెంపు నకు కృషి చేయాలి.ప్రతి ఒక్కరూ జీవవైవిధ్యం పెంపు నకు కృషి చేయాలి.పర్యావరణానికి మొక్కలు పెంచాలి2050 సంవత్సరం వరకు దేశ జనాభా 200కోట్లకు పెరిగే అవకాశం ఉంది. పర్యావరణ పరిరక్షణకు,జనాభా హితంకోసం మొక్కలను విరివిరి గా పెంచాలి. లేకుంటే మనిషి సృష్టిస్తున్న విపత్తు వల్ల జీవవైవిధ్యం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉంది. 1972 నుంచి ఇప్పటివరకు 61 శాతం వన్యప్రాణులు అంతరించినట్లు వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఆఫ్‌ నేచర్‌ రిపోర్టు చెబుతుంది. దీంతో మనుగడ సాగించాల్సిన జీవజా తులు అంతరిస్తున్నాయి. ఇలా ఒక రకమైన జీవులు అంతరిస్తే వాటిమీద ఆధారపడే జీవులూ నశిస్తు న్నాయి.రాష్ట్రంలో జీవ వైవిధ్యానికి కేంద్రం లాంటిది. అనేక రకాల జంతు,పక్షి జాతులకు నెలవు.తెలం గాణ వ్యాప్తంగా 280రకాల మొక్కలజాతులు ఉన్నా యి. అందులో 1800రకాల జాతుల మొక్కలు ఔషద మొక్కలే. 900రకాల ఔషధ మొక్కలు హైదరాబాద్‌ కేంద్రంగా అందుబాటులో ఉన్నాయి. 108 జాతుల క్షీరదాలు,486 పక్షిజాతులు తెలంగాణలో మనుగడలో ఉన్నాయి. తెలంగాణ బయోడైవర్సిటీ రిపోర్టు ప్రకారం మన రాష్ట్రంలో అంతరించిపోయే దశలో ఉన్న వాటిలో అడవి కుక్క,ఉడుత,చిరుతపులి,హైనా, మౌస్‌డీర్‌, రాబందు,బాతు,హంస,మొసలి, మరిన్ని చేపజాతులు ఉన్నాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడా నికి తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా,మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా పరిధిలోనే జీవవైవిధ్యాన్ని రక్షించడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్‌ సైట్లను ఏర్పాటు చేయ డానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. అందులో భాగం గానే కూకట్‌పల్లి శివారులోని అమీన్‌పూర్‌ లేక్‌ను అభివృద్ధి చేసింది. 2016 నుంచి ఈ చెరువును వలస పక్షుల కోసం చుట్టు పక్కల జీవ వైవిధ్యాన్ని సంరక్షిం చడం కోసం ఉపయోగించుకుంటుంది. 93 ఎకరాల్లో విస్తరించిన ఈ చెరువు పరిధిలో కొన్ని వందల స్థానిక పక్షులతోపాటు వలస పక్షులు ఆశ్రయం పొందుతు న్నాయి.ఇక ప్రభుత్వం మనుగడలో ఉన్న జీవులు, చెట్లను గుర్తించి రాష్ట్ర ఐకాన్‌లుగా ప్రకటించింది. అందులో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, రాష్ట్ర చెట్టుగా జమ్మిచెట్టు,రాష్ట్ర పువ్వుగా తంగేడు ఉన్నాయి.-(గునపర్తి సైమన్‌)

నో స్మోకింగ్‌ ప్లీజ్‌..

వృత్తిలోనే ప్రవృత్తిని వెతుక్కున్నారు ఆ అధికారి. సగటు మనిషిపై వ్యసన పరుడిగా ముద్ర వేస్తున్న పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పోరాటం సలుపుతున్నారు. పొగాకు ఉత్పత్తుల బారిన పడుతూ ప్రాణాంతకమైన వ్యాధులను కొనితెచ్చుకో వద్దని చెప్తూ సమాజ శ్రేయస్సుకు పాటుపడు తున్నారు.పొగాకు ఉత్పత్తులకు వ్యతి రేకంగా తనదైన రీతిలో పోరాటం చేస్తున్నారు. పొగాకువల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అందరిలో అవగా హన కల్పిస్తున్నారు. పొగాకు..వ్యసనపరుల బతుకుల్లో పొగ బెడుతున్న తీరును సామాజిక మాధ్యమాల్లో వివరించడంద్వారా పొగాకు ఉత్ప త్తులపై రగల్‌ జెండా ఎగురవేసిన రఘునందన్‌ సేవలు అభినందనీయం.
అవకాశం దొరికినప్పుడల్లా..
ఎక్స్‌ ఖాతా ద్వారా నిత్యం పొగాకు,సిగార్‌ గురిం చిన పోస్టులు పెడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న రఘునం దన్‌ ప్రచార సరళిని దేశవిదేశాల్లోని స్వచ్చంధ సంస్థలూ గుర్తించాయి.పొగాకు నియంత్రణలో భాగంగా ఏర్పాటుచేసే సభలు, సమావేశాల్లో పాల్గొనేందుకు రావాలని ఆయనకు అంతర్జాతీ యంగా ఆహ్వానాలు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల ప్రత్యక్షంగా పాల్గొన లేకపోయారు. అయితే,అవకాశం కుదిరినప్పుడల్లా ఆన్‌లైన్‌ కాన్పరెన్సుల్లో పొగాకు వ్యతిరేకంగా గళమెత్తు తున్నారు.ఛడీఘర్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జాతీయ సదస్సులో గౌరవ ప్రతినిధిగా పాల్గొని తన లక్ష్యాన్ని వివరించారు. జాతీయ స్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న ‘రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టొబాకో’‘కంట్రోల్‌ టోబాకో కంట్రోల్‌ స్టాల్‌వర్ట్‌’గా రఘునందన్‌ గుర్తింంచడం విశేషం.
సోషల్‌ మీడియాలో..
విధి నిర్వహనలో భాగంగా రఘునందన్‌ పల్లెల్లో తిరుగుతూ ఉంటారు. స్వామి కార్యంలో సమాజ కార్యంగా గ్రామాల్లో పొగాకు వల్ల కలిగే అనర్ధాల పై అవగాహన కల్పిస్తుంటారు.ముఖ్యంగా రైతులు, కార్మికులు ధూమపానం చేస్తూ కంటబడితే ముక్కు మూసుకొని పక్కకు తప్పుకోరు.వారి చేత ఆక్షణమే సిగరెట్‌ మాన్పించేలా హితబోధ చేస్తారు.ఇలా ఒకట్రెండేండ్లు కాదు..రెండు దశాబ్దాలుగా కృషిచేస్తున్నారు.వివిధ గ్రామాల్లో సభలు, అవగా హన సదస్సుల్లో పాల్గొని ధూమపానం వదల గొట్టేందుకు ప్రయత్ని స్తున్నారు. పొగాకు వ్యతి రేకంగా తమ చేస్తున్న పోరాటానికి మంచి స్పందన వస్తుందని చెబుతారు రఘునందన్‌. ఎవరైనా మీ మాటలు విన్నాక నేను సిగరెట్‌ మానేశానని చెప్పినప్పుడు ఎంతో ఉత్సాహం కలుగుతుంటుందని…ఆ కిక్‌తో మరింత కష్టపడే ప్రయత్నం చేస్తున్నాను అంటున్నారాయన.
రఘునందన్‌ నేపథ్యం..
రఘునందన్‌ మాచన..మేడ్చల్‌ జిల్లా కేశవరం వాస్తవ్యుడు. ఆయన తండ్రి అభిమన్యు ఆంగ్లభాషా పండితుడు. తండ్రి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారా న్నందుకున్నారు.అలా భావి పౌరులను తీర్చిదిద్దే క్రమంలో తనదైన సేవలు అందిస్తూ ఉత్తమ ఉపా ధ్యాయుడిగా పేరు గడిరచారు అభిమన్యు. తండ్రి కి తగ్గ కొడుకు అనిపించు కునేలా రఘునం దన్‌ సమాజ శ్రేయస్సుకోసం తనవంతు కృషి చేస్తు న్నారు. యువత పెడదోవ పట్టకుండా తనదైన రీతిలో స్పందిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. పౌర సరఫరాల శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌గా నిత్యం దాడులు,తనిఖీలు నిర్వ హించే అధికారులు ఎందరో ఉన్నారు.కానీ రఘు నందన్‌ మాచన అలా కాదు.ఉద్యోగాన్ని తన విధి గానో,ఓఅధికారిగా తాను నిర్వర్తించాల్సిన బాధ్యత గానో మాత్రమే భావించలేదాయన. అందులో మానవత దృక్పథాన్ని వెతుక్కున్నారు. సమాజాన్ని మా ర్చాలన్న తపన ఆయనలో కనిపిస్తుంది. అలా కమిట్‌మెంట్‌తో సామాజిక స్పృహతో పనిచేస్తుం టారు రఘునందన్‌.
సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూ..
పొగాకు నియంత్రణపై రఘునందన్‌ సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోస్టులు అంతర్జాతీయంగా అన్ని సమాజాలను చేరుతూ ఆలోచింప జేస్తున్నాయి.ఎక్స్‌ ద్వారా ఆయన పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం, జర్మనీ దేశస్తులను ఆకట్టుకోగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తమ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రఘునందన్‌ను ఆహ్వానిం చింది.దేశం తరఫున పాల్గొనడం ఆనందాన్ని చ్చింది..పంజాబ్‌ ఛండీగడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంత ర్జాతీయ సదస్సులో భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా నేను పా ల్గొనడం ఆనందా న్నిచ్చింది. పొగాకు ఉత్పత్తులవల్ల ఆరోగ్యానికీ, ఐశ్వ ర్యానికీ ముప్పు వాటిల్లక ముందే..టుబా కోకు గుడ్‌ బై చెప్పాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలని ఆశిస్తున్న వారిలో నేనొకణ్ని. నేను సుమారుగా రెండు దశా బ్దాలుగా పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా పని చేస్తున్నా. ఆఫలాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ సంస్థ ‘టుబాకో కంట్రోల్‌ స్టాల్‌ వర్ట్‌’గా నాసేవలను గుర్తించింది.అమెరికాకు చెందిన హెల్త్‌ మ్యాగజీన్‌ పల్మనరీ మెడిసిన్‌ కూడా నాసక్సెస్‌ను గుర్తిస్తూ వావ్‌..వెల్డన్‌ అని కొనియాడిరది.ఇటీవల పలువురు నన్ను అభినందించడం ఆనందాన్ని చ్చింది.పొగాకు ఉత్పత్తుల వాడకం సమసిపోయేలా చేయటం అంత సులభమైన పనికాదు.ఆలోచన ఆత్మ నుంచే రావాలి.స్వీయ చైతన్యంతోనే మార్పు సాధ్యం.బీడీ,సిగార్‌,పొగాకు ఉత్పత్తుల మత్తులో పడినవాళ్లు ఎవరికివారు ప్రశ్నించుకోవాలి.తన ఆరోగ్యంపై శ్రద్ద పెరిగినప్పుడే పొగాకు వినియో గం ఆగిపోతుంది.నా పెండ్లికివచ్చి స్మోకింగ్‌ చేయొద్దు అని నేను నావెడ్డింగ్‌ కార్డులో ఓనిబం ధన రాయించాను.ఇలా చేయడంద్వారా రాకుండా ఉంటారని కాదు!ఒక ఆలోచన,చర్చ మొదలవు తుంది.మార్పు ఆలోచనతోనే ఆరంభ వంవుతుంది కదా.నేను కోరుకునేది అంతే!నా మాటలు విని పొగతాగడం మానేసిన వాళ్లుచాలా తక్కువే కానీ..ప్రత్యక్షంగా మాట్లాడి ఆకొద్దిమంది ఆరో గ్యాన్ని కాపాడగలిగానన్న సంతృప్తి మిగిలుతోం దని,ఈఅభినందనలన్నీ నాబాధ్యతను మరింత పెంచాయని రఘునందన్‌ మాచన ఆకాంక్షిం చారు.-` గునపర్తి సైమన్‌

పౌర సేవల్లో వాట్సాప్‌ విప్లవం

దేశంలో తొలిసారిగా..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు , పజల నుంచి వినతల స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సప్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సప్‌ నంబర్‌ను 9552300009 ప్రకటించింది. ఆ ఎకైంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌(టిక్‌ మార్క్‌) ఉంటుంది. ఈనంబర్‌ వన్‌స్టాప్‌ సెంటర్‌లా పనిచేస్తుంది. తొలిదశలో ఇందులో 153 రకాల సేవలు అందించనున్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్త్రతం చేయనున్నారు.ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆర్‌టీజీఎస్‌ సీఈఓ దినేష్‌ కుమార్‌ ఈ సేవలపై ప్రజంటేషన్‌ సమర్పించారు.ప్రస్తుతం అమల్లోకి వచ్చాయి.
ఏపీ ప్రజలకు కూటమి సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌చెప్పింది.9552300009వాట్సాప్‌తో జనన, మరణ ధృవీక రణ పత్రాలు అందించేందుకు సన్నా హాలు చేస్తోంది.‘మనమిత్ర’ ప్రజల చేతిలోనే ప్రభు త్వం,ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం అని విద్య,ఐటీశాఖల మంత్రి నారా లోకేష్‌ పేర్కొ న్నారు. ప్రజలు ధృవపత్రాలు, ఇతర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా పౌర సేవ లను వేగవంతంగా అందజేసేందుకు వాట్సాప్‌ గవర్నెన్స్‌ కు కూటమి ప్రభుత్వం నాంది పలికింది.దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్‌ లాంఛనంగా జనవిర 30న ప్రారం భించారు.దీనికోసం అధికారిక వాట్సప్‌ నెంబర్‌ 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం చింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లా డుతూ..యువగళం పేరుతో 3,132 కి.మీల పాదయాత్ర చేశాను.ఈఆలోచన యువగళం పాద యాత్ర నుంచి మొదలైంది. నాప్రసంగాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక బటన్‌ నొక్కితే సినిమాచూస్తున్నాం,భోజనంవస్తోంది,క్యాబ్‌ వస్తుం ది.ఒక బటన్‌ నొక్కితే ప్రభుత్వం ఎందుకు ప్రజల వద్దకు రాదనే ప్రశ్న ఉత్పన్నమైంది.ఆఛాలెంజ్‌ను నేను స్వీకరిస్తున్నాని ఆనాడు చెప్పా.అందుకే ‘మన మిత్ర’ ప్రజల చేతిలోని ప్రభుత్వం,ప్రజల చేతిలో పాలన,మాది ప్రజాప్రభుత్వం నినాదంతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించడం జరుగుతోంది.
మొదటి విడతలో అందుబాటులోకి 161 రకాల పౌర సేవలు : వాట్సప్‌ గవర్నెన్స్‌కు 36శాఖలను అను సంధానించాల్సి ఉంటుంది. ఇది చాలా క్లిష్టతరమైన పని. మొదటి విడతలో161పౌర సేవలు అందు బాటులోకి తీసుకువస్తున్నాం. రెండో విడతలో 360 పౌర సేవలు ప్రారంభిస్తాం. ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌ గవర్నెన్స్‌. రియల్‌టైంలో ధృవపత్రా లు అందించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసు కుం టుంది. సర్టిఫికెట్లు అందజేసినప్పుడు వాటిపై ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఆక్యూర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఏపీ గవర్నమెంట్‌ వెబ్‌ సైట్‌ కు ఆలింక్‌ వెళ్తుంది. దీంతో నకిలీ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ కూడా త్వరలోనే తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నెంబర్‌ సెలెక్షన్‌ద్వారా రెవెన్యూ, మున్సిపల్‌, ఎండో మెంట్‌ సర్వీసులతోపాటు అనేక సర్వీసులు తీసుకు వచ్చాం. రెండో దశలో ఏఐ బాట్‌, వాయిస్‌ ద్వారా కూడా అమలుచేస్తాం.ప్రపంచంలోనే వాట్సప్‌ గవర్నె న్స్‌ అమలు చేస్తున్న తొలిరాష్ట్రం మనది.దీనికి మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.లోటు పాట్లు సరిచేసుకునిమరింత మెరుగ్గా దీనిని తీర్చిది ద్దుతాం.రియల్‌ టైంగవర్నెన్స్‌లో కూడా అన్ని శాఖల నుంచి సమాచారాన్ని తీసుకుని క్రోడీకరిస్తు న్నాం. డేటా లేక్‌ క్రియేట్‌ చేసి సీమ్‌ లెస్‌ సర్వీసెస్‌ అంది స్తాం.గత మూడు నెలలుగా మా టీం అహర్ని శలు కష్టపడ్డారు. గత15రోజులుగా టెస్టింగ్‌ చేస్తు న్నాం. ఇంకా మెరుగులు దిద్దాలని నాకు అర్థమైంది. ఇదొక ప్రయాణం.ఆరు నెలల్లో ఐడియల్‌ ప్రొడక్ట్‌ గా తీర్చిది ద్దుతాం.అన్నిసేవలుఅందుబాటులోకితీసుకు వస్తాం. పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నా.ఆరు నెలల్లో ఎంతమార్పు వస్తుందో ప్రజలే చూస్తారు. మెటా ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ సంధ్య దేవనాథన్‌ మాట్లాడుతూ..ఈ రోజు మీ మధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది.మనమిత్ర వాట్సప్‌ సేవలు ప్రారంభించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితం లో వాట్సప్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మన మిత్ర ద్వారా 161పౌర సేవలను ప్రతి ఒక్కరికి అంది స్తాం. ప్రజలు సులభంగా విని యోగించేలావాట్సప్‌ గవర్నెన్స్‌నురూపొందించాం.వాట్సప్‌గవర్నెన్స్‌ సేవ లకోసం చాలా కృషిచేశామ న్నారు.ఏపీ ప్రభుత్వం తో కలిసి మన మిత్రను మరింత మెరుగ్గా తీర్చి దిద్దుతామని చెప్పారు.వాట్సప్‌ డైరెక్టర్‌,ఇండియా హెడ్‌ రవిగార్గ్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం. అయితే సింగిల్‌ ప్లాట్‌ ఫామ్‌పై అన్ని రకాల సేవలు అందిం చడం ఎక్కడా లేదు. మన మిత్ర వాట్సప్‌ గవర్నెన్స్‌ ను మరింత అభివృద్ధి చేసి మరిన్ని సేవలు అందు బాటులోకి తీసుకువస్తాం. హాయ్‌ అని టైప్‌ చేయడం ద్వారా ప్రజలు సుల భంగా పౌరసేవలను పొంద వచ్చని అన్నారు. మొద టి దశలో వాణిజ్యరంగంలో సమర్థ వంతమైన ప్రభు త్వ సర్వీస్‌ డెలివరీ కోసం రీ ఇంజ నీరింగ్‌ విధా నాలను అమలుచేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు. ఈప్రక్రియ లో,ఈక్రింది విధంగా వివిధరకాల సేవలను అందిం చడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.-(కందారపు మురళి)

విశాఖ తీరంలో నేవీ డే విన్యాసాలు

విశాఖలో నేవీ విన్యాసాలతో,సాగ తీరం అంతా యుద్ధ వాతావరణం నెలకొంది. నేవీ విన్యాసాలు చూసేందుకు వచ్చిన పర్యాటకులు, నగరవాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నేవీ చేస్తున్నటువంటివి అన్నీ కళ్లకు కట్టినట్లు చూపించారు. విశాఖ సాగర్‌ తీరంలో నేవీ విన్యాసాలు చూడటం ఎంతో బాగుందని పర్యాటకులు అంటున్నారు.నేవీ యుద్ధ విమానాలు దగ్గర నుండి చూడటం ఇదే మొదటిసారి అంటూ చెబుతున్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా లేజర్‌ షో చాలా బాగుందని అంటున్నారు. నేవీ దేశం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ నేవీ విన్యాసాలు చూడటం ద్వారా తెలిసిందని మరికొందరు అంటున్నారు. మన దేశం కోసం ఎంతో కష్టపడి నేవీ పని చేస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హాజరయ్యారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో కూడా నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందని, తుఫాన్లు, వరదలు, ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నావికా దళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికి అతి ముఖ్యమైన నావల్‌ హెడ్‌ క్వార్టర్స్‌గా విశాఖపట్నం తయారవ్వడం సంతోషంగా ఉందన్నారు.భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం 1947 విశాఖలో నేవల్‌ స్థావరానికి పునాది పడిరదని,అధికారికంగా తూర్పునౌకాదళం 1983లో ఏర్పాటైంద న్నారు.చిన్న నేవల్‌ బేస్‌గా ఉన్న తూర్పు నౌకాదళం కమాండ్‌ నేడు మహోన్నతంగా ఎదిగిందన్నారు. శనివారం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో జరిగిన నేవీ ఆపరేషనల్‌ డెమోకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి,మనవడు దేవాన్ష్‌ బాబుతో కలిసి తిలకించారు.అనంతరం సీఎం ప్రసంగించారు.మదిని మైమరపించేలా నేవీ బృందం అద్భుత విన్యాసాలను చేసి చూపించింది. వారి ధైర్యానికి, సామర్థ్యానికి, కఠోర దీక్షకు సెల్యూట్‌ చేస్తున్నా. నేవీ డే ఒడిశాలో జరిగినా విశాఖలో మళ్లీ డెమో నిర్వహించాలని వైస్‌ అడ్మిరల్‌ నిర్ణయించడం చాలా సంతోషకరం. ఎంత క్రమశిక్షణ,కఠోర శ్రమ ఉంటేనే ఈ డెమో నిర్వహించడంసాధ్యం అవుతుంది.1971లో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖపట్నం నేవల్‌ కమాండ్‌ చాలా కీలకంగా పని చేసింది. పాకిస్తాన్‌ సబ్‌ మెరైన్‌ ఘాజీని ధ్వంసం చేసింది మనవిశాఖ తూర్పు నౌకాదళమే.ఆ యుద్ధంలో ఇండియా గెలిచి చరిత్రలో నిలిచింది. కలకత్తా నుంచి చెన్నైవరకు కోస్టల్‌ ప్రాంతం ఉన్నా విశాఖ నావికా దళానికి ప్రత్యేకత ఉంది అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘దేశం ఆర్థికంగానే కాకుండా రక్షణ రంగంలోనూ బలంగా ఉండాలి.అందుకే ప్రధాని మోదీ వికసిత్‌ భారత్‌లో భాగంగా రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అలాంటి రక్షణరంగంలో నౌకాళంచేస్తున్న కృషి అసామాన్యం. నేవీని చూసి వేరే దేశాలు భయపడేలా పనిచేస్తున్నారు. సముద్ర రవాణాకు తూర్పునౌకాదళం రక్షణగా నిలిచి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తోంది.దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వచ్చినా నౌకాదళం వేగంగా స్పందిస్తోంది.హుద్‌హుద్‌ తుపాను సమయంలో పది రోజులపాటు నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. తుపాన్ల సమయంలో మత్స్యకారుల ప్రాణాలు కాపాడు తున్నారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘సుదీర్ఘ తీర ప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు కల్పించుకుంటే ఆర్థికంగా ఎదగొచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి తరహాలో విశాఖను రాష్ట్రఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతం ఉన్న పోర్టులు, భోగా పురం ఎయిర్‌పోర్టు, మెట్రోరైలు ప్రాజెక్టు పూర్తయితే మారిటైం గేట్‌వేగా విశాఖ నిలుస్తుంది’’ అనిముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.తూర్పు నౌకాదళం విశాఖ తీరంలో జనవరి 4ననిర్వహించిన విన్యాసాల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య మంత్రి చంద్రబాబుతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.తూర్పునౌకాదళాధిపతి రాజేష్‌ పెంథార్కర్‌ ముఖ్యమంత్రిని సభావేదిక పైకి తోడ్కొని వెళ్లారు.
టెక్నాలజీలో ఏపీ ముందంజ :దేశ భవిష్యత్తు, రక్షణకు నౌకాదళం ఎంత క్రియాశీలక పాత్ర పోషిస్తుందో,రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా అదే తరహాలో సహకరించాలని తూర్పు నౌకాదళాన్ని సీఎం కోరారు. – గునపర్తి సైమన్‌

కులగణ నేటి సామాజిక అవసరం

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కులగణాంకాలపై ఎన్నడూ లేనంతగా విస్తృతమైన చర్చ జరుగుతోంది. మన సమాజంలో కులం అన్న దాన్ని పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఒక అతి కీలకమైన, విస్మరించలేని వాస్తవం.సామాజికంగా,ఆర్థికంగా,రాజకీయంగా మనకు సంబంధించిన అన్ని విషయాల్లో అసమాన వ్యవస్థలను, అహేతుకమైన హెచ్చుతగ్గులను, నిర్హేతుకమైన ఆధిపత్య-ఆధారిత భావజాలాలను కులం పెంచి పోషించింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కులాల హోదా, స్థానం, స్థితిగతులు, గౌరవ ప్రతిపత్తులలో పెద్ద మార్పు రాకపోగా, వ్యవస్థల భాగస్వామ్యంలో వారి యథాతథ స్థితి కొనసాగింది. ఉద్యోగిత, ఆదాయం, ఇంకా అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో రాజ్యాంగంలో ఉద్దేశించిన విధంగా ఎలాంటి మార్పులు రాలేదు. గత అనుభవాలను పరిశీలిస్తే దేశ సామాజిక, ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని నిష్పక్షపాతంగా అర్థం చేసుకుని అవసరమైన మార్పును, అభివృద్ధిని సాధించే విధానాల రూపకల్పన, వాటి అమలులో మౌలికంగానే ఎక్కడో లోపమున్నట్లు వెల్లడవుతోంది. అనేక ప్రణాళికలు, లక్షల కోట్ల బడ్జెట్లతో కూడిన లెక్కలేనన్ని పథకాలు, కార్యక్రమాల అమలు కూడా ఆశించిన ఫలితాలనివ్వలేదు. పంపిణీలో సమన్యాయం పాటించడం అనేదే జరగలేదు.వారసత్వ రాజకీయాలు, కుటుంబపాలన, అవినీతి, నయా భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థల పునఃప్రతిష్ఠ కొనసాగి, అన్ని రంగాల్లో అసమానతలు, పెచ్చు పెరిగాయి. కులవ్యవస్థ ప్రభావం నిరంతరంగా కొనసాగడం వల్లనే పై స్థితి స్థిరీకరించబడిరది. దీనికి అనేక కారణాలున్నప్పటికీ అయితే దేశ ప్రజలకు సంబంధించిన శాస్త్రీయమైన గణాంకాలు అందుబాటులో లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిపే జనాభా గణాంకాల ఆధారంగా ప్రాధాన్యతలను బట్టి, అవసరాలను బట్టి ప్రభుత్వాలు అభివృద్ధి విధానాన్ని రూపొందిస్తాయి. స్వాతంత్య్రానికి ముందు 1871 నుంచి 1931వరకు 16సార్లు జరిగిన జనాభా లెక్కల్లో కుల ప్రస్తావన ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల 1941 సెన్సెస్‌ ప్రక్రియలో అంతరాయం కల్గింది.వివరాలు సేకరించినా నివేదికలు రూపొందించలేదు. కానీ స్వాతం త్య్రానంతరం జనాభావివరాలు సేకరణలో కుల అంశాన్ని పక్కకు పెట్టారు.దేశ ప్రజల కుల సంబంధిత సమాచారం లేకపోవడంతో సామాజిక వివక్ష,అసమానతలు,ఆర్థిక అంతరాలను తగ్గించటానికి తోడ్పడే విధానాల రూపకల్పన శాస్త్రీయంగా జరుగలేదు.ప్రభుత్వ సంక్షేమ విధానాలు,సామాజిక న్యాయం,ప్రధానంగా విద్య, ఉద్యోగాలు,అభివృద్ధిలో సమాన అవకాశాలు కల్పించడం వంటి అన్ని అంశాలలో అప్పటివరకు అందుబాటులో ఉన్న అరకొర గణాంకాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది.1931 సెన్సెస్‌ తర్వాత గడ చిన 90సంవత్సరాల కాలంలో సమాజంలో వచ్చిన అనేక మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసి తదను గుణంగా విధానాలు రూపొందించే క్రమాన్నే ప్రతిపాదించలేదు.ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం అర్థవంతంగా జరుగలేదు.ఈ నేపథ్యంలో మౌలికమైన కులగణాంకాల సమాచారం లేకుండా వివిధ తరగతులకు చెందిన సామాజిక, ఆర్థిక,అంశాలకు సంబంధించిన సమస్యలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలవల్ల సాధించిన పురోగతి, తద నుగుణంగా జరిగిన మార్పులు తెలుసుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. అసలు విధాన నిర్ణయ మే ఎలా సాధ్యమన్న మౌలిక ప్రశ్న కూడా ఉంది. అదే క్రమంలో ఓబీసీ,బీసీ కమిషన్లు వివిధ కులాల స్థితిగతులను తులనాత్మకంగా ఎలా అర్థం చేసుకోగలు గుతాయి.వెనుకబడ్డ కులాలను గుర్తించి వారి జాబితా లను ఎలా రూపొందిస్తారు. కులాల చేర్పులు మార్పు లు ఎలా సాధ్యం. క్రీమీలేయర్‌ విషయంలో ప్రతిపాద నలు ఎలా రూపొందిస్తారు.రిజర్వేషన్‌ కోటాలను ఎలా నిర్థారిస్తారు.కులం వివక్షకు,అసమానతలకు మూల కారణమైన విద్య,ఆరోగ్యం,ఉద్యోగం మొదలైనవి అందుబాటులో లేకపోవడంవల్ల ఉత్పన్నమవుతున్న అడ్డంకులను తొలగించడం ఎలా వీలవుతుంది? ఇందుకు సంబంధించిన సామాజిక మార్పుల విష యంలో విధానరూపకల్పన ఎలాసాధ్యం? అదే విధం గా గణాంకాలు, సమాచారం లేకుండానే పది శాతం ఈడబ్ల్యుయస్‌ రిజర్వేషన్లను ఎలా నిర్ధారించగలిగారు? పక్షపాత రహితమైన,నాణ్యమైన గణాంకాలు సెన్సెస్‌ ద్వారానే సాధ్యమని,ఆ సమాచారమే చట్టబద్ధమని కోర్టులు భావిస్తున్న తరుణంలో కులగణాంకాలు నిర్వ హించకపోవడం ఎంతవరకు సహేతుకం.అది తర్కా నికి ఎలా నిలుస్తుంది అన్న అనేక ప్రశ్నలు ఉత్పన్న మవుతాయి. వాస్తవానికి సమాజానికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం కోసం 2011 జనా భా లెక్కల్లో కులగణాంకాలను సేకరిస్తామని, అనేక చర్చల తర్వాత అప్పటి ప్రధాని మన్‌మోహన్‌ సింగ్‌ 2010లోనే పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దానికి సంబం ధించిన ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే సెన్సెస్‌ సంస్థ ద్వారా కాకుండా 2011లో సామాజిక, ఆర్థిక కుల గణాంకాలపేరుతో ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా గణాంకాలు సేకరించినా,అందులో అనేక తప్పులు దొర్లాయని నాటి పాలకులు చెప్పారు.2014లో నరేం ద్రమోదీ అధికారంలోకి వచ్చాక గణాంకాల సేకర ణలో జరిగిన తప్పులు సవరిస్తామని మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఓబీసీ సమాచార అవసరాన్ని యూపీఏ, అదేవిధంగా ఎన్‌డిఏ అధికారి కంగా గుర్తించినప్పటికీ,గణాంకాలను వాస్తవంలోకి తీసుకురావడానికి తగినచర్యలు చేపట్ట లేకపోయా యి. గత జూలైలో ప్రస్తుత హోం సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ 2021సెన్సెస్‌లో కులాధార గణాం కాల సేకరణ ఉండదని పార్లమెంట్‌లో ప్రకటించారు. ఆతర్వాత మోదీ సర్కారు సుప్రీంకోర్టుకు కూడ, ఇది సాధ్యంకాదని చెప్పింది.ఇలా కుల గణాంకాల సేకరణ విషయంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు రెండూ మాట మార్చాయి. ద్వంద్వ ప్రమాణాలు పాటించాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే కుల గణాంకాల విష యంలో ఒక అనిశ్చిత స్థితి నెలకొల్పాయి. ప్రజలకు సంబంధించిన పూర్తి సమాచారం వారికి అందజే యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ప్రధానమంత్రి గుర్త్తించకపోవడం ఎంతవరకు సమంజసం? దేశంలో 50 శాతం పైగా ఉన్న ఓబీసీల అభివృద్ధి కాంక్షిస్తున్నా మని చెప్పే ప్రభుత్వాలు కుల గణాంకాలు చేపట్టడానికి అనుకూలంగా ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు, ఎన్‌.డి.ఎ లోని కొన్ని పార్టీలు, అదే విధంగా ఎన్‌డిఎను బయట నుండి సమర్థించే మరికొన్ని పార్టీలు,మహారాష్ట్ర, బీహార్‌,ఒడిషా,మధ్య ప్రదేశ్‌,చత్తీస్‌ఘడ్‌ ముఖ్యమం త్రులు,అదే విధంగా సి.పి.ఐ,సిపియం,ఎన్‌సిపి, ఎస్‌పి, బహుజనసమాజ్‌పార్టీ,డియంకె,తెలుగుదేశంతో సహా అనేక జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు, కుల గణాంకాలు కోరుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో అనుకూలంగా నిర్ణయం తీసుకునే ధోరణి లో ఒక కమిటీ వేసి పరిశీలిస్తుంది.అనేక మంది బిజెపి ఎంపీలు కులగణాంకాలు జరపాల్సిందేనని పట్టుబడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈవిషయంలో అందరి అంగీకారం కూడగట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. స్వాతం త్య్రం వచ్చిన దగ్గరనుండి కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో వేసిన అన్నిఓబిసి /బిసి కమీషన్లు, ప్రణాళికా సంఘం, పార్లమెంటరీ కమిటీలు కుల గణాంకాలు చేపట్టాలని సూచించాయి. దేశవాప్తంగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంఘాలు,కులసంఘాలు పెద్ద ఎత్తున ఈ 2021సెన్సెస్‌లో కులగణాంకాలు చేర్చాలని చెప్తున్నా యి. మరో ప్రధానమైన అంశం, సుప్రీంకోర్టు, అనేక హైకోర్టులు కూడా వివిధ కేసుల్లో తీర్పులనిస్తూ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో, కొత్త కులాలను గుర్తించబడిన జాబితాలో చేర్చే విషయంలో, నియామ కాల్లో, ప్రమోషన్లలో ఇంకా అనేక సందర్భాలలో కుల గణాంకాల ఆవశ్యకతను చెబుతూనే ఉన్నాయి. ఈ గణాంకాలను ఎవరు వ్యతిరేకిస్తున్నారో పరిశీలిస్తే అసలు విషయం గ్రహించవచ్చు.1990లలో ఓబీసీ లకు రిజర్వేషన్లు నిర్దేశిస్తూ ప్రకటన చేసినపుడు ఎవరు వ్యతిరేకించారో వారే మళ్ళీ ఇప్పుడు కూడా వాటిని వ్యతిరేకిస్తున్నారు.అయితే దీనిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో అందరి అనుమానాలను నివృత్తిచేస్తూ నిర్ణయం తీసుకునే బాధ్యత ఇప్పుడు ప్రధామంత్రి నరేంద్రమోదీపైఉంది. ఓబీసీల జీవన ప్రమాణాలను,సామాజిక హోదాను పెంపొందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం నెలకొల్పాలి. ఇందుకు ఆ సామాజిక వర్గాల అభివృద్ధికి దోహదపడే సమాచారాన్ని సేకరిం చాలి. ఏఏ సామాజికవర్గాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వారికి ఏవిషయంలో సహాయం అవసరమో గుర్తించి, ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చాలి. ఇది తమ విధ్యుక్తధర్మ మని ఇప్పటికైనా పాలకులు గుర్తించాలి. కులగణాం కాల సేకరణను కేవలం రాజకీయ దృష్టితో కాకుండా సామాజిక కోణంలో పరిశీలిస్తే వాటి అవసరం గురించి అందరికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సమగ్ర కుటుంబ సర్వే : తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది.75ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరి స్తున్నారు.ఈసర్వే డేటాఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కాను న్నాయి. గుర్తించిన కుటుంబాల నుంచి ఎన్యుమరేటర్లు పూర్తి వివరాలు సేకరిస్తారు.ప్రధాన ప్రశ్నలు 56,ఉపప్రశ్నలు 19కలిపి మొత్తం 75ప్రశ్నలతో కుటుం బానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు.కుటుంబసభ్యుల పేర్లతోపాటు అందరి మొబైల్‌ నంబరు సేకరిస్తారు.కులంతో పాటు ఆకులాన్ని ఇతర పేర్లతో పిలిస్తే వాటిని కూడా రాసుకుంటారు. కుటుంబ సభ్యులవారీగా విద్య,చదివిన మాధ్యమం,ఉద్యోగం,ఉపాధి,వ్యాపారం, వార్షికా దాయం తెలుసు కుంటున్నారు.కుటుంబానికి ఉన్న భూములు,ఇళ్లు, ఇతర స్థిర,చరాస్తుల వివరాలు సేకరిస్తారు. ఇప్పటి వరకు విద్య,ఉద్యోగాల్లో పొందిన రిజర్వేషన్‌ ప్రయో జనాలు.
గత ఐదేళ్లుగా పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు, వాటిని దేని కోసం ఉపయోగించారన్న అంశాలు సైతం అడుగుతారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజాప్రతిని ధులుగా,లేదా నామినేటెట్‌ పదవులు,ఎన్జీవోల్లో సభ్యత్వం వంటి అంశాలు నమోదు చేయనున్నారు. విదేశాలు లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారా అనే అంశాలపై కూడా అధ్యయనం జరగనుంది. సొంత ఇళ్లా అద్దెకు ఉంటున్నారా ఇంట్లోఫ్రిజ్‌,కారు, ద్విచ క్రవాహనం,కంప్యూటర్‌,స్మార్ట్‌ ఫోన్‌ వంటివి ఉన్నాయా అనే వివరాలు అడిగి ఫారంలో నింపుతారు.
ఈ సమాచారాన్ని ఏవిధంగా ఉపయోగిస్తారంటే? : ప్రజల నుంచి సేకరించిన వివరాలను గో ప్యంగా ఉంచాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది.భవిష్యత్తులో బీసీ,ఎస్సీ,ఎస్టీ,ఇతర వెనక బడిన వర్గాలకు సంక్షేమపథకాలు,రాజకీయ,విద్య, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అవసరమైన ప్రణాళి కలను తయారు చేసేలా ఈ డేటాను వినియోగించు కోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అదేవిధంగా స్థానిక సంస్థల్లో బీసీరిజర్వేషన్లు ఎంతఉండాలోఈడేటా ఆధారంగానే ఖరారు చేయనున్నారు.ఈసర్వేలో సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,కుల,రాజకీయ సమా చారం సేకరించనున్నారు. ఈ క్రమంలో సర్వే చేసే ఎన్యుమరేటర్‌ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఏ పత్రాలు దగ్గర పెట్టుకోవాలి? ఏం సమాధానం చెప్పాలి అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.
సర్వే నిర్వహణ ఇలా : సర్వేలో మొత్తం 75ప్రశ్నలు ఉంటాయి.వీటి నుంచి సమాచారంసేకరిస్తారు. ఇందులో 56ప్రధాన ప్రశ్నలు ఉండగా,మరో 19అను బంధ ప్రశ్నలు ఉంటాయి.మొత్తం రెండు పార్టులు అంటేపార్టు-1,పార్టు-2గాఉండి ఎనిమిదిపేజీల్లో సమాచారం పూరించనున్నారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉండాయి. అంటే సాధా రణ,విద్య,ఉద్యోగ,ఉపాధి, భూములు, రిజర్వేషన్‌ ప్రయో జనాలు, వలసలు, రాజకీయ సమా చారం అడగను న్నారు.అలాగే పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు.ఇందులో మొత్తం17ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా,మిగిలినవి అనుబంధ ప్రశ్నలు.
ధరణి ఖాతా, ఎకరాల వివరాలు చెప్పాల్సిందే : భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, భూముల వివరాలు మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్‌? కు చెప్పాల్సి ఉంటుంది.సాగు విస్తీర్ణం వివరాలు అన గా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి.
రిజర్వేషన్‌ ఫలాలు పొందేవారు : విద్యా,ఉద్యోగ పరంగా రిజర్వేషన్‌ విధానంతో ప్రయోజనం పొంది నా,గడిచిన ఐదేళ్లలో ప్రభు త్వం నుంచి లబ్ధిపొందిన పథకాలు,ఆ వివరాలు నమోదు చేసుకోవాలి.ఎస్సీ, ఎస్టీ,బీసీ,ఈడబ్ల్ల్యూఎస్‌ ధ్రువపత్రాలు పొందారా? అనేవి పొందుపర్చుతారు.
రాజకీయ నేపథ్యం : ప్రజాప్రతినిధిగా సభ్యత్వం కింద ప్రస్తుతం,పూర్వం ఏపదవిలో ఉన్నారనేది తెలుసుకుం టారు. పదవీ కాలం,నామినేటెడ్‌ వివరాలు నమోదు చేస్తారు. ఈ ప్రశ్నావళి ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారికి వర్తిస్తుంది.
ఈ పత్రాలు దగ్గర ఉంచుకొండి : ఆధార్‌ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్‌ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పు డు సులువుగా వివరాలు అందించవచ్చు. ఒక కుటుం బంలో ఎవరైనా ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళితే వారి వివరాలు చెప్పాలి. వలసలు వెళ్లడానికి కారణం కూడా ఆరా తీస్తారు. సర్వే సంద ర్భంగా ప్రతి కుటుం బం ఈ విషయాలను గుర్తుంచు కోవాలి. ఎందుకంటే సర్వే సందర్భంలో ఫొటోలు,పత్రాలు వంటివి తీసు కోరు.అలాగే కుటుం బీకులు అందరూ ఉండాల్సిన పని లేదు. కుటుంబ యజమాని ఉండి ఆయా వివరాలను నమోదు చేయి స్తే సరిపోతుంది.వారు ఇచ్చిన సమాచారాన్ని గోప్యం గా ఉంచుతారు.
విద్యా వివరాల నమోదులో : పాఠశాలలో చేరిన నాటికి వయసు ఎంతో చెప్పాలి. విద్యార్హతను చెప్పాలి. ఏమాధ్యమంలో చది వారని తెలియజేయాలి.ఒకవేళ బడి మానేస్తే ఆ వివరాలు కూడా నమోదు చేయాలి.
ఉద్యోగ, ఉపాధి వివరాలు : ఈ విషయానికి వచ్చిన ప్పుడు ప్రస్తుతం చేసే పని,ఉద్యోగం,వృత్తి,ఉపాధి సమాచారం ఇవ్వాలి.వార్షికాదాయం,ఒకవేళ వ్యాపా రులైతే వార్షిక టర్నోవర్‌ తెలియజేయాలి. సాంప్రదా య కులవృత్తులయితే ఆ వృత్తి కొనసాగిస్తున్నారా? లేదా? అని రాయాలి. కుల వృత్తితో కలిగిన వ్యాధి (ఉంటేనే) చెప్పాలి. ఆదాయ పన్ను చెల్లింపుదారులా? అవునా,కాదా చెప్పాలి. బ్యాంకు ఖాతా ఉందా,లేదా తెలియజేయాలి.సర్వే వివరాల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయనుందని కలెక్టర్‌ రాజర్షిషా వెల్లడిరచారు. ప్రణాళికబద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వల్లూరు క్రాంతిఅధికారులను ఆదేశించారు. ఇంటిం టి సర్వే కోసం చేస్తున్న ముందస్తు సన్నాహా లను అధికారులతో కలిసి పరిశీలించారు. – (ప్రొ.కె.మురళి మనోహర్‌)

హక్కుల ప్రాధాన్యత ప్రంచానికి చాటుదాం

‘‘ మానవ ప్రగతికి దోహదం చేసే పరిస్థితులే హక్కులు. సమాజ ఆమోదం పొంది, చట్టబద్ధమై నప్పుడే అవి అర్థవంతమవుతాయి.జాతి,మత,కుల,లింగ, ప్రాంతీ య తేడాలతో సంబంధం లేకుండా మానవులందరికీ హక్కులు వర్తిస్తాయి.వ్యక్తి గౌరవాన్ని (ఔన్నత్యాన్ని) పెంపొందించడానికి హక్కులు అవసరం. ఇవి మానవ నాగరికతకు నూతన ప్రమాణాలు.హక్కులు లేని మనిషి బానిసతో సమానం. ఎందుకంటే మనిషి స్వతంత్రంగా జీవించి, తన మనుగడ కాపాడుకోవడానికి హక్కులు సహకరిస్తాయి. ఎన్నో పోరాటాల ద్వారా, మరెన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న మానవ హక్కులకు నేడు రక్షణ లేకుండా పోయింది. మానవ హక్కులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే వాటిని హననం చేస్తు న్నాయి. మానవుల మాన, ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవహక్కులు. పుట్టుకతో ప్రతివ్యక్తికి లభించే ఈ హక్కులు జాతి,మత మౌఢ్యంవల్ల,రాజకీయాలవల్ల, వ్యక్తిగత ద్వేషం,కక్ష, కార్పణ్యాల వల్ల మనుషుల జీవితా లకు భరోసా లేకుండా పోతోంది. ’’
ప్రపంచంలో మానవులందరూ ఒక్కటే అని మనం గొప్పగా చెప్పుకున్నా,నవ నాగరిక సమాజంలో మన ప్రయాణం సాగుతూ ఉన్నా అనేక సందర్భాలలో స్వార్థం,కుటిలత్వం,అమానుషత్వం వంటి అనేక కారణా ల వల్ల మనిషి ప్రాణాలకు సాటి మనుషుల నుండే ముప్పు వాటిల్లుతోంది. అటువంటి పరిస్థితులలో మనిషి ప్రాణా లకు భద్రత కావాలంటే మానవ హక్కులు అవసరం. ఆహక్కుల ద్వారానే మనిషి తనకు తాను రక్షణ కల్పించు కోవచ్చు.ఈ మానవ హక్కుల గురించి ఈనాడు చర్చ చేయడం,పోరాటాలు చేయడం అనేది గొప్ప విషయం కాదు.క్రీ.శ.1215లోనే ఈమానవ హక్కుల సాధన విష యమై ఒకప్రకటన జరిగింది అంటే ఆశ్చర్యకరమే. అప్ప టి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటనగా భావించవచ్చు. న్యాయబద్ధమైన తీర్పుద్వారా తప్ప,మరేవిధమైన పద్ధతు ల్లోనూ పౌరుల స్వేచ్ఛను హరించడం నిషేధం’ అని హక్కులకు సంబంధించిన చారిత్రక శాసనం ‘మాగ్నా కార్టా’ స్పష్టం చేసింది.
ఈ భూమ్మీద ఒకానొకప్పుడు పాలన సాగించిన నియంతలు,చక్రవర్తులు,రాజులు మా మాటే వేదం, మేం దైవాంశ సంభూతులం,తిరుగులేని అధికారం మాకే స్వం తం,చట్టానికి మేం అతీతులం అంటూ పాలన సాగించిన పాలకుల అధికారానికి మొట్ట మొదటిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరో పేరే మాగ్నాకార్టా.ఎవరైతే ప్రజల హక్కులను అణచివేసి,అతనే తప్పనిసరి పరిస్ధితులలో హక్కుల పత్రంపై సంతకం చేసిన క్షణాలు ఈ ప్రపం చంలో ప్రజాస్వామ్యానికి పునాది పడిన ఆ ఘడియల నుండే న్యాయం,స్వేచ్ఛ అనే మహత్తర భావాలకు పునాదు లు పడ్డాయి. రాజే సర్వాధికారి అని ప్రబలంగా నాటుకు పోయిన అభిప్రాయం ఆ రాజు సంతకంతోనే కొట్టుకు పోయింది. నియంతలపై ప్రజా సంక్షేమం పట్టని వారిపై ఈ రోజున ఉద్యమాలు చేయడం గొప్ప విషయం కాదు. ఏనాడో 800సంవత్సరాల క్రితమే సర్వాధి కారాలు చెలాయిస్తున్న అప్పటి ఇంగ్లాండ్‌ రాజు జాన్‌ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు ఫలితమే మాగకార్టా. నియంతరాజు మెడలువంచి స్వేచ్ఛ, సమా నత్వం అనే భావాలు మానవుల హక్కు అని నిరూపించి ప్రపంచానికి అందించిన వ్యక్తి స్వేచ్ఛల హక్కుల పత్రం.. ఇది చరిత్ర లో ఓకీలక ఘట్టం.చట్టానికి ఎవరూ అతీ తులు కాదు రాజైనా పేదైనా చట్టం ముం దు అందరూ సమానులే అంటూ ఇంగ్లాం డ్‌ ప్రజానీకం పోరు బాట పట్టింది.రాజే సర్వాధికారి అనే వేలసంవత్సరాల అభిప్రా యాన్ని కేవలం ఆఒక్క సంతకంతో తల్ల కిందులు చేసింది. తిరుగులేని ఇంగ్లాండ్‌ రాజే చట్టానికి లోబడి వ్యవహరించే అని వార్య పరిస్థితిని ఈ చారిత్రక ఒప్పందం కల్పించింది.ఆపరిణామంతో నియం తత్వ, తిరుగులేని అధికారాలు క్రమంగా పలుచబడుతూ, ప్రస్తుతం ప్రజలే ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఆవిర్భావానికి దారితీసింది. ప్రపంచ మానవాళికే గొప్ప బహుమతిని అందించింది.మానవ హక్కు లకు పట్టం కట్టింది. భావితరాల వారికి ఈవ్యక్తి స్వేచ్ఛహక్కులపత్రం నాందీ ప్రస్తా వనగా నిలిచింది అని చెప్పడంలో ఎటు వంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ పత్రం స్వేచ్ఛా హక్కుల పరిరక్షణోద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ తదుపరి 1789వసం.లోఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ పేరిట మానవ హక్కుల గురించి పేర్కొన్నారు. కాలక్రమేణా అనేక మంది మేధావులు ఈభూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతం త్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుండాలని, సాటి మనిషిని మనిషిగా కూడా చూడాలని అది హక్కుల కల్పన ద్వారానే సాధ్యపడుతుందని అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. మనుషుల్లో జాతి,భాష,కులమతాల జాఢ్యం వీడని కారణంగానే మానవ విలువలు అడుగంటిపో తున్నాయి. మానవ హక్కులు లేని నాడు, మానవ జీవనం మరింతహీనంగా పరిణమిస్తుందని అనేక మంది సాంఘి క సంస్కర్తలు తమభావాలను వ్యక్త పరుస్తూ అనేక గ్రంధాలు, ప్రసంగాలు చేపట్టి ఈ హక్కుల ప్రాధాన్యత ప్రపంచానికి చాటి చెప్పారు.వీటిని పురస్కరించుకునే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల రూపకల్పనకై ముం దడుగు వేసింది. – (రుద్రరాజు శ్రీనివాసరాజు)

ప్రజలకు జవాబుదారిగా ఉండేలా పాలన చేద్దాం

ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పాలన అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజాప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సీఎంగా తాను కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తానని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరిం చాలని ముఖ్యమంత్రి సూచించారు. పీ4 ద్వారా పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్స్‌ పార్టనర్షిప్‌ ద్వారా పేదల జీవన ప్రమాణాల్ని మార్చే కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ఏపీ దేశంలో నెంబర్‌ 1గా ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ చేయలేక పోవటం వల్ల 4 లక్షల ఎకరాలకు నీరివ్వలేని పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసారు. అందుకే వాటి నిర్వహణను కూడా సక్రమంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని గుంతలు పడిన రహదారులకు మరమ్మత్తులు నిర్వహణ చేయాల్సి ఉందన్న సీఎం ఆ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడిరచారు. -జిఎన్‌వి సతీష్‌
సంక్షేమం,అభివృద్ధి,సుపరిపాలన ఎన్డీయే విధానం.పేదల ఆదాయం పెరగాలి..ఖర్చులు తగ్గాలి. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలే ధ్యేయంగా పని చేస్తాం.సూపర్‌-6,మేనిఫెస్టో హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం.సంక్షేమం ప్రారంభమైంది టీడీపీ ఆవిర్భావంతోనే. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఉండాలనేది ఎన్టీఆర్‌ ఇచ్చిన నినాదం. ఎన్టీఆర్‌ రూ.2 లకే కిలో బియ్యం ప్రవేశపెట్టారు…అది ఇప్పుడు దేశం మొత్తం అమలైంది.పేదలకు పింఛనురూ.30లతో ప్రారంభించారు.రైతులను ఆదుకు నేందుకు రూ.50లకే హార్స్‌ పవర్‌ విద్యుత్‌ అందించాం. పేదలు ఉండాల్సింది గుడిసెల్లో కాదు…పక్కా ఇళ్లని ఆలోచించి ఇళ్లు కట్టించారు.సగం ధరకే జనతా వస్త్రాల పంపిణీ చేశారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.162రోజుల కూటమి పాలనపై సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రసంగించారు.
భవిష్యత్‌లో 3.7లక్షల కోట్ల మేర పెట్టుబడులు: ప్రస్తుతం ఏపీలో 1.2 లక్షల కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులు జరగాల్సి ఉందని, అలాగే 70 వేల కోట్ల రైల్వే లైన్‌ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఎన్డీఏ కూటమి ప్రథమ ప్రాధాన్యత జాబ్‌ ఫస్ట్‌ అన్న సీఎం అందుకే మొదటి సంతకం16 వేల 300ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై చేశానని స్పష్టంచేశారు. మెగా డీఎస్సీద్వారా ఈఉద్యోగాల భర్తీ చేయాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వీటితో పాటు పారిశ్రామికంగా,పర్యాటకంగా,చిన్నతరహా పరిశ్రమలు,ఫుడ్‌ ప్రాసెసింగ్‌ద్వారా పెట్టుబడులు, ఉపాధి సాధించాలని అందుకే వీటిపై కొత్తవిధానాలను తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సా హక బోర్డులోనూ 85వేలకోట్ల పెట్టుబడులకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.34 వేల ఉద్యోగాలు వీటి ద్వారా వస్తాయని భావిస్తున్నామన్నారు.అలాగే 1లక్షకోట్ల పెట్టుబడులు ఎన్టీపీసీ,ఏపీ జెన్కో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్లాంట్‌?ను ప్రధాని ప్రారంభిస్తారని తెలిపారు.రిలయన్స్‌ బయో సంస్థ కూడా కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతోందని, వీటి ద్వారా 2.5లక్షల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సమీప భవిష్యత్‌లో 3.7లక్షల కోట్ల మేర పెట్టుబడులు,అదేస్థాయిలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఉద్యోగాల ఆధారంగా ప్రోత్సాహకాలను ఇచ్చే పాలసీని కూడా ఏపీలో అమలు చేస్తున్నామ న్నారు.గత ప్రభుత్వం శాంతిభద్రతల్ని నిర్లక్ష్యం చేసిందని, రాజకీయ ప్రాధాన్యతతో అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గంజాయి,డ్రగ్స్‌తో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నా సీఎం,మహిళల జోలికి వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గంజాయి నివారణకు డ్రోన్స్‌ద్వారా నిఘా పెట్టినట్లు వెల్లడిరచారు.
కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదు
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డిసెంబరు మొదటి వారం లో రాష్ట్రవ్యా ప్తంగా ర్యాలీ చేస్తామని, ఆర్యాలీలో తాను కూడా పాల్గొంటానన్నారు.తెలుగువారు ప్రపంచ వ్యాప్తం గా నాలెడ్జ్‌ ఎకానమీలో రాణిస్తున్నారన్నారు. కరడు గట్టిన నేరస్తులకు ఏపీ కేంద్రం కాదని,వారికి గట్టిగా హెచ్చరి కలు జారీచేశారు.గతంలో ఫింగర్‌ ప్రింట్‌ అనాలసిస్‌ కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.కూటమి ప్రభు త్వం శాంతి భద్రతలకు అగ్రపాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.అభివృద్ధి,సంక్షేమంసజావుగా సాగాలంటే సుపరి పాలన ఉండాలన్నారు.ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ యాక్టు`2024కు తీసుకువస్తున్నామన్న సీఎం,ఇందులో భూఆక్రమణ దారే తనకు హక్కులు ఉన్నాయని నిరూపిం చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.తప్పని తేలితే14ఏళ్ల జైలు శిక్ష భారీజరిమానా ఉంటుందన్నారు. మద్యందు కాణాల విషయంలో ప్రభుత్వం కఠి నంగా ఉంటుందని, బెల్టు దుకాణాలు వస్తే బెల్టు తీస్తామని హెచ్చరించారు. మద్యం అక్రమాల విషయంలో మన, తన అనే బేధాలు ఏవీ ఉండవని తెలిపారు.ఉచిత ఇసుక సరఫరా విషయంలోనూ ఎలాంటి రాజీ ఉండబోదని తేల్చి చెప్పా రు.ఐదేళ్లపాటు చీకటిజీవోల ద్వారా పాలన సాగించారని, వాటన్నింటినీ ఆన్‌లైన్‌లో పెడుతూ నిర్ణయం తీసుకున్నా మన్నారు.పౌరసేవలన్నీ ఇకపై వాట్సప్‌లో ఇచ్చేలా నిర్ణ యం తీసుకుంటున్నామని వెల్లడిరచారు.రెవెన్యూ, దేవా దాయ,రవాణా,ఆర్టీసీ,గ్రీవెన్సు ఇలా వివిధ శాఖల సేవలు ఇక వాట్సప్‌ ద్వారా ఇస్తామన్నారు.150 ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌,వాట్సప్‌ద్వారా పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
శాసనసభ వేదికగా 2047 విజన్‌ డాక్యుమెంట్‌
నదుల అనుసంధానం కూటమి ప్రభుత్వ విధాన మని స్పష్టం చేశారు.సంక్షేమం,అభివృద్ధి,ఆదాయం, సాంకేతికతతో కూడిన సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యాలని వెల్లడిరచారు. ఓర్వకల్లులో డ్రోన్స్‌ సిటీ ఏర్పాటు చేసి నైపుణ్యశిక్షణ,పైలట్‌ ట్రైనింగ్‌,ఉత్పత్తి చేస్తామని అన్నా రు. రాష్ట్రంలో సవాళ్లు,సమస్యలు చాలా ఉన్నాయన్న సీఎం,రాత్రికి రాత్రి మారిపోతుందని చెప్పటం లేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగకుండా మంత్రుల కమిటీ నియమించా మన్నారు.శాసనసభ వేదికగా 2047విజన్‌ డాక్యు మెంట్‌ ను ప్రజల ముందు ఉంచుతామని వెల్లడిరచారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టాలు వారసత్వంగానే వచ్చా యని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్‌ పోయిందని, సమస్యలు కూడా వచ్చాయ న్నారు. వ్యవస్థలు కూడా ఛిన్నాభిన్నం అయ్యాయన్నారు. రాష్ట్రానికి దశ దిశ చూపించటంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాముల బలిదానం వృథాగా పోదని,ఆస్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే లా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్వాతంత్య్రం రాక ముందు తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ ఎంత మంది వచ్చినా అన్నం పెట్టారన్న సీఎం,అందుకే మధ్యా హ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో అరాచకాలు, గంజా యిపై డిప్యూటీ సీఎం చాలా గట్టిగా ఉన్నారని, తాము ఇద్దరం కలిసి ప్రజలకు హామీ ఇస్తున్నామన్నారు. మహిళ లకు అవమానం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు లు పెడితే అదే వారికి చివరి రోజు అవుతుందని ముఖ్య మంత్రి హెచ్చరించారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని సూచించారు. ప్రాణాలకు ముప్పు ఉన్నా లెక్క చేయకుండా ముఠా నాయకులు, మత విద్వేషాలు, నక్సల్స్‌ను నియంత్రించానని తెలిపారు.
కొందరు రౌడీలు,బ్లేడ్‌ బ్యాచ్‌లు ఉన్నాయి. వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టంచేశారు. పోలీసు వ్యవస్థను కూడా సంస్కరిస్తున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరూ శాంతిభద్రతల్ని చేతుల్లోకి తీసుకో వద్దని చెబుతున్నామని అన్నారు. ఎవరైనా దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఉక్కుపాదంతోనే అణచివేస్తామని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్‌ కావాలని అన్నారు.ప్రజలు కూడా ప్రభుత్వానికి సహక రించి వారి కుటుంబాలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని చంద్ర బాబు ఆకాంక్షించారు.రైతులు పంపుసెట్ల వద్ద సౌర విద్యుత్‌ ప్యానళ్లుపెట్టుకుంటే మిగిలిన విద్యుత్‌ విక్రయిం చుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రిడ్‌కు అనుసంధానించడంద్వారా తిరిగి సొమ్ము పొందే అవకా శం రైతులకు ఉంటుందని వెల్లడిరచారు.దీనిపై శాసన సభ్యులు తమ నియోజకవర్గాల్లో రైతులను ప్రోత్సహిం చాలని సూచించారు.
ఏపీలో 85 వేల కోట్ల పెట్టుబడులు – 10 భారీ పరిశ్రమలకు లైన్‌ క్లియర్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 85 వేల కోట్ల పెట్టుబడు లకు ప్రభుత్వ ఆమోదం లభించింది. 34వేల ఉద్యోగాలు కల్పించే 10భారీ పరిశ్రమలకు సీఎం చంద్రబాబు అధ్య క్షతన జరిగిన ఎస్‌ఐపీబీ (ూ్‌a్‌వ Iఅఙవర్‌ఎవఅ్‌ ూతీశీఎశ్‌ీఱశీఅ దీశీaతీస) తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రు లు నారాలోకేశ్‌,పయ్యావుల కేశవ్‌,గొట్టిపాటి రవి, అన గాని సత్యప్రసాద్‌,అచ్చెన్నాయుడు,టీజీ భరత్‌, నారా యణ,వాసంశెట్టి సుభాష్‌, బీసీ జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్న ఈ భేటిలో ఈ అను మతులు, భూములు ఇచ్చేందుకు నిర్ణయిం చారు.

న్యాయ దేవత కళ్లు తెరిసింది

దేశ అత్యున్నత న్యాయస్థానం న్యాయదేవతకు కళ్లు ఉండాలని నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఆదేశాలతో సుప్రీంకోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.గతంలో న్యాయ దేవత కుడి చేతిలో న్యాయానికి ప్రతి బింబంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. కొత్తగా ఏర్పాటుచేసిన న్యాయ దేవత విగ్రహం కుడి చేతిలో త్రాసు అలాగే ఉంచి ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగం ఉంచారు . ప్రస్తుతానికి సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు. న్యాయం గుడ్డిది కాదని.. చట్టానికి కళ్లున్నాయని బలమైన సంకేతమిచ్చే ఉద్దేశంతో న్యాయదేవత విగ్రహంలో సుప్రీంకోర్టు మార్పులు చేసింది.న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. చట్టం ముందు అందరూ సమానమే.. న్యాయస్థానం డబ్బు, అధికారం.. ఇతర హోదాను చూడదు అనే సందేశంతో విగ్రహానికి గంతలు కట్టి ఉండేవి.ఇక ఖడ్గం విషయానికి వస్తే అన్యాయాన్ని న్యాయదేవత చీల్చిచెండాడుతుందని సంకేతం ఇచ్చేందుకు చేతిలో ఖడ్గం ఉండేది.కాగా కొత్త న్యాయ దేవత విగ్రహం కిరీటం, ఆభరణాలతో భారతమాత రూపంలో ఉండ డం విశేషం. ఈ విగ్రహానికి ఆమోదం లభిస్తే దేశ వ్యాప్తంగా ఇదే విగ్రహాన్ని అన్ని న్యాయస్థానాల్లో ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
అయితే ఇప్పటివరకు ఉన్న న్యాయ దేవతల విగ్రహాలకు..ఈ విగ్రహానికి చాలా తేడాలు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ దేవత విగ్రహానికి కళ్లకు గంతలు తీసేశారు. అంతేకాకుండా న్యాయ దేవత కుడి చేతిలో ఉండే త్రాసును అలాగే ఉంచగా..ఎడమ చేతిలో ఉండే పొడవైన కత్తిని తీసేసి ఆ స్థానంలో రాజ్యాంగాన్ని పెట్టారు. అంటే రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని తెలియ జేయడానికి దాన్ని అలా ఉంచారు.సుప్రీంకోర్టు జడ్జిల లైబ్రరీలో ఏర్పాటైన ఈకొత్త న్యాయ దేవత విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.చట్టానికి కళ్లు ఉండవని.. దానికి గుర్తుగానే కోర్టుల్లో ఉండే న్యాయ దేవత విగ్రహానికి ఉండే కళ్లను గంతలతో కడతారని మనం ఇప్పటివరకు విన్నాం.అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో చూశాం.న్యాయ దేవతకు కళ్లు ఉండవని,చెవులు కూడా వినిపించవని పేర్కొంటారు.ఎందుకంటే డబ్బు, అధికారాన్ని బట్టి..నిందితులకు చట్టాలు, తీర్పులు ఉండ వని..న్యాయ దేవత ముందు అందరూ సమాన మేనని చెప్పేందుకే అలా ఉంచారు. అయితే ఈ న్యాయ దేవత విగ్రహాన్ని బ్రిటీష్‌ కాలంలో ప్రవేశపెట్టగా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగు ణంగా మార్పులు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం కోర్టుల్లో చూసే న్యాయ దేవత జస్టియా అనే గ్రీకు దేవత. జస్టిస్‌ అనే పదం నుంచి జస్టియా అనే పేరు వచ్చింది.17వ శతాబ్దంలో ఒక బ్రిటిష్‌ కోర్టు అధికారి ఈ జస్టియా విగ్రహాన్ని మొట్ట మొదటి సారిగా మన దేశానికి తీసుకువచ్చారు.ఆ తర్వా త 18వ శతాబ్దంలో బ్రిటిష్‌ కాలంలో న్యాయ దేవత విగ్రహాన్ని కోర్టుల్లో ఉంచగా..స్వాతం త్య్రం వచ్చిన తర్వాత అదే విగ్రహం కొనసా గుతూ వచ్చింది.
ఇటీవల సుప్రీంకోర్టు ఆవరణలోని న్యాయ మూర్తుల గ్రంథాలయంలో కొత్త న్యాయదేవతా విగ్రహం ఏర్పాటు చేయటంతో దేశంలో ఈ మార్పు వెనకాలవున్న ఉద్దేశాలపైన పెద్ద చర్చ మొదలయింది.సాధారణంగా న్యాయదేవత ఒక గౌను వేసుకొని, తల విరబోసుకుని, కళ్లకు గంతలతో,ఒక చేతిలో త్రాసు,మరో చేతిలో ఖడ్గంతో ఉంటుంది.న్యాయదేవతగా ప్రపంచ దేశాలలో సైతం ఈ విగ్రహం ప్రసిద్ధి.గ్రీకు పురాణాల ప్రకారం థెమిస్‌ అనేది న్యాయ దేవతగా చెప్పుకుంటారు. ఆమె న్యాయానికి, చట్టానికి అధికారానికీ ప్రతీక.థెమిస్‌ను గ్రీకు ప్రజలు బాగా గౌరవిస్తారు. థెమిస్‌ అంటే గ్రీకు భాషలో సంప్రదాయం,చట్టం అని అర్థం. ఈజిప్టులోనూ ‘మాట్‌’ దేవతను సత్యదేవతగా పూజిస్తారు. రోమ్‌లో జెస్టిసియా దేవత న్యాయానికి గుర్తుగా ఉంది. ప్రపంచ దేశాలలో ఈ విగ్రహాన్ని న్యాయ స్థానాలలో వాడు తున్నారు. బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మొదలైన దేశాలలో కూడా ఈ ప్రతిమనే న్యాయానికి ప్రతీకగా పెడతారు. బ్రిటీషర్స్‌ నుండి మనమూ కొనసాగిస్తున్నాము. చట్టానికి అందరూ సమా నమని,వారి వారి రంగు, మతము, పేద, ధనిక, ప్రాంత భేదాలు లేకుండా తప్పొప్పుల ఆధారంగానే న్యాయం జరుగుతుందని, శిక్షలు విధించడం చేస్తామని చేప్పే ప్రకటనకు, కళ్లకు గంతలు ఉంటాయని వివరిస్తారు.అలాగే ఖడ్గం ధరించడం అనేది శిక్ష విధింపునకు ఉండే అధికారాన్ని సూచిస్తుంది. ఇంకా వివరణలేవో చెపుతుంటారు.
స్వతంత్రం వచ్చినా బ్రిటీష్‌ పాలకులు బిగించిన చట్రంలోనే భారత దేశం పరిపాలన సాగు తోందన్నది అందరికీ తెలిసిన నిజం.అయితే ఎవరూ ఆ సంకెళ్ల ఆనవాళ్లను వదలించడానికి ప్రయత్నించలేని పరిస్థితి. అయితే అప్పటి బ్రిటీష్‌ పాలకులు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా న్యాయదేవత విగ్రహాన్ని ఇలా కళ్లకు గంతలు కట్టి ఏర్పాటు చేశారు. ఇంత కాలం న్యాయదేవత కళ్లకు గంతలతో పాటు ఒక చేతిలో త్రాసు,మరో చేతిలో కత్తి ఉండేవి. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పేందుకే న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు కట్టేవారు.కుడి చేతిలో ఉండే త్రాసు న్యాయానికి సూచికగా ఉం డేది.ఎడమ చేతిలో ఖడ్గం అన్యాయాన్ని న్యాయ దేవత సహిం చదని,అంతం చేస్తుందని తెలిపేందుకు ఏర్పాటు చేశారు.
ఇంతకాలం కోర్టుల్లోనూ న్యాయం జరగనపుడు న్యాయదేవత కళ్లు తెరచి చూడదని,అందుకనీ నిజాలు తెలువవనీ విమర్శ వచ్చేది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆదేశాల మేరకు న్యాయ దేవత రూపురేఖలను మార్చి తయారు చేశారు.ఆవిగ్రహం కళ్లకు గంతలు తీసివేశారు. చేతిలో కత్తి బదులు రాజ్యాంగాన్ని పెట్టారు. త్రాసు అలాగే ఉంది. కానీ మొత్తం దేవతా రూపం భారతీకరించారు. ’’న్యాయదేవత కళ్లకు గంతలు అవసరం లేదు. చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదు.అదిఅందరినీ సమంగా చూస్తుంది.కత్తి హింసకు ప్రతీకగా కనిపిస్తుంది.కానీ న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల మేరకు న్యాయాన్ని అందజేస్తాయి’’అని జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈసందర్భంగా వ్యాఖ్యానిం చారు. వాస్తవికతలో అలా జరిగితే సంతోషమే. ఈ న్యాయ వ్యవస్థలోనే మొన్న మరణించిన ప్రొఫెసర్‌ సాయిబాబా తొమ్మిదేళ్లు విచారణ పేరుతో ఏనేరంరుజువు కాకుండానే జైల్లో మగ్గారు.హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి జైల్లోనే ప్రాణాలు విడిచారు.సాయిబాబాకు తన తల్లి మరణిస్తే,చూసేందుకు కూడా అనుమతి దొరక లేదు.కానీ అనేక దుర్మార్గాలు, హత్యలు, లైంగిక దాడుల ఆరోపణలతో జైలుకెళ్లిన డేరా బాబాకు పదులసార్లు పెరోల్‌ దొరికిన సంద ర్భంలో, న్యాయదేవత విగ్రహం మారగానే న్యాయం జరుగుతుందని నమ్మటానికి అవకాశముందా? అంబేద్కర్‌ ఆధ్వర్యంలో నిర్మితమైన రాజ్యాంగం పైన ఏమాత్రమూ గౌరవం,విశ్వాసం లేని పాల కులు,అనేక రాజ్యాంగ సవరణలకు పూనుకుని, రాజ్యాంగ మౌలిక స్వభావాన్నే మార్చివేస్తున్న వేళ,న్యాయదేవత చేతిలో రాజ్యాంగాన్ని పెట్ట గానే భ్రమకు గురవుతామా!కళ్లకు గంతలు తీసిన దేవతకు నిజాల్ని చూసి తీర్పులిచ్చే ధైర్యం వస్తుందా!ఈఅసమ సమాజంలో న్యాయం ఎవరి పక్షం వహించాలో న్యాయ వ్యవస్థకు ముందుగానే తెలుసు.న్యాయ చట్టా లను మార్చి,సంస్కృత పేర్లతో వాటిని పిలిచిన పుడే ఏదో మార్పుకు మార్గం వేస్తున్నారని సంకేతించారు.ఇప్పుడు భారతీకరించిన మను ధర్మాన్నే న్యాయంగా తెచ్చేందుకు పూనుకునే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా వేచిచూడాలి!
ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహం కళ్లకు గంతలు తీసేశారు. దీని అర్థం ఏమిటంటే చట్టం కళ్లున్నా చూడలేని గుడ్డిది కాదు. రెండు కళ్లు తెరిచి అందరినీ సమానంగా చూడగలదని చెప్పడానికే న్యాయదేవత కళ్లకు గంతలు తీసేశారు. అదేవిధంగా ఎడమ చేతిలో ఉన్న కత్తి బదులు రాజ్యాంగం ఉంచారు. దీని అర్థం ఏమిటంటే రాజ్యాంగాన్ని అనుసరించి న్యాయదేవత జరిగిన అన్యాయాన్ని గుర్తించి శిక్ష విధిస్తుంది. ఈ విషయాలను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ వెల్లడిరచారు. ఆయన ఆదేశాల మేరకే న్యాయదేవత విగ్రహంలో ఈ మార్పులు చేశారు.
న్యాయ దేవత కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. చట్టం గుడ్డిది కాదన్న సందేశం బలంగా వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఇలా న్యాయదేవత విగ్రహంలో మార్పులు చేసినట్లు సమాచారం. – గునపర్తి సైమన్‌

గిరిజన ఆకాంక్షల మేరకు అల్లూరి జిల్లా అభివృద్ధి

గిరిజనుల ఆకాంక్షల మేరకు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా మని అల్లూరి సీతారామారాజు జిల్లా కలెక్టర్‌ఎ. ఎస్‌.దినేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.అక్టోబర్‌ 23న కలెక్టరేట్‌ మిని సమావేశ మందిరంలో జిల్లా వ్యా ప్తంగా ఉన్న పలుగిరిజనసంఘాల నేతలతో సమా వేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్య, ఉద్యోగ అవకాశాలు, వైద్య సేవలు,రహదారుల అభివృద్ది,స్వయంఉపాధి పథకాలు,నైపుణ్యాభివృద్ధిని సమర్దవంతంగా అమ లు చేయడానికి గిరిజన సంఘాల నేతల తగు సలహాలు సూచనలు అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రా 2047కింద చేపట్టిన అబి óవృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. పాఠ శాల భవనాల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపించాలమని తెలియ జేసారు.పాఠశాల భవనాలు లేని చోట తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేయడానికి ఒకడిజైన్‌ చేయాలని అన్నారు. ప్రభు త్వ భూములు,క్వార్టర్లను ఆక్రమిస్తే తనదృష్టికి తీసుకునివస్తే తగిన చర్యలు చేపడతామని చెప్పా రు.గిరిజన భూములను గిరిజనేతరులు ఆక్రమిస్తే సమాచారం అందించాలని అన్నారు. మూడు, నాలుగేల్లో ప్రతి గ్రామానికి కనీస రహదారి సదు పాయం కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జెఎసి నేతలు రామారావు దొర,మొట్టడం రాజాబాబు,కొర్ర బల రాం,డా.రామకృష్ణ,ఎస్‌.వరలక్ష్మి తదితరులు మాట్లాడుతూ ఆశ్రమపాఠశాలల్లో మెనూ సక్ర మంగా అమలు చేయడం లేదని అన్నారు. డిప్యూటీ వార్డెన్ల పోస్టులు నిర్వహణకు ఉపాధ్యాయులు పైరవీలు చేస్తుంటారని చెప్పారు.ఆశ్రమ పాఠ శాలలో చదువుకుంటున్న 4,5తరగతి విద్యా ర్ధులపై ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎంపిపి పాఠశాలల ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని అన్నారు. కొయ్యూరు ప్రాంతంలో జీడి తోటలు అధికంగా ఉన్నాయని జీడిపిక్కల పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతా యని సూచించారు. జాఫ్రా,రబ్బరు పరిశ్రమలు, అటవీ ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మారేడు మిల్లి నుండి రాజమండ్రికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు.గిరిజన యువతకు శిక్షణ అందించి స్వయం ఉపాధి పథకాలు నెలకొల్ప డానికి తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. గంజాయి సాగు,రవాణా,వినియోగంపై కఠిన చర్య లు తీసుకోవాలని సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యపరీక్షలు,రక్త పరీక్షలు సక్ర మంగా నిర్వహించడం లేదని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.నకిలీ కులదృవీ కరణ పత్రా లుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రెడ్‌ క్రాస్‌ సంస్థ కార్య కలాపాలు సక్రమంగా జరగపోవడం వలన రక్తకొరత ఏర్పడుతుందని చెప్పారు. జిల్లాలో ముఖ్యంగా చింతూరు డివిజన్లో వరద సహాయ చర్యలు చేపట్టి నష్టాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్‌ సేవలును అందరూ ప్రశంసించారు. ఈ సమావేశంలో 22 మండలాల నుండి గిరిజన సంఘాల ప్రతినిధులు కె.ఆనం దరావు,గోపాల్‌,ఎస్‌.అశోక్‌,డా.పి.రాకుమార్‌, కె.సన్యాసిరెడ్డి,గిరిజన విద్యార్ధి సంఘం ప్రతిని దులు కిరసాని కిషోర్‌, ఎం.బాబూజీ తది తరులు పాల్గొన్నారు.
కాఫీ రైతులకు గిట్టుబాటు ధర అందించండి
అరకు కాఫీకి గిట్టుబాటు ధర అందించా లని జిల్లా కలెక్టర్‌ఎ.ఎస్‌.దినేష్‌కుమార్‌ సూచిం చారు. బుధవారం ఆయన కార్యాలయంలో ఐటిసి కంపెనీ అధికారులు,కాఫీ అధికారులతో కాఫీ విక్ర యాలపై సమావేశం నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు కాఫీని గిరి జన రైతులు ఆర్గానిక్‌ విధానంలో సాగు చేస్తు న్నారని కాఫీ రైతులకు మంచి ధర చెల్లించాలని స్పష్టం చేసారు. చింతపల్లి మాక్స్‌ సంస్థ సేకరిస్తున్న కాఫీని బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తామ మన్నారు. కాఫీ సేకరణలో తగిన నాణ్యతలు పాటించాలని సూచించారు. కాఫీ రైతుకు జియో ట్యాగింగ్‌ చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు.కాఫీ నాణ్యతలపై లైజాన్‌ వర్కర్లకు అవగా హన కల్పించాలని చెప్పారు.చింతపల్లి మాక్స్‌ సంస్థ ఈ ఏడాది 600టన్నుల పార్చిమెంట్‌ కాఫీని ఉత్పత్తి చేస్తోందన్నారు గిరిజన కాఫీని బహిరంగ వేలంలో విక్రయిస్తామన్నారు.గత రెండు సంవ త్సరాలను అరకు కాఫీ ఫైన్‌ కప్‌ అవార్డును పొందు తోందన్నారు.ఐటిసి అధికారులు వాసు దేవ మూర్తి, కిరీట్‌ పాండే మాట్లాడుతూ మాక్స్‌ కాఫీ వేలంలో పాల్గొంటామని చెప్పారు. కాఫీ విక్రయాలు, వేలం సమయంలో సమాచారం అందించాలని కోరారు.
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కలిసికట్టుగా నడుద్దాం – రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అందరం కలిసి కట్టుగా నడుద్దా మని, సమష్టి కృషి చేద్దామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.ప్రజా సమస్య ల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలుద్దామని పేర్కొ న్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఛైర్‌ పర్శన్‌ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.సీజనల్‌ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి లో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. డయేరియా లాంటి మహమ్మారి దాడి చేయకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని, క్లోరినేషన్‌ ప్రక్రియను నిరంతరం చేపట్టాలని చెప్పారు.మురుగు కాలువలకు ఆను కొని తాగునీటి పైపు లైన్లు ఏర్పాటు చేయరాదని, జలజీవన్‌ మిషన్‌ లో భాగంగా చేపట్టిన పనులను నిర్ణీత కాలంలో వందశాతం పూర్తి చేయాలని పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని,శివారు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదని పలువురు సభ్యులు ప్రస్తావించగా స్పందించిన హోం మంత్రి రోడ్ల అభివృద్ధికి సభ్యుల సలహాలు, సూచనలతో సమగ్ర ప్రణాళిక రూపొందిద్దామని పేర్కొన్నారు.ఇప్పటికే దీనిపై కేంద్ర హోం మంత్రి తో చర్చించామని కేంద్ర,రాష్ట్ర నిధుల సహా యం తో గిరిజన ప్రాంతాల్లో రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకుందామని అన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఇక నుంచి డోలీమోత కష్టాలు ఉండ వని హోంమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతాల్లో కూడా రోడ్ల మరమ్మతులకు తక్షణ చర్యలు చేపడతామని,తదుపరి శాశ్వత చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా తెలి పారు.ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని రోడ్ల మరమ్మ తులకు రూ.20కోట్లతో పనులు చేసేందుకు చర్య లు తీసుకున్నట్లు ఆమెగుర్తు చేశారు. రోడ్లకు ఇరు వైపులా తుప్పలను తక్షణమే తొలగించాలని ర.భ. శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షా కాలం కావున కాలువగట్ల పటిష్టతకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉందని సంబంధిత అధికా రులను ఉద్దేశించి పేర్కొన్నారు.జడ్పీ ఛైర్‌ పర్శన్‌ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ముం దుగా సీఈవోపి.నారాయణమూర్తి అజెండా అం శాలను చదివి వినిపించారు.సభ్యులు పలు అంశా లపై ప్రశ్నలు వేశారు. మధ్యాహ్న భోజనం పథకా న్ని బాగా అమలు చేయాలని,ప్రయివేటు పాఠశా లల్లో తనిఖీలు చేపట్టాలని, పిల్లల భద్రతకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ సకాలం లో విత్తనాలు, ఎరువులు అందించాలని కోరారు. ఇటీవల కురిసిన వర్షాల కు ఏజెన్సీ ప్రాంతంలో భారీగాపంట నష్టం జరి గిందని, పారదర్శకంగా అంచనాలు వేసి పరిహా రం అందించాలని విజ్ఞప్తి చేశారు.రోడ్లకు మరమ్మ తులు చేపట్టాలని విన్నవించారు. ఉపాధి హామీ, కల్వర్టుల నిర్మాణం, తాగు నీటి సౌకర్యం,జలజీవన్‌ మిషన్‌ పనులు తదితర అంశాలపై సభ్యలు మాట్లా డారు.
స్టీల్‌ ప్లాంటుపై ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా స్పందిస్తాం ః ఎంపీ శ్రీభరత్‌
సమావేశంలో భాగంగా స్టీల్‌ ప్లాంటు విషయంలో స్థానిక ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించాలని, న్యా యం చేయాలని ఓసభ్యుడు విన్నవించగా విశాఖ పట్టణం ఎంపీ శ్రీభరత్‌ సానుకూలంగా స్పందిం చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్టీల్‌ ప్లాంటు విషయంలో కేంద్రం నుంచి సానుకూల పరిణా మాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ నాలుగు నెలల కాలంలో రూ.500కోట్లు ఒక సారి,రూ.1200కోట్లు ఒకసారి మొత్తం రూ.1, 700 కోట్ల నిధులు వేర్వేరు అవసరాల దృష్ట్యా విడుదలయ్యాయని పేర్కొన్నారు. నిధుల విడుదల ను బట్టే స్టీల్‌ ప్లాంటు విషయంలో కూటమి ప్రభు త్వం దృక్పథం అర్థమవుతుందని ఎంపీ వ్యాఖ్యా నించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే స్థానికంగా స్పందిస్తామని ఎంపీ స్పష్టం చేశారు. కాఫీ,మిరియాలు,జీడితోటలు,ఇతర పండ్ల తోట లకు గ్రామీణ ఉపాధిహామీపథకాన్ని అనుసం ధానం చేసే విధంగా పార్లమెంటులో ప్రస్తావిం చాలని జడ్పీ ఛైర్‌ పర్శన్‌ ఎంపీని కోరగా తప్పకుం డా ప్రస్తావిస్తామని ఎంపీ భరత్‌ పేర్కొన్నారు.
పాఠశాలల్లో, వసతి గృహాల్లో ఆహారం నాణ్యతను పెంచాలి ః ఎంపీ తనూజ రాణి
ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో అందించే ఆహారం నాణ్యతను మరింత పెంచాలని అరుకు ఎంపీ తనూజ రాణి పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరచాలన్నారు. పిల్ల లకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని సూచిం చారు. ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా..పిల్లలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శిథిల భవనా లకు మరమ్మతులు చేయాలని, కొత్తవాటిని నిర్మిం చాలని, గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ పనులు పూర్తి చేయాలని సూచించారు.స్థానిక సమస్యలను పార్ల మెంటులో ప్రస్తావిస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
మార్కెట్‌ కమిటీ ఆదాయాన్ని ప్రజా అవసరాలకు వెచ్చించాలి ః పెందుర్తి ఎమ్మెల్యే
స్థానికంగా ఉండే మార్కెటింగ్‌ కమిటీల ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక ప్రజా అవసరాల మేరకు వెచ్చించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బాబు అభిప్రాయపడ్డారు. ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాలపై అధికారులు దృష్టి సారించాలని, సభ్యులకు,ప్రజలకు సహకారం అందించాలని సూచించారు. అలాగే సమావేశానికి వచ్చే సభ్యులు స్థానిక పరిస్థితులపై ముందుగానే అవగాహన కల్పించుకోవాలని,ఏయే అంశాలపై ప్రశ్నలు అడ గాలో సిద్ధమై రావాలని అప్పుడే ఆశించిన ఫలితా లు వస్తాయని పేర్కొన్నారు. అన్ని రకాల శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యలు, అంశాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు తోడుగా నిలవాలన్నారు.
షట్రపల్లిలో మోడల్‌ కాలనీ నిర్మిస్తాం ః ఏఎస్సార్‌ జిల్లా కలెక్టర్‌
ఇటీవల కురిసిన వర్షాలకు జీకే వీధి మండలం లోని షట్రపల్లిలో భారీ నష్టం జరిగిం దని, అక్కడి ప్రజలు ఇళ్లు కూడా కోల్పాయరని స్థానిక జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించగా అల్లూరి సీతారాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సానుకూలంగా స్పందిం చారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించానని, అక్కడి పరిస్థితులను పరిశీలించానని చెప్పారు. షట్రపల్లి గ్రామంలోని 37కుటుంబాలను అనుకూ లమైన ప్రాంతానికి తరలించి వారికి కోసం పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద మోడల్‌ కాలనీని నిర్మిస్తామని పేర్కొన్నారు.
సమావేశంలో విశాఖపట్టణం,అరుకు ఎంపీలు శ్రీభరత్‌, తనూజ రాణి,ఎమ్మెల్సీ దువ్వా రపు రామారావు,పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌ బాబు, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌, దినేష్‌ కుమార్‌,విజయ కృష్ణన్‌,ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు,ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-జిఎన్‌వి సతీష్‌

1 2 3 10