పొగ మహామ్మారిని తరిమెద్దాం..!

సిగరెట్‌ తాగడం వల్ల 12 రకాల క్యాన్సర్‌లు వస్తాయని తేలింది. సరదాగానో, మిగిలిన వారిని చూసిన ఉత్సా హంలోనో పొగతాగడాన్ని అలవాటు చేసుకున్న వారు ఆ మత్తు నుండి బయటపడలేకపోతున్నారు. ఏం చేయాలన్నా ‘ఒకసారి పొగతాగాల్సిందే’ అన్నట్టు వారి వ్యవహార శైలి మారిపోతుంది. చాలామంది వైద్యులు పొగతాగేవారిని ప్రశ్నిస్తే- తాము చిన్నతనంలో పదేళ్ల ప్రాయంలోనే సరాదాగా స్నేహితులతో పందెం కాసి పొగతాగడం మొదలుపెట్టానని చెబుతుంటారు. కాని పొగతాగేవారి వల్ల వారికే కాదు, వారి చుట్టూ ఉన్న వారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. వ్యక్తులకు, ఆరోగ్యానికి, సమాజానికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నారు. ‘ పొగతా గడం మానేయండి, పొగాకు వదిలి వేయండి’ అనే నినాదం అంతా పాటిస్తే అంతా సుఖమయంగా జీవిస్తారు. పొగతాగడం ద్వారా ఎన్నో హాని కరమైన, విషతుల్యమైన వాయువుతో ఊపిరితిత్తులను ఉదయం నుండి రాత్రి దాకా నిర్వి రామంగా కాలు స్తూనే ఉంటే మన జీవితం వెలుగు తున్న కొవ్వొత్తి మారిది కరిగి వెలుగులేకుండా ఆరిపో వడం ఖాయం. పొగతాగడం మానాలి అంటే మీ నేర్పు, మీ మనో ధైర్యం, పోరాట శక్తి, పొగమానాలనే బలమైన కోరిక తో దానిని జయించాలి. హానికరమైన వ్యస నాన్ని కలిగించే పదార్థాలే క్యాన్సర్‌ కరకాలు అని గుర్తించాలని… గత 20 ఏళ్లగా పొగాకు నియంత్రణపై ప్రచార ఉద్యమం చేపడుతున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఓ డిప్యూటీ తాహశీల్దార్‌ ‘‘ మాచన రఘునందన్‌’’ మే 31న పోగాకు నియంత్రణ దినోత్సవం సందర్భంగా ‘థింసా’కి ఇచ్చిన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇదీ!
మేడ్చల్‌ జిల్లా కేశవరంకు చెందిన ‘‘మాచన’’.. రంగారెడ్డి జిల్లాలో ఆంగ్లభాషా పండితుడిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్నందుకున్న అభిమన్యు కుమారుడు. సాధారణంగా పండిత పుత్ర పరమశుంఠ అని నానుడి. కానీ..మాచన అందుకు భిన్నం. ఇప్పుడు తన కుటుంబం మొత్తం గర్వించదగ్గ రీతిలో తన ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూనే…పొగాకుపై ఉద్యమం చేస్తున్న పోరాటశీలి. అందుకే జాతీయస్థాయిలో పొగాకు నియంత్రణకు కృషి చేస్తున్న రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టుబాకో కంట్రోల్‌ రఘునందన్‌ని ‘‘టుబాకో కంట్రోల్‌ స్టాల్‌ వర్ట్‌’’గా గుర్తించింది. అమెరికాకు చెందిన హెల్త్‌ మ్యాగజీన్‌ పల్మనరీ మెడిసిన్‌ కూడా రఘునందన్‌ విజయగాధను వావ్‌..వెల్డన్‌. అని కొనియాడిరది. ఈమధ్యే రఘునందన్‌ విధి నిర్వహణలో కనబరుస్తున్న చొరవతో పాటే…ఆయన ఆశయాలు..వాటికై ‘‘మాచన’’ పోరాటం గురించి తెలుసుకున్న పలు వురు రఘునందన్‌ను అభినందించడంతో తన బాధ్యత మరింత పెరిగిందంటారు ‘‘మాచన’’. రఘునందనంటే ఓనిబద్ధత గల ఉద్యోగి…తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూనే…తమ హక్కులకై పాత పింఛన్‌ విధానంపై పోరాడే ప్రచార కార్యదర్శి…పొగాకును కూకటివేళ్లతో పెకిలించే చైతన్యం సమాజం నుంచే రావాలని పోరాడుతున్న ఉద్యమశీలి.. వీటన్నింటినీ మించి సామాన్యుల పాలిట సాటి మనిషిగా స్పందించే మానవీయకోణం..మొత్తంగా మన రాష్ట్రం వాడు..మనవాడు…నిత్యం అందరిలో ఒకడు.
పొగాకు పై ఇరవయ్యేళ్ల పోరాటం
సిగరెట్‌ తాగకు..పొగాకు మంచిది కాదు అని వైద్యులు చెప్పడం సాధారణం. అదే ఓ వైద్యే తర రంగానికి చెందిన వ్యక్తికి మాత్రం జీవితమే పొగాకు పై రణం. ఇది ఓనమ్మ లేనినిజం. మాచన రఘునందన్‌ది పౌర సరఫరాలశాఖలో ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ ఉద్యోగం. అందరు ఉద్యోగుల్లా డ్యూటీ అయిపోగానే ఇంటికి, లేదా కాలక్షేపం కోసం క్లబ్బుకు చేరే రకం కాదు మనం చెప్పుకుంటున్న మాచన రఘునందన్‌.తన జీవితంతో మారాలి ఎన్నో జీవితాలు అని పొగాకు నియంత్రణ పథంలో ప్రయాణిస్తూ..మేం సిగరెట్‌,బీడీ,తంబాకు మానేస్తాం అని ప్రమాణం చేయిస్తున్నారు. సమాజ సేవ ఎలా చేయాలో స్ఫూర్తినిస్తున్నారు. ఎందరి జీవితాలనొ పొగాకు నుంచి విముక్తి చేస్తున్న ఓ అసాధారణ ఉద్యమం తన జీవితం అని చెప్పకనే చెబుతున్నారు. రఘునందన్‌ నగరంలో నివసించే తన ద్విచక్ర వాహనంపై పర్యటిస్తారు. ఎక్కడ ఎవరు దమ్ము కొట్టినా.. ఒక్క క్షణం ఆగి కంఠంలో ప్రాణాన్ని పొగాకు కు బలి చేయొద్దు అని తన కంఠ శోషగా హితవు చెబుతున్నారు. ప్రజారోగ్యం కాంక్షించే వైద్యులకు, ఆసుపత్రులకు వరల్డ్‌ క్యాన్సర్‌ డే, నో స్మోకింగ్‌ డే, వరల్డ్‌ నో టబాకో డేలు ఓ అవగా హన కలిగించే సందర్భాలు మాత్రమే. నగరం లో నివసించే, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తాసిల్దార్‌ మాచన రఘునందన్‌ గత ఇరవై ఏళ్ల నుంచి పొగాకు నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు. ఆయన ఇలా తన వాహనం పై స్మోకింగ్‌ కిల్స్‌,క్విట్‌ టుబాకో ఆన్న సందేశం తో రాష్ట్ర వ్యాప్తంగా 5000 కిలో మీటర్లు ప్రయాణించి,500 గ్రామాల్లో వేలాది మంది ని పొగాకు, ధూమపానం మానేస్తాం అని ప్రతీణ చేయించారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. శుక్రవారం నాడు ఆయన నగరంలో పలు ప్రాంతాలలో ఇలా బైక్‌పై తిరుగుతూ పొగాకు కాన్సర్‌ కారకం అని అవగాహన కలిగించారు. ఎంతో నిస్వార్థ సేవ చేస్తున్నా..ఎటువంటి అవా ర్డులు ఆశించరు. పరిమాణం ముఖ్యం కాదు పరిణామం ప్రధానం అంటారు మాచన రఘునందన్‌.
సామాజిక ఉద్యమశీలి
వాస్తవానికి నా వృత్తి డిప్యూటీ తహశీల్దార్‌ హోదా ఉన్న వ్యక్తికి…ప్రవృత్తిగా సమాజం కోసం ఏదో సాధించాలన్న తపన..ఆ తపనకు తగ్గ కమిట్మెంట్‌ ఉండట మంటే కాస్తా అరుదే. అలా ..అని ఎవరూ ఉండరని కారు. అలాంటి వారిలో ఒకరే మనమిప్పుడు చెప్పుకునే రఘు నందన్‌ మాచన. పౌరసరఫరాలశాఖలో ఓ విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఎక్కడో ఓచోట నిత్యం దాడులు,తనిఖీలు నిర్వహించే క్రమంలో… ఎందరో అధికారుల్లాగే లంచాలకు మరిగి తానూ ఆర్థికంగా అందలమెక్కొచ్చు. కానీ అలా అయితే రఘునందన్‌ గురించి చెప్పుకోవడ మెందుకు..? తన సర్వీస్‌లో మాచన రఘు నందన్‌కు ఉద్యోగ బాధ్యతే కావచ్చు..కానీ అందులో మానవత్వం ఉంది. సమాజాన్ని మార్చాలన్న తపన కనిపిస్తుంది. అందుకే ఈ అరుదైన అధికారికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. పొగాకు నియంత్రణలో రఘు నందన్‌ డెడికేషన్‌ జర్మనీ దేశాన్నీ టచ్‌ చేసింది. ఇప్పుడు రఘునందన్‌ ను ఆ దేశ ప్రతినిధులు తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తున్నారు. సామా జిక మాధ్యమాల ద్వారా పుకార్లు, ఫార్వర్డ్లు, తమకు గిట్టనివారిని ఉతికారేసే ఇష్టారీతి ద్వేషపు రాతలురాసే వాళ్లేకనిపించే రోజుల్లో… పొగాకు నియంత్రణపై రఘునందన్‌ అదే సామాజిక మధ్యమాలనుపయోగించుకుని కల్పిస్తున్న అవగాహన అంతర్జాతీయ సమాజాన్నీ చేరుతోంది. వైద్యుడు కానప్పటికీ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌..తన కార్యక్రమా లకు రఘునందన్‌ ను ఆహ్వానిస్తోంది. అయితే ఇంతేనా.. మాచన అంటే…? పంజాబ్‌ ఛండీ గడ్‌లో జరిగిన పొగాకు నియంత్రణ అంతర్జా తీయ సదస్సులోనూ ‘‘మాచన’’నే భారత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ గౌరవ ప్రతినిధిగా పాల్గొనడమంటే దానివెనుక ఆయన అవిరళ కృషే కారణం. పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికీ, ఐశ్వర్యానికీ ముప్పు కలగక ముందే.. టుబాకో కు గుడ్‌ బై చెప్పే అవగా హన ప్రతి ఒక్కరిలో కల్గాలని ఆశిస్తున్న వ్యక్తి మాచన. మాచన రఘునందన్‌ సుమారుగా రెండు దశాబ్దాల కృషి. అయితే ఆఫలాలు ఇప్పుడు అందుతున్నాయి. ఆయన ఆశించిన మార్పు ఆయనెంచుకున్న లక్ష్యాల్లో కనిపిస్తోంది. ఆయన పేరూ హైదరాబాద్‌ జిల్లా దాటి..రాష్ట్ర వ్యాప్తమై.. దేశం గుర్తించి…అంతర్జాతీయ సమాజానికీ వినిపిస్తోంది. ఇలా రఘునందన్‌ అటు వృత్తిలోను ఇటూ ప్రవృత్తిలోనూ తనకంటూ ఓ ప్రత్యే’కథను’ సంతరించు కుంటున్నవారు.
ప్రతిభకు పట్టాభిషేకం
రఘునందన్‌ విద్యదశలో ఉన్న సమయంలో కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలపై తనదైన ప్రతిభను చాటుకున్నారు. ఉత్తమ జర్నిలిస్టుగా,సామాజిక కార్యకర్తగా తెలంగాణా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొందారు. ఈనేపధ్యంలోనే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ (2009)లో కేంద్ర ప్రజా సంబంధాల సమాచార బోర్డు కాష్టింగ్‌,మంత్రిత్వశాఖ ఏపీ తరుపున ఉత్తమ సామాజిక/పాత్రికేయడుగా ఎంపిక చేసింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 15మంది టీమ్‌ను దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన అరుణచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మేఘా లయ,త్రిపుర,మిజోరాం,వంటి రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ఆదివాసీ గిరిజన ఆచార వ్యవహారాలపై పరిశోధన చేశారు.ఆ బృం దంలో రఘునందన్‌ ప్రత్యేక గుర్తింపు పొం దాడం విశేషం. స్థానికంగా రఘునందన్‌ చేస్తున్న సామాజిక కృషిని రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా ఉన్నతాధికారులు సైతం తన ప్రతిభకు పట్టాభిషేకం కడుతూ ప్రశంసలు కురిపిస్తూన్నారు. రఘునందన్‌ చేస్తున్న ఈ జర్నీ మరింత ముందు కెళ్లాలని…మరెందరో అధికారులకు,సామాన్యులకు ఈయన స్ఫూర్తి ఓప్రేరణ కావాలనీ ఆశిద్దాం.! – గునపర్తి సైమన్‌