తెలుగు భాష తీయ్యనది

మనం ఒక వ్యక్తితో మన భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ సమా చారం కేవలం మెదడుకు మాత్రమే చేరుతుంది. అదే మన మాతృభాష, అతని మాతృభాష ఒకటే అయినప్పుడు ఆ సమాచారం హృదయానికి చేరుతుందంటారు నెల్సన్‌ మండేలా. ప్రతి ఒక్కరూ తమ జన్మభూమిని, సంస్కృతిని, మాతృభాషను గౌరవించాలి. నాగరిక జాతి మాతృభాషలోనే మాట్లాడుతుందని డబ్ల్యూ.బి.యేట్స్‌ అంటాడు. భాష మన భావాలను ఎదుటివారికి వ్యక్తపరిచే ఒక సాధనం. భూగ్రహంపై ఉన్న లక్షలాది జీవరాశుల్లో ఒక్క మానవుడికి మాత్రమే భావాలను రాత, కూత రూపంలో వ్యక్తపరిచే అవకాశం ఉంది. మన మనసులో ఏ భావాలు ఉంటాయో, ఏ అనుభవాలు ఉంటాయో వాటిని సమర్థవంతంగా భాష తెలుపుతుంది. మాట్లాడే అలవాటుతో కూడిన వ్యవస్థ భాష. బుద్ధి జీవులు తమ అనుభ వాలను భాష ద్వారానే వ్యక్తం చేస్తారు. మొదట చిన్న చిన్న శబ్దాల రూపంలో ప్రారంభమైన భాష, అమ్మ నోటి నుండి వెలువడే పదాలతో సుసంపన్నమ వుతుంది. అమ్మ మాటను శిశువు అనుకరిస్తాడు.. అనుభవిస్తాడు.. ఆనందిస్తాడు.. జత కలుపుతాడు.. కొనసాగిస్తాడు. అమ్మ మాటే మాతృభాషగా కొనసాగుతుంది. తెలుగు నేల మీద అమ్మ భాషకు క్రమంగా వెలుగులు తగ్గుతున్నాయి. మూలమైన ఈ భాషను చేతులారా మనమే మూలకు నెట్టేస్తున్నాం. తల్లిని ప్రేమించినట్టే..తల్లిని రక్షించుకున్నట్టే భాషను రక్షించు కోవాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉంది.
భావ వ్యక్తీకరణకు,భావ గ్రహణానికి మాతృభాష కీలకమైనది. మనం వేరే భాష మాట్లాడే ప్రాంతంలో ఉన్నప్పుడు,మన భాషకు సంబంధించిన ఒక్కమాట వినబడినా ఉప్పొంగిపోతాం. మాతృభాషను మాట్లాడగలిగిన వ్యక్తి ప్రపంచంలోనే ఇతర ఏ భాషనైనా సులభంగా నేర్చుకుం టాడనడానికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మన బాధను,ఆనందాన్ని,కోపాన్ని,అనుభూతిని మాతృభాషలో వ్యక్తీకరించినంత శక్తివంతంగా ఇతర ఏ భాషలోనూ వ్యక్తీకరించలేము.ఇవాళ మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న ఒక తరాన్ని మనమే తయారు చేసుకున్నాం. విద్య వ్యాపారం అయ్యాక, మనిషి సరుకు వెంటపడ్డాక, కేవలం డబ్బులు సంపాదిం చడమే విద్యగా మనం మార్చేశాం. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమే కానీ పరాయిభాషను నాలుక మీద ఎక్కించుకొని,మాతృభాషను పాదాల కిందకు తొక్కేయడం క్షమించరాని నేరం.
చదివితే ప్రయోజనాలు..
మాతృభాషలో విద్యాబోధన వల్ల గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది.విద్యార్థుల్లో సృజనాత్మకత వికసి స్తుంది. మనుషులు నిజమైన భావ ప్రేరణ, ప్రగతి మాతృభాష వల్లే కలుగుతుంది.అసలు స్వభాషలో విద్య ఉంటే మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చి ఉం డేదని గాంధీ అభిప్రాయపడ్డారు. మాతృభాషలో విద్య మనసును చురుగ్గా చేస్తుంది.భాష కేవలం వ్యక్తీకరణ కోసమే కాక,అది ఒక జాతి మొత్తానికి వారి ఉనికిని,వారి సంస్క ృతిని,సాంప్రదాయా లను, స్థానిక వాతావరణ పరిస్థితులను ఆ తర్వాత తరానికి అందించే వారధిగా ఉంటుంది. భాష ఒక జాతి అస్తిత్వం. పరాయి భాష కేవలం జీతం కోసమే. మాతృభాష జీవితాన్ని తెలుపుతుంది. మాతృభాషలో మన ఆలోచన అత్యంత వేగంగా ఉంటుంది. ఒక వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి మాతృభాష సోపానం వంటిది. మన మాతృభాషని అర్థం చేసుకుంటే అందులోని జాతీయాలు,పదబంధాలు,మెరుపులు,ఛలోక్తులు వాటి తాలూకు పరిమళం మనకు తెలుస్తాయి. పరాయి భాష ఎంత నేర్చుకున్నా అందులోని ప్రాణశక్తిని మనం పట్టుకోలేం.మాతృభాషలో విద్యను నేర్చుకున్న విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడానికి తొందరగా అలవాటుపడతారు. ఏదైనా ఒక విషయం మీద మాట్లాడమని చెప్పిన ప్పుడు మాట్లాడగలరు, స్పందించగలరు.ఇతర భాషల్లో ఆ స్పందన ఉండదు. కేవలం బట్టీపట్టి మాత్రమే వాళ్ళు మాట్లాడగలరు. పసివారి మెదడుకు మాతృభాష సహజమైన పోషణ. పిల్లలు ఈ నేల మీద పుడతారు, ఈ నీళ్లు తాగుతారు. కానీ విదేశీ భాషను ఆ పసికందుల నెత్తిన రుద్దడం అంటే వారి మేధాశక్తిని, సృజనాత్మకతను హత్య చేయడమే అవుతుంది.
భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి..
ఆంధ్రప్రదేశ్‌ తొలి భాషా ప్రయుక్తగా ఏర్పడిరది. కానీ ఇవాళ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. ప్రభుత్వం జీవోలు తెలుగులో ఇవ్వాలనే ఒక ప్రకటన విడుదల చేసింది. జీవోలు తెలుగులో ఇచ్చినంతమాత్రాన భాషను పరిరక్షించినట్టు కాదు. పాలనా భాషగా,బోధనా భాషగా పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడానికి పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలు కారణం. ఈనాటి బాల బాలికలలో,యువతరంలో తీవ్రమైన మానసిక ఉద్వేగాలకి కారణం వాళ్లు తమ భాషలోని మాధుర్యాన్ని, ఆ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోలేని స్థితిలో ఉండటమే! మనది కాని సాహిత్యాన్ని వాళ్ళ నెత్తిన రుద్దుతున్నాం. పరభాషా వ్యామోహంతో అమ్మ భాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిది. అమ్మ భాషను పరిరక్షించుకోవడం సామాజిక అవసరం. ‘దేశ క్షేమానికి భాషా క్షేమమే పునాది’ అని గిడుగు అప్పుడెప్పుడో ఉద్ఘాటించారు.‘పర భాష బోధన సోపానాలు లేని సౌధంలా ఉంటుంది’ అని ఠాగూర్‌ అంటారు.విద్య గ్రామీణుల అవసరాలు తీర్చేదిగా ఉండాలి.‘విద్యా బోధన మాతృభాషలో జరగాలి. కొల్లగొట్టుకునే సామ్రాజ్యవాదులకు సహాయకారిగా ఉండకూడదు!’ అని మహాత్ముడు పిలుపునిచ్చాడు.
నూతన విద్యా విధానంలో..
నూతన జాతీయ విద్యా విధానంలో కూడా ప్రాంతీయ భాషలకు పట్టం కట్టారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలో ఉండాలని చెప్పారు.అయినా సరే అట్లాంటి చట్టాల్ని, నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోవు. ఏదో ఒకసారి కోర్టులో తీర్పు తెలుగులో వెలువడితే చంకలు గుద్దుకుని ఆనందించిన వాళ్ళం మనమే. పిల్లలకు పునాది సరిగా లేకపోతే ఏభాష అయినా ఎలా వస్తుంది. సృజనాత్మకత మొలకెత్తాలంటే మాతృభాష మార్గం.శిక్షణల ద్వారా భాష రాదు. మనం కొన్నాళ్లుగా ఇంగ్లీష్‌ మీడియం పేరు మీద ఇస్తున్నది శిక్షణ.కానీ అది పిల్లలకు రక్షణ కాదు. అది విద్యావిధానం లక్షణం కాదు. మాతృభాషను ఎట్లా ఉత్సవం చేసుకోవాలో ఈజాతి ఇంకా తెలుసుకోలేదు. ‘మాతృభాష కంటిచూపు వంటిది. మిగతా భాషలు కళ్ళజోళ్లు వంటివి. కంటిచూపు లేకుండా కళ్ళజోళ్ళు ఎన్ని పెట్టుకున్నా ప్రయోజ నం ఉండదు’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలో చెప్పారు. తనకు మాతృ భాషలోనే విద్య నేర్పమని ఔరంగజేబు తన గురువుకు ఉత్తరం రాసిన సంగతి చరిత్రలో ఉంది.ఆనాటి విద్యావ్యవస్థపై ఔరంగజేబు చేసిన ఫిర్యాదు అది.
ఏ భాష నేర్వాలన్నా..
ప్రపంచవ్యాప్తంగా జరిపిన జరుగుతున్న పరిశోధనల ద్వారా విద్యార్థులు ఏ శాస్త్రమైనా ఏ ఇతర భాషలు నేర్చుకోవడానికైనా మాతృభాష మాధ్యమమే సరైనదని తేల్చారు. జపాన్‌, ఐర్లాండ్‌, ఫిన్లాండ్‌, చైనా లాంటి దేశాల్లో ఆ ఫలితాలను మనం చూస్తూనే ఉన్నాం. బహుళ భాషల సమాజాల మనుగడ నేడు వాస్తవంగా ఉన్నప్పటికీ మాతృభాష పరిరక్షణ తప్పనిసరి అవుతుందని యునెస్కో తెలుపుతుంది. ‘నేను నా మాతృభాష లోనే మాట్లాడుతాను. ఎందుకంటే నా ఉనికికి నా భాష కారణం. మా అభిమాన మాతృభాషనే మా బిడ్డలకు నేర్పుతాం. వారెవరో వారికి తెలియాలి!’ ఇలాంటి నినాదాలు యునెస్కో ఎప్పటినుంచో గుర్తుచేస్తూ ఉంది.
భాషను వ్యాపార వస్తువు చేయడం మన రాష్ట్రం లో మరీ మితిమీరినట్టుగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాన్వెంట్ల మోజు విపరీతంగా పెరిగింది. ప్రభుత్వాలు కూడా భాషను బ్యాలెట్‌ పేపర్‌గా చూడడం మొదలుపెట్టాయి. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం పాఠశాలలో చేర్పించి, పిల్లవాడు చాలా త్వరగా ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నాడంటూ మురిసిపోతున్నారు. అందులో వారి తప్పేమీ లేదు. ఆంగ్లం కేవలం 26 అక్షరాలతో కూడిన భాష. తొలి 100 పదాలను సులభంగా నేర్చుకుంటారు. ’’మమ్మీ డాడీ’’ అని పిలుస్తూ తిరుగుతూంటే ఇంగ్లీష్‌ అంతా వచ్చేసిందనే భ్రమలో తల్లిదండ్రులు ఉండిపోతారు. తెలుగులో అచ్చులు, హల్లులు, గుణింతాలు, వాటి ఒత్తులు మొత్తంగా సుమారు 15 వందలకు పైగా అక్షరాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఒక్కసారి అక్షరాలను నేర్చుకుంటే ఏ వాక్యాలనైనా, ఏ కావ్యాలనైనా సులభంగా చదివేయొచ్చు. కానీ ఆంగ్ల భాష అలాకాదు.. జీవితాంతం ప్రతి పదానికీ కొత్తగా ఉచ్చారణ, రాసే విధానం నేర్చుకుంటూ పోవాల్సిందే.
పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టే తెలుగు బాగానే వస్తుందనే భ్రమలో మనం ఉండిపోయాం. తల్లిదండ్రులు రోజూ పిల్లలతో కొద్దిసేపు తెలుగు కథలను చెప్పడం వల్ల మన సంస్కృతి, సాంప్రదాయాలను, మన సాహిత్య ఇతిహాసాలు వంటివి పిల్లలకు సులభంగా చేరతాయి. పిల్లలు కథలను చదవడం ద్వారా వారి మీద వికాసం చాలా బాగుంటుంది. మాతృభాషలో కథలను చదువుతున్నప్పుడు అవి వారి మనసుల్లో దృశ్య రూపంలోకి సులభంగా మారుతూంటాయి. అవి అలా గుర్తుండిపోతాయి. అందువల్ల పిల్లల్లో సృజనాత్మకత మెరుగుపడుతుంది. కథలను టీవీలోనూ యూట్యూబ్‌ ఛానల్‌లోనూ చూస్తున్నప్పటి కంటే చదువుతూ ఉన్నప్పుడు పిల్లలే దృశ్యకరణ చేసుకోగలరు. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి.
ప్రస్తుతానికి సురక్షితం..
ప్రస్తుతానికి తెలుగు భాష యునెస్కో లెక్కల ప్రకారం 65 సురక్షిత భాషలలో ఒకటిగా ఉంది. మన దేశంలో గానీ మన రాష్ట్రంలో గానీ ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులను పరిశీలిస్తే.. వారికి బోధించే ఉపాధ్యాయులు కేవలం పాఠాన్ని చెప్పడానికి సాంకేతిక పదాలు మాత్రమే ఆంగ్ల భాషలో ఉపయోగిసూ,్త మిగిలినదంతా మాతృ భాషలోనే చెప్తారు. బోధించే వారికి కూడా ఆ భాషలో సరైన భావ ప్రసారం ఉండదు. ఏది ఏమైనప్పటికీ కాస్తో కూస్తో సినిమా పరిశ్రమల వాళ్ళు మాతృభాషలో సినిమాలు తీసి సేవ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్లు కూడా ఆంగ్ల మాధ్యమంలో సినిమాలు తీయడం మొదలుపెడితే మన భాష పరిస్థితి ఇక అంతే. కేవలం మాట్లాడే వాళ్ళు ఉంటే భాష బతికేస్తుంది అనే మాట తప్పు. ఆ భాషలో రచనలు రావాలి. వాటిని చదివే వాళ్ళు ఉండాలి. ఈ తరంలో సొంతంగా ఐదారు వాక్యాలు కూడా తెలుగులో సరిగా రాయలేని వాళ్ళు గణనీయమైన శాతంలో ఉన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. మాతృభాషలో విద్యాబోధన లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. దీన్ని మార్చా ల్సిన అవసరం ఉంది. మాతృభాషలో చదువుని ప్రారంభించిన విద్యార్థి ఒత్తిడిని సులభంగా అధిగమించగలడు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు వారి వారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడానికి, వారు రాజకీయ కిరీటాలు ధరించడానికి, వాళ్లు ప్రజలలోకి చొచ్చుక ుపోవడానికి చేసింది వారికి మాతృభాషలో ఉన్న పట్టు మాత్రమే అనే విషయాన్ని కూడా గుర్తించాలి.-(గొడవర్తి సూర్యనారాయణ)

2047నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం

ఏపీ అసెంబ్లీలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం..!
‘‘ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష. ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, విద్యుత్‌ ఉండాలి. యువతకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది మా విధానం. పీ-4 విధానం ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలిం చేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు సరికొత్త విధానాలు తెచ్చాం. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్ట్‌ ద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం’’. – జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, గవర్నర్‌
ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగు లేని మెజారిటీ ఇచ్చారని,ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.
గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైం దని,గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్ట పోయిందని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నా మన్న గవర్నర్‌, అధి కారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్‌సీ దస్త్రంపై సంతకం చేశామని, అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. తలసరి ఆదాయం పెరిగింది: కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడి లో పెడుతున్నా మన్న గవర్నర్‌,తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అవకా శాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని వెల్లడిరచారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని,పేద విద్యార్థులకు ఉప కారవేతనాలు అందిస్తు న్నామని అన్నారు.విద్య, వైద్యం,మౌలికవసతు లపై ప్రత్యేక దృష్టి సారించామన్న గవర్నర్‌, బీసీవర్గాలు సమాజానికి వెన్నెముక అని వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీల కు 34శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు గుర్తు చేశారు.
టూరిజంలో పెట్టుబడులు పెరిగాయి: ‘మన బడి – మన భవిష్యత్తు’ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని గవర్నర్‌ తెలిపారు. మెరిట్‌ ఆధారంగా 9వర్సిటీలకు వీసీలను నియమించామని, స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధన ఎత్తివేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించామని,ఐటీఐలు, పాలిటెక్నిక్‌ల్లో 200 స్కిల్‌ హబ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఉండాలనేది సీఎంఆకాంక్ష అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో టూరిజంలో పెట్టు బడులు పెరిగాయని గవర్నర్‌ నజీర్‌ అన్నారు. ఎంఎస్‌ ఎంఈలకు అండగా ఉన్నామని,అన్నివిధాలా ప్రోత్స హిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
రాయలసీమలో కరవు అనేదే ఉండదు: తాగు,సాగు, పారిశ్రామిక అవసరాలకు నీరందించేలా కార్యక్రమా లు చేపట్టామని, 2027నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల పూర్తయితే రాష్ట్ర రూపురేఖలు మారతాయని, రాయలసీమలో కరవు అనేదే ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థిక పతనం అంచుకు చేరిందన్న గవర్నర్‌, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని 7శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలి పామని గుర్తుచేశారు. గత ఐదేళ్ల పాలనలో వనరుల మళ్లింపు, సహజవనరుల దోపిడీ జరిగిందని మండి పడ్డారు.గతఐదేళ్ల పాలనలో ఎక్సైజ్‌,ఇసుకలో లోప భూయిష్ట విధానాలు జరిగాయన్న గవర్నర్‌, ప్రభుత్వ పన్నులను సైతం దారి మళ్లించారని చెప్పారు. రూ.6.5లక్షలకోట్ల పెట్టుబడులు పెట్టారు: రూ.2, 488 కోట్ల ఆర్థికసంఘం గ్రాంట్‌తో స్థానిక పాలన బలోపేతం చేశామని గవర్నర్‌ నజీర్‌ తెలిపారు. పోలవరం,అమరావతి ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిం చామని, విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్‌ ఏర్పాటు హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు. సుస్థిర వృద్ధికి దోహదపడే 22కొత్త విధానాలద్వారా బలమైన పునాది వేశామన్న గవర్నర్‌,గూగుల్‌, ఆర్సెలర్‌ మిట్టల్‌, టాటా పవర్‌ కంపెనీలను ఆకర్షించినట్లు తెలిపారు. గ్రీన్‌కో గ్రూప్‌, బీపీసీఎల్‌, టీసీఎస్‌ కంపెనీలను ఆకర్షించా మని, ఇన్వెస్టర్లు ఇప్పటివరకు రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడిరచారు. ఆయా పెట్టు బడుల ద్వారా 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు పెరిగాయని,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రూ.16లక్షల కోట్లకు విస్తరించిందని అన్నారు.
కందుకూరి వ్యాఖ్యలు ప్రస్తావించిన గవర్నర్‌: తలసరి ఆదాయం కూడా రూ.2.68 లక్షలకు పెరిగిందని, వ్యవసాయం, పరిశ్రమలు,సేవల రంగాలు వృద్ధి చెందాయని అన్నారు.ఈ సందర్భంగా సంఘ సంస్కర్త కందుకూరి వ్యాఖ్యలను గవర్నర్‌ ప్రస్తావించారు. ప్రతి వ్యక్తిలో ప్రతిభ ఉంటుందని, అవకాశమిస్తే బయటకు వస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం స్వర్ణాంధ్ర-2047 దిశగా వెళ్తోందని, సమాజ అభివృద్ధికి సంక్షేమం, అభివృద్ధి కలిసికట్టుగా వెళ్లాలని సూచిం చారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండాలనేదే తమ విధానమని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఐటీ విప్లవానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని కొనియాడారు. అమెరికాలోని ప్రవాస తెలుగువాళ్ల తలసరి ఆదాయం ఎక్కువని తెలిపారు. ప్రస్తుతం ఏపీ మరో విప్లవానికి నాయకత్వం వహిస్తోందని, పరిపాలన,పరిశ్రమలు,ఆర్థిక వృద్ధిలో ఏఐను విని యోగిస్తున్నామని చెప్పారు.
‘‘స్వర్ణాంధ్ర-2047కు పది సూత్రాలతో విజన్‌ రూపొందించాం.పేదరిక నిర్మూలన, మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. యువతకు నైపు ణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన,నీటి భద్రత, రైతు-అగ్రి టెక్‌,గ్లోబల్‌ బెస్ట్‌ లాజిస్టిక్స్‌,వ్యయ నియంత్రణ, విద్యుత్‌-ఇంధనం ప్రత్యేక దృష్టి పెట్టాం. ‘పీపుల్‌ ఫస్ట్‌’ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్‌మ్యాప్‌ రూపొందించాం.పేదలకు ఆహార భద్రత కోసం పీడీఎస్‌ను బలోపేతం చేశాం.ఎస్సీ,ఎస్టీ కుటుంబా లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అంది స్తున్నాం’’. -జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, గవర్నర్‌
24 అంశాలపై చర్చ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు నడపాలన్నది నిర్ణయించను న్నారు. ఎన్నికల హమీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నెల 28వ తేదీన 2025-26వార్షిక బడ్జెట్‌?ను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 వారాల పాటు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పన: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశా లపై గవర్నర్‌ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌?ను చట్టసభలకు సమర్పించనున్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు సమాచారం. 15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్‌ రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంతో తొలుత ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను పాత ప్రభుత్వం సభకు సమ ర్పించింది.
రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా బడ్జెట్‌: ఆతర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇతరత్రా అంశాల కారణంగా మరో నాలుగు నెలల కాలానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్‌?ను సమర్పించింది. రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా నిలిచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను, అభివృద్ధిని గాడిన పెట్ట డంలో ఈ నెల 28న ప్రవేశపెట్టే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ ఎంతో కీలకం కానుంది. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, మేనిఫెస్టోలో అంశాలకు ఈబడ్జెట్‌లో స్థానం కల్పించాల్సి ఉన్నందున, అందుకు తగ్గట్టుగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. హామీల అమలుకు తగ్గట్టుగా వనరుల సమీకరణ ఇక్కడ కీలకం కానుంది. బడ్జెట్‌ సమావేశాల సంద ర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కేంద్ర పథకాలను వీలైనంతగా వినియోగించుకుని: ముఖ్యమంత్రి ఆర్ధికశాఖ అధికారులతోను, ఆర్ధిక మంత్రితోను బడ్జెట్‌ రూపకల్పనపై ఇప్పటికే పలు మార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అన్ని ప్రభుత్వశాఖలకు సంబం ధించిన మంత్రులు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శు లు, కార్యదర్శులతో బడ్జెట్‌ ప్రతిపాదనలపై కూలం కషంగా చర్చించారు. ఆయా శాఖల్లో వారి ప్రాధాన్యా లపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు ప్రకారం బడ్జెట్‌ రూపకల్పన చేసినట్లు సమాచారం. శాఖల వారీగా వారి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు కూడా తెలుపుతూ ఎన్నికల హామీల ప్రకారం బడ్జెట్‌ రూప కల్పన,అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉండ నున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలను వీలైనంతగా వినియోగించుకుని కేంద్రం నుంచి నిధు లు రాబట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. విద్యా, వైద్య శాఖల ద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులు లభించవచ్చని అంచనా వేస్తున్నారు.-గునపర్తి సైమన్‌

భారత్‌ గణతంత్ర దినోత్సవం`2025 ప్రత్యేకతలు

‘‘ భారత సైనిక శక్తిని,ఆయుధ పాటవాన్ని,సాంస్కృతి వైభవాన్ని ప్రదర్శిస్తూ 76వ గణతంత్ర వేడుకలు కన్నుల పండువగా జరిగాయి.అత్యాధునిక క్షిఫణులు,యుద్ద విమానాల ప్రదర్శన,జవాన్ల కవాతు దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా సాగాయి. సశక్త్‌ ఔర్‌ సురక్షిత్‌ పేరిట తొలిసారి ప్రదర్శించిన త్రివిధ దళాల ఉమ్మడి శకటం ఆకట్టుకుంది. ఢల్లీిలోని కర్తవ్య పథ్‌లో జనవరి 26న జరిగిన ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ,కేంత్రమంత్రులు,త్రివిధ దళాధిపతులు,ప్రముఖలు పాల్గొన్నారు.రాష్ట్రపతి సంప్రదాయ బగ్గీలో కర్తవ్యపథ్‌కు చేరుకున్నారు.’’
త్రివర్ణ స్పూర్తి`సమున్నత కీర్తి
భారతదేశ ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా,అపారమైన సైనిక పాటవానికి అద్దం పట్టేలా,పురోభివృద్ధి ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్లు వివరించేలా శకటాలు,కవాతులకు కర్తవ్యపథ్‌ వేదికగా నిలిచింది.76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ఢల్లీిలోని కర్తవ్యపథ్‌ నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.వారిద్దరూ కలిసి గుర్రపుబగ్గీలో ప్రధాన వేదికవద్దకు వచ్చారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని తీసుకురావడం ఈసారి ఒక ప్రత్యేకత.అభివృద్ధి ప్రధాన ఇతివృత్తంగా ‘స్వర్ణిమ్‌భారత్‌: విరాసత్‌ ఔర్‌ వికాస్‌’ పేరుతో ప్రత్యేక శకటాలకు రూపకల్పన చేశారు.బ్రహ్మోస్‌,ఆకాశ్‌ క్షిపణులు,పినాక మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ ప్రత్యే-ఆకర్షణగా నిలిచాయి.కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన 31శకటాలను ప్రదర్శించారు.
మార్మోగిన ‘నారీశక్తి’
కవాతులో నారీశక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం, డోలు వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌ పరేడు ప్రారంభించారు. సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో నారీశక్తిని చాటేలా అధికారిణులు- లెఫ్టినెంట్‌ కర్నల్‌ రవీందత్‌ రంధావా, లెఫ్టినెంట్‌ కమాండర్‌ మ అగర్వాల్‌, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ రుచి సాహా, కెప్టెన్‌ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు. డీఆర్డీవో బృందానికి మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. సహాయ కమాండెంట్‌ ఐశ్వర్య జాయ్‌ నేతృత్వంలోని 148 మంది సభ్యుల సీఆర్పీఎఫ్‌ మహిళా బృందం, డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ ఆదిత్య నేతృత్వంలోని ఆర్పీఎఫ్‌ బృందం పరేడ్లో పాల్గొన్నాయి. 15 మంది మహిళా పైల బృందం గగనతల విన్యాసాలతో తమ ప్రతిభను చూపింది.
ప్రపంచ రికార్డులు..
కదులుతున్న మోటారుసైకిల్‌ మీద 12 అడుగుల ఎత్తైన నిచ్చెనపై నిలబడి రాష్ట్రపతికి శాల్యూట్‌ చేయడం ద్వారా మహిళాధికారిణి కెప్టెన్‌ డిరపుల్సింగ్‌ భాటి ప్రపంచరికార్డు సృష్టించారు. డేర్రెవిల్స్‌ ప్రదర్శించిన మరో విన్యాసం కూడా ప్రపంచరికార్డు సృష్టించనుంది. 33మంది కలిసి మానవ పిరమిడ్‌ ఆకారంలో చేసిన ఇంకో విన్యాసం విశేషంగా ఆకట్టుకుంది. సుఖోయ్‌ విమానాల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. కొయ్యబొమ్మల నుంచి మహా కుంభమేళా వరకు వివిధ అంశాలకు ప్రతీకగా శకటాలు నిలిచాయి. 5వేల మంది జానపద కళాకారులు, గిరిజనులు కలిసి 45 రకాల నృత్యరీతుల్ని ప్రదర్శించారు. ఇండోనేసియా సైనిక దళానికి చెందిన 152 మంది బృందం కవాతులో పాల్గొంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రగతికి పది సూత్రాల ప్రణాళికతో
రాష్ట్రప్రగతికి పది సూత్రాల ప్రణాళికతోముందుకు వెళుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు.విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో నిర్వహిం చిన 76వ గణతంత్ర దిన వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్‌ ప్రసంగించారు. ఏడు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌ తీవ్ర ఆర్థిక, పరిపాలనా గందరగోళంతో దెబ్బతిం దన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేయడం, వనరుల మళ్లింపుతో పాటు దుష్పరి పాలన సాగించడంతో ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలపై పడిరదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని, అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయని, నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాలనా వ్యవస్థ దెబ్బ తిన్నదన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడం, ప్రతి సవాలును అవకాశంగా మార్చడం మన బాధ్యతని, ఇందుకు స్వర్ణాంధ్ర విజన్‌ 2047 రోడ్‌మ్యాప్‌ రూపొందిం చినట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొదట ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్ను పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆర్థిక అడ్డంకులను అధిగ మించడం, రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ రూ.16లక్షల కోట్ల నుంచి 2047నాటికి రూ.305 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, పలువురు మంత్రులు, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీఎస్‌ విజయానంద్‌, డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
పది సూత్రాలు
`-పేదరికం నిర్మూలనకు పీ 4 విధానం.
-అందరికీ స్వచ్ఛమైన తాగునీరు.
-మహిళ, యువత సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి.
-యువతను రేపటి అవకాశాలకు సిద్ధం చేస్తూ వేగంగా నైపుణ్య గణన
-నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పులు
– వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మామిడి,అరటి,మిర్చి,కాఫీ,సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు లాంటి పంట ఉత్పత్తులు ప్రత్యేక కేంద్రాల ద్వారా ప్రపంచ మార్కెటోతో నుసంధానం.
-మెగా పోర్టులు, అంతర్జాతీయ విమానా శ్రయాలు,మల్టీమోడల్‌ రవాణా కేంద్రాల అభివృద్ధి.
-క్లీన్‌ ఎనర్జీ పాలసీ 2024తో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపు. 5వేల ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు. పీఎం సూర్య ఘర్‌ రూఫ్‌ టాప్‌ సోలార్‌ పథకం, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తికి ప్రోత్సాహం.
-గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధతిలో పండిరచే పంటలకు విలువ జోడిరపు సౌకర్యాల కల్పన.
అసెంబ్లీ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు : అసెంబ్లీ ప్రాంగణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసన సభలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం,ఓటుహక్కు కల్పించిందని అయ్యన్న పాత్రుడు స్పష్టంచేశారు. సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడు కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈసందర్భంగా పిలుపు నిచ్చారు.
త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శాసనమండలి ఛైర్మన్‌: శాసనమండలిలో ఛైర్మన్‌ మోషేన్‌రాజు త్రివర్ణ పతా కాన్ని ఎగురవేశారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని మోషేన్‌ రాజు తెలిపారు. పాఠ్యాం శాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజ యానంద్‌ జాతీయ జెండాను ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా చిన్నారులకు సీఎస్‌ కె.విజయానంద్‌ మిఠాయిలు పంచారు..
హైకోర్టులో..: హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా 76వగణతంత్ర వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్ర మంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ఠాకూర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సమైక్యస్ఫూర్తిని పెంపొందించుకు ని ప్రతి ఒక్కరూ ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగాలని అంద రికీ పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌ శకటం..
ఢల్లీిలోని కర్తవ్య పథ్‌ 76వ రిపబ్లిక్‌ డే పరేడ్‌ సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్‌ శకటం ప్రదర్శించ బడిరది. ఆంధ్రప్రదేశ్‌ ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈకళాఖండాలు ఎన్నోఏళ్లుగా చిన్నారుల చేతుల్లో ఆటవస్తువుల్లాగా ఉన్నాయి. ఎలాంటి రసాయ నాలు ఉపయోగించకుండా అడవి లో దొరికే కట్టెలతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.ఈ శకటం ఆంధ్ర ప్రదేశ్‌ కీర్తి కిరీటంలో ఓకలికితురాయి వంటివి. మా మూలు కర్రతో తయారు చేసే ఈబొమ్మలు.. దేశ విదేశాల్లోనూ ఏపీ సృజనా త్మకతను సగర్వం గా చాటి చెబుతు న్నాయి.ఘన చరిత్ర కలిగిన ఈబొమ్మలు గణ తంత్ర దినోత్స వంనాడు శకటం రూపంలో దర్శన మిచ్చి ఆకట్టుకున్నాయి.
విశాఖ జిల్లాలోగణతంత్ర దినోత్సవ వేడుకలు
విశాఖపట్టణం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాంతత్య్రసమర యోధులు, పద్మ అవార్డుల విజేతలు,రాజకీయ ప్రముఖులు, న్యాయ, పరిపాలనా అధికారులు వేడుకల్లో భాగస్వా మ్యం కాగా..జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగాడీసీపీ మేరీ ప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్‌ ఓపెన్‌ టాప్‌ వాహనంపై మైదానాన్ని సంద ర్శించారు. అనంతరం పరేడ్‌ కమాండర్‌ ఎన్‌.వి. రమణ సారథ్యంలో మార్చ్‌ ఫాస్ట్‌ మొదలు కాగా పోలీస్‌ సిబ్బంది,ఎన్‌.సి.సి. క్యాడెట్లు కవాతు నిర్వహించారు. వారి నుంచి కలెక్టర్‌, వేదికపై ఆశీనులైన ఇతర అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. శాంతికి చిహ్నం, జాతి సమైక్యతను చాటి చెబుతూ జిల్లా కలెక్టర్‌, పోలీసు అధికారులు జాతీయ జెండా రంగులతో కూడిన బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రగతి విశేషాలను వివరిస్తూ కలెక్టర్‌ అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. -(జి.ఎ.సునీల్‌ కుమార్‌)

చిత్తడి నేలలు ప్రకృతి పరిరక్షణకు నెలవులు

సముద్రం,నది ఇతర నీటి వనరులు కలిగిన తీర పాంతాల్లో తక్కువ లోతు ఉండి ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండే భూములను చిత్తడి నేలలు అంటారు. పెద్దనదులు లేదా సరస్సుల వెంబడి మంచినీటి చిత్తడి నేలలు ఏర్పడతాయి.. అతిపెద్ద సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సును చిత్తడి నేలలు కలిగిన భూమిగా గుర్తించారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోక పోతే భావితరాలకు చిత్తడి నేలలు ఉండవు. ఇప్పటికే పలురకాల పక్షులు,జంతువులు, జీవ జాతులు అంతరించిపోతున్నాయి. కొన్నిరకాల జంతువులు, పక్షులు చూడా లంటే జూపార్కు లోనో, ఛానల్స్‌లోనే చూడవలసి వస్తుందని, ఇదే పరిస్ధితి కొన సాగితే భవిష్యత్తులో చిత్తడినేలలు కనుమరు గవు తాయని పర్యావరణ నిపు ణులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. మానవాళి మను గడకు చిత్తడి నేలలు ఎంతో దోహద పడతాయి. సృష్టిలో సహజసిద్ధంగా ఏర్పడిన వనరులను కాపాడుకుంటే భావితరాల ప్రజలకు వాటి ఆవశ్య కత, స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించ గలుగు తాం. సృష్టిలో ఉన్న అనంతకోటి జీవరాశుల్లో 40 శాతం చిత్తడి నేలల్లోనే ఉంటాయి. పక్షులకు ఈ నెలల్లో ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. వీటి ప్రాముఖ్యతను గుర్తించి వివిధ దేశాలు ‘ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం’ నిర్వహిస్తున్నాయి.
భూగోళంపై జీవరాశి మనుగడకు చిత్తడి నేలలు అత్యంత కీలకం. భూమికి ఊపిరితిత్తులుగా పని చేస్తూ ప్రకృతి సమతుల్యతకు ఇవి ఎంతగానో దోహదపడతాయి.దురదృష్టవశాత్తు చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని శతాబ్దాలుగా గుర్తించకపోవడం వల్ల, అవి శరవేగంగా అంతరించి పోతున్నాయి. జీవుల మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు చిత్తడి నేలలు ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా గడచిన వందేళ్లలో ఇవి64శాతంమేర అంత రించి పోయాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.చిత్తడి నేలల ప్రాధాన్యాన్ని గుర్తించడంతో పాటు వాటి పరిరక్షణ,అభివృద్ధి కోసం కృషి చేయాలని ఇరా న్లోని రామ్సార్లో 1971లో ప్రపంచ దేశాల మధ్య ఒప్పందం కుదిరి ఆతరవాత నుంచి ఏటా ఫిబ్రవరి రెండో తేదీన చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మానవాళికి చిత్తడి నేలల వల్ల కలిగే ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడం ఈఏడాది లక్ష్యం.
ఎన్నో ప్రయోజనాలు..
సముద్ర,నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి వనరులతో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలుగా పరిగణిస్తారు. మంచినీటితో పాటు ఉప్పు నీటి సరస్సులు,తంపర,బీల భూములు,పగడపు దిబ్బలు, మడ అడవులు తదితర 19రకాల ప్రాంతాలు చిత్తడి నేలల కిందకు వస్తాయి. నదీ తీరాల్లోని చిత్తడి నేలలు ప్రవాహ ఉద్ధృతిని,అలల తాకిడిని అడ్డుకుని తుపానులు, వరదల ప్రభావాని తగ్గిస్తాయి. పర్యావరణ మార్పుల కారణంగా వాయు దుష్ప్రభావాలను గణనీయంగా నియం త్రిస్తాయి.అరుదైన మత్స్య,వృక్షజాతుల జీవనానికి దోహదపడటంతోపాటు దేశ,విదేశీ వలస పక్షులకు ఆశ్రయమిస్తాయి.ఈ నేలలు పరిసర ప్రాంతాల్లోని నీటి నాణ్యతను పెంచడమే కాదు,కాలుష్య తీవ్రత ను తగ్గించడంలోనూ కీలకమవుతున్నాయి.చిత్తడి నేలలు సాగు,తాగునీరు అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయి.ఈ నేలల్లో లభించే చేపల్లో పోష కాలు అధికంగా ఉంటున్నాయని పలు పరిశోధ నలు తేల్చాయి.చూపరులను విశేషంగా ఆకట్టు కుంటున్న చిత్తడి నేలలు-పర్యటక ఆదా యాన్ని గణనీయంగా పెంచుతున్నాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,400 ప్రదేశాలను రామ్సార్‌ ప్రమాణాల ప్రకారం చిత్తడి నేలలుగా గుర్తించారు.వీటిలో అత్యధికంగా 175 వరకు యూకేలోనే ఉన్నాయి.142 ప్రదేశాలతో మెక్సికో రెండో స్థానాన్ని ఆక్రమించింది.భారత్‌ 1982లో రామ్సార్‌ ఒప్పందంలో చేరి చిత్తడి నేల గుర్తింపును మొదలుపెట్టింది.1982-2013 మధ్య కాలంలో 26ప్రదేశాలను,2014-23 మధ్య మరో 49 క్షేత్రాలను చిత్తడి నేలలుగా గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 చోట్ల13.30లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామ్సార్‌ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు విస్తరించి ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు,పులికాట్‌ సరస్సులు ఇలా గుర్తింపు పొంది నవే.రామ్సార్‌ ఒప్పంద ప్రమాణాలకు అను గుణంగా ఉన్నప్పటికీ,దేశంలోని అనేక చిత్తడి నేలలను గుర్తించడంలో తీవ్రతాత్సారం జరుగు తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోయంబత్తూరుకు చెందిన సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఆర్నిథాలజీ, నేచురల్‌ హిస్టరీ (సాకాన్‌) సంస్థ రెండు దశాబ్దాల క్రితమే దేశంలోని 700 ప్రదేశా లకు చిత్తడి నేలలుగా గుర్తింపునిచ్చి పరిరక్షించా లని సూచించింది.వాటిలో 200 ప్రాంతాలను రామ్సార్‌ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. కోరింగ అభయారణ్యం, పాకాల చెరువు, కృష్ణా నదీ పరీ వాహక ప్రాంతాలను ఆ జాబితాలో చేర్చాల్సినవి గా సాకాన్‌ పేర్కొంది.సోంపేట,నౌపడ, వాకల పూడి బద్వేలు,కంభం,విశాఖపట్నం జిల్లాలోని కొండక్లర్ల్‌ ఆవ,తిమ్మరాజు చెరువు ప్రాంతాలు చిత్తడి నేలలేనని,వాటి పరిరక్షణకు చర్యలు అత్యవసరమని సూచించింది.కొల్లేరు,కొండకర్ల ఆవతో పాటు మరికొన్ని ప్రదేశాలను అటవీశాఖ చిత్తడి నేలలుగా గుర్తించినప్పటికీ,వాటి సంరక్ష ణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడంలేదు. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా గుర్తిం పు పొందిన కొల్లేరు పరిధిలో వేల ఎకరాల చిత్తడి నేలలు ఆక్రమణలకు,విధ్వంసానికి గురయ్యాయి. దాన్ని అడ్డుకుని,అక్కడి నేలలను పునరు ద్ధరించ డంలో ప్రభుత్వ వ్యవస్థలు ఘోరంగా విఫలమవుతు న్నాయి.సుప్రీంకోర్టు ఇటీవలే నాగ్పుర్లోని ఫుటాలా సరస్సు చుట్టూ కార్యకలాపాలను నిలిపివేసింది. చిత్తడి నేలగా గుర్తించిన ఈ ప్రదేశాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం మానవ నిర్మితంగా పేర్కొన్నప్పటికీ, ప్రకృతి వ్యవస్థల వాస్తవరూపాన్ని మార్చవద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం వారించింది.జాతీయ హరిత ట్రైబ్యునల్‌,కాగ్‌ వంటివి సైతం చిత్తడి నేలల విధ్వంసాన్ని నిలువరించాలని గతంలో సూచించాయి.జాతీయ అటవీ కమిషన్‌ 2006 లోనే చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్రానికి నివేదించింది. సుమారు దశాబ్ద కాలం తరవాత కేంద్రం 2017 లో చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణకు మార్గదర్శ కాలను తీసుకువచ్చినప్పటికీ, అవేమీ క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడంలేదన్న విమర్శలు న్నాయి.
బహుముఖ చర్యలు కీలకం…
కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రప్రభు త్వాలు గుర్తింపు పొందిన చిత్తడి నేలల సమాచా రాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలి. పర్యా వరణ,అటవీ, వన్యప్రాణి, కోస్తా నియంత్రణ చట్టాలను వర్తింపజేయడంతో పాటు వ్యర్థ రసాయనాలు, విషపూరిత జలాలను చిత్తడి నేలల్లో పారబోయకుండా నిఘాను తీవ్రతరం చేయాలి. కఠిన శిక్షలు,భారీ జరిమానాలు విధించడం ద్వారా ఈ నేలల ఆక్రమణలను, విధ్వంసాన్ని అడ్డుకోవాలి.చిత్తడి నేలల పరిరక్షణ కోసం నిరుడు కేంద్రం ప్రకటించిన ‘అమృత్‌ ధరోహర్‌’ పథకాన్ని రామ్సార్‌ గుర్తింపు ఉన్న ప్రదేశాలకే పరిమితం చేశారు.మిగతా చిత్తడి నేలలకూ వర్తింపజేయాలి. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు సంయు క్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు జిల్లాస్థాయి ప్రణాళికలను రూపొందించి స్థానిక సమూహాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమర్థంగా అమలుపరచాలి. ఇటువంటి చర్యలు కొరవడితే-చిత్తడి నేలల విధ్వంసం నిరాటం కంగా సాగు తూనే ఉంటుంది!
కొరవడిన సంకల్పం
చిత్తడి నేలల విధ్వంసం మూలంగా పర్యావరణ మార్పుల దుష్పరిణామాలు అధికమవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వీటి పరి రక్షణకు పటిష్ఠ కార్యాచరణను రూపొందించి అమలుపరచాలని కోపెన్హాగెన్‌ వంటి ప్రపంచ స్థాయి సమావేశాలెన్నో తీర్మానాలు చేశాయి. అందుకు గట్టి సంకల్పం కొరవడటం దుర దృష్టకరం.జనాభా పెరుగుదలకు తోడు పారిశ్రా మిక అవసరాల కోసం చిత్తడి నేలలను మట్టితో కప్పి ఆక్రమించేస్తున్నారు పంటల సాగు కోసం రసాయన ఎరువులు,పురుగు మందులను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు.ఆ ప్రభావంవల్ల చిత్తడి నేలలు సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయి.
జల,వృక్ష సంపదకు కొల్లేరు ఆలవాలం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు చిత్తడి నేలలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇటువంటి నేలను, ప్రకృతిని కాపాడితే అది భవి ష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుందని కొంతమంది గుర్తించలేకపోతున్నారు.సృష్టిలో సహజసిద్ధంగా మానవాళి మనుగడ కోసం ఏర్పడిన సంపదను విస్మరిస్తున్నారు.ప్రపంచ దేశాలుసైతం పర్యావరణాన్ని పరిరక్షించండి, ప్రకృతిని కాపాడడండి అంటూ పదేపదే హెచ్చరి స్తున్నా వాటి వినాశనానికి చేసే వికృతి చేష్టలు తగ్గలేదు.సహజసిద్ధంగా ఏర్పడిన సంపదను రక్షించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని (వరల్డ్‌ వెట్‌ల్యాండ్స్‌డే) జరుపుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన ఏకైక చిత్తడి నేలలు ఏలూరు జిల్లాలో విస్తరించిన 77,136 ఎకరాలు కొల్లేరు సరస్సు మాత్రమే. ఈచిత్తడి నేలలు అనేక జీవరాశులకు, పక్షులకు ఎంతో మేలు చేస్తుంటాయి. అందువల్లే ప్రపం చంలోని అనేక దేశాలకు చెందిన పక్షులు వలస వస్తున్నాయి. చిత్తడినేలలపై 1971సంవత్సరంలో ఫిబ్రవరి 2న ఇరాన్‌ దేశంలో రామ్‌సర్‌ నగరంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.అప్పుడు సదస్సులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రపం చంలోని 164దేశాలు చిత్తడినేలల పరిరక్షణకు ఒప్పంద సంతకాలు చేశాయి.వీటిలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది.2002 సంవత్సరంలో కొల్లేరును రామ్‌సర్‌ సైట్‌లోనికి తీసుకున్నారు. భారతదేశంలో 21రాష్ట్రాల్లో 46 ప్రాంతాలను చిత్తడినేలలుగా గుర్తించారు.
చిత్తడి నేలల ప్రాధాన్యం
అరుదైన మొక్కలు,పక్షులు,జంతువులు,చేపలు గుడ్లు పెట్టడానికి ఈ నేలలు చాలా అనుకూలం. నీటి నాణ్యతను పెంచడంలో,కాలుష్య కారకా లను గ్రహించడంలో ఈ చిత్తడినేలలు ప్రాధాన్యత పోషిస్తాయి. మానవ తప్పిదాలతో పర్యావరణానికి చాలాహాని జరుగుతుంది. ప్రజలు వ్యవసాయ, ఆక్వా అవసరాలకు ఈ భూములను ఆక్రమిం చుకుని రసాయన ఎరువులు వాడడంవల్ల నివాస యోగ్యానికి ఈ నేలలను పూడ్చడంతో చిత్తడి నేలలు విధ్వంసానికి గురవుతున్నాయి. ప్రపంచం పరిశ్రమల కోసం ఈచిత్తడి నేలలు కేటాయించ డంతో మరింత వినాశనానికి దారితీస్తున్నాయి.
భూమికి ఊపిరితిత్తులు!
6 వేలకు పైగా చిత్తడి నేలలు నమోదయ్యాయి
చిత్తడి నేలల సంరక్షణ కోసం వ్యవసాయం మరియు అటవీ మంత్రిత్వ శాఖలోని జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేచర్‌ కన్జర్వేషన్‌ అండ్‌ నేషనల్‌ పార్క్స్‌చే నిర్వహించబడుతున్న కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందజేస్తూ, మంత్రి యు మాక్లీ చిత్తడి నేలల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు, ఇవి జీవశాస్త్రపరంగా అత్యంత ఉత్పాదక పర్యా వరణ వ్యవస్థలు. రెయిన్‌ఫారెస్ట్‌, పర్యావరణ సమతుల్యతను నిర్ధారించడం మరియు జీవ వైవి ధ్యాన్ని సంరక్షించడం రెండిరటిలోనూ దృష్టిని ఆకర్షిస్తూ,ఈ ప్రాంతాలు అనేక విధులను కలిగి ఉన్నాయని యుమాక్లే పేర్కొన్నారు.ఈ ప్రాంతాలు భూగర్భ జలాలను పోషించడం,భూగర్భ జలాలను సమతుల్యం చేయడం, వరద నీటిని నిల్వ చేయ డం, వరదలను నియంత్రించడం,తీర ప్రాంతాల్లో సముద్రపు నీరు ప్రవేశించకుండా నిరోధించడం ద్వారా ఈప్రాంతం నీటి పాలనను క్రమబద్ధీకరి స్తుంది.2002లో చేసిన శాసన పునర్విమర్శతో చిత్తడి నేలలను నింపడం మరియు ఎండబెట్టడం నిషేధించబడిరదని మంత్రి యుమాక్లే గుర్తు చేస్తూ, ‘‘అదే సంవత్సరంలో చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ అమలులోకి వచ్చింది. చిత్తడి నేలల రక్షణపై నియంత్రణ,చిత్తడి నేలల రక్షణ,ఉపయో గం,సూత్రాలు,రక్షణ మండలాల నిర్ధారణ,అమలు సూత్రాలు,రామ్‌సార్‌ సైట్‌ల ప్రకటన ప్రక్రియ, జాతీయ చిత్తడి నేల కమిషన్‌ విధులు,పని విధానా లతో ఒక ముఖ్యమైన అడుగు తీసుకోబడిరది. నిర్ణయించబడ్డాయి.‘‘నియంత్రణ ద్వారా స్థాపించ బడిన నేషనల్‌ వెట్‌ల్యాండ్‌ కమిషన్‌,చిత్తడి నేలలపై మరియు ప్రకృతి పరిరక్షణ పేరుతో సంబంధిత సంస్థలను కలిగి ఉన్న మన దేశంలో మొదటి కమిషన్‌’’సమాచారం ఇచ్చాడు. టర్కీ లోని రామ్‌సర్‌ కన్వెన్షన్‌ ద్వారా రక్షించబడిన 14 ప్రాంతాలు కాకుండా,మొత్తం 59మిలియన్‌ 47 వేల1హెక్టార్ల విస్తీర్ణంలో161చిత్తడి నేలలు ఉన్నా యని, వీటిలో 205 జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలు మరియు వాటిలో 120 స్థానిక ప్రాముఖ్యత కలిగినవి అని యుమాక్లే పేర్కొంది. గత 5 సంవత్సరాలలో,జనరల్‌ డైరెక్ట రేట్‌ నిర్వ హించిన అధ్యయనాలతో జాతీయ చిత్తడి నేలల జాబితా పూర్తి దశకు చేరుకుందని నేషనల్‌ వెట్‌ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ పేర్కోంది.ఈ వ్యవస్థలో జాబితా మాత్రమే కాకుండా,చిత్తడి నేలల హోదాలో ఇవ్వబడిన చిత్తడి నేల కార్యకలాపాలకు అనుమతులు కూడా ఇక్కడ నిర్వహించబడతాయి.అదనంగా, మన ప్రజలు ఇ-గవర్నమెంట్‌ ద్వారా చిత్తడి నేలల కోసం సులభంగా దరఖాస్తులు చేసుకోవచ్చు. 1999 నుండి రామ్‌సర్‌ కన్వెన్షన్‌‘తడి నేలల హేతుబద్ధ వినియోగం’ సూత్రం పరిధిలో మా మంత్రిత్వ శాఖ చిత్తడి నేల నిర్వహణ ప్రణాళి కలను సిద్ధం చేసింది.చిత్తడి నేల నిర్వహణ ప్రణా ళిక ఆప్రాంతం సాధారణ రక్షణ వినియోగ సూత్రాలను నిర్ణయిస్తుంది. అదనంగా, ప్రణాళి కలు చిత్తడి నేలల సమస్యలను పరిష్కరించడానికి భాగస్వామ్య విధానం మరియు అన్ని ఆసక్తి సమూ హాలకు వివిధ బాధ్యతలను అందించే కార్యకలా పాలను కలిగి ఉంటాయి.1999 నుండి జనరల్‌ డైరెక్టరేట్‌ చే వెట్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌లు తయారు చేయబడ్డాయి. -గునపర్తి సైమన్‌

ఏపీకి పెట్టుడుల వెల్లువ

ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 63వేల 411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా 1లక్ష 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. సచివాలయంలో జరిగిన ఎస్‌ఐ పీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్‌ఐ పీబీ సమావేశంలో చర్చించారు.ఇక దరఖాస్తు చేసు కున్న ప్రాజెక్టుల్లో 9కీలకప్రాజెక్టుల స్థాపనకు ముఖ్య మంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు.ఈ 9ప్రాజెక్టులద్వారా రాష్ట్రానికి లక్ష 82వేల 162కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే దాదాపు 2లక్షల 63వేల411కుపైగా ఉద్యోగఅవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎంచంద్రబాబుకు వివరిం చారు. ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్‌..6 వేలఎకరాల విస్తీర్ణంలో 96వేల 862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీనిద్వారా 2వేల 400 మంది ఉపాధి లభించబోతోంది.అలాగే విశాఖ మిలీనియం టవర్స్‌లో 80కోట్ల రూపాయల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టీసీఎస్‌ ముందుకొచ్చింది.దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు.దీని ద్వారా దాదాపు 2వేల మంది ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. పెట్టు బడిదారులంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినెల ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ మీటింగ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రాయితీలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక పాలసీ దేశాన్ని కూడా ఆకర్షిస్తోందని చెప్పొచ్చు.ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్‌..ఏపీలో భారీఎత్తున రిఫైనరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.రామాయపట్నం పోర్టు దగ్గర వారికి 6వేల ఎకరాల ల్యాండ్‌ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.గుజరాత్‌ తర్వాత రెండో అతి పెద్ద రిఫైనరీ ఏపీలో ఏర్పాటు కానుందని చెప్పొచ్చు.టాటా,రిలయన్స్‌ లాంటి దిగ్గజ సంస్థలు క్లీన్‌ ఎనర్జీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకు న్నాయి.దీనిద్వారా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు లభి స్తాయి.నిన్న ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాలతో దాదాపు 2లక్షల 84వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించొచ్చు. ఎప్పటిలోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అనే వివరాలు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పెద్దఎత్తున వస్తున్న సంస్థలకు భూకేటాయింపులతో సహా మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదేవిధంగా ఒప్పందం ప్రకారం నిర్ధిష్ట సమయంలోనే ప్రాజెక్టులు పూర్త య్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అధికా రులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. సచివాలయంలో జరి గిన ఎస్‌ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయదలిచిన ప్రాజెక్టులకు ముఖ్య మంత్రి ఆమోదం తెలిపారు.
బీపీసీఎల్‌తో సహా ప్రతిష్టాత్మక సంస్థల రాక..
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పా టు చేయనుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.దీంతో2,400మందికి ఉపాధి కలుగ నుం దని చెప్పారు.మొత్తం 9మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు సామర్ధ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్‌,లెర్నింగ్‌ సెంటర్‌,రిఫైనరీ,పెట్రోకెమికల్స్‌ యూనిట్స్‌,క్రూడ్‌ ఆయిల్‌ టెర్మినల్‌,గ్రీన్‌ హెచ్‌2, అడ్మినిస్ట్రేషన్‌ బ్లాకులు నిర్మిస్తారని అధికా రులు ముఖ్య మంత్రికి వివరించారు. వచ్చే 20ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికిరూ.88,747కోట్ల ఆదాయం రానుందని తెలిపారు.అయితే 2029 లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు.
టీసీఎస్‌..
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగులవిస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) రూ.80కోట్ల పెట్టుబడి పెట్ట నుంది.దీంతో 2వేల మందికి ఉద్యోగాలు రాను న్నాయి.
ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ :
శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్‌ మొబిలిటీ ఇండియా లిమిటెడ్‌ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యేలాఎలక్ట్రిక్‌ త్రీ వీలర్‌ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్‌ప్రాజెక్టు ఏర్పాటు చేయ నుంది.ఇందుకోసంఈ సంస్థ రూ.1,046కోట్ల పెట్టు బడిపెట్టనుంది.2,381మందికి ఉపాధి కలుగుతుంది.
బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ :
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని106ఎకరాల్లో రూ.1,174కోట్లతో 1,500మందికి ఉపాధి కలిగేలా బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌వెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఎండీఎఫ్‌/పర్టికల్‌ బోర్డు ప్లాంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ నెలకొల్పనుంది.
క్లిక్‌ అయిన క్లీన్‌ ఎనర్జీ పాలసీ :
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన క్లీన్‌ ఎనర్జీ పాలసీతో పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రా నికి వస్తున్నాయి.కొత్తగా ఐదు సంస్థలు రూ.83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పా టు చేయనున్నాయి.దీంతో కేవలం క్లీన్‌ ఎనర్జీ రంగం లోనే రెండున్నల లక్షల మందికి ఉద్యోగఉపాధి అవ కాశాలు కలుగుతున్నాయి.
ఏఎం గ్రీన్‌ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ..
ఏఎంగ్రీన్‌ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 592ఎకరాల్లో 1మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత అమ్మోనియా మాన్యుఫాక్చరింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తోంది.రూ.12,000 కోట్ల పెట్టుబడితో 2,600 మందికి ఉపాధి కలుగుతుంది.
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
జాన్‌ కోకిరిల్‌ గ్రీన్‌కో హైడ్రోజన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కాకినాడలో 40ఎకరాల్లో 2గిగావాట్ల సామ ర్ధ్యం కలిగిన ఎలక్ట్రోలైజర్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూని ట్‌ను రూ.2,000 వేల కోట్లతో స్థాపించనుంది. దీంతో 500 మందికి ఉపాధి కలుగుతుంది.
టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ..
400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును టాటా పవర్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ కర్నూలు జిల్లాలోని హోసూరు,పెద్ద హుల్తిలో 1,800 ఎకరా ల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.1,380 మందికి ఉపాధి కలుగుతుంది.
క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌..
వైఎస్సాఆర్‌ జిల్లాలోని మైలవరం, కొండాపురం అలాగే నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల విండ్‌పవర్‌, 130 మెగా వాట్ల సోలార్‌ హైబ్రీడ్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ హైబ్రిడ్‌ త్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2,000కోట్ల పెట్టుబడులు పెడు తోంది.650 మందికి ఉద్యోగ ఉపాధి అవకా శాలు రానున్నాయి.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రాష్ట్రంలో తాజాగా 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల మందికి ఉపాధి కలిగేలా 11 వేల మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో 500 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయ నుంది.ఈప్రాజెక్టు మొత్తం 2028 కల్లా పూర్తి కానుంది. దీని ద్వారా రాష్ట్రానికి రూ. 4,095 కోట్ల ఆదాయం రానుంది. నవంబర్‌ 19న జరిగిన ఎస్‌ఐ పీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.-జిఎన్‌వి సతీష్‌

కడలి కోత పెడుతోంది..!

‘‘బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖ సముద్రతీరం భయపెడుతోంది. రాకాసి అలలు తీరం వెంబడి అలజడి సృష్టిస్తున్నాయి.అలల ఉధృతికి తీరంలో కోత పెరిగిపోతుంది. ఇసుక తెన్నెలు కరిగిపోకుండా ఏర్పాటు చేసిన రాళ్లగోడలు సైతం జారుతున్నాయి. ఆర్కేబీచ్‌లో కోత నివారణ కోసం పెంచుతున్న కొబ్బరి వనాలు కోతకు కడలిలో కలసిపోతున్నాయి.కడలి హోరును ఆవేమీ తట్టుకోలేకపోతున్నాయి. ఫలితంగా కురుసురా సబ్‌మెరైన్‌ మ్యూజియం ప్రాంతంలో నానాటికీ తీర ప్రాంతం కడలిలో కలిసిపోతుంది.కొన్నాళ్లుగా శాంతించి గంగమ్మతల్లీ మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది.. సముద్రం గత రెండు మూడు రోజుల నుంచి ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో కొన్నిచోట్ల భారీగా భూమి కోతకు గురవుతోంది.. ఆర్కేబీచ్‌లో విక్టరీ ఎట్‌ సీ ఎదురుగా ఉన్న బీచ్‌ సందర్శకులను భయపెడుతోంది.అక్కడ పర్యాటకులు, సందర్శకులు సేదతీరేందుకు ఏర్పాటుచేసిన కోకోనట్‌ ఎరినాకు కెరటాలు తాకుతున్నాయి. ఈ పరిణామాలు సందర్శకులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.’’ (జి.ఏ.సునీల్‌ కుమార్‌)
విశాఖలోని సాగరతీరం మళ్లీ కోతకు గురవు తోంది.తరచూ సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. గతంలో తుఫాన్లు,పెనుతుఫానుల సమయం లోనే ఇలాంటి పరిస్థితి తెలెత్తేంది.కానీ ఇప్పుడు స్వల్పంగా ప్రభావం చూపే అల్పపీడనాలు,ఆవర్తనాలు వంటివి ఏర్పడినప్పుడు కూడా కడలి కన్నెర్ర చేస్తోం ది.గతంలో 2014,2015,2016 సంవత్స రాల్లో విశాఖసాగరతీరం కోతకు గురైంది.2015లో మరిం త అధికంగా..కిలోమీటర్ల మేర తీరం దెబ్బతింది. ఆర్కేబీచ్‌ సహా పలుచోట్ల బీచ్‌లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి.అప్పట్లో జీవీఎంసీ అధికారులు తీరంలో పెద్దపెద్ద బండరాళ్లను దింపి దడిలా ఏర్పాటు చేసి కోతను తాత్కాలికంగా కట్టడి చేశారు.
రక్షణ కోసం వేసిన ఐరన్‌ మెస్‌ ధ్వంసం చేసేలా..
ఇన్నాళ్లు ఎక్కడో చోట అప్పుడప్పుడు తీరం కోతకు గురయ్యేది.సబ్‌ మెరైన్‌ మ్యూజియం,నోవెటల్‌ ఎదు రుగా ఉన్నబీచ్‌,సాగర్‌నగర్‌ ఋషికొండ ప్రాంతా ల్లోనూ కోతకు గురయ్యేది.ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో తీవ్రత కాస్త తగినప్పటికీ..తాజాగా విక్టరీ ఎట్‌ సీ వద్ద సముద్రం భారీగా ముందుకు చొచ్చుకొస్తోంది. పౌర్ణమి నుంచి ఆటుపోట్ల తీవ్రత మరింత పెరిగింది. ఆర్కే బీచ్‌ ఏరియాలో సందర్శకులు సేద జరిగినం దుకు కొన్నిచోట్ల కోకోనట్‌ ఎరీనాలు ఏర్పాటు చేశారు అధికారులు.తీరం కోతకు గురై కొబ్బరి చెట్లు పడిపో కుండా..ఉండేందుకు ఇసుకతోపాటు పెద్ద పెద్ద రాళ్ల ను పేర్చి వాటికి ఐరన్‌ మెస్‌ ను రక్షణగా పెట్టారు. అయితే ప్రస్తుతం సముద్రపు కెరటాల ఉగ్రరూపంతో.. ఆ ఐరన్‌ మెస్‌ను తాకి..అక్కడ ఇసుకను తనలో కలిపేసుకోవడమే కాకుండా.. మెస్‌ లోపలికి కెరటాలు చొచ్చుకెళ్లి ఐరన్‌ మెస్‌ను ధ్వంసం చేసేలా ఉంది. దీంతో మెస్‌ లోపల కొబ్బరిచెట్ల రక్షణ కోసం ఏర్పాటు చేసిన బండ రాళ్లుసైతం బీచ్‌ కెరటాల వైపు కొట్టుకు వెళ్తున్నాయి.ఇది స్థానిక మత్స్యకారులను సైతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
యారాడ నుంచి భీమిలి వరకూ..
సముద్రం నుంచి అలలు ఎగసిపడుతూ దూకుడుగా ముందుకు రావడంవల్ల తీరంలో ఇసుక పెద్ద మొత్తం లో సముద్రంలోకి కొట్టుకుపోతోంది. సాధార ణంగా ఏటా నైరుతి రుతుపవనాల సీజనులో అలల ఉధృతి అధికంగా ఉండటం వల్ల తీరం కోతకు గురవుతోంది. కొన్నిసార్లు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనూ ఇక్కడి తీరంకోత సమస్య ఎదుర్కొంటోంది.ముఖ్యంగా యారాడ నుంచి భీమిలి వరకు దాదాపు 35 కిలోమీ టర్ల దూరంలో కొన్నిచోట్ల సముద్రతీరం తరచూ కోతకు గురవుతున్నట్లు నిపుణులు ఇప్పటికే గుర్తిం చారు.ఇందులో యారాడబీచ్‌,కోస్టల్‌బ్యాటరీ, ఆర్కే బీచ్‌, కురుసుర సబ్‌మెరైన్‌ మ్యూజియం,చిల్డ్రన్స్‌ పార్క్‌, జోడుగుళ్లపాలెం,రుషికొండ,భీమిలి తదితర ప్రాంతా లున్నాయి.ఈ పరిస్థితిని నివారించడానికి విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ)డ్రెడ్జర్లతో డ్రెడ్జింగ్‌ చేయిస్తుం టుంది.ఏటా ఏఫ్రిల్‌,మే నెలల్లో డ్రెడ్జింగ్‌ ద్వారా కోతకు గురైన ప్రాంతాళ్లో ఇసుకను పంపింగ్‌ చేస్తుంది.దీంతో తీరం కోతకు ఒకింత అడ్డుకట్ట పడుతోంది.
తాజాగా దూకుడు..
విశాఖలో తీరం కోతకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి.సముద్రంలో మార్పులకు తోడు వాతావరణ పరిస్థితులు..భౌగోళిక పరిస్థితుల్లో కూడా తోడవుతున్నాయి అన్నది నిపుణుల అంచనా.. వాస్తవానికి,పౌర్ణమి అమావాస్యలకు కెరటాల ఆటు పోట్లు సహజం..కానీ,సాధారణ రోజుల్లో కూడా ఆటు పోట్లు పెరుగుతుండటం,అలలు చొచ్చుకు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.తాజాగా విశాఖ తీరం మరోసారి కోతకు గురవుతోంది.దాదాపు మూడు రోజుల నుంచి ఈపరిస్థితి ఉంది.కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌ హోటల్‌ వరకు ఉన్న మధ్య ప్రాంతంతోపాటు మరికొన్నిచోట్ల కోత ప్రభావం కనిపి స్తోంది.విశాఖ బీచ్‌లో నాలుగైదు చోట్ల పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచడానికి ఓరిసార్ట్సు సంస్థ కొన్నేళ్ల క్రితం సుమారు 600కొబ్బరి చెట్లను నాటింది.ఆ చెట్లును బీచ్‌ అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటక ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సముద్రతీరం కోతకు గురవుతుండడంతో వీటిలో కొన్ని కొబ్బరి చెట్లు,బీచ్‌లో వివిధ ఆకృతులతో జీవీ ఎంసీ ఏర్పాటు చేసిన విద్యుత్‌ స్తంభాలు కూలుతు న్నాయి.
కోత నివారణకు విశాఖ పోర్టు సంరక్షణ చర్యలు..
విశాఖ ఆర్కే బీచ్‌ ప్రాంతంలో బీచ్‌ నిర్వహ ణ,విశాఖ పోర్టు అథారిటీ సామాజిక బాధ్యతలో డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం అవుటర్‌ హార్బర్లో పేరుకున్న ఇసుకను సముద్రతీర ప్రాంత పరిసరాలలో నింపుతూ విశాఖలో బీచ్‌కోత నివారణకు పోర్టు సంరక్షణ చర్యలు తీసుకుంటుంది.విశాఖ నగరంలోని బీచ్లను పరిరక్షిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తుంది.బీచ్‌కోత నివారణ కోసం డ్రెడ్జింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఉన్న అత్యాధునిక డ్రెజ్జర్లను వినియోగించి,డిసిఐ డ్రెడ్జ్‌ 21పరికరంతో పోర్టులోపల పేరుకుపోయిన ఇసు కను తవ్వి ఆర్కే బీచ్‌ పరిసరాలలో 0.5కిలమీటర్ల పొడవైన పెపులైన్లు, రెయిన్‌ బోయింగ్‌ ద్వారా నింపు తారు.ఇలా ప్రతి ఏటా పోర్ట్‌ అధికారులు, రాష్ట్ర ప్రభు త్వం డ్రెడ్జింగ్‌ పనులు చేపడితేనే బీచ్‌ కోతకు గురవ కుండా ఉంటుంది.గత సంవత్సరం కొంతమేర పను లు చేసినప్పటికీ ఈ సంవత్సరం మరల కోతకు గురవు తుంది. ఇప్పటికైనా పోర్ట్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని బీచ్‌ కోతకు గురవకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు.
కోత నివారణకు ప్రతిపాదనలు..
ఇటీవల సముద్రం కోతకు గురైన సంద ర్భాల్లో భారీగా సముద్రంలో ఉన్న ఇసుకను తీరంపై వేసేవారు.వైజాగ్‌ పోర్ట్‌ ప్రత్యేకంగా దీనికోసం ఆర్థిక భారాన్ని భరించి ఇసుకను డ్రెడ్జింగ్‌ చేసేది.హుదూద్‌ సమయంలో కెరటాలు ఆర్కే బీచ్‌ రోడ్డుపైకి వచ్చాయి.. ఆ సమయంలో భారీగా తీరం కోతకు గురవడంతో నివారణ చర్యలు తీసుకున్నారు.అయినప్పటికీ సము ద్రుడి ఉగ్రరూపం ముందు ఆచర్యలన్ని తాత్కాలి కంగానే మిగిలిపోయాయి.అయితే గతంలో చేసిన డ్రెడ్జింగ్‌ ద్వారా ఆర్టిఫిషియల్‌గా వేసిన ఇసుక మళ్ళీ సముద్రం తన సహజసిద్ధంగా సముద్రంలోనికి కలిపే సుకుంటుందని మరి కొంతమంది నిపుణులు అంటు న్నారు. అయితే..తీరం కొత్తశాశ్వత నివారణకు వైజాగ్‌ మెట్రో రీజియన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ ప్రణాళికను సిద్ధం చేసింది.తాజాగా జరిగిన సమావేశంలో పలు కీలక పనులకు,ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేస్తూ.. కోస్టల్‌ ఎరోసన్‌ ప్రాజెక్టుకూ ప్రతిపాదన కేంద్రానికి పంపింది. 200కోట్ల వ్యయంతో కేంద్రప్రభుత్వం, వీఎంఆర్‌డీఏ 90:10నిష్పత్తిలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని భరించేలా ప్రణాళికలో సిద్ధం చేశారు.
భయపడెతున్న సాగరతీరం..
ఒకప్పుడు బీచ్‌కు వెళ్తే చాలా దూరం ఇసు కలో నడుస్తూ కెరటాల ముందు వరకూ వెళ్లే వాతా వరణం ఉండేదని,ఇప్పుడు తీరం భారీ కోతలమూ లంగా ఎక్కడ కూర్చోవాలో తెలియనంతగా ఇరుకుగా మారింది.అధికారులు,పర్యావరణవేత్తలుఈ విష యంలో తగిన పరిష్కారం చూపాలి.అందమైన విశాఖ బీచ్‌ అలాగే ఉండాలంటే విశాలమైన ఇసుక తిన్నెలు ఉండాల్సిందేనని బీచ్‌ప్రేమికులు అంటున్నారు. విశాఖ సాగరంలో 2012లోఏర్పడిన సునామీ సమ యంలో కూడా హద్దులు దాటి పెద్దగా ముందుకు రాలేదని గుర్తు చేస్తున్నారు.కానీ ఇప్పుడు చూస్తే పరిస్థి తులు కాస్త ప్రతికూలంగా మారుతున్నాయని ప్రజలు కలవరపడుతున్నారు.ఈనేపథ్యంలో సముద్రం నెమ్మ దిగా ముందుకు దూసుకుని వస్తే ఎలా అన్నచర్చ పర్యాటకులు,సందర్శకుల్లో మొదలైంది.
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..
విశాఖపట్నం అనగానే సుందర సాగరతీరం అందరికీ గుర్తొస్తుంది. వైజాగ్‌ వచ్చిన ప్రతి ఒక్కరు బీచ్‌ ని సందర్శించే వెళ్తారు. నిత్యం పర్యాటకులు, నగరవాసులతో బీజ్‌ అంతా సందడిగా కనిపిస్తుం టుంది. అయితే అలాంటి సాగరతీరం కోతకు గురవు తోంది. అలలు తాకిడికి తీరం కోతకు గురవుతోంది.. దీంతో చెట్లు, పార్కులు, రోడ్లు ధంసం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో పోర్ట్‌ అధికారులు, జీవీఎంసీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. సముద్ర శాస్త్ర రిట్కెర్డ్‌ ప్రొఫెసర్‌ బీఆర్‌ రెడ్డి అంటు న్నారు.ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో తీరం పక్కన ఉన్న రోడ్లు, భవనాలు మునిగిపోయే ప్రమాదం ఉదని ఆయన తెలిపారు. గతంలో సము ద్రం లోపల నుండి ఇసుక తీసుకువచ్చి డ్రెజ్జింగ్‌ పనులు చేసేవావారని..ఇలా చేస్తే తీరం కోతకు గురవ కుండా ఉంటుందని తెలిపారు. అయితే ఇటీవల డ్రెజ్జింగ్‌ పనులు చేయకపోవడం..అధిక శాతం ఇసుక అలల తాకిడికి కోతకు గురికావడంతో తీర ప్రాంతం దెబ్బతింటోందని ఆయన తెలిపారు.

ఆదివాసులకు దక్కని రాజ్యాంగ ఫలాలు

రాజ్యాంగ దినోత్సవాన్ని ‘‘నేషనల్‌ లా డే’’ లేదా ‘‘సంవిధాన్‌ దివస్‌’’ అని కూడా పిలుస్తారు. ఇది భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజుని ప్రతి సంవత్సరం నవంబర్‌ 26 న జరుపుకుంటారు. 26 నవంబర్‌ 1949 న భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అందువల్ల రాజ్యాంగం యొక్క సిద్ధాంతాలను, డాక్టం బి.ఆర్‌.అంబేద్కర్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి ఈ రోజును ఎంచుకున్నారు.– బి.రామారావు దొర

ఈ దేశ ఆదివాసులకు భారత రాజ్యాంగం షెడ్యూల్‌ 5,6 ద్వారా ప్రత్యేకమైన రక్షణ వలవలయాలు (బపర్‌ జోన్స్‌) రూపొందించింది. భూమి హక్కులు,వనరులు పరిరక్షించడంతో పాటు భాష,సాంస్కృతి, సాంప్రదాయక విలువలను కూడా ఈరక్షణ వలయంలోకి తీసుకువచ్చింది.ఈషెడ్యూల్‌ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూ పరిరక్షణకు 1/70భూ వదలాయింపు నియంత్రణ చట్టం చేసింది.1917 ుష్ట్రవ Aస్త్రవఅషవ ుతీaష్‌ం Iఅ్‌వతీవర్‌ aఅస ూaఅస ుతీaఅంటవతీం Aష్‌, 1917 (Aష్‌ చీశీ.1శీట 1917)’’ఈ చట్టానికి మూలం కాగా,ఈ చట్టం రూపకల్పనకు కారం తమ్మన్న దొర చేసిన పోరాటం స్పూర్తిగా నిలిచింది. ఆ తరువాత 1935, 1959 సవరణల తరువాత 1970లో ఏజేన్సీ ప్రాంతంలో ఆదివాసులు-ఆదివాసేతరు లకు మద్య అన్నిరకాల భూబదలాయింపులు పూర్తిగా నిషేదించబడిరది. షెడ్యుల్డ్‌ ప్రాంతంలో స్వయం ప్రతిపత్తిని బలపరుస్తూ,స్థానిక సంస్థల పరిపాలనను చూసుకోవడానికి పెసా చట్టం, 1996 ను తీసుకు వచ్చారు. వందల ఏళ్లుగా అదారపడ్డ అటవీ భూములకు యాజమాన్యపు హక్కులు సుస్థిరం చేయడానికి 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టం రూపకల్పన చేసారు.షెడ్యూల్డ్‌ కులాలు,షెడ్యూల్డ్‌ తెగల పట్ల అత్యాచారాలు,ద్వేషపూరిత నేరాలను నిరోధించడానికి భారతపార్లమెంటుఎస్సీ,ఎస్టీ అట్రాసిటి (అత్యాచారాల నిరోధక) చట్టం,1989 తీసుకు వచ్చింది. ఆదివాసులను వడ్డీ వ్యాపారుల దోపిడీ నుండి కాపాడటానికి షెడ్యూల్డ్‌ ప్రాంత ఋణ (వడ్డీ) వ్యాపార నిబంధనలు 1960,రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు మరియు వెనకబడిన తరగతుల కుల దృవీకరణ పత్రాల జారిచట్టం`1993వంటి రక్షణ వ్యవస్థలు రూపొందించబడి ఉన్నాయి. అంతేకాకుండా,జాతీయ విధానాలు (చీa్‌ఱశీఅaశ్రీ ూశీశ్రీఱంఱం), మార్గదర్శకాలు (Gబఱసశ్రీఱఅం) చాలానే ఉన్నాయి.
క్షేత్రస్థాయి ఆచరణలో ఆదివాసుల హక్కులపట్ల పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వలన వారి హక్కులకు భంగంకలుగుతూనే ఉన్నాయి.రోజురోజుకు వారిహక్కులు ఉల్లంఘించబడుతూ ఉంది. బలమైన రాజ్యాంగవ్యవస్థలు ఉన్నప్పటికీ,ప్రస్తుతం ఆదివాసుల స్థితి ఏమిటి అంటే?ఉన్న చట్టాలు అమలు కోసం లేదా పరిరక్షించుకోవడం కోసం నిరంతరం పోరాటాలు చేస్తూనే, జరుగుచున్న ఉల్లంఘనలను అడ్డుకో వడానికి కొత్త చట్టాలు రూపకల్పనకు మరో పోరాటం చేస్తు ఉండాలి.దొంగ ఎస్టి సర్టిఫికెట్లుతో ఎస్టీల లోకి చొరబడిన వారు దొంగ ఎస్టీ విద్యార్థులు,దొంగ ఎస్టీ ఉద్యోగులు,దొంగ ఎస్టీ రాజకీయ నాయకులు, దొంగ ఎస్టీ ఓటర్లు, దొంగ ఎస్టీ లబ్దిదార్లు ఆదివాసులకు న్యాయంగా దక్కవలసిన రాజ్యంగా ప్రయోజనాలు, భూములు దొంగిలిస్తున్నారు.వీరికి పాలకపక్షాలన్ని మద్దతుగా నిలుస్తున్నారు.భారతదేశం అత్యంత వైవిధ్యమైన ఆదిమా సముహాల జనాభాకు సాక్షిగా నిలుస్తుంది.ప్రతి తెగకు దాని సొంత పాత్ర,గుర్తిం పు,స్వభావం కలిగి ఉంటుంది.ఉదాహరణకు,మధ్య భారతదేశం లేదా పశ్చిమ భారతదేశంలోని ఆదివాసుల జీవితం, పరిస్థితులకు – ఈశాన్య భారతదేశం మరియు అండమాన్‌లోని తెగల స్థితులు భిన్నంగా ఉంటాయి. దేశంలోని ఆదిమ సమూహాలు 18 రాష్ట్రాలలో విస్తరించి దేశ జనాభాలో 8.6% (104.2 మిలియన్లు) ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లోని ఈ సమూహాలు మెజారిటీగా ఉండగా (ఉదా:ఈశాన్య రాష్ట్రాలు), ఇతర రాష్ట్రాలలోని షెడ్యూల్డ్‌ ప్రంతాలలో చిన్నచిన్న భూ భాగా లుగా ఉన్నాయి.వీరిచట్టాలు కేంద్ర,రాష్ట్రా ప్రభు త్వాలచే అమలు చేయబడతాయి.భారత రాజ్యాంగం ఆదివాసుల ప్రయోజనాలను,ప్రత్యేకించి వారి భూమిపై వారి స్వయం ప్రతిపత్తి హక్కులను పరిరక్షించడానికి ప్రయత్నిస్తుంది. భారత రాజ్యాంగంలోని షెడ్యూల్‌ 5,6 ప్రత్యేక రక్షణను కల్పిస్తుంది.ఇది ఆదివాసీ సమూహాలను దోపిడీ నుండి రక్షించడానికి,వారి భూమిపై వారి హక్కులను కాపాడు కోవడానికి దోహద పడుతుంది.
ఐదో షెడ్యూల్డ్‌ నియమాల ప్రకారం సాధారణ పరిపాలనకు ఉద్దేశించిన పార్లమెంటు లేదా రాష్ట్ర శాసన సభలు చేసిన చట్టాలను షెడ్యూల్డ్‌ ప్రాంతానికి వర్తిస్తా యని జారిచేసిన నోటిఫికేషన్‌ లేదా ఆ చట్టాలను కొన్ని మినహాయింపులు, కొన్ని చేర్పుల (జుఞషవజ్‌ూఱశీఅం aఅస వీశీసఱటఱషa్‌ఱశీఅం)తో ఈ ప్రాంతానికి వర్తింపచేసేటట్లు రాష్ట్ర గవర్నర్‌,టిఎసితో కలిసి తగిన నిర్ణయం తీసుకుని వర్తింపచేయవలసి ఉంటుంది. ఇది ఐదో షెడ్యూల్డ్‌ లోని పేరా 5(1డ2) వెసులుబాటు కల్పిస్తుంది.దీనికి ఉదా హరణ:1994లో 73వరాజ్యాంగ సవరణ ద్వారా రూ పొందించిన రాష్ట్ర పంచాయతీ రాజ్‌ చట్టం నియ మాల ప్రకారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, 1996లో పంచాయతీరాజ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంత విస్తరణ చట్టం (పెసా) కేంద్ర చట్టం చేసే వరకు ఇదేళ్ళపాటు (1995-99) షెడ్యూల్‌ ప్రాంతంలో హై కోర్టు తీర్పుతో రద్దుచేసారు. పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలను మినహాయింపులు లేదా చేర్పుల లేదా కొత్త చట్టాలు రూపొందించడానికి టిఎసిదే కీలకపాత్ర.కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 10 నెలలు గడుస్తున్న ఇంకా కౌన్సిల్‌ ఏర్పాటు జరగలేదు. నియమా నుసారం జరజవలసి రాజ్యాంగ ప్రక్రియాను నిర్లక్ష్యం చేయడం లేదా దానిని రాజకీయ సంస్థగా చూడటం వలన ఆదివాసులకు తీవ్రనష్టం జరుగుతుంది. ఇది అణ గారిన అదివాసి ప్రజల పట్ల జరుగుతున్న వివక్షపూరిత నిర్లక్ష్యానికి నిదర్శనం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో1950 జనవరి 26 నాటికి షెడ్యూల్‌ తెగలుగా గుర్తించబడి షెడ్యూల్డ్‌ ప్రాం తంలో నివాసం ఉంటున్న స్థానిక తెగలతో టిచర్‌ పోస్టుల భర్తికి ఉద్దేశించిన జీవో నెంబర్‌ 3రద్దు తర్వాత అదివా సులలో ‘షెడ్యూల్‌ ప్రాంతాల ఉద్యోగ నియామకల చట్టం’ చేయాలని డిమాండ్‌ ముందుకు వచ్చింది.నిజానికి ఈ డిమాండ్‌ కొత్తగా లేవనెత్తిన గొంతెమ్మ కోరిక కానేకాదు. రాజ్యాంగ కర్తలు ఐదో షెడ్యూల్‌ పేరా5లో పొందు పరచిన అంశమే.ఈ ప్రక్రియా రాజ్యాంగ వ్యవస్థ అయిన టిఎసిని ఏర్పాటుచేసి, ఆదివాసీ శాసనసభ్యులంత సంత కాలుచేసి,తిర్మాణాన్ని ఆమోదించి గవర్నర్‌ గారికి పం పాలి.రాష్ట్ర గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపాలి.ఆతీర్మానం ఆమోదం పొందితే ఆదివాసుల ఉద్యోగ భద్రతకు చట్టబద్దత వస్తుంది.ఇది రాజ్యాంగ ప్రక్రి యనే అయినప్పటికీ,ఉభయ తెలుగు రాష్ట్రాలు కనీస ప్రయత్నం చేయకుండా గుమ్మనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో గతప్రభుత్వం చేసిన టిఎసి తీర్మానం గవర్నర్కు ఆమోదం కోసం పంపిన సరిపోతుంది.లేదా టిఎసి ఏర్పా టు చేసి, తీర్మానాన్ని ఆమోదించి పంపాలి. లేదంటే, నాణ్యత లేని అరకొర చదువులతో ఏజేన్సీ ప్రాంత తెగలు, ఇప్పుడున్న పోటిని ఎదుర్కొని ఉద్యోగాలు పొందడం అంత సులువు కాదు. జీవో నెంబర్‌ 3రద్దు తరువాత,ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడకి లేఖ రాస్తూ, ‘ఆదివా సుల హక్కులపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి, సాను భూతి లేకపోవడం వలన అణగారిన ప్రజలు వారి పురోగతికి,సాధికా రతకు ఆటంకం కలిగిస్తున్నార’ని తన లేఖలో పేర్కొ న్నారు. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా, అరుకు సభలోను,అమరావతిలో జరిగిన ‘ప్రపంచ ఆది వాసి దినోత్సవ’ సభ లోను జివో నెం.3ని మళ్లీ తీసుకు వస్తానని బాబుప్రకటించారు.ఈప్రకటన వయసు మిరు తున్న ఆదివాసీ నిరుద్యోగులకు కొంత ఊరటనిచ్చే అంశమే.అయినా,మెగా డిఎస్సి -2024 నోటిఫికేషన్‌ జారీకి ముందు ఏజేన్సీప్రాంతానికి కేటాయించిన పోస్టు లు గురించి సరిjైున నిర్ణయం తీసుకోకుండా జెనరల్‌ రోస్టర్‌ ప్రకారం నోటిఫికేషన్‌ ఇస్తే మాత్రం షెడ్యూల్డ్‌ ఏరియా ఆదివాసులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది.ఆదివాసులకు గత పాలకులపై కలిగిన అపనమ్మకం, చంద్రబాబుపై పెట్టుకున్న ఆశ నెరవేరాలని ఆశిద్దాం…(నంబర్‌ 26 భారత రాజ్యాంగ దినోత్సవం సంద ర్బంగా… వ్యాసకర్త: ఆంధ్రప్రదేశ్‌ ఆదివాసీ జెఎసి జిల్లా కన్వీనర్‌, అల్లూరి జిల్లా)

వణికితున్న మన్యం..విసురుతున్న చలి పంజా…!

చలి తీవ్రత పెరగడంతో కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. పొగమంచు కురుస్తున్నది. సాయంత్రం నుంచి మొదలుకొని మరునాడు ఉదయం 8 గంటల వరకు చలివీస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది వాకింగ్‌, జాగింగ్‌ చేస్తున్నారు. చలికాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్య నియమాలు పాటించక పోవడంతో జబ్బుల బారినపడతారని నిపుణులు పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జబ్బులు వారిని పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, కాబట్టి పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గునపర్తి సైమన్‌


ఉత్తరాంధ్రలో చలిపంజా విసురుతోంది. అర్ధ రాత్రి నుంచి తెల్లవారే వరకు కురుస్తున్న మంచుకు చలిగాలులు తోడయ్యాయి.దీంతో జనం ఉదయం7 గంటల వరకు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులుచెబుతున్నారు. సాధారణంగాఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటున్నాయి. ఉష్ణోగ్రతలు గత వారం రోజుల నుంచి వేగంగా పడిపోతు న్నాయి.మన్యంలోపాటు మహావిశాఖలోను ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.కురి స్తున్న దట్టమైన పొగమంచుతో చలి తీవ్రత పెరగడంవల్ల మన్యం వణికిపోతుంది. ప్రధా నంగా వృద్దులు,పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవా లని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
గతంలో లేని విధంగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.నగరంలో గతనాలుగైదు రోజుల నుంచి కనిష్టస్థాయిలో సుమారు14 డిగ్రీలుగా నమోదువుతు న్నాయి.చలిగాలి తీవ్రత పెరిగి వణికిస్తోంది.ప్రధానంగా రాత్రిళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతుండడం గమనార్హం.రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడన ప్రభావ నేపథ్యంలో మరింత తక్కువ ఉష్ణోగ్రతలు నమోద య్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తు న్నారు.ఇక మన్యప్రాంతంలో డుంబ్రిగుడలో8.2, జీ.మాడుగులలో 8.4,అరకులోయలో 8.5,పాడేరులో 10.9,ముంచంగిపుట్టులో 10.9,గూడెం కొత్తవీధిలో 11.4,చింతపల్లిలో11.3,మినుములూరులో9, పాడేరు లో 11డిగ్రీలు నమోదైంది.
మన్యంలో దట్టమైన పొగమంచులు..
చలి పులి పంజా విసరడంతో విశాఖ ఏజెన్సీ వణికిపోతోంది.జనం ఇళ్లలో నుంచి బయటకు రావడా నికి భయపడిపోతున్నారు.చలిమంటలు వేసుకుని కాలక్షే పం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదా రుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. పాడేరులో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాడేరు వణికిపోతోంది.చలి పులి పంజా విసరడంతో జనం ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడి పోతు న్నారు. చలిమంటలు వేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. పొగమంచు కమ్మెయ్యడంతో రహదారుల్లో ముందు ఏంఉందో కనిపించడం లేదు.దీంతో పగలు కూడా లైట్లు వేసుకుని వేసుకుని వెళుతున్నారు వాహనదారులు. మిచౌంగ్‌ తుఫాన్‌ తర్వాత నుంచి అల్లూరి జిల్లా పాడేరు చలితో గజగజా వణికిపోతూనే ఉంది.తాజాగా చలి తీవ్రత మరింత పెరిగింది. పాడేరు ఏజెన్సీలో చలితీవ్రత ఎక్కువవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకుంటోంది.
ఎంత పొద్దెక్కినా సూరీడు కనిపించట్లేదు..
ఎంత పొద్దెక్కినా సూర్యుడు కనిపిం చకపోగా, పాడేరు,చింతపల్లి,అరకు లోయ, డుంబ్రిగుడ, ముంచుంగిపుట్టు, హుక్కుంపేట, తదితర మన్యప్రాంతాన్ని మంచు దుప్పటి కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు నానా ఇక్కట్లు పడుతు న్నారు.రోజురోజుకూ ఉష్ణోగ్ర తలు పడిపోవ డంతో పగలైనా సరే,వాహనం బయటకు తియ్యాలంటే లైట్లు ఆన్‌ చెయ్యా ల్సిందే.ఇక ముంచంగిపుట్టులో చలితీవ్రతకు జనం చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. మన్యంలో చలి తీవ్రత కొనసాగుతున్నది.క్రమంగా ఉష్ణోగ్ర తలు దిగజారుతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది.తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు చలితీ వ్రత కొనసాగుతోంది.ఇకసాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవు తోంది.కొద్ది సమయం లోపలే ప్రజలు పనులు చక్కపెట్టు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది.ఇక ముంచంగి పుట్టు మండల పరిధిలో గత మూడు రోజులు గా చలి తీవ్రత పెరిగింది.ఉదయం పూట పది గంటల వరకు ముంచంగిపుట్టులో మం చు తెరలు వీడడం లేదు.చలికి జనం గజగజ వణికిపోతున్నారు.సాయంత్రం అయితే చాలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయ పడుతున్నారు.సాయంత్రం నాలుగు గంటల తరువాత వీధుల్లో చలి మంటలు దర్శనమి స్తున్నాయి.ఇలా ఉండగా ఈవాతావరణ పరిస్థితులు సందర్శనకు వచ్చే పర్యాటకులకు మంచి అనుభూతినిస్తోంది.చలిలో మంచు అందాలను తిలకిం చేందుకు మాత్రమే వారు సందర్శి స్తున్నారు.మంచు విపరీతంగా పడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్య లకు గురవుతున్నారు.ఫ్రధానంగా విష(వైరల్‌) జ్వరాలు విజృంభిస్తున్నాయి.ఆస్తమా(ఉబ్బసం)బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం విశాఖ కేజీహె చ్‌కు జ్వరాలు,ఆస్తమాతో బాధప డుతున్న రోగులు తాకిడి పెరిగింది.ఎక్కువశాతం మందికి ఓపి విభాగంలో చికిత్స చేసి పంపుతున్నామని,శ్వాస తీసుకోవడంతో ఏమైనా ఇబ్బందులుంటే ఆసుప్రతిలో చేర్చి చికిత్స అందిస్తున్నా మని ఆసుపత్రి మెడిసిన్‌ విభాగా ప్రొఫెసర్‌ డాక్టర్‌ వల్లూరి సత్యప్రసాద్‌ తెలిపారు.చలి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
పెరుగుతున్న బాధితులు..
బాధితుల్లో ఒళ్లునొప్పులు,జ్వరం,జలుబు, గొంతు నొప్పి,నోరు రుచి లేకపోవడం వంటిలక్షణాలు కనిపిస్తు న్నాయి. జ్వరం మాత్రం48గంటలోపే నియంత్ర ణలోకి వస్తోంది.ఐదురోజుల వరకు జ్వరం తగ్గకపోయినా,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. కోవిడ్‌ టీకాలు వేయించుకోకుంటే కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.ప్రస్తుతం వస్తున్నవి విష జ్వరాలే.ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.కాస్త ఆప్రమత్తంగా ఉంటే సరిపోతుంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..` డాక్టర్‌.యశోధ

గిరిజన విద్యార్థుల్లో సమగ్ర వికాసం

అనంతగిరి ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, అరకు లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌, యండపల్లి వాలసాలో జూనియర్‌ కాలేజ్‌, మరియు పాదేరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ వంటి వివిధ సంస్థలలో యువ క్లబ్‌లు ఉన్నాయి.ఈ యువ క్లబ్‌లతో మా పరస్పర చర్యల సమయంలో,విద్యార్థులు కొన్ని అత్యంత ముఖ్యమైన సమస్యలను మాకు తెలియజేశారు. గత రెండు సంవత్సరాలలో,మేము పాఠశాల మరియు కాలేజ్‌ విద్యార్థుల కోసం ఉద్యోగా భివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాము, వారి సంబం ధిత గ్రామాల నెలకొన్న సమస్యలపై విద్యార్థులు దృష్టిసారించి తెలియజేశారు. వారి సమస్య లను యూత్‌ క్లబ్స్‌ తరుపున అల్లూరి జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌కి,ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌ సమత ప్రతినిధులు అందజేయడం జరిగింది.
విద్యార్థి దశ ఓమధురానుభూతి.అయితే తీవ్ర ఒత్తిడితో కూడిన నేటి చదువుల వల్ల విద్యా ర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పుస్తకాల బరువు,హోంవర్కులు,పరీక్షలు, మార్కులు, ర్యాంకులు వంటి వాటి హోరుతో తీవ్ర మానసిక వేదనకు గురౌతున్నారు. ఆటపాటలు కరువై ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతుం డటంతో మధురస్మృతులకు లోనై తీవ్ర ఒత్తిడికి గురౌతున్నారు.విషయ పరిజ్ఞానం,ఆలోచ నాశక్తి,సృజనాత్మకత,ప్రశ్నించేతత్వం అంతంత మాత్రంగానే ఉంటోంది.ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంపొందించటమే లక్ష్యంగా సమత రెండేళ్ల నుంచి అల్లూరి సీతారామారాజు జిల్లా పాడేరు,అనంతగిరి, అరకు ఏపీ గిరిజన సంక్షేమ ఆశ్రమ జూని యర్‌ కళాశాల బాలబాలికలతో యూత్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసింది.స్థానికంగా నివాసముంటున్న వారి గ్రామాల్లో పలు సామాజిక సమస్యలను గుర్తించడం,వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం,జీవిత నైపుణ్యాలు తెలుసుకోవడం వంటి అంశాలపై తద్వారా విద్యార్ధినీ, విద్యార్థులు తమ నైపుణ్యాలతో గ్రామాల్లో ఉన్న పలు రకాల సమస్యలను తెలుసుకుని ఇటీవల జిల్లా కలెక్టర్‌,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారికి విన్నవించేలా కృషి చేస్తోంది.సామాజిక సేవే లక్ష్యంతో విద్యార్థుల అభ్యున్నతే ధ్యేయంగా ఏర్పాటు చేసిన గిరిజన యూత్‌ క్లబ్‌లు సత్ఫ్‌లితాలు ఇస్తున్నాయి.కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన,వక్తత్వ పోటీలు నిర్వహిస్తుండటం ద్వారా విద్యార్థుల్లో ప్రపంచ,సామాజిక,శాస్త్ర, సాంకేతిక విషయా లపై అవగాహన,ఆసక్తి పెంపొందిం చటానికి కృషి చేస్తున్నారు.పోటీల్లో విజయం సాధించిన విజేతలకు చక్కట విలువైన బహుమతులు అందజేస్తున్నారు.స్నేహపూర్వకంగా సహాయ సహకారాలతో ముందుకు సాగుతోంది. కళా శాల విద్యార్థుల్లో సమగ్ర మనో వికాసానికి తమవంతుగా కృషి చేస్తున్నారు. ప్రాథమిక విద్య సమయంలోనే నైతిక విలువలు,జీవన నైపుణ్యాలు,సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని యూత్‌ క్లబ్‌ విద్యార్థులకు అలవర్చుతున్నారు.మాధ్యమిక, ఉన్నత విద్యను అభ్యసించే వారికి విమర్శనాత్మక దృష్టి, సృజనాత్మకత,భావ ప్రకటనా సామర్థ్యం, పరస్పర సహకారం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయటానికి కృషిచేస్తున్నారు. సామాజిక సమానత్వం,న్యాయం,ప్రపంచ సంఫీుభావం పెంపొందించటం,ప్రజాస్వామ్య విలువల పరి రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతి సమస్య గురించి హేతుబద్ధంగా ఆలోచించటం,పరిస్థితులను అవగాహన చేసుకోవటం,ఊహించటం,పోల్చటం, క్షేత్ర స్థాయి జ్ఞానాన్ని పెంపొందించటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.చదువుకునే రోజుల్లో ఉన్నత ప్రమాణాలకు పునాదులు వేసేందుకు యూత్‌ క్లబ్‌లు నిర్విరామంగా కషిచేస్తున్నాయి. వాటితోపాటుగా ఆరోగ్య సూత్రాలు,విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికిగాను వారి శారీరక, మానసిక,విజ్ఞాన శక్తులను పెంపొందించే విధంగా సూచనలు,సలహాలిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలపై అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది. సదస్సులు, సమావేశాలు, అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది.ఆటల్లో ప్రోత్సాహం, వ్యాయామం వంటివి నేర్పిం చటం, అవగాహనా శక్తి పెంపొందించే విధంగా మోటివేషనల్‌ తరగతులను వివిధ విషయాలపై నిర్వహిస్తున్నారు. మేథోశక్తిని పెంపొందించటానికి పుస్తకపఠనం,ఆన్‌లైన్‌ పోగ్రాములు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా,ఒత్తిడి లేని విద్యను అభ్యసించటంపైనా, కెరీర్‌ గైడెన్స్‌పైనా మార్గదర్శకత్వం వహిస్తూ ఉన్నత చదువులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు.ఆతర్వాత కూడా వారి ఆరోగ్య రక్షణకు,మానసిక వికాసానికి తగిన సూచనలు,సలహాలను అందిస్తున్నారు.
-గునపర్తి సైమన్‌

సముద్ర కాలుష్యం..ప్లాస్టిక్‌ అధికశాతం

తినే తిండి..తాగేనీళ్లు..వాడుకునే వస్తువులు..ప్రతిదానికీ ప్లాస్టిక్‌! మనకండ్ల ఎదురుగా కనిపించే ప్రతి వస్తువులో ప్లాస్టిక్‌..అంతాలా మన జీవితంలో ప్లాస్టిక్‌ భాగమైపోయింది.అవసరం ఉన్నాలేకున్నా వాడాల్సిన పరిస్థితికి మనం చేరి పోయాం.ప్లాస్టిక్‌ వస్తూనే ఉన్నది..గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూనే ఉంది.భూమినే కాదు..సముద్రాలను ముంచెత్తుతుంది.ఎన్నో జీవరాశుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది.ప్లాస్టిక్‌ భూతం వల్ల సముద్రాలకు,జలచరాలకు జరుగుతున్న నష్టమెంత?ప్లాస్టిక్‌ను ఆపేదెట్ల? సముద్రాలను కాపాడుకునుడెట్ల (కొట్టాల రాము)
మనిషి అడుగుపడనంత వరకే ఏ ప్రాంతమైనా సురక్షితం..అని అన్నాడో రచయిత.దేన్నయినా ధ్వంసం చేయగల నేర్పు..గాలినీ,గంగనూ..కలుషితం చేయగల తెలివి..ఒక్క మనిషికే సొంతం.మన తప్పులకు నీటి అడుగున ఉన్న ప్రపంచం నాశనం అవుతోంది.ఫ్లాస్టిక్‌ చెత్తను పడేసేందుకు డంపింగ్‌ యార్డుల్లా సముద్రాలు మారిపోతున్నాయి.ప్లాస్టిక్‌ వ్యర్ధాలతో నిండిపోతున్నాయి.సముద్రపు జీవుల మనుగడే ప్రశ్నార్ధకంగా మారిందని అమెరికాకు ఎందిన ‘ది5గైర్స్‌ ఇనిస్టిట్యూట్‌’ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ప్రపం చవ్యాప్తంగా ఉన్న మహా సముద్రాల్లో దాదాపు 170 ట్రినియన్ల ప్లాస్టిక్‌ ముక్కలు ఉన్నాయి.వీటి బరువు రెండు మిలియన్‌ టన్నుల ఉంటుంది.2005నుంచి సముద్రాల్లో ప్లాస్టిక్‌ పొల్యూషన్‌ చాలా పెరిగింది.దీన్ని కానీ ఆపకపోతే 2040నాటికి వ్యర్ధాలు మూడురెట్లు పెరుగుతాయి.ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది.ప్లాస్టిక్‌ నివారణకు చట్టబద్దమైన విధానాలు తీసుకురావాలి.ఫ్లాస్టిక్‌ నష్టాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం అవసరం.ఎక్కువ ఫ్లాస్టిక్‌ తయారీతోపాటు వాడకం కూడా పెరిగింది.దీంతో భూమిపై వీటి వ్యర్ధాలు భారీగా పేరుకుపోయాయి’’ని వివరించింది.
మనకు ఎంతో ఇస్తోంది..
జీవి మనుగడకు సముద్రం అత్యంత ముఖ్యం.సముద్రాలులని మానవ జీవనాన్ని ఊహించలేం. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడువంతులు సముద్రాలే.ఒకవంతు భాగంలో మనం జీవిస్తున్నాం. మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం.సముద్రాల్ని క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ,మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. మన ఫుడ్‌లో ఇంపార్టెంట్‌ స్టాల్‌..అఅది దొరికేది సముద్రం నుంచే.చేపలు,రొయ్యలు,పీతల్లాంటి జలచరాలు సముద్రాల నుండే లభిస్తున్నాయి.అలాగే సముద్రపు పొచి,నాచు నుంచి సేకరించే పదార్ధాలను ఫుడ్‌ ఐటమ్స్‌లో వాడతారు.సముద్రాల్లో దరికే ఫ్రాన్స్‌,సీవిప్‌ కోరల్స్‌ నుంచి సేకరించిన పదార్ధాలను ఫెయిర్‌ కిల్లర్స్‌,ఇతర ఔషధ ఉత్పత్తుల్లో వాడతారు. సముద్ర తీరాల్లో లభించే ఇసుక..భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది.మనకు ఇంత ఉపయోగపడుతున్న సముద్రాలకు మనం మాత్రం తిరిగికాలుష్యాన్ని కానుకగా ఇస్తున్నాం.ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా కలుషితం చేస్తున్నాం.
సముద్ర జీవాలకు ముప్పు…
సముద్రపు అంచుల్లో నివసించే జీవుల్లో మైక్రో ఫ్లాస్టిక్స్‌ బయటపడుతున్నాయి. ‘‘మైక్రో ఫ్లాస్టిక్‌వల్ల నీరు కలుషితం అవుతుంది.ఇదొక్కటేనా ప్లాస్టిక్‌ను ఫుడ్‌ అనుకొని సముద్ర జీవులు తినడంతో వాటి ఆర్గాన్స్‌ దెబ్బతింటున్నాయి.మహాసముద్రాల్లో మైక్రో ఫ్లాస్టిక్స్‌ పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రపంచస్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంద’’ ని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు.తాబేళ్లు,తిమంగలాలు,ఇతర జలచరాలు ఫ్లాస్టిక్‌ మింగడం లేదా వాటిలో చిక్కు కొని మరణిస్తున్నాయి.సముద్రపక్షలు చేపలు అను కుని ప్లాస్టిక్‌ను తింటున్నాయి.ఇలా చనిపోయిన పక్షల కడుపుల్లో దాదాపు80శాతం ఫ్లాస్టిక్‌ ఉంది. తిమింగలాల పొట్టలో నుంచి కేజీల కొద్దీ ఫ్లాస్టిక్‌ బయటపడిన ఘనటలూ ఉన్నాయి.
కారణాలేంటీ?..
సముద్రాలకు ఫ్లాస్టిక్‌ చేస్తున్న హానిని ఊహించ లేమని సైంటిస్టులు ఆందోళన పడుతు న్నారు.‘బీచ్‌ల్లో చెత్త వేయడం,సాధారణ వ్యర్ధాల నిర్వహణలోపం,మురుగు కాలువలు,నదులు, వాన లకు కొట్టుకుని రావడం వంటి కారణాలతో సము ద్రంలోకి ఎత్త చేరుతోంది.మరో 22శాతం మిస్‌ మేనేజ్‌ చేస్తున్నారు.ఇది ఇలానే కొనసాగితే భయంకర పరిస్థితులు తెలెత్తుతాయి.ప్రపంచం ముందుకు వచ్చి ఫ్లాస్టిక్‌ కట్టడికి చర్యలుతీసుకోకపోతే..2040 నాటికి మహా సముద్రాల్లోకి చేరే చెత్త 64బిలియన్‌ ఫౌండ్ల(2,902కోట్ల కిలోల)కు పెరుగుతుందని రీసెచర్చర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2050 నాటికి భూమిపై పోగయ్యే చెత్త 26ట్రిలియన్‌ ఫౌండ్ల(11.79కిలక్షల కోట్లు)వరకు ఉండొచ్చని మరో స్టడీ అంచనా వేసింది.‘‘ఫ్లాస్టిక్‌ కాలుష్యం చాలా స్థిరంగా కొనసాగుతుంది.అలానే వదిలేస్తే అనేక దశాబ్దాలు లేదా శతాబ్దాలపాటు ఇలానే ఉండొచ్చు.సముద్రంలోకి ఫ్లాస్టిక్‌ చేరకుండా అడ్డు కోవాలంటే దాని మూలాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి.అప్పుడే పరిష్కారాలు దొరుకుతాయి. దీనికి పూర్తి మ్యాపింగ్‌ అవసరం.ఒకసారి మహా సముద్రాల్లోకి చేరిన చెత్త..చిన్నచిన్న భాగాలుగా విడిపోతుంది.కాలక్రమేణా మారిపోతుంది.కానీ నిజంగా అదృశ్యం కాదు.రికవరీ కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది’’అని ది ఓషన్‌ క్లీనప్‌ రీసెర్చ్‌ హెడ్‌ లౌరెంట్‌ లెబ్రెటెస్‌ ఆందోళన వ్యక్తం చేశాడు.
నమ్మలేని నిజాలివి…
-కొన్నేండ్లుగా సగటున ప్రతి నిమిషానికి ఓట్రక్కు చెత్త సముద్రంలో కలుస్తున్నట్లు అంచనా.
-గత వందేండ్లలో ఉత్పత్తి కానంత చెత్త..కేవలం గత దశాబ్దకాలంలోనే ఉత్పత్తి అయింది.
-ఒక ఫ్లాస్టిక్‌ కవర్‌ మనకు ఉపయోగపడే సమయం సగటున కేవలం 15 నిమిషా లు.కానీ అవసరం తీరాక అది డీగ్రేడ్‌ కావడానికి 500నుంచి వెయ్యేండ్లు పడు తుంది.డీ గ్రేడ్‌ అయినంత మాత్రాన డీ కంపోజ్‌కాదు.మైక్రోఫ్లాస్టిక్‌గా మారు తంది. మనుషులు,జంతువులకు విష పూరితంగా మారుతుంది.పావుగంటలో వాడేందుకు పనికరాకుండా పోయే వస్తువును..కొన్ని తరాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాకర వస్తువుగా మారుస్తున్నాం.
– ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 సముద్ర జంతువులు ఫ్లాస్టిక్‌ వల్ల చనిపోతు న్నాయి.దాదాపు 90శాతం సముద్ర పక్షలు ఫ్లాస్టిక్‌ తింటున్నాయి. ఫ్లాస్టిక్‌ను ఆహారం అనుకుని ప్రతి మూడు సముద్ర తాబేళ్లలో ఒకటి తింటున్నాయి.
– చివరికి తల్లి గర్బంంలోని శిశువులకు అన్ని పోసకాలను అందించే,బొడ్డు తాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రోఫ్లాస్టిక్‌ అవశే షాలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
-2050కల్లా ప్రపంచంలో మత్స్య సంపద తో సమానంగా ఫ్లాస్టిక్‌ సముద్రాల్లో చేరు తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు చేపలు పట్టేటప్పుడు ప్లాస్టిక్‌ వస్తువులు ఎక్కువగా పడుతున్నాయట. ఇటీవల కేరళలో మత్స్యకారుల వలలకు టన్నుల కొద్దీ ఫ్లాస్టిక్‌ చెత్త వచ్చి పడిరదట.
-సముద్రాల్లో పొగువుతన్న చెత్తలో 80శాతంపైగా ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలే ఉం టున్నాయి.
– ప్రపంచంలోని ఒక్కశాతం నదులు (సుమారు1,0001)..సముద్రాల్లోకి చేరే 80శాతం ఫ్లాస్టిక్‌కు కారణమవు తున్నాయి.
క్లీనింగ్‌ ఇలా..
ఫ్లాస్టిక్‌ చెత్త సముద్రాల్లోకి చేరకుండా ఆపడాన్ని నదులను శుభ్రపరచడం ద్వారా ప్రారం భించాలి.దిఓషన్‌ క్లీనప్‌ అనే నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనై జేషన్‌.. సముద్రాల్లో ఫ్లాస్టిక్‌ క్లీన్‌ చేసేందుకు చర్యలు చేప ట్టింది.ఇప్పటివరకు 2మిలియన్‌ కిలోలకు పైగా చెత్తను సముద్రం నుంచి తొలగించింది.
కాస్టింగ్‌ నెట్‌..
సముద్రాల్లో ఏర్పడే ప్యాచ్‌లను తొలగిం చేందుకు నెట్స్‌ వాడుతున్నారు.రెండు పడవలకు చెరోవైపు నెట్‌ను తగిలించి..యు ఆకారంలో వెళ్లి చెత్తనంతా మధ్యలోకి తీసుకొస్తారు.అక్కడి నుంచి తరలించి రీ సైకిల్‌ చేస్తారు.ఈప్రాసెస్‌లో సముద్ర జీవులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంటర్‌ సెప్టార్‌ సిస్టమ్‌..
నదికి అడ్డంగా ఒకవైపు నుంచి ఇంకో వైపునకు ‘ట్రాష్‌ ట్రెంచ్‌’ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంటర్‌ సెప్టార్‌ బ్యారియర్ల ద్వారా చెత్త సేకరి స్తారు. నది వెడల్పు,లోతు,ప్రవాహ వేగం,చెత్త రకం వంటి అంశాల ఆధారంగా సేకరణ తీరు మారు తుంటుంది.ఈ మొత్తాన్ని ఏఐ కెమెరాలను ఉపయో గించి అంచనా వేస్తారు.చెత్తను తీయడానికి కన్వే యర్‌ బెల్ట్‌ వాడతారు.
గ్రేట్‌ బబుల్‌ బారియర్లు..
గ్రేట్‌ బబుల్‌ బారియర్లద్వారా నది నుంచి వచ్చే చెత్త సముద్రంలో కలవకుండా చూస్తారు.ఈ బబుల్‌ బారియర్లను నదిలో వాలుగా ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి వచ్చే గాలి బుడగలు ప్లాస్టిక్‌ చెత్తను అడ్డుకుంటాయి.వచ్చే చెత్తమొత్తం ఒడ్డును ఒక మూలకు చేరేలా చేస్తాయి.అక్కడి నుంచి చెత్తను సేకరిస్తారు.
రోజూ వాడే వస్తువులన్నీ…
నదులు ద్వారా,నేరుగా డంపింగ్‌ చేయ డం ద్వారా భారీస్థాయిలో ఫ్లాస్టిక్‌ చెత్త సముద్రాల్లోకి వచ్చి పడుతోంది.సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆఫ్లాస్టిక్‌ అక్కడక్కడా గుంపు(ప్యాచ్‌)గా చేరుతోంది.ఈ ఫ్లాస్టిక్‌ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల వస్తువులు ఉంటున్నాయి.శాస్త్రవేత్తలు పసిఫిక్‌ ప్యాచ్‌లో పరిశీలించినప్పుడు..ఫ్లాస్టిక్‌ బాటి ల్స్‌,గ్లాసులు,పాత్రలు,బొమ్మలు,టాయిలెట్‌ సీట్లు, చేపల వలలు,ఎలక్ట్రానిక్‌ పరికరాల ఫ్లాస్టిక్‌ భాగా లు,ఇంట్లో వాడే ఇతరఫ్లాస్టిక్‌ వస్తువుల ముక్కలు, థర్మాకోల్‌ ముక్కలు..ఇలా ఇంకా ఎన్నో రకాలు కనిపించాయి.
ఫ్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేమా.?
ఫ్లాస్టిక్‌ను నియంత్రిండమెలా?నిజంగా మనం ఫ్లాస్టిక్‌ను వాడకుండా ఉండలేమా?శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి.‘‘ విచ్చలవిడిగా ఫ్లాస్టిక్‌ను తయారుచేస్తూ..రీ సైకిల్‌ చేయాలి..క్లీన్‌ చేయాలి అంటే ఎలా?అసలు ఫ్లాస్టిక్‌ తయారు చేయడమే మానేయాలి.అప్పుడు రీ సైక్లింగ్‌,క్లీనింగ్‌ అవసరమే ఉండదు.ఫ్లాస్టిక్‌ బదులు మనకు ఎన్నోప్రత్యామ్నాయ మార్గాలున్నాయి .కాకపోతే ప్రభుత్వాలకూ,ప్రజలకూ నిబద్దత అవ సరం.ఫ్లాస్టిక్‌ వాడే తీరు మారాలి’అంటున్నారు.
సైంటిస్ట్‌లు..
మనం బజారుకెళ్లి ఏంతెచ్చినా..ఫ్లాస్టిక్‌ కవర్‌లోనే తెస్తాం.ఇంటికి వచ్చే వరకే ఫ్లాస్టిక్‌ కవర్‌ మనకు అవసరం.తర్వాత అదిచెత్త బుట్టలోకి వెళ్తుంది. ఇలా ఒకరోజుకు,నెలకు,ఏడాదికి ఎంత ఫ్లాస్టిక్‌ చెత్తను మనం పడేస్తున్నాం అనేది ఆలో చించాలి.అవసరం మేరకే వాడుతున్నామా? అందుబాటులో ఉంది కాబట్టి విచ్చలవిడిగా వాడు తున్నామా?అనేది గమనించాలి.మితిమీరి తింటే మందు కూడా విషం అవుతుంది.అలాంటిది విషం లాంటి ఫ్లాస్టిక్‌ను..ప్రతి దానికి ఉపయోగిస్తున్నాం.
మారాల్సింది మనం ..ఫ్లాస్టిక్‌ వాడుతున్న పద్దతి కదా!..
ఫ్లాస్టిక్‌ కవర్లపై నిషేధం అంటూ ఉత్తుత్తి ప్రకటనలతో కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి.దశల వారీగా సింగిల్‌ యూజ్‌ ఫ్లాస్టిక్‌ను నిషేధించాలి.ఫ్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించేం దుకు టార్గెట్లు పెట్టుకోవాలి.వాటిని సాధించేందుకు కృషి చేయాలి.బ్యాన్‌ను కాదని అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రత్యామ్నాయాలను ప్రొత్స హించాలి.జనపనార లేదా క్లాత్‌ సంచుల వినియో గాన్ని ప్రోత్సహించాలి.తయారీదారులకు ఇన్సెం ట్‌వ్‌లు ఇచ్చి దన్నుగా నిలవాలి.ముఖ్యంగా బయో డీఏడబుల్‌ సంచులను ఉపయోగించేలా ప్రజల్లో మార్పు తీసుకురావాలి.బంగాళదుంపలతో కూడా క్యారీబ్యాంగ్‌,స్పూన్స్‌,ప్లేట్స్‌,పిల్లల ఆట సామగ్రిని తయారు చేస్తున్నారు.పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు.కొదÊఇద రోజులకే కరిగి భూమిలో కలిసిపోతాయి.వీటిని రీసైక్లింగ్‌కి కూడా వాడొచ్చు. బ్రిటన్‌,జపాన్‌లలో వీటిని ఇప్పటికే వాడుతున్నారు. రోజుకు సముద్రాల్లో ఎంత ఫ్లాస్టిక్‌ చెత్త పేరుకు పోయింది?రేపటికీ అది ఎంత అవుతుంది?వచ్చే ఏడాది ఎంత పెరుగుతుంది?ఇలాంటి ప్రశ్నలకు మనకు నిజంగా సమాధానాలు తెలియపోవచ్చు. కానీ,సముద్రపు చెత్తా చెదారాన్ని నియంత్రించ డానికి స్థానికంగా,ప్రాంతీయంగా, ప్రపంచ స్థాయి లో తీవ్రమైన ప్రయత్నాలు జరిగే వరకు భారీ మొత్తంలో ఫ్లాస్టిక్‌ వేస్ట్‌ సముద్రాల్లో పెరుగుతూనే ఉంటుంది.
పదివేల అడుగుల లోతున…
ఫిలిప్పీన్స్‌ మెరైన్‌ సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన మైక్రోబయల్‌ ఓషియనాలజిస్ట్‌ డాక్టర్‌ డియోఫ్లోరెన్స్‌ ఓండా..2021లో పసిఫిక్‌ సముద్రం లోని ‘ఎమ్డెన్‌ డీప్‌’లో 10,000మీటర్ల లోతైన ప్రదేశానికి వెళ్లారు.అది ప్రంచంలోని అతి పురాత నమైన, భూమ్మీద మూడులోతైన ట్రెంచ్‌(కందకం) సముద్రంలో దాగి ఉన్న రహాస్యాలను కనుగొవడం కోసం ఆసాహసం చేశారు.10,000మీటర్ల లోతులో పదార్ధాలను,వాతారణాన్ని పరిశీలిం చారు. ఆయనతోపాటు అమెరికన్‌ సైంటిస్ట్‌ విక్టర్‌ వెస్కోవా వెళ్లారు.ఇద్దరూ దాదాపు 12గంటలపాటు అన్వేషించారు.‘‘ మేమిద్దరం సముద్రంలోని లోతైన ప్రదేశానికి వెళ్లగానే తెలుపు రంగులోని పదార్ధాలు కనిపించాయి.వాటిని మొదట జెల్లీఫిష్‌ అనుకు న్నాం.తీరా దగ్గరకు వెళ్లి చూస్తే..అవన్నీ ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలని అర్ధమైంది.ఇంత లోతులో ఫ్లాస్టిక్‌ వ్య ర్ధాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. బట్టలు, పాత బొమ్మలు,ప్యాకేజింగ్‌ వస్తువులు,ఫ్లాస్టిక్‌ సంచులు ఇలా చాలా వస్తువులు అక్కడ పేరుకు పోయాయి’’ని చెప్పారు ఓండా.
ఊహించలేనంత నష్టం..
సముద్రం ఒక క్రైమ్‌ ప్లేస్‌గా మారింది. ఇది ఒక సైటింటిస్టు ఆవేదన.నీటిలో తప్ప ఇంకె క్కడా బతకలేని జలచరాలకు..సముద్రమే ప్రమాద కరమైన ప్రదేశంగా మారుతోంది.మనకెన్నో ఇస్తు న్న సముద్రాన్ని అంతలా మనమే నాశనం చేస్తు న్నాం.నీళ్లు,సముద్రపు ఉత్పత్తులు కలుషితం అయి పోతున్నాయి.అమెరికా సహా పలుదేశాల్లోని సము ద్ర తీర ప్రాంతాల్లో మట్టి,ఇసుకను పరిశీలిం చిన శాస్త్రవేత్తలు…వాటిలో ఫ్లాస్టిక్‌ అవశేషాలు గణ నీయంగా ఉన్నట్లు గుర్తించారు.మనం తినే తిండి, తాగే నీళ్లు..ఓలెక్కన చెప్పాలంటే మన శరీరంలోకి కూడా మైక్రోఫ్లాస్టిక్‌ చేరిపోతుంది.అసలు మైక్రోఫ్లాస్టిక్‌(సూక్ష్మస్థాయి ఫ్లాస్టిక్‌ ముక్కలు) లేనిప్రదేశమే లేకుండా పోయిందని సైంటిస్టులు చెప్తున్నారు.ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకా రం..గాలిలోని దుమ్ములో,తాగేమంచినీళ్లలో, సము ద్ర జీవు కడుపుల్లో మైక్రోఫ్లాస్టిక్‌ను గుర్తించారు. మనం తప్పు చేసి శిక్ష అనుభవించడమే కాకుండా ఎన్నో కోట్ల జీవరాశులను బలి చేస్తున్నాం.భవిష్యత్తు తరాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాం.‘‘ఏటా 640 వేల టన్నుల ఫిషింగ్‌ ఎక్విప్‌మెంట్‌ను సముద్రాల్లో డంప్‌ చేస్తున్నారు.ఫ్లాస్టిక్‌ నుంచి వెలువడే రసా యనాలతో నీళ్లు కలుషితమవుతున్నాయి.ఆ ప్రభా వం సముద్రం జీవులపై పడుతోంద.వాటి నుంచి ఆ ఎఫెక్ట్‌ మనుషుల ఆరోగ్యంపై పడుతోంది’’ అని డబ్ల్యూయూఎన్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ రీసెర్చర్లు ఆందోళన పడుతున్నారు.
ప్లాస్టిక్‌ లేని ఊరు..
ఫ్లాస్టిక్‌ వల్ల ఈ భూమ్మీద ప్రతి ప్రాణికి ప్రమాదమే.అందుకే మన దేశంలో సహా ప్రపం చంలో అనేక దేశాలు ఫ్లాస్టిక్‌ వాడకం తగ్గించాయి. వ్యర్ధాలను ఎక్కపడితే అక్కడ పారేయకుండా చర్యలు తీసుకుంటున్నాయి.ఫ్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్ధాలను గుర్తించిన ఓ గ్రామం సర్పంచ్‌ వాళ్ల ఊరి ప్లాస్టిక్‌ రహిత పంచాయితీగా మార్చాలి అనుకున్నాడు.కానీ,అది అంత ఈజీకాదని కొత్తగా ఆలోచించాడు.దాంతో ఆయన లక్ష్యం 15రోజు ల్లోనే నెరవేరింది.సౌత్‌ కశ్మీర్‌ అనంతనాగ్‌ జిల్లా లోని షహబాద్‌ బ్లాక్‌ సాదీవర పంచాయితీకి ఫరూ క్‌ అహ్మద్‌ గనయ్‌ సర్పంచ్‌.ఇంతకుముందు ఆయన లాయర్‌గా పనిచేశారు.వాళ్ల గ్రామంలో ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలు లేకుండా చేయాలనుకుని..‘ఫ్లాస్టిక్‌ తీసుకు రండీ`బంగారం గెలుచుకోండి’ అని ప్రకటించాడు.ఈ కార్యక్రమంలో భాగంగా 20 క్వింటాళ్ల ఫ్లాస్టిక్‌ వ్యర్ధాలను తీసుకొచ్చిన వాళ్లకు ఒక బంగారం నాణెం ఇస్తామని చెప్పాడు.దాంతో ఊరివాళ్లంతా ఫ్లాస్టిక్‌ సేకరించే పనిలో పడ్డారు. దాంతో..పదిహేను రోజుల్లోనే ఊళ్లో ఫ్లాస్టిక్‌ కని పించకుండా పోయింది.ఆ తర్వాత గవర్న మెంట్‌ ఆ గ్రామాన్ని ఫ్లాస్టిక్‌ రహిత గ్రామంగా ప్రకటిం చింది.
రీసైక్లింగ్‌కు కట్టుబడితేనే…
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం మున్సి పాలిటీల ప్రాధమిక విధుల్లో ఒకటి.తడి,పొడి చెత్తను వేరుగా తీసుకోవాలి.రీసైక్లింగ్‌ చేపట్టాలి .అయితే ఈపని ఎక్కడా సరిగా జరగదు.కానీ, ఒడిశాలోని సంబల్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ)చెత్తనుంచి ఆదాయం సంపాదించుకుం టోంది.ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి.. అమ్మ డం ద్వారా ప్రతినెల రూ.15లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఆదయాం పొందుతోంది.‘గ్లాసు, పేపర్‌,కార్డ్‌బోర్డ్‌,మెటల్‌,ఫ్లాస్టిక్‌ టైర్లు,బట్టలతో సహా 16రకాల రీసైకిల్‌ చేయగలిగే వ్యర్ధాలు వేరు చేస్తోంది. ఎంపిక చేసిన ఏజెన్సీకి..ఒక్కో ఐటమ్‌ను ఒక్కో ధరకు అమ్ముతోంది.సంబల్‌పూర్‌ సిటీలో రోజూ 110టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే.. తొమ్మిది వెల్త్‌ సెంటర్లును ఏర్పాటు చేసి ప్రాసెస్‌ చేస్తున్నారు.తొలుత గృహాలు,వాణిజ్యసంస్థల నుంచి సేకరించిన చెత్తను వెల్త్‌ సెంటర్లకు తీసు కొస్తారు.ఈసెంటర్లలో మైక్రోకంపోస్టింగ్‌ సెంటర్‌ (ఎంసీసీ),మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ (ఎం ఆర్‌ఎఫ్‌) ఏర్పాటు చేశారు.నగరంలో ఉత్పత్తయ్యే బయోడీగ్రేడబుల్‌ వ్యర్దాలను వేరు చేస్తారు.అలా వేరు చేసిన తర్వాత రీసైకిల్‌ చేయడానికి వీలులేని చెత్తను..ఇంధనంగా వాడేందుకు సిమెంట్‌ ఫ్యాక్టరీకి పంపుతారు.రీసైకిల్‌ చేయగలిగే చెత్తను ఏజెన్సీకి అమ్ముతారు.వేస్ట్‌ను కూడా వేస్ట్‌ చేయకుండా ఆదాయవనరుగా మార్చుకుంటు న్నారు వాళ్లు.2017లో బ్రిటన్‌కు చెందిన అండర్‌ వాటర్‌ ఫొటోగ్రాఫర్‌ కారోలిన్‌ పవర్‌ తీసిన పొటో ఇది.హోండురాస్‌లోని రోవాటెన్‌ ఐలాండ్‌కు దగ్గర్లోకి కరేబియన్‌ సముద్రంలో ఇలాకొన్ని కిలో మీటర్ల మేరచెత్త పేరుకుపోయింది.హోం డురాస్‌, గాటెమాలలో అడ్డూఅదుపు లేని ఫ్లాస్టిక్‌ వినియో గానికి ఇదోఉదాహరణ.సముద్రాల్లో ఫ్లాస్టిక్‌ ఎంతటా పేరుకుపోతుందో చేపేందుకు ఇదో నిదర్శనం.పైగా‘దీనికి మీదే బాధ్యత’అంటూ రెండు దేశాలు ఒకరినొకరు నిందుంచుకోవడం గమ నార్హం. (వీ6వెలుగు సౌజన్యంతో…)

1 2 3 11