నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రణాలు నిలువెత్తు ప్రతిష్ట

మతానికి ప్రతీకారానికి మణిపూర్‌ రాష్ట్రం బలి యవుతుంటే ద్వేషంతో దేశ ప్రజలు విడిపో తున్నారు. ‘‘ఉపన్యాస విన్యాసాలతో దేశ ప్రజల శిరస్సులకు చేతబడి జరుగుతుంది’’ అంటూ జూకంటి జగన్నాథం అనే కవి పలికినట్లు.. మణిపూర్‌ ఘటనలు ఒక ఎత్తైతే దాని పర్యవసానాలు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలపై చూపుతున్న ప్రభావం మరింత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.
ప్రస్తుత ఈ పదేళ్ల కాల పరిపాలనలో చోటు చేసుకుంటున్న ప్రధాన మార్పు ఏమంటే జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకించిన వాళ్లపై దాడి జరుగుతుంది. వండి వార్చిన అభిప్రాయాలను ప్రజల ఆలోచనలపై నిండుకుండలా కుమ్మ రించి అంధ భక్తులను తయారు చేయడంలో నేటి మితవాద పాలకులు సఫలీ కృతం అవు తున్నారు. ఇద్దరు మహిళలను వివస్త్రులను చేసి అంగాంగ ప్రదర్శన చేయడమే కాకుండా వాటిని తమ వికృత చేష్టలతో తడుముతూ బహిరంగ మానభంగం చేసి హతమార్చిన సంఘటనను దేశం కళ్ళారా చూసింది. జరిగిన 72రోజుల తర్వాతగాని ఈ అంశం బాహ్య ప్రపంచం దృష్టికి రాలేదు.మే4వ తారీఖున సంఘటన జరిగితే మే18వతారీఖున భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా ఈ సంఘటన జూలై 19వ తారీఖున ఒక వీడియో ద్వారా ప్రజల ముందుకు వచ్చిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. జరిగిన అఘాయిత్యాలను, జరగని పోలీసుల చర్యలను ఖండిరచడం ఒక బాధ్యత.అలా సోషల్‌ మీడియాల ద్వారా ఖండిరచబడుతున్న వాటిని, అంధ భక్తులు ప్రతి ఖండిస్తూ విద్వేషాలతో ఊగిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు మరొక రాష్ట్రంలో జరగలేదా, మానభంగాలు మర్డర్లు మరెక్కడా జరగలేదా? అంటూ సమర్ధించుకుంటున్నారు. అబలలపై జరిగిన ఆకృత్యాలను సమర్థించుకు నేదా సంస్కారం అంటే? ఇది ఒక్కటే కాకుండా మహిళలకు జరిగిన అన్యాయాలపై తిరగబడిన ఒక యువకుడి తల నరికి ఇంటి ముందున్న తడికె కు వేలాడదీసిన ఫోటో జూలై 22వ తారీకు ఆంధ్రజ్యోతిలో దర్శనమిచ్చింది. వెంటనే భక్తులు రంగంలోకి దిగి ‘‘కాశ్మీరీ పండిట్లకు జరిగిన అన్యాయం సంగతి చెప్పండి’’ అంటున్నారు. జరుగుతున్న అన్యాయాలన్నింటికీ చారిత్రక తప్పిదాలే సమాధానాలా? భాజపా నాయకురాలు విజయశాంతి తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మిత సబర్వాల్‌ లాంటివాళ్ళు ట్విట్టర్‌ వేదికగా ఈ అంశాన్ని ఖండిస్తే వారిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇదేనా సంస్కారం అంటే? జగన్మాత, భారత మాత, కాళీమాత అంటూ ఏవేవో పేర్లు పెట్టి మహిళలకు గౌరవం ఇస్తున్నట్టుగా ఫోజులు కొట్టేవాళ్ళు మహిళలపై జరుగుతున్న దాడులను కనీసం ఖండిరచడానికి మొహం చాటేస్తున్నారు ఇది సిగ్గుచేటు కాదా? మతాలు మత ఛాంద సవాదులు ముఖ్యంగా రాజకీయాలను మతంతో ముడిపెట్టి, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయా లను నడిపిస్తున్న నేటి పాలకులు వారి అనుయా యులు మరియు వారి వార్తల మాధ్యమాలు ఎన్నడూ మహిళల గౌరవానికి ప్రాధాన్యతను ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే ఆధిపత్య భావజాలం లో అది అసాధ్యం.‘‘ఎత్తి చూపిన పాలిండ్లు కరుణ చూపని కఠిన శిలలయ్యే వరకూ, గగుర్పొడిచేలా గరళ బీజా లు నాటిన గర్భసంచుల్లో గన్నేరు కాయలు కాసే వరకూ, ఈ యాత్ర ఇలాగే కొనసాగుతోంది’’ అంటూ కవయిత్రి పాడిబండ్ల రజిని చెప్పిన ఆగ్రహ వాక్యాలు నిజమనిపిస్తున్నవి. ఇక తమ ఆగడాలను కప్పిపుచ్చుకోవడానికి దేశము, మతము అభద్రతలో ఉన్నాయనే ముసుగును కప్పుకుంటున్నారు. దేశంలోకి మయన్మార్‌ ప్రాంతం నుండి రోహింగ్యాలు చొరబడుతు న్నారు ఇది మయన్మార్‌ మరియు చైనా దేశాల కుట్ర అంటూ అసత్య ప్రచారాలతో ఊదరగొడు తున్నారు. పదేళ్ల నుంచి పాలిస్తున్న వారు, దేశ సరిహద్దులను తమ హద్దులలో పెట్టుకున్న వారు,ఈ మాట అంటుంటే నమ్మడానికి మన కున్న వివేకం ఏమైనాట్లు. ప్రతి సంఘటనను విదేశీ కుట్రతో ముడిపెట్టడం కుసంస్కారం కాదా? ఇక మణిపూర్లో హిందూ మతం అబద్రతలో పడిరదంటూ క్రైస్తవ మతం ఆధి పత్యం చాలాయిస్తుందంటూ మరో అసత్య వాదనకు నిస్సిగ్గుగా తెర తీస్తున్నారు. మైదాన ప్రాంతంలో నివసించే వారంతా మైతేయులని, వారంతా హిందువులని, అదేవిధంగా కొండ ప్రాంతాల్లో నివసించే వారంతా కుకీ జాతికి చెందిన గిరిజన క్రైస్తవులని తెలుస్తుంది. దేశం లో ఎక్కడైనా కొండ ప్రాంతంలో ఉన్న వారికి రిజర్వేషన్లు అమలులో ఉన్నవి. కొండ ప్రాంతం లో ఉన్న భూమిని ఇతరులు ఎవరు కొనకుండా 370అధికరణం కింద ఆంక్షలు ఉన్నవి. మరి ఈరోజు అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం మైదానంలో ఉండే మైతేయులకు ఎస్టీ హోదా కల్పించడంలో ఉన్న ఆంతర్యం ఏమంటే కొండ ప్రాంతాల్లో కూడా వాళ్ళు భూమిని కొనవచ్చు, సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఉద్దేశంలో సామాజిక అంశం ఉన్నదా,ఆర్థిక అంశం ఉన్నదా?కొండ లోయల్లో విరివిగా పండే నల్ల మందు వంటి వాణిజ్య పంటలను హస్తగతం చేసుకోవడం కోసమే కదా ఈ రకమైన రాజకీ య ఎత్తుగడ భాజపా ప్రభుత్వం వేసింది! పేదరికపు నిష్పత్తి గిరిజనులకు మించిన స్థాయిలో మిగతా సమూహాల్లో ఉన్నదా? అయినప్పటికిని భాజపా రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకంగా తన రాజకీయ నిర్ణయాన్ని ఏనాటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నది. ఇది చాలదా వారి అసలైన అంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి? ఈ అసలైన ఆర్థిక ఆధిపత్యపు అంశాన్ని పక్కనపెట్టి జాతుల మధ్య మతాల మధ్య జరుగుతున్న రచ్చ గా బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఇది తెలియని అంధ భక్తులు హిందూ మతం ప్రమాదంలో పడిరది, భవిష్యత్తులో ఇతర మతాలు ఆధిపత్యం చెలాయిస్తాయి, అనే న్యూనతాభావంతో అనవసర విద్వేషాలకు లోనవుతున్నారు.
మూడు నెలల నుంచి జరుగుతున్న ఈ సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించి భారతదేశ పరువును బజార్లో పెట్టాయి. భారతదేశంలో మతసహనం లేదని ఒక్క మణిపూర్‌ రాష్ట్రంలో 250చర్చిలకు పైగా కూల్చబడ్డాయని ఐక్యరాజ్యసమితిలో చర్చ జరిగింది. యూరోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్లో, ఇంగ్లాండ్‌లోని హౌస్‌ ఆఫ్‌ కామన్‌ సభలో ఇదే రకమైన చర్చ జరుగుతోంది. ఇలాంటి పర్యవసానాలు దేశానికి నష్టదాయకం కావా?అసలు పరిస్థితి ఇంత దాకా ఎందుకు వచ్చింది.‘‘ఏ స్టిచ్‌ ఇన్‌ టైం సేవ్స్‌ నైన్‌’’ అనే ఇంగ్లీషు సామెత అర్థం ఏమంటే సరైన సమయంలో స్పందిస్తే సమస్య పెరిగి పెద్దది కాదు అని. సరైన సమయంలో స్పందించక పోవడమే కాక రాష్ట్ర ప్రభుత్వం వహించిన అలసత్వం, రిజర్వేషన్లపై కోర్టు తీర్పును పునః సమీక్షించని విధానం, ఈ దుస్థితికి దారితీ సాయి. ఒక రాష్ట్రంలోని ఎన్నికల దృష్ట్యా వ్యవసాయ సంస్కరణల నల్ల చట్టాలపై వెనక్కి తగిన కేంద్రం మణిపూర్‌ అంశంలో అదే చొరవ చూపలేకపోయింది. మణిపూర్‌ ప్రజలపై నిప్పుల వర్షం కురుస్తుంటే కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పూలజల్లు కురిపించుకోవడానికి ఇష్టపడిన పెద్దలు దీనికి బాధ్యత వహించాలి. ఒక అమ్మాయిని దుశ్శాసనులంతా కలిసి నగ్నంగా ప్రదర్శిస్తున్న అంశాన్ని కళ్ళారా చూసిన తర్వాత గాని పెద్ద మనిషికి నోరు పెకల లేదు. తెరిచిన ఆనోటి తుంపరలు పక్క రాష్ట్రాల పై వెదజల్లెందుకు తాతహలాడాయి.ఈసందర్భం గా చరిత్రను ఒకసారి గమనించాలి.1946లో బెంగాల్‌ ప్రావిన్స్‌ లోని నొవాకలి ప్రాంతంలో జరిగిన మత ఘర్షణలు అత్యంత దారుణ మైనవి. ముస్లిం లీగ్‌ మరియు హిందూ మహాసభలు భారతదేశ వేరువేరు మత రాజ్యాలుగా ఉండాలని ప్రజల్లో నూరి పోయడంతో, క్షేత్రస్థాయిలో అవి మత ఘర్షణలకు దారితీసాయి. ముస్లింలు మెజారిటీగా ఉన్న ఆ ప్రాంతంలో అనేకమంది హిందువులను ప్రభుత్వ అండదండలతోనే ఊచకోత కోశారు. హిందువులు మైనారిటీలో ఉన్నప్పటికీ అనేకమంది హిందువులు భూస్వాములుగా చలామణి అవుతూ ఉండే వారు. కానీ హిందువులను ఏనాడు వారు రక్షించడానికి ప్రయత్నం చేయలేదు. అరకొరగా అందిన వార్తల ఆధారంగా మహాత్మా గాంధీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఎంక్వయిరీ చేయసాగారు. కానీ అప్పటి బెంగాల్‌ ప్రభుత్వం అసత్య సమాచారాన్ని ఇస్తూ అంతా సవ్యంగా ఉంది అనే సంకే తాలను పంపింది. ఒకానొక రోజు మహాత్మా గాంధీ ఆనాటి కాంగ్రెస్‌ అధ్యక్షులు జేబీ కృపలానిని బెంగాల్‌ సందర్శించడానికి ఆదేశించవలసి వచ్చింది. ఆయన తన సతీమణి సుచేత కృపలాని నీ వెంటబెట్టు కొని వెళ్లారు. అక్కడి దీన వ్యవస్థలోని ప్రజల ఆర్తనాదాలు అభ్యర్థనలు సుచేత కృపలాని నీ అక్కడే మరో ఆరు నెలలు ఉండేలా చేశాయి. పరిస్థితి సద్దుమణి వరకు సుచేత కృపలాని గారిని అక్కడే ఉంచి జేబీ కృపలాని ఢల్లీి వెళ్లారు. మనందరికీ తెలుసు దేశమంతా స్వాతంత్ర సంబరాల్లో మునిగి ఉంటే,మాత్మ గాంధీ బెంగాల్లోని మత కలహాలను తగ్గించేందుకు అక్కడికి వెళ్లి మకాం వేసి, ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయత్నించారని. ఇలాంటి చరిత్రకు వారసులుగా ఉన్న నేటి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా తమకు గర్వభంగము అవునేమో ననే చీకటి గౌర వాన్ని తలపై మోస్తూ దేశాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇది దేశ ప్రజలలో విపరీత వైశమ్యాలకు దారితీస్తున్నది.‘‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’’ అన్నట్లు పాలకులకే సమయమనం లేకుంటే సామాన్య ప్రజానీకానికి ఎందుకుంటుంది. అంచేత పంతాలు, పట్టింపుల కన్నా పరిష్కారానికి చొరవ చూపాల్సిన సమయం సందర్భం ఇది.-(జి.తిరుపతియ్య)

కుటిల రాజకీయాలతోనే మణిపూర్‌ మంటలు

బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుం టామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు. మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర వుందని ఆరోపిస్తారు. గతంలో జరిగిన మరికొన్ని అఘాయిత్యా లతో పోటీ పెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపిస్తారు, వ్యాసాలు రాయిస్తారు. జరిగిందాన్ని కప్పిపుచ్చడానికి, తీవ్రత తగ్గించడానికి సకల శక్తియుక్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన.
ఘనమైన మోడీ గారికి ఈ సమస్య పట్టించుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందోళన,ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమ కుట్టి నట్టు లేకపోయింది.మణిపూర్‌ నుంచి బిజెపి తర పున రెండు ప్రతినిధి బృందాలు,ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయనను కలుసుకోవడానికి ఢల్లీిలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తు లందుకుంటున్నారు.అమెరికా,ఫ్రాన్స్‌ వంటి దేశాల లోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెం టును వాయిదా వేయించారు ! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా ?
ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా మణిపూర్‌ దురంతం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కార్‌ వాషింగ్‌ వర్క్‌షాప్‌లో పని చేసుకుని బతికే ఇద్దరు ఆదివాసి యువతులను వివస్త్రలను చేసి వెంటాడి మానప్రాణాలు బలిగొంటున్న బీభత్స దృశ్యం జాతిని కలచివేసింది. ఘోరకలి జరిగాక రెండున్నర నెలలకు ఈ వీడియోలు బయిటకు వచ్చినా ఇంత ఆగ్రహావేదనలు ప్రజ్వరిల్లాయంటే జరిగింది ఎంత దారుణమో,వాస్తవ పరిస్థితి మరెం త ఘాతుకంగా వుందోననే సందేహం ప్రతివారిలో కలిగింది.దానికదే విషయం బహిర్గతమయ్యే వరకూ తెలియనట్టే ప్రవర్తిస్తున్న డబుల్‌ డబ్బా పాలకులకు ఘోర పరాభవం ఎదురైంది.మొన్ననే ఎన్‌డిఎ విస్త్రుత సమావేశంలో గజమాల వేయించుకుని సూక్తులు వినిపించిన విశ్వగురు ప్రధాని మోడీ బోనులో నిలబడాల్సి వచ్చింది. అయితే అలాంటి పరాభవాలు పట్టించుకునే ఘటం కాదు గనక పార్లమెంటు సమావేశాల సందర్భంగా చేసిన అని వార్య వ్యాఖ్యలలో ఆయన ఈ తప్పుకు దేశంలోని వంద కోట్లమంది ప్రజలదీ బాధ్యత అన్నట్టు మాట్లాడేశారు. దేశం, సమాజం సిగ్గుపడాలన్నారు. విశ్వగురుగా గజమాల వేయించుకోవడానికి నమో నమో కీర్తనలతో ఊరేగడానికి తాను, అమాను షానికి మాత్రం అందరిదీ బాధ్యత! ఇంతకన్నా విడ్డూరమైన,విపరీతమైన విషయం మరోటి వుం టుందా?కాని బిజెపి మోడీ పాలనల్ఱో అదే భారతీ య వాస్తవం.
చర్చకే దిక్కు లేదు, చర్య ఎక్కడ
మణిపూర్‌ లోనూ ఢల్లీి లోనూ పాలించేది అక్షరా లా వారు చెప్పే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌. ఆపైన ఈశాన్య రాష్ట్రాలకు బిజెపి తరపున బాధ్యుడూ, మంత్రిగా ఈ శాఖకు బాధ్యుడు కూడా తన కుడి భుజమైన హోంమంత్రి అమిత్‌షా నే. మణిపూర్‌ పాలకుడైన బీరేన్‌ సింగ్‌ సరేసరి. అయినాసరే దేశ ప్రజలు వంద కోట్ల మంది సిగ్గు పడాలిగాని ఈ ఇద్దరు ముగ్గురు మనుషులు ఈషణ్మాత్రం సిగ్గు పడినట్టు కనిపించరు. తమకు నచ్చని రాష్ట్రాలలో చీమ చిటుక్కుమంటే ట్వీట్లు పెట్టి ఫీట్లు చేసే సంఘ పరివార్‌ పెద్దలెవరూ స్పందించరు.నూతన పార్ల మెంటు భవనం ముందు ఈ ఘోర వార్తపై స్పం దిస్తూ మణిపూర్‌ పుత్రికలకు జరిగిన ఘోరం పట్ల ప్రతివారూ విచారిస్తున్నారని,కారకులెవరైనా వదలిపెట్టే ప్రసక్తి లేదని గంభీర ప్రకటన చేసిన ప్రధాని ఆ సభలోనే ఈ సమస్యపై చర్చకు హాజరు కారు.సమగ్ర చర్చకాకుండా స్వల్ప వ్యవధితో సరి పెడతామంటారు. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు.మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏగుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర వుందని ఆరోపి స్తారు. గతంలో జరిగిన మరికొన్ని అఘాయి త్యాలతో పోటీపెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపి స్తారు, వ్యాసాలు రాయిస్తారు.జరిగిందాన్ని కప్పి పుచ్చడానికి, తీవ్రత తగ్గించడానికి సకల శక్తియు క్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన. టెలిగ్రాఫ్‌ పత్రిక 79మొసళ్ల కార్టూన్‌ వేసి ఆ పైన మోడీ విచారాన్ని పెట్టింది. ఎందుకంటే నవ వర్ష నమో పాలన తర్వాత వీటికి తేలిగ్గా లోబడిపోయే స్థితిలో దేశ ప్రజలు లేరు.
కాషాయ వ్యూహాల కరాళ ఫలితమే
ఈశాన్య రాష్ట్రాలు కూడా తమ ప్రాబల్యంలోకి రావడం మోడీ మహత్తులలో ఒకటని చెప్పుకునే బిజెపి అందుకు అనుసరించిన ఎత్తులు, జిత్తుల పర్యవసానమే ఈశాన్య జ్వాలలు. గుర్తు చేసుకుంటే కొంతకాలం కిందట అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదం ప్రజ్వరిల్లడం ఎవరూ మర్చిపోలేదు. నిరంతరం తన మాటలతో వివా దాలు సృష్టించే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ విశ్వశర్మ పరిష్కారానికి ఏమీచేసింది లేదు ఎగ దోయడం తప్ప. తర్వాత మేఘాలయ తోనూ ఇదే తరహా ఘర్షణ చెలరేగి ఆరుగురు చనిపోయారు. ఇవి అస్సాం నుంచి విడదీయబడిన రాష్ట్రాలు కావడం గుర్తుంచుకోదగింది. ఎందుకంటే 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఈశా న్యాన మణిపూర్‌, త్రిపుర మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలుగా వుండేవి.1954లో అరుణాచల్‌ ప్రదేశ్‌,1963లో నాగాలాండ్‌,1969లో మేఘా లయ,1972లో మిజోరాం అస్సాం నుంచి విడదీసి ఏర్పాటు చేసినవే. మొదటి నుంచి వున్న మణిపూర్‌, త్రిపుర 1972లో పూర్తి రాష్ట్రాలయ్యాయి. ఈశాన్య ప్రాంతం నేరుగా బ్రిటిష్‌ వారి పాలనలో ఎన్నడూ లేదు.వారు కావాలనే చైనాకూ తమకూ మధ్య ఒక విడుపులాగా దాన్ని అట్టిపెట్టారు. అక్కడ అనేక జాతులు, ఉపజాతుల గిరిజనులు ఆదివాసులు జీవించేవారు. నాగా,కుకీ,మిసో తదితర తెగలు ఉపజాతులు అలాంటివే.గిరిజనులలో క్రైస్తవ మిషనరీల ప్రభావం కూడా ఎక్కువే. మణిపూర్‌ మైదానప్రాంతాలలో మైతేయిలు వుంటారు. కుకీలు మూలవాసులైనప్పటికీ రాజకీయ వ్యవస్థలో మైతే యిల ప్రాబల్యమే ఎక్కువ. ఈచిన్న రాష్ట్రంలో మొత్తం 36తెగలు, ఉపజాతుల వారు వుంటారంటే సమస్య అర్థమవుతుంది.మైతేయిలు ఇంఫాల్‌ లోయలో వుంటూ హిందూ మతాన్ని సనామహి అనే స్థానిక విశ్వాసాలను ఆచరిస్తారు. కుకీలు, నాగాలు అత్యధికంగా క్రైస్తవ మతానుయాయులు. ఈ తెగలు,ఉపజాతుల మధ్య స్వార్థ రాజకీయ శక్తులు పట్టించుకోని కేంద్రం కారణంగా నిరంతర ఘర్షణలు,తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి. అందులో నాగా,కుకీల తగాదాలు ప్రధానమైనవి. 2017లో బిజెపి అధికారంలోకి రావడంతో ఆరెస్సె స్‌ రంగంలోకిదిగి హిందూవిశ్వాసాలు గల మైతే యిలను క్రైస్తవాన్ని అనుసరించే కుకీలకు వ్యతిరేకంగా కూడగట్టింది.దాంతో ఇది మత వివాదంలా కూడా మారిపోయింది.
ఎఫ్‌ఐఆర్‌ తెలియదా ?
పొరుగునే వున్న మయన్మార్‌లో 2021లో సైనిక నియంతృత్వం అధికారం కైవశం చేసుకున్నాక దాడి తట్టుకోలేక వేలాది మంది చిన్‌ శరణార్థులు వచ్చి పడటంతో పరిస్థితి మరింత దిగజారింది. వీరు కూడా కుకీలే. మిజోరాం, మణిపూర్‌ల లోని కుకీలు వారిని ఆహ్వానించి ఆశ్రయమిచ్చారు. కాని మోడీ ప్రభుత్వం వారికి ఆశ్రయం నిరాకరించి అక్రమ చొరబాటుదారులుగా ప్రకటించింది. ఇదే సమ యంలో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం రిజర్వు అడవుల నుంచి కుకీలను భారీ ఎత్తున తొలగించడం మొద లెట్టింది. అడవులలో మాదక ద్రవ్యాల పంటలను నాశనం చేసేందుకు దాడి కూడా గిరిజనులను దూరం చేసింది. కుకీలు అక్రమ చొరబాటుదారులని ప్రచారంచేసే తీవ్రవాద మైతేయి వర్గాలకు ఆరెస్సెస్‌ వత్తాసునిచ్చింది.అస్సాం ముఖ్యమంత్రి శర్మ, బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఆప్రాంతంలో పని చేస్తున్న కాలంలోనే కుకీ తీవ్రవాద సంస్థ యుకెఎల్‌ఎఫ్‌ (యునైటెడ్‌ కుకీ లిబరేషన్‌ ఫ్రంట్‌)తో సంబంధం పెట్టుకుని నిధులు సమకూర్చినట్టు తర్వాత వెల్లడైంది. ఇందుకు ప్రతిగా వారు 2017 లోనూ 2019లోనూ బిజెపికి ఎన్నికల్లో మద్దతు నిచ్చారు.ఈవిషయం బయిటకు వచ్చాక ముఖ్య మంత్రి బీరేన్‌సింగ్‌కు మైతేయిలలో కూడా మద్దతు లేకుండా పోయింది. తమ సమస్యలకు మూల కారణంగా భావించిన ఆయనను కుకీలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వున్నారు. బిజెపి లోనే వున్న పది మంది కుకీ ఎంఎల్‌ఎలు ప్రత్యేక పాలనా విభాగం కావాలని ఆందోళన మొదలెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న కల్లోలం వెనక ఇంత లోతైన నేపథ్యముం దని గుర్తుంచుకోవాలి.పులి మీద పుట్రలా ఈ పరిస్థి తులలో మైతేయిలను కూడా గిరిజనులుగా పరిగ ణించాలని మార్చి 27న మణిపూర్‌ హైకోర్టు తీర్పు చెప్పడం,దానికి అభ్యంతరం లేదని బీరేన్‌ సింగ్‌ హడావుడిగాప్రకటించడంతో ఈ ఘర్షణలు పరాకా ష్టకు చేరాయి.ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు జోక్యం చేసుకోకపోగా కుటిల వ్యూహంతో మరింత రగలడానికి కారణమైనాయి.మే 4వ తేదీ మహిళలపై ఘోర కలి వీడియో జులై 20న బయిట కు వచ్చినప్పటికీ నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు ఈవిషయాలు తెలియవని కాదు. మే రెండవ వారంలోనే వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేయడం ఎఫ్‌ఐఆర్‌ నమోదు జరిగాయి. మే 29న అమిత్‌షా అక్కడ పర్యటించి వచ్చారు. ఇక ఘనమైన మోడీ గారికి ఈ సమస్య పట్టించుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందో ళన, ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమ కుట్టినట్టు లేకపోయింది. మణిపూర్‌ నుంచి బిజెపి తరపున రెండు ప్రతినిధి బృందాలు, ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయనను కలుసుకోవడానికి ఢల్లీిలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తులందుకుంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ వంటి దేశాలలోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెంటును వాయిదా వేయించారు! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా ?
జరగాల్సిందేమిటి ?
మాట్లాడితే వీర జవాన్లు, దేశభక్తి అంటూ ఊదరగొట్టే కేంద్ర పాలకులు కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికుని భార్యకు ఈ దుర్గతి పడితే స్పందించకపోవడాన్ని ఏమంటాం? మే 4 రాత్రి దుష్ట మూకలు వేల సంఖ్యలో ఆ గ్రామాన్ని చుట్టుముట్టి కుకీ కుటుంబాలను తరిమేయడమే గాక ఇద్దరు యువతుల బట్టలూడదీయించి మృగాల్లా హింసిస్తూ ఈడ్చుకు పోయారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్లను కాపాడేందుకు వెళ్లిన వారిని చంపేశారు. రక్తసిక్తమైన శరీరంతో ఆ అభాగ్యురాళ్లు ఇద్దరినీ తీసుకుని వారు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు చేరుకుంటే పరిధి సమస్య వచ్చింది. దాన్ని మరో స్టేషన్‌కు బదలాయించారు. ఇంత జరిగినా ఏ చర్య తీసుకున్నది లేదు, ఇంటర్‌నెట్‌ సెన్సార్‌ వుంది గనక బయిటకు రాలేదు. ఈ లోగా మహిళా కమిషన్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదు. వందల సంఖ్యలో ఇలాంటివి వస్తుంటే ఏదని చూస్తామన్నది వారి అహంకారపూరితమైన జవాబు. ఇంకా ఆ ముఖ్యమంత్రిని ముట్టుకోని కేంద్రాన్ని ఏమనాలి? ఈ విషయంలో ముందే జోక్యం చేసుకుని తీవ్రంగా ఖండిరచిన సిజెఐ డి.వై.చంద్రచూడ్‌ ప్రభుత్వం చర్య తీసుకోకుంటే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. అత్యు న్నత న్యాయమూర్తి స్పందనకూ ప్రభుత్వాధినేత స్పందనకూ తేడా కనిపిస్తూనే వుంది. వాస్తవానికి రాని స్పందనకోసం వ్యవధి ఇవ్వడం కంటే సుప్రీం కోర్టు వెంటనే రంగంలోకి దిగి చర్య తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తక్షణం గద్దె దిగాలి. ఇప్పటికీ బయిటకు రాని ఘోరాలు మరెన్ని వున్నాయో ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలి. బాధితుల రక్షణ కోసం తక్షణం కేంద్రం రంగంలోకి దిగాలి. (ప్రజా శక్తి సౌజన్యంతో..)

మానవత్వానికే మచ్చ..!

మణిపూర్‌లో మూడు నెలలుగా పాలన గాడి తప్పింది.శాంతిభద్రతలు దిగజారాయి. కేంద్రంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు మౌనం వహించి నీచరాజకీయాలు చేస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడి యోలు అసాంఘికశక్తుల అరాచకాలను స్పష్టంగా చూపుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు,పారామిలటరీ దళాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు.
మణిపూర్‌లో స్త్రీల మానాలకు, పురు షుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది.పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండా పోయింది. దురాగతాల వీడియోలు ప్రపంచానికి మణిపూర్‌ దీనస్థితిని ఎలుగెత్తి చాటుతున్నాయి.బీజేపీ పాలన లో తప్ప గతం లో ఎన్నడూ దేశ ప్రతిష్ఠ ఇంతగా దిగజారిపోలేదు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ డబు ల్‌ ఇంజిన్‌ సర్కారే మణిపూర్‌లో ఉన్నది.వారి పాల నలో ప్రభుత్వ అనుకూల మూకలు రెచ్చిపోతున్నాయి. రాక్షస ప్రవర్తనతో ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నాయి. గత రెండు నెలలుగా హింసా త్మక సంఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. గృహ దహనాలు కొనసాగుతున్నాయి. స్త్రీలు,పిల్లలు, వృద్ధు లు హాహాకారాలు చేస్తున్నారు. స్త్రీలపై అత్యాచా రాలు కొనసాగుతున్నాయి. తమను రక్షించమని, తమ ప్రాణాలను కాపాడమని దేవుడిని వేడుకుం టున్న వందలాది మంది క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.పోలీసుల కాల్పులలో 86 మందికిపైగా మరణించారు. ప్రార్థనా మందిరాలైన వందలాది చర్చిలను ధ్వంసం చేశారు. మణిపూర్‌లో మతం మత్తులో హింస హద్దులు దాటింది.మరో గుజరాత్‌ మారణ కాండను తలపించేలా మైనారిటీ గిరిజనులపై హింసాకాం డ కొనసాగుతున్నది. అల్లరి మూకలు గిరిజనులను లక్ష్యం గా చేసుకుంటున్నాయి. కర్ర లు, కత్తులు, ఆయుధాలతో దాడులు చేస్తున్నాయి. చేతికి చిక్కిన మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తు న్నాయి. ఇద్దరు మహిళలపట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారిని వివస్త్రలను చేసి, వీధులలో బహిరంగా ఊరేగించారు. ఆపై పొలాల్లోకి ఈడ్చు కళ్లారు. స్త్రీలపై సామూహిక లైంగికదాడులు జరుగుతున్నాయి.కాలేజీలో చదువుతున్న 21 ఏండ్ల అమ్మాయి కూడా బాధితుల్లో ఉన్నది. 19 ఏండ్ల ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి హింసించి చివరికి చంపేశారు. రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తించారు. మే4న జరిగిన ఈఅమానుష సంఘ టన వీడియో దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.ఒకవైపు అల్లర్లు, హింసాత్మక సంఘటన లతో మణిపూర్‌ మూడు నెలలుగా తగలబడు తుంటే,మరోవైపు బాధ్యతలేని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాలకు, విదేశీ పర్యటనలకు వెళ్లారు. దేశ,విదేశాల్లో బీజేపీ అనుకూల వర్గాలు ఆయనకు జేజేలు పలకడం అమానుషత్వానికి పరాకాష్ఠ. కనీసం బాధితులను ప్రధాని ఓదార్చలేదు. వారికి ధైర్యమైనా ఇవ్వలేదు.శాంతిభద్రతలపై సమీక్ష కూడా చేయలేదు. ప్రాణ భయంతో మణిపూర్‌ను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలుపోతున్న వారికి భరోసానైనా కల్పించలేదు. పోలీసులకు మార్గదర్శక త్వమైనా చేయలేదు. వెలుగులోకి వచ్చిన వీడియోల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటైన హెచ్చరికలు చేసింది. ఇకనైనా మోదీ ప్రభుత్వం కనీ సం స్పందిస్తుందా?ఈ దురాగతాలకు బాధ్యత వహిస్తుందా? లేదాఎప్పటి మాదిరిగానే దున్నపోతు మీదవర్షం పడినట్లు స్తబ్ధుగా,మౌనంగా ఉండి పోతుందా? వేచిచూడాలి. మణిపూర్‌లో జరిగిన, జరుగుతున్న అరాచకత్వంపై మానవతావాదులు, ప్రజాస్వామిక వాదులు స్పందించాలి. అసమర్థ బీజేపీ పాలనను ఎండగట్టాలి.దేశ,విదేశీ మీడి యా కండ్లు తెరువాలి.సోషల్‌ మీడియా ప్రజాపక్షం వహించి మణిపూర్‌ దురాగతాలను ఖండిరచాలి. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. మణిపూర్‌ సంఘటనలపై ప్రత్యక్ష పర్యవేక్షణలో సత్వర విచా రణ జరిపించాలి. కాలయాపన చేయకుండా దోషులపట్ల కఠినంగా వ్యవహరించాలి. న్యాయపర మైన శిక్ష విధించాలి.
స్త్రీల అస్తిత్వానికి పెను సవాల్‌ ` అనిశెట్టి రజిత
మాతృదేశానమాతృమూర్తులకు లబి óస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమ యంలో మతితప్పి ఉంటే బాగుండుననిపి స్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయ బడిన పాలనలో ఉన్నామా అనిపిస్తున్నది. మైనారిటీలు, ఆదివాసీలు,కొన్నితెగల,సమూహాల పౌరస త్వాలూ, అస్తిత్వాలూ ప్రశ్నార్థకమవుతున్నాయి. దేశంలో స్త్రీల అస్తిత్వాలకు పెనుసవాల్‌ ఎదురవుతున్నది. భారతీ య సమాజాన్ని వేధిస్తున్న వ్యవస్థను చూస్తే విస్మ యం కలుగుతున్నది. దేశంలో మతతత్వం, కుల తత్వం, ప్రాంతీయ దురహంకారం ఉన్మాదంతో చెలరేగిపోతున్నది. వారి అరాచకాలను సమర్థించు కోవడానికి,ఓటు బ్యాంకులను కొల్లగొట్టి అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికే ఈ రాజకీయ హత్యాకాండల న్నీ. అయినా దేశాన్ని, ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పే ప్రభుత్వానికి ఇవేం పట్టవు. మతం ఈరోజున దేశానికి ప్రధాన రాజకీయ వనరుగా మారింది. ఈర్ష్యాద్వేషాల ముసుగులను వేసుకొని నగ్నతాం డవం చేస్తున్నది. ఇదంతా చేస్తున్నది చేయిస్తున్నది మతవాదులే అని తేటతెల్లమైంది. మతమంటే మారణ హోమమా? మన భారతీయ సంస్కృతిని మనం ఎలా నిర్వచిం చుకుందాం? నాజ్ఞానానికి, అనుభవానికి తెలిసినంత వరకు మతం, ఆచారా లు, సంప్రదాయాలు,తంతులూ అన్నీ కూడా మన సంస్కృతిలో భాగం మాత్రమే. స్వార్థపర దుష్టశక్తులు తమ పగద్వేషాలూ, దుండ గాలు, దోపిడీల కోసం మతాన్ని సంస్కృతి నుంచి విడదీసి దాన్నొక ఆయు ధంగా వాడుకుంటున్నారు. సంఘ సమగ్రతను చిన్నాభిన్నం చేస్తూ రక్త క్రీడలను ప్రోత్సహిస్తు న్నారు. ఈ దేశాన్ని ‘భారతమాత’ అంటూ మోకరి ల్లుతూ ఆరాధిస్తున్నట్టుగా నటిస్తూ భరతమాతకు చెడ్డపేరు తెస్తున్నారు. ఒకభారత స్త్రీగా,పౌరురాలిగా,దేశ భక్తురాలిగా, సమతా సామ్యవాద శాంతి విలసిల్లే సమాజాన్ని ఆశిస్తున్నాను. కానీ నారీశక్తిగా నేను కలతల లోకంలో కల్లోలిత జీవితం గడపాల్సి వస్తున్నది. అమానుషత్వాల, అగౌరవానికి నిత్యం బలిపశువునై ఆక్రందనలు చేయాల్సి వస్తున్నది. అందుకే వెంటాడుతున్న మానవ మృగాల నీడలకు భీతిల్లి ప్రాణ,మాన రక్షణ కోసం పరితపించాల్సి వస్తున్నది. గాయపడిన దేహాలతో చిరిగిన పీలికల్ని చుట్టుకొని,అర్ధ నగ్నంగా పరిగెత్తుకుంటూ పోతున్న స్త్రీమూర్తుల వారసురాలిగా ఆందోళన చెందాల్సి వస్తున్నది.ఆడపిల్లగా పుట్టినందుకు లైంగిక దాడు లకు, ఆడజన్మనెత్తినందుకు అత్యాచారాలకు నన్ను వేదికగా చేసుకుంటున్నారు. గౌరవంతో, హుందా తనంతో జీవించే హక్కునూ, అర్హతను నిరాకరిస్తు న్నారు. ఇలాంటి వింత మృగాళ్ళ నడుమ ఉన్నందు కు నాలో విపరీత ఆలోచనలు కలుగుతున్నాయి. సిగ్గులేని మనుషుల నడుమ సిగ్గుతో తలవంచుకొని, నన్నూ నాదేహాన్ని లోలోపలికి కుచించుకొని బత కాల్సి వస్తున్నది. ఈ రోజున దేశానికీ ‘దేశమాత’కూ దిక్కు దిశ లేదు. రాజ్యాంగాన్ని చదువాల్సి వస్తుం దని,పాటించకుంటే ప్రశ్నిస్తారని ఏ చీకటి గుహల్లో నో సమాధి చేశారు. మానవీయ భావనలను మధ్య యుగాల్లోకి మళ్లించారు. ఆడవాళ్ల దేహాలపై నగ్న రాజకీయాల పచ్చబొట్లు పొడుస్తున్నారు.ఈ రోజున రాజకీయాలు సృష్టించిన‘మతం’తో జతగట్టి భారతమాత ప్రతినిధులైన స్త్రీల నగ్న దేహాలతో రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారు. తమ తమ మత ఉన్మాదాలకు రక్తసిక్త నగ్న చరిత్రలు రాసి వికృతత్వానికి పట్టం కడ్తున్నారు. మతం చిచ్చుకు తోడు ‘మర్దాంగీ’(మగతనం)లను మేల్కొల్పి స్త్రీలపై విరుచుకుపడి మృగ(మగ)తనాలను నిరూపించు కుంటున్నారు. నిజంగా వీళ్లు మతం అంటే ఏమిటో తెలిసినవాళ్లేనా? నిజంగా వీళ్లు భారతీయులేనా? దేశమన్నా, దేశభక్తియన్నా వీరికి అర్థం తెలుసా? నిజంగా వీళ్లు స్త్రీలను గౌరవించి పూజించే వ్యక్తు లేనా? స్త్రీలను ‘సతి’ చేసిగాని చల్లబడే మత రక్షకులే కదా, మూర్ఖ పాలకులే కదా. ‘భారత్‌ బచావో’ అన్న భావన నినాదమై ఈ రోజున దేశవ్యాప్తంగా అలజడిగా మారింది.పౌరసమాజం పాలకుల నేరా లపట్ల అట్టడుగు నుంచి ఉడికిపోతున్నది. భరత మాత కన్నీటి గంగలు ప్రవాహాలుగా ప్రళ యాలు సృష్టిస్తున్నవి.భేటీ బచావో, బడావో, పడావో మాట లు చిలుం పట్టి తుక్కులా రాలి పోతున్నవి.
అయ్యా! దేశ ఏలికల్లారా! పాలకుల్లారా! అధికార పీఠాలను అధిష్ఠించిన రాజకీయ, మత నేతల్లారా! మానవత్వం కన్నా ‘మహోన్నత మతం’ ఏదో,ఎక్కడుందో సెలవిస్తారా?మానవ సేవకన్నా మాధవ సేవంటూ ఉందా!దేశప్రజల క్షేమం, రక్షణ, వారికిచ్చే భరోసా, నమ్మకాలను మించిన సంక్షేమ శాంతి పరిపాలన ఇంకేమైన ఉన్నదా? లౌకికశక్తుల నిర్భంధం,అరాచకశక్తుల విశృంఖలత్వమే మీ సైద్ధాంతిక విధానమా? దాన్ని అరాచక అత్యాచా రాల పునాదులపై లేచిన కబేళాలతో నింపాలను కుంటున్నారా? అందుకు ఈ (మా) దేశపు స్త్రీలమైన మా దేహాలే మీకు వేదికలా? మా శవాలపైనే మీ సింహాసనాలా? అయ్యా అన్నీ కన్నీటి ప్రశ్నలే%ౌౌ% అంతా సంక్షుభిత పరిస్థితులే! అంతటా రక్తపు తడిలో తడిచి రెపరెపలాడున్న నెత్తుటి పతాకాలే! మీ దేశభక్తికీ మత ధర్మ ఉద్ధరణలకు ఒక నిరసన దండం! (వ్యాసకర్త : ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక జాతీయ అధ్యక్షురాలు)-(డాక్టర్‌ కోలాహలం రామ్‌కిశోర్‌)

ఎకో టూరిజంపై సమత శిక్షణ తరగతులు

స్థానిక వనరులపై స్థానికులకే హక్కు కలిగి ఉండాలనే లక్ష్యంతో సమత గిరిజన యువతకు ఏకోటూరిజంపై జూన్‌ 19నుంచి 26వ తేదీ వరకు ఆరురోజుల పాటు గిరిజన యువతకు శిక్షణ తరగతులు నిర్వహించారు.‘‘స్థానిక వనరులపై స్థానిక ఆదివాసులకే హక్కు ఉంది’’అనే అంశంపై శిక్షణ కార్యక్రమం జరిగింది.విశాఖ ఉమ్మడి జిల్లా ఐదువ షెడ్యూల్‌ ప్రాంతానికి చెందిన కటికి, కొల్లా పుట్‌,సరియా,సరుగుడు ఆదివాసీ ప్రాంత జలపా తాల వద్ద జరిగిన శిక్షణకార్యక్రమంలో సుమారు 30మంది యువతీ,యువకులు పాల్గొన్నారు. ఈ యువకులంతా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న స్థానికంగాఉన్న వనరుల సద్విని యోగంపై అడిగి తెలుసుకున్నారు. అనంతిగిరి మండలం బొర్రా పంచా యితీ కటిక జలపాతం వద్ద నుంచి శిక్షణ కార్యక్ర మం ప్రారంభమైంది. కార్యక్రమాన్ని బొర్రాపంచా యితీ సర్పంచ్‌ జన్నిఅప్పారావు ప్రారంభించారు. సర్పంచ్‌ మాట్లాడుతూ కటికి వాటర్‌ ఫాల్స్‌ చరిత్ర ను వివరించారు.తర్వాత గ్రామపెద్ద గెమ్మెల దేవ కుమార్‌ మాట్లాడుతూ ఈ జలపాతాలు ద్వారా స్థానిక యువ కులు పొందుతున్న స్వయం ఉపాధి గురించి వివరించారు.వాటర్‌ ఫాల్స్‌ నిర్వహణ కమిటీ తరుపున గెమ్మెల రమేష్‌ మాట్లాడుతూ దీనివల్ల సుమారు 30మంది ఆదివాసీ కుటుంబాలు స్వయం ఉపాధిని పొందుతున్నట్టు చెప్పారు.ఆనాడు సమత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవిరెబ్బాప్రగడ ఆద్వ ర్యంలో ఆనాటి ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌ శివశంకర్‌ ఏర్పాటు చేసిన కటికి వాటర్‌ ఫాల్స్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ నేడు మా ఆకలి తీర్చుతోందని వివరించారు. రెండోవరోజు కటికి,సరియా,సరుగుడు వాటర్‌ పల్స్‌ టీంలు కాటికి వాటర్‌పల్స్‌ పరిసర ప్రాంతాల్లో స్వచ్‌ భారత్‌ నిర్వహించారు.అక్కడ నుంచి మూడవ రోజు కొల్లాపుట్‌ ఎకో రిసార్టుస్‌కు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన శిక్షణలోఐ.టి.డి.ఏ.నుంచి ఎకో టూరిజం కో-ఆర్డినేటర్‌ గణపతి నాయుడు రిసోర్స్‌ పెర్సన్‌గా హజరయ్యారు. ఆయన ఎకో టూరిజం ప్రాముఖ్య తను వివరించారు.ఎకో టూరిజం అంటే ప్రకృతిని పాడు చేయకుండా చేసే కార్యక్రమని అన్నారు. దీనిద్వారా స్థానిక యువకులకు స్వయం ఉపాధి లభిస్తోందని,నీరు కలుషితం కాకుండా చెత్త చెదరాలను లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే దీని లక్ష్యమన్నారు. పర్యా వరణాన్ని పరిరక్షించుకోవడానికి స్థానికులను చైతన్య వంతులను చేయాలని కోరారు.చెట్లను నరక కుండా అందంగా తీర్చిదిద్దాలి.ఎకోటూరిజంద్వారా ప్రకృతి సహసిద్దమైన కూరగాయలు,అటవీ ఉత్పు త్తులు లభిస్తాయని వాటి ద్వారా కూడా జీవనో పాధిని పెంపొదించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రీనరీ ని పెంచడం ద్వారా టూరిస్టులు ఆకర్షితులు అవు తారని, వాటర్‌ పల్స్‌ దగ్గర ప్లాస్టిక్‌ కనిపించే కుండా టీం వర్కు చేయాలని పిలపు నిచ్చారు. అలాగే ఎత్తు పల్లాలుగా ఉన్న భూమిని అలాగే ఉంచి మనం క్రియేటివిటీగా ఆలోచించి అందంగా తీర్చి దిద్దినట్లుయితే అప్పుడు పర్యాటకులు ఇష్టపడ తారని సూచించారు.మొదట స్థానికంగా మనం ప్లాస్టిక్‌ని వాడకం తగ్గించాలని,తరువాత టూరిస్టు లకు చెప్పాలని సూచించారు. స్థానికంగా అటవీ ప్రాంతాల్లో లభించే ఆకులు,వెదురును వస్తువులుగా తయారు చేసి వినియోగించుకొని స్వయం ఉపాధి పొందవచ్చన్నారు.మట్టి కుండల్లో మంచినీటిని నింపి డోకులతో పర్యాటకులకు ఇవ్వడం అలవాటు చేయాలి.ఆదివాసీ సాంప్రదాయాలను,ఆచారా లను,మనం టూరిస్టులకు చూపించాలి.ఈ విధంగా ఉంటే మన ఆదాయం పెరుగుతుంది అని వివరిం చారు.చాపరాయి వాటర్ఫాల్స్‌ టూరిజం మేనేజర్‌ అప్పారావు కూడా పలు సూచనలు చేశారు.ఎకో టూరిజం-ఎకోఫ్రెండ్లీగా ఉండాలి. ఎకో టూరిజం మన ఆదివాసీప్రాంతాల్లో చాలాచక్కగా చేయవచ్చు న్నారు.నేచర్‌ ఎస్‌ టీచర్‌ ట్రైబ్‌ ఎస్‌ గైడ్‌ టీం వర్క్‌కి సొసైటీ కీ చాలా సంబంధం ఉంటుంది, మొదట టీం వర్క్‌ బలపడితే,దాని సొసైటీగా రిజిస్టర్‌ చేయ వచ్చు,ఈ సొసైటీలో ప్రెసిడెంటు, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ,జాయింట్‌ సెక్రెటరీ, కోశాధికారి మరియు మెంబెర్స్‌ ఉంటారు. దీనికి ఒక బై లా ఉంటుంది. దాని ప్రకారం సొసైటీ ని నడపాలని సూచించారు. ముఖ్యంగా రికార్డ్స్‌ రాయాలి,ప్రతి సంవత్సరం అడిట్‌ చేయించాలి, టూరిజంలో ఎకోటూరిజం, అగ్రికల్చరల్‌ టూరిజం,హోమ్‌ స్టే టూరిజం ఇలా 75 రకాలు ఉన్నాయి. ఆతర్వాత 2016లో కొల్లా పుట్‌ రిసార్ట్‌ పేరుతో నిర్మించిన 8కాటేజీలద్వారా స్థానిక యువతీ, యువ కులు పొందుతున్న స్వయం ఉపాధిపై వివరిం చారు.అక్కడ నుంచి కొత్తపల్లి జలపాతంను సందర్శించారు.ఇక్కడ నవీన్‌ మేనేజర్‌ మాట్లాడుతూ ఇక్కడ 12మంది యువకులు పని చేస్తున్నారు వీరు అంతా ఆదివాసీ తెగ(పీటీజీ) గ్రూప్‌కు చెందిన గిరిజనులని వారు ఇక్కడ స్వయం ఉపాది పొందు తున్నట్టు తెలిపారు.అక్కడ నుంచి చింతపల్లి మండలం,పెదబారడా పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చేరుకున్నారు.ఇక్కడ చింతపల్లి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు ఆధ్వర్యంలో చింతపల్లి అటవీశాఖ సబ్‌ డివిజినల్‌ అధికారి బెర్లాండ్‌రాజు,రేంజ్‌ అధికారిణి చిట్టితల్లి,సెక్షన్‌ ఆఫీసర్‌అప్పారావు బీట్‌ఆఫీసర్‌ వెంకటరావు గార్డులతో కలసి అవగాహన సదస్సు నిర్వహిం చారు.అటవీశాఖ అధికారులకు సమత కోఆర్డినేటర్‌ సతీష్‌ కుమార్‌ సమత నిర్వహిస్తున్న ఏకో టూరిజం శిక్షణపై వారికి వివరించారు. గత మూడు రోజుల నుండి కాటికి జలపాతం, కొల్లాపుట్‌ ఎకో టూరి జం,లంబసింగి టీం అందరు సందర్శించడం, అక్కడ వారు చేస్తున్న పని, ఎకో టూరిజం ద్వారా ఎలా జీవనోపాధి పొందుతు న్నారు, వంటి అంశాలు శిక్షణలో నేర్చుకోవడం జరిగిందన్నారు.షబ్‌ డివిజినల్‌ అధికారి మాట్లా డుతూ కృష్ణాపురం గ్రామం దగ్గరలో ఎకో టూరి జం,మీఅందరి సహకారంతో మొదలు పెడతాం. ఈటూరిజంలో మీ గ్రామస్తులు పని చేసుకొని ఉపాధి పొందడం మన ముఖ్య ఉద్దేశ్యమని వివరిం చారు. దీనికి అందరు సహకరించాలని ఆదివాసీల సహకారం లేకపోతేె ఈ ప్రాజెక్టుని తాము ముందుకు తీసుకెళ్లలేమని సూచించారు.అక్కడ నుంచి నాత వరం మండలం సరుగుడు పంచాయితీ సుందర కోటవాటర్‌ ఫాల్స్‌ సందర్శించారు. ఇక్కడకు కూడా చాలా మంది టూరిస్టులు రావడం జరుగుతుంది. ఇక్కడ గవర్న మెంటు కొంత సుందరంగా తయారు చేశారు ఫారెస్టు డిపార్టుమెంట్‌ కొంత పెన్సింగ్‌ కట్టడం సరుగుడు వాటర్‌ పల్స్‌ అనిబోర్డు పెట్టడం జరిగింది. ఇక్కడ టికెట్‌ కలెక్షన్‌ లాంటివి చేయడం లేదని స్థానికులు తెలియజేశారు.
ఈ శిక్షణ నాకు ఎంతో ఆలోచన ఇచ్చింది..!
మాది సరుగుడు గ్రామం నేను బి.టెక్‌ చదివాను. ఈఐదురోజులు చాలా ప్రాంతాలు సందర్శించడం వల్ల నాకు ఎంతో ఆలోచన వచ్చింది.సరుగుడు వాటర్‌ ఫాల్స్‌వద్ద టోల్‌గేట్‌ ఏర్పా టుచేసి ఇక్కడ నిరుద్యోగ గిరిజన యువకులం స్వ యం ఉపాధి పొందుతాం.అందుకు సమత సహకా రం అవసరం.
చిన్నా.సరుగుడు ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన మాది కాటికి గ్రామం. మేము దాదాపు 15 సంవ త్సరంల నుండి కాటికి వాటర్‌ఫాల్స్‌ని నిర్వహి స్తున్నాము. ఇందులో దాదాపు 20మందికి ఉపాధి దొరుకుతుంది. కొల్లాపుట్‌ రిసార్ట్‌ ద్వారావారు ఉపాధి ఎలాదొరుకుకుతుంది నేర్చు కున్నాము.అలానే ఫారెస్టు డిపార్టుమెంటు ద్వారా కూడా ఎకో టూరిజం పెట్టవచ్చు అనేది ఆలోచన వచ్చింది. తమాల మోహన్‌,కటిక గ్రామం.
ఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా నేర్చుకున్నా..
మాది బొర్రా గ్రామం. ఈఎక్సపోసర్‌ విజిట్‌లో చాలా అవసమైన విషయాలు నేర్చుకున్నాము. ఒక ప్రొడక్టుని వేల్యూ ఎడిషన్‌ చేస్తేదాని డిమేండ్‌ ఎలా ఉంటాది అనేది అర్ధమైంది. అలానే ఏదైనా ఒక ప్రాజెక్టు లో టీంవర్క్‌పాత్ర దాని ప్రాముఖ్యత ఎలా ఉంటాది తెలు సుకున్నాం.మనకు ఉన్న వనరులపై హక్కు మనకే ఉంది అనేది అర్ధం అయ్యింది. అలానే స్థానికంగా దొరికే వెదురుతో తయారు చేసిన వస్తువులకు రంగులు పూసి వాల్యూ ఎడిషన్‌ చేస్తే ఆదివాసీ వ్యాపారులకు ఇంకా మెరు గ్గా డబ్బులు వస్తాయి. ముఖ్యంగా మనం టూరిస్టు లకు ఏదీ ఫ్రీగా ఇవ్వ కూడదు అనేది ఈ విజిట్‌ ద్వారా అర్ధం అయ్యింది.
`వంతుల మేరీ,బొర్రా
మహేష్‌ జర్ర: మాది సిరియా వాటర్‌ పల్స్‌, మేము ఒక్క టిక్కెటు కలెక్షన్‌ చేస్తూ 10 మంది ఉపాధి పొందుతున్నాము . మొదటిలో స్థానిక పంచాయతీ నుండి చాలా వత్తిడి వచ్చింది. వాటర్‌ పల్స్‌ పంచాయితీది అని చాలా ఇబ్బంది పెట్టారు. మేము అన్ని తట్టుకొని చేస్తున్నాము సమతా సతీష్‌ గారి ద్వారా కటికి వారు నిర్వహిస్తున్న వాటర్‌ పల్స్‌ ని సందర్శించడం జరిగింది, అలా నే వారిని చూసి మాకు కూడా కొంత దైర్యం వచ్చింది. సర్యా వాటర్‌ పల్స్‌ అనేదిచాలా ప్రమాద కరమైన ప్రదే శం,కాబట్టి మేము చాలా జాగ్రత్త పని చేయా లి, ముఖ్యంగా టూరిస్టులు విశాఖపట్నం నుండి వస్తారు.ఈ విసిట్‌ వలన మాకు కొత్త ఆలోచనలు వచ్చాయి,ఆదివాసీ సాంప్రదాయ పద్ధతులు టూరి స్టులకు చూపిస్తే వారు ఆకర్షితులు అవుతారు. మేము కూడా ఎకోటూరిజం ప్రాజెక్టు నాకు ఆలో చన చేస్తాము.-(కె.సతీష్‌ కుమార్‌)

పోలవరం పోరు కేక

పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే ఆంధ్ర ప్రదేశ్‌ సస్యశ్యామలంగా ఉంటూ పంటలు సుభిక్షంగా పండు తాయని ఉద్దేశంతో వేల ఎకరాల భూ ములు గ్రామాలు ఖాళీ చేసి కట్టుబట్టలతో బయటికి వెళ్లిన అభాగ్యులు కన్నెర చేశారు.పోలవరం నిర్వాసితుల సమస్యలను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలను నెరవేర్చ కుండా,సరైన పునరావాసం కల్పించకుండా కాలం గుడపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే విధంగా పోరు కేకతో నిర్వాసితులు మమా పాద యాత్రకు కదం తొక్కారు. జూన్‌ 20 అల్లూరి జిల్లా నెల్లిపాక నుంచి ప్రారంభమైన మహా పాదయాత్ర జూలై 4న విజయ వాడలో ముగిసింది.
జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసిన బాధ్యత మొదట తమదేనన్న కేంద్రప్రభ/త్వం నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీ విషయంలో ఎందుకు నిర్వక్ష్యం వహి స్తుందని నిలదీశారు. ప్రాజెక్టు నిర్మాణాలను అంగ రంగ వైభంగా చూపిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల వేదనలను ఎందుకు ప్రజలకు వివరించడం లేదని ప్రశ్నించారు. పునరావాసం పూర్తయ్యాకే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ మూరు మూరులో పాదయాత్ర కొనసాగుతుంది. కళ్లుండి చూడ లేని,చెవులుండీ వినలేని గుడ్డి,చెవిటి ప్రభు త్వాల్ని మనం ఎన్నుకున్నామని నిర్వాసితులు విమర్శి స్తున్నారు. వరదలోస్తే మురమూరు గ్రామాలు నీటి మునిగే ప్రమాదముందని,41కాంటూరులో కలపా లని కోరుతూ అధికారిక మెమోరాండం సమర్పిం చినట్లు నిర్వాసితుల తరుపున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు ప్రకటించారు. మురు మూరులో మొత్తం 356 కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.పాదయాత్రకు వైసీపీ కాచవరం నాయ కులు సంఫీు భావం పలికారు.అనంతరం పల్లూరు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు.
నిర్వాసితుల డిమాండ్లు ఇవే
పోలవరం నిర్వాసితులకు పునరావాసంతోపాటు పూర్తి పరిహారం చెల్లించాకే గ్రామాలను ఖాళీ చేయించాలని మహా పాదయాత్ర డిమాండ్‌ చేస్తోంది. పునరావాసం పూర్తయ్యే వరకు ముంపు గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని,1986,2022నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాలు రీ సర్వే చేయాలని,మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పునరవాసం పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని కోరింది.పునరావాసం ఏకకాలంలో అన్ని గ్రామా ల్లో పూర్తి చేయాలని,ప్రతి ఎకరానికి రూ.20లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. గ్రామాలు ఖాళీ చేయించే నాటికి18ఏళ్లు నిండిన వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ పరిహారం ఇవ్వాలని,నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని కోరింది.
ఇలా సాగిన పాదయాత్ర
అల్లూరి సీతారామారాజు జిల్లా నెల్లిపాక నుంచి నిర్వాసితుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో 400కిలోమీటర్ల మేర 15రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది. జూలై నాలుగో తేదీన విజయవాడలో మహా ధర్నాతో పాదయాత్ర ముగిసింది. పాదయాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు,కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం,వీ.వెంకటేశ్వర్లు పాల్గొ న్నారు.
పోలవరం పునరావాసం కోసం…
పోలవరం ప్రాజెక్టు చాలా సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రధాన ఎజెండాగా వుంది. ఇదిబహుళార్థక సాధక ప్రాజెక్టు అని సాగు నీరు,తాగునీరు,విద్యుత్‌ ఉత్పత్తికి తద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ప్రచారం చేశారు. ప్రాజెక్టుని మాహయాంలో పూర్తిచేస్తా మంటే మాహ యాంలో ప్రారంభిస్తామని గొప్పలకు పోయి మరీ మాట్లాడడం మనంచూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాలు,ప్రధాన ప్రతిపక్షాలు చెప్పింది చెబు తున్నది….ప్రాజెక్టు ఎత్తు, పొడవు,వాలు,డ్యామ్‌ నిధులు…వీటి గురించే. కానీ నేడు చర్చించాల్సింది సర్వం త్యాగంచేసిన నిర్వాసితుల గురించి. పోల వరం నిర్వాసితులకు న్యాయం చేయా లని సి.పి.యం ఆధ్వర్యంలో జూన్‌ 20వ తేదీ నుండి జులై 4వరకు చేపట్టిన‘మహా పాద యాత్ర’ గ్రామాల సరిహద్దులు దాటుకుంటూ చైతన్య పరుస్తూ జూలై 4న విజయవాడకు చేరికొని మహా సభతో ముగి సింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8 మండలాలు, 222 పంచాయతీలు, 373గ్రామాలు,1,06, 000 కుటుంబాలు నీట మునుగుతాయి. లక్షల జనాభా నీట మునిగి ఆస్తులు,సంపద పోగొట్టుకుంటున్నా వీరి సంక్షేమాన్ని, పునరావాసాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అత్యంత విషాదం.2018 డి.పి.ఆర్‌. ప్రకారం ప్రాజెక్టుఖర్చు రూ.55.656 కోట్లు. ఇందులో పునరావాసం కోసం ఖర్చు చేయాల్సింది రూ.33,000కోట్లు కానీ ఖర్చుచేసింది రూ. 7000 కోట్లు మాత్రమే. ఎక్కువ శాతం నిర్మాణానికే ఖర్చు చేస్తున్నారు.మరి నిర్వాసితుల సంగతేంటి? సర్వస్వం త్యాగం చేసిన గిరిజనులు,అడవి బిడ్డల పరిస్థితి ఏంటి?అందుకే పునరావాసం పూర్తయిన తరువాతే ప్రాజెక్టు కట్టాలి.పోలవరం ప్రాజెక్టు ద్వారా చాలా ప్రయోజనాలు చేకూరతాయనేది ఎంత వాస్తవమో నిర్వాసితులు నష్టపోతారన్నది అంతే నిజం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 25 రకాల మౌలిక వసతులు కల్పించాలి. కానీ అవెక్కడా నిర్వాసితుల కాలనీల్లో కనిపించవు.ఏనిర్వాసిత కాలనీలో కూడా శ్మశానవాటికలు కనిపించవు.బుట్టాయిగూడెం, జీలు గుమిల్లి,జంగారెడ్డిగూడెంనిర్వాసిత కాలనీల్లో అధ్వా న పరిస్థితులున్నాయి.ఇళ్ళ శ్లాబులు వర్షం వస్తే కారిపోతున్నాయి.నిర్మాణ సంస్థలు కాసుల కక్కుర్తితో నాణ్యత లేకుండా నిర్మించాయి. విద్య, వైద్యం సదుపాయాలు లేవు. గడప గడపకు వైసిపి పేరుతో గత కొంత కాలంగా హడావుడి చేస్తున్నారు. కానీ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నిర్వాసిత కాలనీల్లో అడుగు పెట్టడం లేదు. ఈ గడపలకు ఎందుకు రావడం లేదు. నిర్వాసితులు నిలదీస్తారని భయమా ?
ప్రతి సంవత్సరం వరద వస్తుంది. 2022 జులైనెలలో వచ్చిన వరద వేరు. ఇది పాలకుల నిర్లక్ష్యం కారణంగా వచ్చిన వరద. కాం టూరు లెక్కలన్నీ తప్పని ఈ వరదలతో తేలిపో యింది. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా వరద ప్రాంతాలను ముంపు ప్రాంతాల జాబితా లోకి చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. వరదలో పశువులు కొట్టుకుపోయాయి.పంటపొలాలు మునిగిపోయాయి.33రోజులు ఎందరో ఇళ్ళు నానిపోయి పడిపోయాయి. విలువైన వస్తువులు పాడైపోయాయి. ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం నుండి అందిన సహాయం రూ.2 వేలు మాత్రమే. ఇళ్ళు కూలిపోయినవారికి రూ.10వేలు అందిం చారు. అదికూడా అరకొరగానే అందించారు. అందులోను రేకులషెడ్డుకి ఇవ్వలేదు.ముంపు గ్రా మాల ప్రజలకష్టాలు ఇలాఉంటే ఊళ్లు ఖాళీ చేసి వచ్చిన నిర్వాసితకాలనీలో బతుకుతున్న గిరిజనుల పరిస్థితి ఘోరంగా తయా రైంది.వారు నిర్వాసిత కాలనీలకు వచ్చి2సంవత్సరాలైంది.రావాల్సిన ప్యాకే జీ డబ్బులు ఇంకారాలేదు.కనీస సౌకర్యాలు కల్పిం చడం లేదు.‘చూస్తాం ప్రభుత్వం ప్యాకేజీ డబ్బులు ఇవ్వకుంటే మరలా తిరిగి మా గ్రామాలకు వెళ్ళి పోతాం.పరిహారం ఇస్తుందో,మమ్మల్ని గోదారిలో ముంచేస్తుందో ప్రభుత్వమే తేల్చుకుంటుంద’ని ఆవేదన చెందుతున్నారు.సాధారణంగా తుఫాన్లు సముద్రాల్లో పుడతాయి.కానీ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల ఇదే వైఖరి కొనసాగిస్తే, వదిలేస్తే, ఉదాసీనత ఇలాగే కొనసాగితే తుఫాన్‌ పుట్టేది సముద్రంలో కాదు. గోదారినదిలో.ఆ తుఫాన్‌పేరు నిర్వాసితుల ఉద్య మం.ఈ తుఫాన్‌ ప్రజల్ని ఐక్యం చేసి పాలకులను వణికించి అమరావతి దగ్గర తీరం దాటుతుంది జాగ్రత్త. ఇది హెచ్చరిక కాదు. వాస్తవం. గిరిజనులే కదా అణచివేద్దాం, తొక్కేద్దాం అంటే కుదరదు. ఎందుకంటే ఇది చరిత్ర. ఇదే గిరిజనులకు ప్రభుత్వ పెత్తందారులకి జరుగుతున్న అసలైన వర్గపోరాటం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసి తులకు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వరద సమస్య లపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన.
1,నిర్వాసితు లేమో ప్రభుత్వం మా పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తుందని, మేము మాకు పూర్తిగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని,పునరావాస కాలనీల లో అన్ని పూర్తి చేయాలని అడుగుతున్నాం అందుకే ఇలా చేస్తే మేమే వెళ్ళిపోతాం అని అధి కార్లు ఇలా చేస్తున్నారని అన్నారు. 2,ప్రభుత్వం నిర్వాసితులనుగాలికి వదిలేసింది అని, వారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ 10లక్షలు, ప్రతీకుటుం బానికి రూ10వేలు,దోమతెరలు మూ డు,నెలలపాటు ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని, ప్రతిపక్షరాజకీయ నాయకులు కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.3,కొన్ని సంస్థలు,సంఘాలు ప్రజల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు.4,ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి25 కేజీల బియ్యం,కేజీ కంది పప్పు, కేజీ నూనె,కూరగాయలు ఇస్తున్నారు.అయితే ఇవి అందరికీ అందటం లేదని ప్రజలు కొట్టు కున్నారు. దీనిపై ఏలూరుజిల్లా కలెక్టరు,మండల అధికారులను ప్రజల ముందే హెచ్చరించారు.వెలేరు పాడు ముంపు గ్రామాలను పరిశీలించి వస్తున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఎస్పీ లను ఎర్ర బోరు గ్రామం వద్ద నిర్వాసితులు అడ్డుకొని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అసలు ఈ భారీ వర్షాల గురించి ప్రభుత్వా నికి తెలియదా? సవంవత్సరం ముందుగానే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియా మెటియో రాలాజికల్‌ డిపార్ట్‌ మెంట్‌ మే నెలలో నే చెప్పింది.ఈ శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పడే వర్షాల గురించి, రుతు పవనాలు గురించి మే నెలలో నివేదిక విడుదల చేస్తుంది. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తెలియకుండా పోతుం దా? ఇవన్నీ తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.అంటే ఇది పూర్తిగా నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యధోరణి ప్రభుత్వం కనపరిచినట్లు అర్థమ వుతుంది.ముంపు ప్రాంతాలను అధికారులు ముం దస్తుగా సందర్శించి రాబోయే వరదల గురించి ప్రజలకు చెప్పి వారి వారి సామాన్లను,తరలించు కోవడానికి రవాణా ఏర్పాట్లు చేయ వచ్చు కానీ అలా జరగలేదు.ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. కుకునూరు మండల కేంద్రం ఎత్తు లో వుంటుంది కదా అని ఆ గ్రామ ప్రజలు మన ఊరు మునగదని ధీమాతో ఉన్నారు. రాత్రిపూట చడీ చప్పుడూ లేకుం డా గ్రామం అంతా తెల్ల వారే సరికి నీటి మయ మైంది. అప్పుడు ఆరాత్రిలో గ్రామప్రజలు సొం తంగా ప్రక్క గ్రామాల నుంచి ట్రాక్టర్‌లు 36 (తెలంగాణా గ్రామాలు సరిహద్దులో ఉన్నాయి). తెప్పించి కొంత మందిని సురక్షిత ప్రాంతాల కు తరలించారు. రెవెన్యూ అధికారులు కేవలం 7, ట్రాక్టర్‌లు ఏర్పాటు చేశారు. లేదంటే చాలా ప్రాణ నష్టం జరిగేది. ఇలా చేయడంవల్ల పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు అనేక కష్టాలు పడితేనే రేపు వారికై వారే పునరావాస కాలనీల కు గత్యంతరం లేక వెళతారు.అంటే దానర్ధం పొ మ్మన కుండా పొగ పెట్టడం.ఇంకా ఇక్కడ ఉం డలేము అని విసుగు చెంది వెళ్ళిపోతారు. ప్రభుత్వం వైపున తప్పు లేదని ఇది ప్రకృతి వైపరీత్యం అనీ, ఎవరూ ఏమీ చేయలేరు అని సమర్ధించు కుంటుం ది.కానీ ఇది పూర్తిగా మానవతప్పిదంగానే భావిం చాలి.ఎందుకంటే ప్రతీ ఏడాది జూలై నెలలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు.
ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ ఓపెన్‌ చేస్తే ఇలా ఉంటుంది.
ముంపు, నిర్వాసిత సమస్యను,తగ్గించటానికి ప్రత్యాయ మ్నాలను గుర్తించాలని,ప్రాజెక్ట్‌ భాధిత కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిం చాలని ఉంటుంది.కానీ వాస్తవానికి కనిపించేది వేరు. పై మాటలు ఆచరణకు నోచుకోవటం లేదు.
1986గోదావరి వరదలకు దీనికి పొంతన లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కు ముందు ఎప్పుడు వరదలు వచ్చినా అవి కొన్నిరోజులుపాటు ఉండి తర్వాత దిగువకునీరు వెళ్ళేది. ఇప్పుడు అలా జరగ లేదు,కాఫ ర్‌ డామ్‌ నిర్మాణం వలన బ్యాక్‌ వాటర్‌ వచ్చి గ్రామాల్లో నిలిచి పోయింది. అందుకే భద్రా చలం కూడా వరద తాకిడికి గురైంది. దీని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ 100 గ్రామాలు మునిగిపోతాయని సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఓ.ఎస్‌.నెంబర్‌బీ1ఆఫ్‌2019.అదే ఇప్పుడు పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతున్నది. మరల ఎటపాక గ్రామాలను తిరిగి తెలంగాణాకు ఇచ్చి వేయాలని వాదిస్తున్నారు.
ఆస్తి నష్టం అంచనా వేయరు!
సాధారణ పరిస్థితుల్లో అయితే ఇటువంటి వరదలు వచ్చినప్పుడు,అధికారులు పంటనష్టం, ప్రాణనష్టం, ఆస్తినష్టం అంచనావేసి,పరిహారం ఇస్తారు. కానీ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుముంపు గ్రామాలలో అది సాధ్యంకాదు.ఎందుకంటే ఏదో ఒకరోజు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలంటున్నారు. అప్పుడు మునిగిపోయినా,రోడ్లు తిరిగి వేయరు, కూలిపోయిన స్కూలు బిల్డింగ్స్‌ కట్టరు,ఇండ్లు కూలిపోతే తిరిగి ఐ.ఏ.వై.స్కీమ్‌లో కట్టరు.పంట దెబ్బతిందని వ్యవసాయశాఖఅధికారులు వచ్చిచెక్కులు ఇవ్వరు. (భూములు తీసుకున్నారు) కాబట్టి గత ముంపుకు ఇప్పటి ముంపుకు తేడాను ప్రజలు గ్రహించాలి. 1986 వరద నీరు వస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు రాలేదా? ఈ రోజు వచ్చింది రేపు రాదు అని గ్యారంటీ లేదు. ఇంత కంటే ఎక్కువ కూడా రావచ్చు. ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి అయితే, నీరు నిలిచి బ్యాక్‌ వాటర్‌ వస్తుంది.అటువంటప్పుడు మరలా కొన్ని పునరావాస కాలనీల ను అక్కడే కడుతున్నారు. అవి ఇప్పుడు వచ్చిన వరదల కు నీట మునిగిపోయాయి.రేపు ఆ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఉండదు. ఆవిషయం అధికారులు కళ్ళారా చూస్తూనే ఉన్నారు.కాబట్టి దీనిపై ప్రజలూ ఆలోసిం చాలి, సమస్య ను ముందుగానే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ప్రజల మధ్యన పని చేసే అను భవంఉన్న మేధావులు కూడా నిర్వాసితులు ఎదు ర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ఇది ఏఒక్కరి సమస్యకాదు,మానవ సమా జంలోఉన్నఅన్ని వర్గాల ప్రజలదని నమ్ముతు న్నాను.-(వై.రాము/బాబ్జీ)

అడవే తిండి పెడుతోంది..

అమ్మ ఉన్న చోట ఆకలి ఉండదనేది ఎంత నిజమో! అడవి తల్లి ఉన్నచోట ఆకలి ఉండదనేది కూడా అంతే నిజం. కరువు కాటేసినా అడవి తల్లి చేరదీస్తుంది. తిండి ఇచ్చి ఆదుకుంటుంది. సాగు చేయకుండానే పంటనిస్తుంది. అందుకే దండకారణ్యంలో ఉంటున్న అడవి బిడ్డలకు తిండి ఎప్పుడూ దొరుకుతుంది.
ఆదివాసులకు అడవే ఆహార భద్రత ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌,చత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఎంతోమంది ఆదివాసులు బతుకుతున్నారు. వాళ్లందరికీ అడవే ఆధారం. సాగు చేయ కుండానే అనేక రకాల ఆకుకూరలు,దుంపలు పండుతాయి. అడవిలో ఎటు వెళ్లినా ఒక పండో,దుంపో దొరుకుతుంది.సంతల్లో 21 రకాల ఆకుకూరలు,పండ్లు, కాయలు, దుంపలు, చిన్న చేపలు,చిన్న రొయ్యలు,కొక్కులు అమ్ము తుంటారు ఆదివాసులు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని కుంట(ఛత్తీస్‌గఢ్‌),చింతూరు (ఆంధ్ర ప్రదేశ్‌), చర్ల(తెలంగాణ),మోటు (ఒడిశా) సంతలకు కాలాల వారీగా దొరికే కాయలు,ఆకుకూరలు తెస్తారు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుతో వాళ్లకు కావాల్సినవి కొనుక్కుంటారు. ప్రకృతిని ప్రేమించాలి. దండ కారణ్యంలో సాగు చేయకుండా దొరుకుతున్న వాటిపై జన వికాస్‌ సొసైటీ స్టడీ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం…కొన్నేండ్ల నుంచి అడవులు నాశనం అవుతు న్నాయి. ముందు ముందు తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. పరిశ్రమలు, ఆర్గనైజేషన్‌, డిస్‌ప్లేస్‌మెంట్‌, క్లైమేట్‌? ఛేంజ్‌, అభివృద్ధి పేరిట ఆదివాసులను అడవులకు దూరం చేస్తే..వాళ్ల మనుగడకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. ప్రకృతిని ప్రేమించడం, పూజించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వ్యవసాయంలో సింథటిక్‌ రసాయనాల వాడకం వల్ల తేనెటీగల క్షీణత పెరిగింది. ఇలాగే మరి కొన్నేండ్లు కొనసాగితే ఎక్కడా తిండి దొరకదు.
ఇవి దొరుకుతున్నయ్‌
మిర్చిలో బొబాయి,బోరాయి,చిన్ని కోర్‌ మిడియా పెద్దకోర్‌ మిడియా,నల్ల మిర్చి రకాలు దొరుకుతాయి.వీటితోపాటు తపిడి చిక్కుడు, పెర్మ, తెల్ల చిక్కుడు, కిసీర్‌జాట,బామ్‌జాట, కిసీర్‌ జాట-2,లుగ్గి జాటా తెల్ల వంకాయ, పెద్ద రాముల్క,చిన్న రాముల్క, బుడమ కాయలు, వెదురు కొమ్ములు, పుట్టకొక్కులు, తమిర్‌?మీట,నారదుంప,అడవి ఎలేరి దుంప, నాగేల్‌మాటి దుంప,నోస్కా మాటి దుంప, అడ్డపిక్కలు, ఆకు కూరల్లో తొండుకుసీర్‌?, ఇత్తోడ్‌కుసీర్‌, కుక్కాళ్‌ కుసీర్‌,దోబకుసీర్‌, పండ్లలో తోలె,పరిగి,ఎర్క,వెలగ,పుసుగు.. సీజన్‌ బట్టి దొరుకుతాయి.
ఆహార భద్రతకు ముప్పు
ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన (పిఎంజికెవై) పథకాన్ని ఆహార భద్రత చట్టం (ఎఫ్‌ఎస్‌ఎ)-2013లో విలీనం చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ‘ఉచిత రేషన్‌’ నిర్ణయం ఒకే దెబ్బకు రెండు పిట్టలు వ్యూ హంగా కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ జనాభాలో మూడిరట రెండొంతుల ప్రజానీకానికి (81.35 కోట్ల మంది) ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని ప్రకటించి సబ్సిడీ ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగించబోమని ప్రకటించడంతో నిరుపేదలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ప్రపంచ ఆహార సూచీలో భారత్‌ అట్టడుగున నిలిచిన నేపథ్యంలోనూ ఆహార ధాన్యాలను కుదించడం ఒక ఎత్తుగడ కాగా, రెండోది ‘ఉచితం’ ప్రచార హోరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లకు గాలం వేయవచ్చున్నది సర్కారు ఎత్తుగడ. 81.35కోట్ల మందికి ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున మాత్రమే ఇక నుంచి ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. ఇదే సమయంలో ఆహార భద్రత చట్టం కింద ఒంటరి మహిళలు, వికలాంగులు, నిరాశ్ర యులు,వితంతు ఫించను పొందేవారు, ఏ ఆస రా లేని నిరుపేదలు, నిరుద్యోగులు,వయో వృద్ధులు వంటి లక్షిత కుటుంబాలకు రాయితీ ధరకు లభించే బియ్యం (కిలోరూ.3), గోధు మలు (కిలో రూ.2), ఇతర తృణ ధాన్యాలు (కిలో రూ.1) ఇక అందవు. కేవలం ఉచితంగా ఇచ్చే 5 కిలోల బియ్యం మాత్రమే అందుతాయి. పర్యవసానంగా ఈ నిరుపేదలంతా పౌష్టికా హారం కోసం ప్రయివేటు మార్కెట్‌పై ఆధార పడాల్సివస్తుంది. బయట మార్కెట్లో తక్కువలో తక్కువ కిలో గోధుమల ధర రూ.30గాను, కిలో బియ్యం ధర రూ.40గాను ఉంటోంది. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రమ జీవులకే నోటి ముద్ద గగనమైపోతున్న ధరాఘాత సమయంలో ఏ ఆసరా, ఏ పని చేయలేని నిస్సహాయ జీవితా లకు రాయితీ తిండి గింజలు నిరాకరించడం దుర్మార్గం. ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించేందుకు ప్రజలందరికీ అన్ని వేళలా అవసరమైన ఆహార ధాన్యాలను తగిన మోతాదులో అందుబాటులో ఉండేలా చూడటం, పౌష్టికాహారం తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం, సహకరించడం ప్రభుత్వాల బాధ్యత. తద్వారా ఆహార సుస్థిరతను సాధించడమనేది ఆహార భద్రతకు విశ్వ వ్యాప్తంగా ఆమోదయోగ్యమైన నిర్వచనం. ఆహార భద్రత హక్కును మన రాజ్యాంగంలో నేరుగా ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం కల్పించిన ‘జీవించే హక్కు’ అర్థంలోనే హుందాగా జీవించడమని స్పష్టతనిచ్చింది. హుందాగా జీవించడమంటే అర్థాకలితో అనికాదు కదా. అందుకనే ఆహారం, మనిషి జీవనానికి అవసరమైన ప్రాథమిక అవసరాలు అనేవి కూడా రాజ్యాంగ కల్పించిన హక్కులే. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కూడా ఈ నేపథ్యంలోనే. కానీ ప్రపంచ ఆహార సూచీలో దేశం ఏటికేడూ దిగజారిపోతోంది. పాలకుల ‘అమృతోత్సవ భారతావని’ గొప్పలు ఎంత ఘోరమైనవో.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో తరుచూ వెలుగుచూస్తున్న ఆకలి చావులు స్పష్టం చేస్తు న్నాయి. మోడీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆహార భద్రత హక్కు, ఉపాధి హామీ వంటి పేదలకు సంబంధించినవాటిపైనే కన్నేసి వాటిని నీరుగార్చే కుట్రలు సాగిస్తూనే వుంది. ఇప్పుడు ఉచిత ఆహారధాన్యాల ఎత్తుగడ కూడా అలాంటిదేనన్న విమర్శకుల విశ్లేషణ సమంజసంగానే కనిపిస్తోంది.కోవిడ్‌ సంక్షోభం, లాక్‌డౌన్‌ నిర్బంధాల నేపథ్యంలో 2020 మార్చి లో పిఎంజికెవైని మోడీ సర్కార్‌ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకానికి ముందు ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ కింద ఆహార ధాన్యాల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం 2021-22లో రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీ ఆహార ధాన్యాల్ని నిలిపివేయడం అంటే ఈ మేరకు పేదలందరిపై భారం వేయడమేన్న మాట. గర్భిణీలకు, తల్లులకు, చిన్నారులకు పౌష్టికాహరం అందించే ఐసిడిఎస్‌లకు, మధ్యాహ్న భోజన పథకాలకు కూడా కేంద్రం నిధులను తెగ్గోస్తోంది.ఆ మేరకు రాష్ట్రాలపై భారాలు పెరిగి ఆ పథకాలు క్రమంగా నీరుగారిపోతున్నాయి. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి పేదరికం కోరలు చాచిన నేపథ్యంలో పాలకులు ఆహార ధాన్యాల సబ్సిడీ కవరేజీని విస్తృతం చేయాల్సిన అవసరముంది. అలాంటి సమయంలో కోటాకు కోత పెట్టడం అమానుషం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున్ణ పరిశీలించడం అవసరం. ఉచిత ధాన్యా లతో పాటు సబ్సిడీ ఆహార ధాన్యాలను కూడా కొనసాగించాలి.
ఆహార భద్రత అందరి బాధ్యత
ప్రతి మనిషి మనుగడకు ఆహారం ఎంతో ముఖ్యం. కానీ నేడు ఆహారం అందరికీ అందుబాటులో లేకపోవడం, ఆకలి కేకలు మిన్నంటడం ఆందోళన కలిగిస్తున్నది. ఆహార పదార్థాల ధరలు పెరగడం ఇందుకు ముఖ్య కారణమైతే, ఆహార వృథా మరొక కారణం. ఆహారం వృథా చేయకపోతే సంపదను సృష్టించి నట్లే! ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార ధాన్యాలలో 35శాతం వరకు వృథా అవుతు న్నాయి. భారత్‌లో ఏటా సుమారు రూ.58 వేల కోట్ల విలువైన ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 82.2 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.ఈ లోపంవల్ల ప్రతి ఐదు నిమిషాలకు ఒక పసి బిడ్డ పొత్తిళ్లల్లోనే చనిపోతున్నాడు. బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతున్నది.భారత్‌లో 5కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. వీటిని అవసరమైన వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంచితే ఆకలి కేకలు, పోషకా హార లోపాలు తగ్గుతాయి. ప్రపంచ జనాభాకు సరిపడా ఆహారం అందుబాటులో లేకపో వడానికి అనేక కారణాలు ఉన్నాయి. పంటలు పండిరచే భూమి విస్తీర్ణం తగ్గడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం, వ్యవ సాయ రంగంపై ఆశించిన పరిశోధనలు జరగకపోవడం, ఆహార ధాన్యాలు, పదార్థాలు సరిగా నిల్వ చేయకపోవడం, నగరీకరణ, పట్టణీకరణ పెరగడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం ప్రధానమైనవి. 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటికే 750 కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్క పూట తిండికి కూడా నోచుకుని వారి సంఖ్య 150కోట్ల పైమాటే. దీంతో కొన్ని దేశాల్లో ఆకలి చావులు కూడా సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) 2030 నాటికి ఆకలి లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నది. ఆహార కొరతను తీర్చాలంటే చాలా కాలంపాటు ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు పాడైపోకుండా ఉండేలా నిల్వ సదుపాయాలు పెంచాలి. ప్రజలకు ఆహార వృథావల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. సరైన ప్యాకింగ్‌ పద్ధతులు పాటించాలి. ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలి. నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలపై రైతులకు 90% రుణాలు ఇవ్వాలి. వ్యవసాయాన్ని, వ్యవసాయ పరిశోధనలను ప్రోత్సహించాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. అప్పుడే ఆహార భద్రత సాధ్యమై అందరికీ ఆహారాన్ని అందించగలం.
ఆహార భద్రతా చట్టం అమలయ్యేనా?
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని పౌరసమాజం, ప్రజాసంఘాలు ఆహార హక్కు అమలు జరిపించడానికి పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తేనే ప్రభుత్వాలు కదిలి ఆయా చట్టాలను, పథకాలను రాజకీయ సంకల్పంతో అమలు జరపడానికి అవకాశం ఉంటుంది. ఆకలి వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలిచినందుకు ఈ బహుమతి ఇవ్వ బడిరది. తద్వారా ప్రపంచ పటంపై ఆకలిని అంత మొందించే బృహత్‌ కార్యక్రమం ప్రాధాన్యాన్ని నోబెల్‌ కమిటీ మొత్తం మాన వాళి ముందుం చింది.ఉత్పత్తి జరిగినప్పటికీ పంపిణీ వ్యవ స్థలు సమాజంలోని బాధిత కుటుంబాలకు అను కూలంగా లేవనే వాస్తవాన్ని మనం గుర్తించాలి. 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఆహార భద్రత పోషణపై ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఏ.ఒ) ఇచ్చిన నివేదిక 2019 నాటికి దాదాపు 200 కోట్ల మంది ప్రజలు సురక్షితమైన, పుష్టికర, సరిపోయేంత ఆహారం అందుబాటులో లేదని తెలిపింది.పూర్తిగా ఆకలితో అలమటించే పేదలు 2030 నాటికి 84 కోట్లను మించిపోతారని చెప్పింది. ఈ సంవత్సరం కరోనా కాలంలో 13 కోట్ల మంది అదనంగా చేరతారని అంచనా వేసింది. వీరిలో అత్యధి కులు అసంఘటిత రంగంలో పనిచేసే కార్మి కులు, మురికివాడల్లో నివసించేవారు, ఉపాధి కోల్పోయిన వలస కూలీలు అని పేర్కొంది. మనదేశంలో లాక్‌డౌన్‌ అనంతరం కనబడని ఆకలిచావ్ఞలు కరోనా మృతుల కంటే ఎక్కువగా ఉంటా యనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. పౌష్టికాహారలేమితో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వలన వాళ్లే ఎక్కువగా అంటువ్యాధులకు, మరణాలకు గురవడానికి ఆస్కారం ఉంది.
ముఖ్యంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువ. యూనిసెఫ్‌ సంస్థ ఈ ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మంది పిల్లలు చనిపోవడానికి ఆస్కారం ఉంటే అందులో మూడు లక్షల మంది భారత దేశంలోనే ఉంటారని హెచ్చరించింది. 2019లో విడుదల చేసిన భౌగోళిక ఆకలి సూచిక ప్రకారం భారతదేశం 117దేశాల్లో 102వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌,నేపాల్‌లు మన కంటే మెరుగ్గా ఉన్నాయి. మన పొరుగు దేశమైన చైనా 25వ స్థానంలో ఉంది. 2017 జాతీయ ఆరోగ్య సర్వే మనదేశంలో 19కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఆకలితో అలమ టిస్తున్నారని, 4,500 మంది ఐదు సంవత్స రాలలోపు పిల్లలు ఆకలి పోషకాహార లోపం వలన మరణిస్తున్నారని తెలిపింది. ఆహారభద్రత చట్టం ఆవిర్భావం, అమలు ఆహార హక్కు ఐక్యరాజ్యసమితి 1948లో వెలువరించిన మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో గుర్తించబడి, 1966లో ఆమోదించబడిన ఆర్థికసామాజిక సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒప్పందంలో స్పష్టపరచబడిరది. ఈ ఒప్పందం అమలు కమిటీ 1999లో ప్రతి ఒక్కరికి ఆకలి నుండి విముక్తి పొందే హక్కును గుర్తించాలని ఆయా దేశాలను ఆదేశించింది. 2000 సంవత్సరంలో భారతదేశం ఆమోదిం చిన ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ధి ప్రకటనలో 2015 నాటికి ఆకలి,దారిద్య్రాన్ని తగ్గిం చాలని పేర్కొనబడిరది. తదనంతరం 2015లో ఆమోదించబడిన ప్రకటనలో 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆకలి దారిద్య్రాలను గణనీయంగా తగ్గించాలని ఆదేశించబడిరది. మన దేశం రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగానే ఆహార హక్కు గుర్తించబడిరది. అలాగే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 47 ప్రకారం ప్రజలందరికీ పౌష్టికా హారాన్ని అందచేయడం,జీవన, ఆర్థిక,ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరుచుటకు రాజ్యం ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పబడిరది.
2001లో దేశంలో ఒకవైపు ఆహార నిల్వలు పేరుకు పోయి మరొకవైపు ఆకలి అంతటా అలుముకున్న సందర్భంలో పిపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పియు.సి.యల్‌) స్వచ్ఛంద సంస్థ భారత ప్రభుత్వం, భారత ఆహార కార్పొరేషన్‌, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలపై తక్షణం ప్రజలకు ఆహార సహాయాన్ని అందించాలని సుప్రీంకోర్టులో ప్రజాప్రయో జనాల వ్యాజ్యాన్ని వేసింది.ఆ వ్యా జ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు చొరవ, ప్రజాఉద్యమాల ఒత్తిడి కార ణంగా భారత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకా లను, కొన్ని చట్టా లను తీసుకువచ్చింది. అందులో ముఖ్యమైనవి.2005లో తీసుకొ చ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం.ఈ కొవిడ్‌ సందర్భంగా గ్రామాలకు తరలివచ్చిన వలస కార్మికులకు ఈ పథకం సంజీవనిగా పనిచేసింది. తదనం తరం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టం తీసుకురాబడిరది. ఈ చట్టంలోని నాలుగు ప్రధాన అంశాలలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీ,6-14 సంవ త్సరాల మధ్య వయసు బాలలకు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, ఆరు నెలలు-ఆరు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు అంగన్‌ వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం,నేటికి కూడా కోట్లాది వలస కూలీ లను, ఇల్లులేని వారిని, అనాధలను, గిరిజనులను గుర్తించడంలో ప్రభుత్వాలు సఫలీకృతం కాలేదు. బయోమెట్రిక్‌ విధానంలోచాలా మంది అర్హతను కోల్పోయారు. -జి ఏ సునీల్ కుమార్ 

ప్రకృతి రణం

సీజన్‌తో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్న ప్రకృతి మనిషిని అల్లకల్లోలం చేస్తోంది. నిజానికి భూమ్మీద ప్రతిజీవి ప్రకృతి మీదే ఆధారపడి బతుకుతుంది. మూడు కాలాలు, ఆరు రుతువులు టైం టు టైం ఉంటేనే ?జీవన చక్రం కరెక్ట్‌గా ఉంటుంది. అలాకాకుండా ఎండా కాలంలో వానలు,చలికాలంలో ఎండలు కాస్తే! వాతావరణంలో వచ్చే మార్పులకు మనిషితో సహా భూమ్మీద ఉన్న ఏప్రాణీ తట్టు కోలేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది. అయితే, అంతటి విపత్తుల వెనక బోలెడన్ని కారణాలు?ఉండొచ్చు. వాటన్నింటికి ముఖ్య కారణం మాత్రం మనిషే. పెరుగుతున్న టెక్నాలజీ మనిషి లైఫ్‌స్టైల్‌లో మార్పులు తెస్తోంది. దాంతో వాతావరణంలో విషవా యువులు పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం ప్రకృతి మీద తీవ్రంగా ఉంటోంది. కొంత కాలంగా వాతావరణంలో వస్తున్న మార్పులు గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. అకాల వర్షాలు, వరదలు,భూకంపాలు,కరువు..ఇవి సహజంగా వచ్చే మార్పులు కావు. అసహజం గా ముంచుకొస్తున్న ప్రకృతి విలయాలు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రకృతి ప్రకోపానికి బలవ్వాల్సిందే.
ఇది మింగుడుపడని విషయమే.అయితే ఇప్పటికైనా ఒంటిమీదకు కాస్త తెలివి తెచ్చుకుని నడుచుకోకపోతే పర్యావరణాన్ని కాపాడుకోవడం కష్టం. అంతెందుకు మనల్ని మనమే రక్షించుకోలేం. జీవనానికి సరిపడా వనరులు ఉంటే చాలు. కానీ, అవసరమైనదానికంటే ఎక్కువైతేనే విపరీత పరిణామాలు ఎదురవు తుంటాయి. ఇక్కడా అదే జరిగింది. నిజానికి వానలు లేకపోతే తాగు, సాగు నీరు ఉండదు. కానీ, ప్రకృతి లైఫ్‌?సైకిల్‌?లో మార్పులు వచ్చి ఏకధాటిగా వానలు కురిస్తే మాత్రం ఇలాంటి నష్టాలే జరుగుతాయి. వానల్ని కంట్రోల్‌? చేయడం సాధ్యం కాదు కదా? మన చేతుల్లో ఏముంది? అనొచ్చు. కానీ, వాతావరణంలో వచ్చే మార్పులకు పరోక్షంగా మనమే కారకులవుతున్నాం అన్నది అక్షర సత్యం. అసలు వాతావరణ మార్పులకు కారణాలేంటి? వాటి వల్ల ఏం జరుగుతుంది?
వాయు కాలుష్యం..
శిలాజ ఇంధనాల(ఫాజిల్‌ ఫ్యూయల్స్‌)ను కాల్చడం ద్వారా వచ్చే పొగ వల్ల భూగ్రహం వేడెక్కింది. దాంతో గ్లేసియర్స్‌ ఐస్‌?క్రీంలా కరిగిపోతున్నాయి. అంతేకాకుండా వాటి నుంచి నల్లని మసి, రేణువులను విడుదల చేస్తాయి. ఆ రేణువులు గాలి ద్వారా పైకి వెళ్లి మంచుపై పడతాయి. అక్కడ అవి మంచు కంటే ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీనివల్ల మంచు వేగంగా వేడెక్కి కరిగిపోతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడం వల్ల గ్లేసియర్స్‌ను రక్షించొచ్చని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. ఇటుక బట్టీలు, కలప నుండి వచ్చే పదార్థం ఈప్రాంతంలో మూడిరట రెండు వంతుల బ్లాక్‌ కార్బన్‌ను కలిగి ఉం టుంది. రెండవ అతిపెద్ద కాలుష్య కారకాలు డీజిల్‌ వాహనాలు.ఇవి 7-18 మధ్య కాలు ష్యానికి కారణమవుతున్నాయి.
2021 రిపోర్ట్‌ చెప్పే నిజాలివి
2021లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరిగాయని స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమెట్‌ రిపోర్ట్‌ చెప్తోంది. వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఎమిషన్స్‌ సాంద్రత రికార్డు స్థాయికి చేరుకుంది. దాంతో గత ఏడేండ్లుగా టెంపరేచర్‌ పెరుగు తోందని ఈ స్టడీలో తెలిసింది. అదే విధంగా గ్రీన్‌ల్యాండ్‌లో మంచుకు బదులు మొదటిసారి వాన కురిసింది. కెనడా, అమెరికా రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు చెలరేగాయి. వాటి వల్ల కొన్నిచోట్ల టెంపరేచర్‌ అమాంతం పెరిగింది. చైనాలోని ఒక ప్రాంతంలో నెలలో కురవాల్సిన వాన కొన్ని గంటల్లో కురిసింది. యూరప్‌?లో వచ్చిన వరదల కారణంగా ప్రాణ,ఆర్థిక నష్టాలు చాలా జరిగాయి. దక్షిణ అమెరికాలో వరుసగా రెండో ఏడాది కరువు వచ్చింది.దాంతో నదుల్లో నీటిమట్టం తగ్గింది. అగ్రికల్చర్‌,ట్రాన్స్‌పోర్ట్‌, ఫ్యూ యల్‌ ప్రొడక్షన్స్‌ బాగా దెబ్బతిన్నాయి.1990లో శాటిలైట్‌ బేస్డ్‌ సిస్టంతో సముద్ర మట్టాన్ని కొల వడం మొదలైంది.1993 నుంచి 2002మధ్య సముద్ర మట్టాలు ఏడాదికి 2.1మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. కానీ, 2013 నుంచి 2021 మధ్యలో ఈ లెక్క రెట్టింపయింది. ఏడాదికి 4.4 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. ముఖ్యంగా మంచు కరిగిపోవడంతో సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి.‘‘గత రెండు వేల ఏండ్లలో ఇలా పెరిగింది లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 కల్లా సముద్ర మట్టాలు 2 మీటర్లు దాటిపోవచ్చు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా 63కోట్ల జనాభా ఇండ్లు కోల్పోతారు. ఇంకెలాంటి పరిస్థితులు వస్తాయో ఊహిం చలేం’’ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌
ముందే పసిగట్టారు
పాకిస్తాన్‌లోని పర్వత ప్రాంతంలో 70 లక్షల మంది ప్రజలు మరింత వరదల బారిన పడే ప్రమాదం ఉందని సైంటిస్ట్‌ల అంచనా. కానీ, భూమి వేడెక్కకుండా చేయగల శక్తి మనలో లేదు. పాకిస్తాన్‌లో విడుదలయ్యే వాయువులు కేవలం1% వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. అఫ్గానిస్తాన్‌, నేపాల్‌ వంటి దేశాలు కూడా అందుకు తక్కువే కారణమవుతున్నాయి. కానీ ఇప్పటికీ ఆ దేశాలే వాతావరణ మార్పులకు ఎక్కువగా నష్టపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనదేశమే కాదు.. ప్రపంచం మొత్తం ప్రమా దం అంచున ఉన్నట్లే అనిపిస్తోంది. వాతా వరణ మార్పులు వల్ల జీవరాశులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మనుషులకు శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. వాటిలో మొదటిది వేడి వాతావరణం.
వేడి పెరిగితే కష్టమే
ఓమాదిరి వేడి వరకు మాత్రమే శరీరం తట్టుకోగలుగుతుంది. అంతకంటే ఎక్కువైతే తట్టుకోలేదు. వేడి తీవ్రత పెరిగిపోతే ఆ వేడికి కండరాలను బ్రేక్‌ చేసేంత శక్తి ఉంటుంది. అందుకనే ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయటకి వెళ్లకూడదు అంటారు. ఎందుకంటే ఆ వేడికి గుండె కండరాలు, కణాలు చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే వేడి ఎక్కువైతే ఒత్తిడికి కూడా లోనవుతారు. అప్పుడు గుండె.. రక్తాన్ని వేగంగా సరఫరా చేస్తుంది. అదే టైంలో చెమట రూపంలో సోడియం, పొటాషియం శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి. ఇలాంటప్పుడు హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎండ ఎక్కువగా ఉంటే డీహైడ్రేషన్‌ బారిన పడతాం అనే విషయం తెలిసిందే. దానివల్ల కిడ్నీలు డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంది. అప్పటికే కిడ్నీల కండిషన్‌ సరిగా లేకపోతే వేడి తీవ్రతవల్ల ప్రాణం పోయే అవకాశంఉంది. ఈ విషయంలో వృద్ధులు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. భూమి వేడెక్కేకొద్దీ, దోమలు వాటికి అనుకూలమైన ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో చేరి…జికా వైరస్‌,డెంగీ,మలేరియా వంటి వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. ఇవేకాకుండా కలరా,టైఫాయిడ్‌,పారాసైట్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి.
తిండి కూడా దొరకదు
వాతావరణంలో మార్పులవల్ల ఫుడ్‌ ప్రొడక్షన్‌ తగ్గుతుంది. సరఫరాపై ప్రభావం పడుతుంది. దానివల్ల మనిషికి అవసరమైన పోషకాలు కూడా తగ్గిపోతాయి. ఇంటర్‌ గవర్నమెంటల్‌ పానెల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ (ఐపిసిసి) స్పెషల్‌ రిపోర్ట్‌ ప్రకారం..ఉష్ణోగ్రతలు పెరగడంవల్లే పంటలు సరిగా పండడం లేదు. అంతేకా కుండా వాతావరణంలో ఉన్న కార్బన్‌%-డై -ఆక్సైడ్‌ పెరగడంవల్ల మొక్కల్లో ఉన్న జింక్‌, ఐరన్‌, ప్రొటీన్‌ వంటి న్యూట్రియెంట్లు నాశనం అవుతున్నాయి.పోషకాలు లేని ఫుడ్‌ ఎంత తిన్నా వేస్టే. పోషకాలు తగ్గితే అనారోగ్యాలు, క్యాన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది. అలాగైతే నీళ్లలో పెరిగే జలచరాల్ని తిందాంలే అనుకుంటున్నారా అదికూడా లాభంలేదు. ఎందుకంటే వేడి వాతావరణాన్ని తట్టుకోలేక అవి ధృవ ప్రాంతాలకు వలసపోతున్నాయి. దాంతో చేపలు, రొయ్యల వంటి వాటి నుంచి వచ్చే పోషకాలు కూడా మనిషికి అందకుండా పోతాయి.
ఆరోగ్యం మీద పెద్ద దెబ్బ
అడవులు కాలిపోవడం, సునామీల వంటి ప్రకృతి విపత్తులు ఈ మధ్య ఎక్కువ కావడం వల్ల ఊహించని నష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పులు మనుషుల ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెస్తాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఆగస్ట్‌లో అమెరికా యూరప్‌, సైబీరియా దేశాల్లో అడవులు కాలిపోయాయి. దాంతో గాలిలో కాలుష్యం పెరిగి పోయింది. ఆగాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, రక్తంలోకి కలుషితాలు చేరిపోతాయి. శరీరంలోని అవయ వాల మీద నేరుగా ప్రభావం చూపకపోయినా, ఇమ్యూనిటీ సిస్టమ్‌ మీద దాని తాలూకా ప్రభావం తప్పక పడుతుంది. దీనివల్ల ఏటా3.6 నుంచి 90లక్షల వరకు అకాల మరణాలు జరుగుతున్నాయని అంచనా. అంతేకాకుండా 65ఏండ్లు పైబడిన వాళ్లకు కాలుష్యం వల్ల ఇన్ఫెక్షన్‌ కలిగించే వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి.
మానసికంగా కూడా…
ప్రకృతి విపత్తులవల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఉదాహరణకు విదేశాల్లో అడవులు తగలబడ టాన్నే తీసుకుందాం.అప్పుడు అక్కడ నివసించే వాళ్లలో కొందరు తమ ఇండ్లు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కొందరైతే సొంతవాళ్లను కోల్పోయారు. మనదేశంలో వరదలు వచ్చిన ప్పుడు కూడా ఇదే పరిస్థితి.సునామీలవల్ల స్ట్రెస్‌,యాంగ్జైటీ పెరిగి పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌కి దారితీస్తుంది.దీన్నే ‘సొలా స్టాల్జియా’ అంటారు. ఈ జబ్బు పోను పోను సూసైడ్‌ చేసుకునే వరకు తీసుకెళ్లే ప్రమాదం ఉంది.
ఏం చేయాలి?
భౌగోళికంగానే కాకుండా శారీరకంగా, మానసికంగా ఎదురవుతున్న ఇన్ని అనర్థాలను ఎలా ఆపాలి? అందుకేం చేయాలని ఎవరిని వాళ్లు ప్రశ్నించుకోవాల్సిన టైం వచ్చేసింది. అలాగే ప్రకృతికి మనం చేస్తున్న నష్టాల గురించి అవగాహన పెంచుకోవాలి కూడా. చెట్లు నరికితే వర్షాలు పడవు. భూములు ఎండిపో తాయి. పంటలు పండవు. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వీటన్నింటి వల్ల తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కరువు అవుతాయి. ఇవన్నీ తెలిసి కూడా చెట్లు నరకడం మనిషి అజ్ఞానానికి నిదర్శనం. అలాగే వాహనాలు.. వాటి నుంచి వెలువడే పొగ గాలిని కలుషితం చేస్తుంది. మనిషి తెలివితేటల్ని ఉపయోగించి లైఫ్‌?ని ఈజీ చేయాలన్న ఆలోచనతో ఏసీలు, ఫ్రిజ్‌?లు కనిపెట్టాడు. కానీ, వాటి నుంచి విడుదలయ్యే గాలి చాలా ప్రమాదకరం. నిజానికి వీటినుంచి వెలువడే విషగాలులవల్లే ఓజోన్‌ పొరకు రంధ్రం పడిరది. కానీ, అవి లేకుండా బతకలేనంతగా ఆ వస్తువులకి అలవాటు పడిపోయాం.ఆ అలవాటుకు దూరమవ్వాలంటే….ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచాలి. ఇంటికి మంచి వెంటిలేషన్‌ ఉం డాలి. ఇంటినుంచి బయటకు అడుగుపెడితే టూవీలర్‌ లేదా కార్‌ ఎక్కకుండా.. ఎక్కువ దూరాలు జర్నీ చేయాలంటేనే వెహికల్స్‌ వాడాలి. వీలైనంత వరకు నడిచి వెళ్లాలి. నడిచి వెళ్లే దూరం కాదంటే సైకిల్‌ మీద వెళ్లడం మంచిది. ఇప్పటికే కొన్ని దేశాలు, మనదేశంలో కొన్ని రాష్ట్రాలు సైకిల్‌ వాడకాన్ని పెంచాయి. దీనివల్లగాలి కాలుష్యంతో పాటు సౌండ్‌ పొల్యూషన్‌ కూడా తగ్గుతుంది.
సముద్రాలు పొంగితే అంతా నాశనమే
మధ్య ఆసియా పర్వత ప్రాంతాన్ని-‘హై-మౌం టైన్‌ ఆసియా’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాం తంలో హిమాలయన్‌, కారకోరం,హిందూ కుష్‌ పర్వతాలు ఉన్నాయి. చైనా నుండి అఫ్గానిస్తాన్‌ వరకు విస్తరించి ఉన్నాయి. మధ్య ఆసియా పర్వత ప్రాంతంలో 55,000 గ్లేసియర్‌లు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ ధృవాల బయట మరెక్కడా లేని విధంగా ఎక్కువ మంచి నీటి నిల్వలు ఉన్నాయి. ఇక్కడ కరిగే నీరు ఆసియాలోని10 అతిపెద్ద నదులకు ఆధారం. దీని బేసిన్లలో దాదాపు రెండొందల కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. 2015 ప్రపంచ బ్యాంకు రిపోర్ట్‌? ప్రకారం75 కోట్ల ప్రజల జీవనోపాధికి గంగా,సింధు,బ్రహ్మపుత్ర నదులు మాత్రమే నీటి వనరులు. చైనాలోని యాంగ్జీ నది ఖండంలోనే అతిపెద్దది-ఆగ్నేయాసి యాలోని మెకాంగ్‌ కూడా హిమాలయ జలాలపై ఆధారపడిరది. కానీ,వేడి ఉష్ణోగ్రతలు వాటిని ప్రమాదంలో పడేస్తాయి. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం,హిమాలయాల్లో ఉష్ణో గ్రతలు ప్రపంచ సగటు కంటే రెండిరతలు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో మంచు కరుగుతుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ను అదుపు చేయడంలో విఫలమైతే, మధ్య ఆసియాలోని పర్వతాల్లోని మంచు కరిగి, వందేండ్లు పూర్తయ్యేనాటికి మూడిరట రెండు వంతుల భాగం కనుమరుగైపోతుంది. జర్మన్‌ క్లైమెట్‌ రిస్క్‌ ఇండెక్స్‌ ప్రకారం-వాతావరణ మార్పుల వల్ల అత్యంత ప్రమాదకరమైన పది దేశాల్లో నేపాల్‌, పాకిస్తాన్‌ ఉన్నాయి. అయితే మొదటి ఇరవై దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉంది. ‘హిమానీనదాలు కచ్చితంగా కరిగిపోతాయి. ప్రస్తుతానికి సరిపడా మంచినీరు ఉంది. కానీ, ముందుముందు ఎంత నీరు ఉంటుందో తెలి యని పరిస్థితి. మన దగ్గర ప్రజలకు వ్యవసా యం ప్రధాన ఆదాయవనరు. మెరుగైన నీటి నిర్వహణ, నీటి శుద్ధిలో పెట్టుబడి పెట్టకపోతే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే’ అని కోల్‌కతా, జెఐ ఎస్‌ యూనివర్సిటీ సైంటిస్ట్‌ భట్టాచార్య హెచ్చరించారు.
చల్లటి దేశాల్లో వేడి!
చల్లటి వాతావరణం ఉండే అమెరికా, యూరప్‌లోని దేశాల వాతావరణంలో కూడా కొన్నేండ్లుగా మార్పులొచ్చాయి. ఇవి సంపన్న దేశాలు కావడంతో అక్కడ ఫ్యాక్టరీలతోపాటు వెహికల్స్‌, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు ఎక్కువ. దాంతో కార్బన్‌ ఎమిషన్స్‌ గాల్లో ఎక్కువగా కలుస్తాయి. దానివల్ల గాలిలో కాలుష్యం, టెంపరేచర్స్‌ పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల వల్లే రెండుమూడేండ్లుగా అమెరికా,యూరప్‌ దేశాల్లో వేడి తీవ్రత ఎక్కువై అడవులు కార్చిచ్చులతో మండిపోతున్నాయి. అలాగే అక్కడి మంచు కూడా కరిగిపోతోంది.చలి కాలంలోనూ టెంపరేచర్స్‌ బాగా పెరిగి,ప్రజలు ఏసీలు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది.
మనదేశంలో..
తూర్పు పసిఫిక్‌ గాలులు బలంగా ఉంటే, అప్పుడు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో వీచే గాలులు బలహీన పడతాయి. ఇలాంటప్పుడు నార్మల్‌గా కాకుండా ‘లా నినా’ లేదా ‘ఎల్‌ నినో’ కండిషన్స్‌ ఏర్పడతాయి. తూర్పు పసిఫిక్‌లో వేడి వాతావరణం ఉంటే, ఎల్‌ నినో కండిషన్‌,చల్లగా ఉన్నప్పుడు లా నినా కండిషన్‌ ఏర్పడుతుంది. అంటే ఎక్కువ వాల్యూ వస్తే ఎల్‌ నినో,తక్కువ వస్తే లా నినా వస్తుంది. ఇవి ఐదారేండ్లకు ఒకసారి వస్తాయి. ఇలా వచ్చినప్పుడు గాలి దిశలో మార్పులు వస్తాయి. పసిఫిక్‌? సముద్రం మీద వీచే గాలుల్లో తేడా వచ్చినప్పుడు అవి బలహీనంగా ఉండి, మన దేశాన్ని తాకకపోతే ఎల్‌? నినో కండిషన్‌ ఏర్పడి వర్షాలు తగ్గిపోతాయి. అన్ని ఎల్‌ నినో సంవత్సరాలు కరువు తీసుకురావు. కానీ.. నార్మల్‌ రోజుల కంటే తక్కువ ఉన్న సంవత్స రాలు కూడా ఉన్నాయి. అది ఎల్‌ నినో లక్షణం. చాలావరకు ఎల్‌? నినో ఇయర్స్‌ కరువు తీసుకొస్తాయి. అప్పుడు మన దేశంలో వర్షాలు పడాల్సిన ప్రాంతాల్లో వర్షాలు పడవు.లా నినా కండిషన్‌లో తీవ్రమైన గాలులు వీస్తాయి. దాంతో సముద్రం నుంచి తేమ ఎక్కువగా వాతావరణంలోకి రావడంతో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అన్ని లా నినా కండిషన్స్‌?లో వరదలు వచ్చే సూచన ఉండదు. కానీ.. లా నినా కండిషన్‌లో వరదలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితులు లోకల్‌గా ఎఫెక్ట్‌ చూపిస్తాయి. ప్రస్తుతం లా నినా కండిషన్‌ మనదేశం మీద ఇంకా ఉంది.ఈపరిస్థితి ప్రపంచమంతటా ఇలాగే ఉంటుంది. యూరప్‌ వంటి దేశాల్లో వాతావరణం వేరేగా ఉంటుంది.కానీ..లా నినా కండిషన్‌ ఎక్కువ అవ్వడంవల్ల గ్లోబల్‌ సర్క్యులేషన్‌లో మార్పులు వచ్చాయి. దాంతో టెంపరేచర్స్‌ ఆపోజిట్‌గా పనిచేశాయి. మన రాష్ట్రం విషయానికొస్తే..రెండేండ్ల నుంచే లా నినా కండిషన్స్‌ వల్ల వర్షాలు ఎక్కువగా వస్తు న్నాయి. మిగతా టైంలో వర్షాకాలంబాగానే ఉంది.ఎంత వర్షపాతం ఉండాలో అంతే ఉంది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ప్రకృతి విపత్తులు అకస్మాత్తుగా వచ్చినవి కాదు. కొన్నేండ్ల నుంచి ఉన్నవే. మొదటి సారిగా1992లో జర్మనీలోని రియో డి జెనిరోలో ‘వరల్డ్‌ ఎర్త్‌ సమ్మిట్‌’ జరిగినప్పుడే దీన్ని డిక్లేర్‌ చేశారు. అది డిక్లేర్‌ చేసి,ఇప్పటికే 30 ఏండ్లు అయింది. అప్పటి నుంచి ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌’ (ఐపీసీసీ) రిపోర్ట్స్‌రావడం మొదలైంది. దీన్ని మొదలుపెట్టడానికి కారణం…ప్రాంతీయంగా పర్యావరణ అంశాలను పట్టించుకోకుండా ప్రవర్తించడం, డెవలప్‌మెంట్‌ చేస్తున్నామంటూ గుడ్డిగా వెళ్లడం, నేచర్‌ని నిర్లక్ష్యం చేయడం. వీటివల్లే ఇలాంటి విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మనదగ్గరే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉంది. స్థానికంగా వాతావరణ పరిస్థితులు కూడా మారాయి. ఉదాహరణకు హైదరాబాద్‌నే చూస్తే…ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. బిల్డింగ్‌లు, ఫ్యాక్టరీలు,వెహికల్స్‌ పెరిగిపోయాయి. కాలుష్యం కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో 2000 సంవత్సరంలో కురిసిన భారీ వర్షం గుర్తుందా ఏ ప్రభావం వల్ల అలా జరిగిందనేది తెలుసుకోవాలి. కానీ, 20 ఏండ్లుగా దాని సంగతే పట్టించుకోలేదు ప్రభుత్వాలు.ఆ తర్వాత 2005లో,2016లో ఇలాంటి విపత్తులే వచ్చాయి. గత ఐదేండ్ల నుంచి ఏటా వానలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయితే, విపత్తు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తున్నారు. తర్వాత దాని ఊసే ఉండదు. దీనికి ముఖ్య కారణం వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(నీటి మౌలిక సదుపాయం) సరిగా లేకపోవడం. వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అంటే.. మంచి నీటి సరఫరా ఎలా జరగాలి వాన నీళ్లు, మురికి నీళ్లు ఎలా వెళ్లాలి అనే వాటి గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో వరద, మురికి నీళ్లు రెండూ కలిసి ప్రవహిస్తున్నాయి. -జిఎన్‌వి సతీష్‌

మన్యం విప్లవం..మహోద్యమం..!

‘‘ బ్రిటిష్‌ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంతఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4,1897-మే7,1924). భారత స్వాతంత్య్ర చరిత్రలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఈ విప్లవ యోధుడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.’’– గునపర్తి సైమన్‌
భారతీయ చరిత్రలో ఆయన మహో జ్వల శక్తి.మన్యం విప్లవం.. మహోద్యమ శీలి. అడవి నుంచి ఆకాశానికి ఎగిసిన విప్లవ కెరటం అల్లూరి సీతారామారాజు. సమర నాదానికి ప్రతిరూపం..విప్లవ నినాదానికి ఆయువు. బ్రిటీషర్ల పాలిట సింహస్వప్నం. తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన విప్లవ వీరుడు అల్లూరి. కేవలం 27ఏళ్ళ వయసులోనే నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన అల్లూరి సీతారామరాజు అమాయ కులు,విద్యా విహీ నులైన కొండజాతి ప్రజలను ఒక్క తాటిపై నిలిపి, వారిని విప్లవ వీరులుగా తీర్చిదిద్ది, బ్రిటిష్‌ ప్రభుత్వంపై యుద్ధం చేసిన అల్లూరి వంటివారు భారత విప్లవ చరిత్రలో మరొకరు కానరారు. సీతారామరాజు విప్లవం విజయ వంతం కాకపోయినా, ఆయన ధైర్యసాహసాలు, ప్రాణత్యాగం ఎందరో భారతీయులను ఉత్తేజ పరచి,వారిలో జాతీయతా భావాన్నీ, దేశభక్తినీ పురిగొల్పాయి. సన్యాసి జీవితం గడిపిన రాజు, తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికికృషి చేయడమే తన విద్యుక్త ధర్మమని భావించాడు. భారతదేశ చరిత్రలో సన్యసించి, విప్లవ కారునిగా మారిన వారు అరుదు. అరవింద్‌ ఘోష్‌,అల్లూరి సీతా రామరాజు మాత్రమే మనకు కనిపిస్తారు.మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు అసలు చరిత్ర చూస్తే..ఆయన 1897వ సంవత్సరం జూలై 4వ తేదీన విజయనగరం జిల్లా పాం డ్రంగి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకట రామరాజు,తల్లి సూర్యనారాయణమ్మ. పశ్చిమ గోదావరిజిల్లాలోని మోగల్లు వారి స్వగ్రామం. అయితే, తాతగారైన మందలపాటి శ్రీరామరాజు ఇంట సీతారామరాజు జన్మించాడు. గోదావరి పుష్కరాల సమయంలో ప్రబలిన కలరా వ్యాధి తో సీతారామరాజు తండ్రి 1908లో మరణిం చాడు.అప్పుడు రామరాజు ఆరోతరగతి చదువు తున్నాడు. తండ్రి మరణంతో కుటుంబం చాలా కష్టాలు పడిరది. స్థిరంగా ఒకచోట ఉండలేక నివాసం పలు ప్రాంతాలకు మార్చాల్సి వచ్చింది. చివరికి 1909వ సంవత్సరంలో భీమవరం దగ్గరి కొవ్వాడ గ్రామానికి సీతారామరాజు తమ కుటుంబం నివాసం మార్చారు. భీమవరంలో మిషన్‌ ఉన్నత పాఠ శాలలో చేరినా..తొలియేడాదే పరీక్ష తప్పాడు. ఆ తర్వాత కూడా చదువు విషయంలో సీతారామరాజు చాలా ఒడిదొడుకులు ఎదుర్కొ న్నాడు. తండ్రి లేకపోవడం, పేదరికం, నివా సం తరచూ మార్చడం వంటి పరిస్థితులు సీతా రామరాజు చదువుపై చాలా ప్రభావం చూపిం చాయి. 1918 వరకు సీతారామరాజు కుటుం బం తునిలోనే నివాసం ఉంది. ఆ కాలంలో చుట్టుపక్కల కొండలు,అడవులు తిరుగుతూ గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండే వాడు. వత్సవాయి నీలాద్రిరాజు దగ్గర జ్యోతి ష్యం,వాస్తు శాస్త్రం,హఠయోగం,కవిత్వం నేర్చు కున్నాడు. సూరి అబ్బయ్యశాస్త్రి దగ్గర సంస్కృ తం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు. పసితనం నుంచే రామరాజులో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు,దానగుణం ఎక్కువగా ఉండేవి. తుని సమీపంలోని గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు. తన మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యంలో పర్యటించాడు. దేవాలయాల్లో, కొండలపై, శ్మశానాలలో రాత్రిపూట ధ్యానం చేసేవాడు. సీతారామరాజు అంటేనే ఓ మహో జ్వల శక్తి అనే విషయం అతి తక్కువ కాలం లోనే స్థానికులకు,బ్రిటిష్‌వాళ్లకు బోధపడిరది. ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఢీకొన్నాడు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం సాధ్యమని నమ్మాడు. ఆ సమయంలో నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులైన తన అను చరులు, అతి తక్కువ వనరులతోనే సంగ్రామం లోకి దూకాడు. ఇలా..భారత స్వాతంత్య్ర సాయుధ పోరాటంలో అల్లూరి సీతారామరాజు పాత్ర ఓప్రత్యేక అధ్యాయం. రెండు సార్లు ఉత్తర భారతదేశ యాత్ర సాగించాడు సీతారా మరాజు. తొలిసారి 1916 ఏప్రిల్‌ 26వ తేదీన బెంగాల్‌ వెళ్లారు. ఆతర్వాత లక్నోలో కాంగ్రె సు మహాసభకు హాజరయ్యాడు.కొంతకాలం కాశీలో ఉండి సంస్కృతం నేర్చుకున్నాడు. తొలి సారి యాత్రలో బరోడా,ఉజ్జయిని,అమృత్‌సర్‌, హరిద్వార్‌,బదరీనాథ్‌,బ్రహ్మకపాలం వంటి ప్రముఖ ప్రదేశాలు చూశాడు.బ్రహ్మకపాలంలో సన్యాసదీక్ష స్వీకరించి, యోగిగా తిరిగివచ్చాడు సీతారామరాజు.తొలియాత్రలో అనేక భాషలు, విద్యలు కూడా నేర్చుకున్నాడు.గృహవైద్య గ్రంథము,మంత్రపుష్పమాల,అశ్వశాస్త్రము, గజశాస్త్రము, రసాయన ప్రక్రియలు వంటి విషయాల గ్రంథాలను అధ్యయనం చేశాడు. 1918లో రెండోసారి ఉత్తరభారతయాత్రకు వెళ్లిన సీతారామరాజు బస్తర్‌,నాసిక్‌,పూనా, బొం బాయి, మైసూరు వంటి ప్రాంతాలు పర్యటిం చాడు. తిరిగొచ్చిన తర్వాత కొంగసింగిలో ఒక మోదుగ చెట్టు కింద మండల దీక్ష నిర్వహిం చాడు. దీంతో రాజుకు అతీంద్రియ శక్తులు న్నాయని స్థానికులు భావించేవారు. అలూరి సీతారామరాజుకు తల్లి అంటే అపారమైన భక్తి. ఎక్కడికి వెళ్లాలన్నా ఆమెకు పాదాభివందనం చేసి బయలుదేరేవాడు. ఆ సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్‌ వాళ్ల దురాగతాలు, దోపిడీ లు, అన్యాయాలు ఎక్కువగా చోటుచేసుకునేవి. స్త్రీలపై అకృత్యాలు నిత్యకృత్యంగా ఉండేవి. పోడు వ్యవసాయం,అటవీ ఉత్పత్తుల సేకరణతో జీవనం సాగించే తెల్లదొరలు ఘోరాలకు పాల్ప డేవారు. తోటి గిరిజనుల కష్టాలు చూడలేక వాళ్లకు అండగా నిలవాలని సీతారామరాజు నిర్ణయించుకున్నాడు వాళ్లలో చైతన్యం తీసు కొచ్చాడు. సమయం దొరికనప్పుడల్లా హక్కుల గురించి చెబుతూ ధైర్యం నూరిపోసేవాడు. దీంతో,గిరిజనులు సలహాలు,వివాద పరిష్కా రాలకు సీతారామరాజును ఆశ్రయించే వారు. క్రమంగా దాదాపు 40గ్రామాల గిరిజనులకు రాజు నాయకుడైపోయాడు. యువకులకు యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పి పోరా టానికి సిద్ధం చేశాడు. ఆక్రమంలో గంటందొర, మల్లుదొర,కంకిపాటి ఎండు పడాలు సీతారామ రాజుకు ముఖ్య అనుచరులైపోయారు. అంతేకాదు..దాదాపు 150మందిని మెరికల్లా తయారుచేశాడు సీతారామరాజు.1922 ఆగస్టు 19వ తేదీన మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీసు దోపిడీకి ప్లాన్‌ చేశాడు.1922 ఆగష్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభం అయింది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపి వేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. మొత్తం 11తుపాకులు,5 కత్తు లు,1390 తుపాకీ గుళ్ళు,14బాయొనెట్లు తీసుకువెళ్ళారు. ఏమేం తీసుకువెళ్ళారో రికార్డు పుస్తకంలో రాసి,రాజు సంతకం చేసాడు. ఆ సమయంలో స్టేషనులో ఉన్న పోలీసులకు ఏ అపాయమూ తలపెట్టలేదు. మరుసటిరోజే అంటే ఆగష్టు 23న కృష్ణదేవు పేట పోలీసు స్టేషన్‌ను ముట్టడిరచి, ఆయుధాలు తీసుకెళ్ళారు. అక్కడ 7 తుపాకులు, కొన్ని మందుగుండు పెట్టెలు లభించాయి. వరుసగా మూడోరోజు అంటే.. ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీసు స్టేషనుపై దాడి చేసారు. అక్కడ పోలీసుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినా పోలీసు లను ఎదుర్కొని బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించారు. ఈ మూడు దాడులలో మొత్తం 26 తుపాకులు, 2వేల 500కు పైగా మందు గుండు సామాగ్రి సీతారామరాజు బృందానికి లభించాయి.వరుసదాడులతో ఉక్కిరి బిక్కిరైన బ్రిటీషు అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుబెట్టడానికి కబార్డు,హైటర్‌ అనే అధికారులను చింతపల్లి ప్రాంతంలో నియ మించింది. సెప్టెంబర్‌ 24వ తేదీన సీతా రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో దాడి చేసి, ఆ అధికారులిద్దరినీ హతమార్చింది. అది చూసి మిగిలిన పోలీసులు చెల్లాచెదురై పోయారు. ఆ ఇద్దరు అధికారుల శవాలను అధికారులు తీసుకువెళ్ళడానికి స్థానికులు మధ్యవర్తిత్వం వహించాల్సి వచ్చింది.1922 అక్టోబర్‌ 15వ తేదీన సీతారామరాజు దళం అడ్డతీగల పోలీసు స్టేషన్‌పై చేసిన దాడి చారిత్రాత్మకమైనది. ఇంతకుముందు చేసిన దాడులకు భిన్నంగా ముందే సమాచారం ఇచ్చి మరీ దాడి చేశారు. కానీ, అప్పటి అధికారులు ముందు జాగ్రత్తగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా.. ఈ దళాన్ని ఎదుర్కోలేకపోయారు. కేవలం ఆయుధాలు వీరికి చిక్కకుండా దాచిపెట్టడం మినహా ఏమీ చేయలేకపోయారు. ఇక,అక్టోబర్‌ 19వ తేదీన రంపచోడవరం పోలీస్‌స్టేషన్‌ను పట్టపగలే ముట్టడిరచినా ఆయుధాలు దాచి పెట్టడంతో దళానికి ఆయుధాలు దొరకలేదు. అయితే అక్కడి ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి రాజుపట్ల తమ అభిమానాన్ని తెలియజేశారు. జ్యోతిశ్శాస్త్రాన్ని నమ్మిన సీతారామరాజు..తాను పెట్టుకొన్న ముహూర్తాన్ని ముందుగా తెలియజేసి ముట్టడిరచి విజయం సాధించడంతో ఆయన సాహసాల గురించి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. కొన్ని సార్లు తను ఫలానా చోట ఉంటానని, కావా లంటే యుద్ధం చేయమని కూడా సీతారామ రాజు సవాలు విసిరేవాడు. ఈ పరిణామాలతో సీతారామరాజును వాంటెడ్‌ లిస్టులో చేర్చిన బ్రిటిషు ప్రభుత్వం అక్టోబర్‌ 23న సాండర్స్‌ సేవాని అనే అధికారి నేతృత్వంలో ప్రత్యేక సైనిక దళాలను పంపింది. సాండర్స్‌ దళంతో రాజు దళానికి ముఖాముఖి యుద్ధం జరిగింది. పరిస్థి తులు అనుకూలంగా లేవని సాండర్స్‌ వెనుదిరి గాడు. తమకు పట్టుబడిన బ్రిటిష్‌ పోలీసుల్లో భారతీయులు ఉంటే సీతారామరాజు దళం మందలించి వదిలేసేవారు. అదే ఏడాది డిసెంబర్‌ 6వ తేదీన అల్లూరి విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. సీతారామరాజు దళానికి, బ్రిటిష్‌ సైనికులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బ్రిటిష్‌ వాళ్లు శక్తివంతమైన ఫిరంగులు ప్రయోగించారు.ఆరోజు జరిగిన పోరాటంలో మొత్తం 12 మంది అల్లూరి దళ సభ్యులు మరణించారు. ఆ పరిణామం తర్వాత దాదాపు 4నెలలపాటు దళం కార్యకలాపాలు తగ్గిపోయాయి. సీతారామరాజు ఆ పోరులో చనిపోయాడని,విప్లవం ఆగిపోయిందని పుకార్లు పుట్టాయి. అయినప్పటికీ బ్రిటిష్‌ ప్రభుత్వం మాత్రం అల్లూరి సీతారామరాజును, ఆయన అనుచరులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. సరిగ్గా ఐదు నెలల తర్వాత 1923ఏప్రిల్‌ 17వ తేదీన ఒక్కసారిగా సీతారామరాజు కొద్దిమంది అనుచరులతో అన్న వరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా ఆయుధాలేమీ దొరకలేదు. అన్నవరం సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. అక్కడ పత్రికా విలేఖరులతో మాట్లాడారు. ఆ సంభాషణ 1923 ఏప్రిల్‌ 21వ తేదీన ఆంధ్రపత్రికలో ప్రచురించారు. అప్పటినుంచి సీతారామరాజును ఎలాగైనా పట్టుకోవాలని బ్రిటిష్‌ ప్రభుత్వం గూఢచారుల ద్వారా ప్రయ త్నాలు సాగించింది. సీతారామరాజు దళం టార్గెట్‌గా బ్రిటిష్‌ ప్రభుత్వం మన్యానికి రూథర్‌ఫర్డ్‌ను కలెక్టర్‌గా నియమించింది. కృష్ణదేవుపేటలో సభ నిర్వహించిన రూథర్‌ ఫర్డ్‌..విప్లవకారుల ఆచూకీ వారం రోజుల్లో చెప్పకపోతే..ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ కాల్చివేస్తామని హెచ్చరించాడు. ఇది తెలిసిన సీతారామరాజు..తాను లొంగిపోయి మన్యం ప్రజలకు విముక్తి కల్పించాలని భావించాడు. కానీ,స్థానిక మునసబు అందుకు ఒప్పుకోలేదు. దీంతో,1924 మే 7వ తేదీన కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని, ఒక పశువుల కాపరి ద్వారా సీతారామరాజు తాను ఉన్న చోటు గురించి పోలీసులకు కబురు పంపాడని చెబుతారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూండగా పోలీసులు సీతారామరాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసిన మేజర్‌ గుడాల్‌ వద్దకు సీతారామరాజును తీసుకెళ్లగా.. ఆయ నను ఓ చెట్టుకు కట్టేసి గుడాల్‌ కాల్చి చంపాడు. మే 8వ తేదీన సీతారామరాజు దేహాన్ని ఫోటో తీయించి దహనం చేశారు. ఆయన చితా భస్మాన్ని సమీపంలోని వరాహనదిలో కలిపేశారు. అలా..కేవలం 27 ఏళ్ళ వయసు లోనే అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడు. 1922 ఆగస్టు 22వ తేదీన ఆరంభమైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విప్లవ పోరా టం 1924 జూలై మొదటివారంలో అంతమైంది.
ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు
శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 నాటి చౌర్స్‌ (బెంగాల్‌) తిరుగు బాటు భారతభూమిలో తొలి గిరిజ నోద్యమం. 1922-24 మధ్య విశాఖ మన్యం లో జరిగినది తుది గిరిజన పోరాటం. కానీ మిగిలిన ఉద్యమాల చరిత్ర మీద ప్రసరించిన వెలుగు రామరాజు పోరు మీద కానరాదు. చోటానాగ్‌పూర్‌, రాంచీ పరిసరాలలో ముండా గిరిజన తెగ బ్రిటిష్‌ ప్రభుత్వం మీద తిరుగు బాటు చేసింది. దీనినే ఉల్‌గులాన్‌ అంటారు. బీర్సా ముండా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఇది 1899-1900 మధ్య కొన్ని నెలలు జరిగింది.బీర్సా జీవితం,ఉద్యమం అద్భు తమైన విషయాలు. కానీ ఆయన ఉద్యమం పది నెలలు మాత్రమే సాగింది. రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సమీకరించి ఆ ఉద్య మాన్ని బ్రిటిషర్లు అణచివేశారు. కానీ రామ రాజు ఉద్యమం ఆగస్ట్‌ 22,1922న చింతపల్లి (విశాఖ మన్యం) పోలీసు స్టేషన్‌ మీద దాడితో మొదలై, మే 7,1924 వరకు ఉదృతంగా సాగింది.ఆ తరువాత కూడా మరో నెలపాటు రామరాజు ప్రధాన అనుచరుడు గాము గంతన్న ఉద్యమాన్ని నడిపించాడు. కానీ, దీనిని గుర్తించ డానికి గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు.విశాఖ మన్య విప్లవం తెలుగువారి చరిత్రలో, ఆమాట కొస్తే భారత గిరిజనోద్యమ చరిత్రలోనే అద్భుత ఘట్టం. రామరాజు చరిత్ర, ఉద్యమం తనకు ప్రేరణ ఇచ్చిందని ఆదిలాబాద్‌ ప్రాంత గోండు ఆదివాసీ ఉద్యమనేత కొమురం భీం (1940) కూడా ప్రకటించాడు. మరణానంతరం రామ రాజు ఔన్నత్యాన్ని గాంధీజీ, సుభాశ్‌బోస్‌, భోగ రాజు పట్టాభిసీతారామయ్య, మద్దూరి అన్న పూర్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి వారంతా గుర్తించి నివాళులర్పించారు.నిజానికి సాంప్రదాయిక ఆయుధాలను వాడుతూ బ్రిటిష్‌ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడడం విశాఖ మన్యానికి కొత్త కాదు. అక్కడ 1790 తరువాత అలాంటి పరిణామాలు జరిగాయి. పోలీసు స్టేషన్లను దగ్ధం చేయడం కూడా ఉండేది. ద్వారబంధాల చంద్రారెడ్డి (1875 ప్రాంతం) ఇందుకు ప్రసిద్ధుడు. మన్యంలో పాత పద్ధతు లను రామరాజు యథా తథంగా తీసుకోక పోయినా కొన్నింటిని అనుసరించారు. ఆగస్టు 19, 1922న శబరి కొండ మీద అమ్మ వారికి అభిషేకం చేయించి రామరాజు ఉద్యమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22న చింతపల్లి స్టేషన్‌ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకు రావడంతో ఉద్యమం వాస్తవంగా మొదలైంది. 23వ తేదీన కృష్ణదేవిపేట, 24వ తేదీన రాజవొమ్మంగి స్టేషన్‌ను రామరాజు లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తం 21 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మద్రాస్‌ ప్రెసిడెన్సీని గడగడలాడిరచింది. ఇరవై ఒక్క తుపాకులు కలిగి ఉండడమంటే దాదాపు ఒక ఆధునిక పోలీసు పటాలం తయారైనట్టే.

విశాఖ ఉక్కుతో కేంద్రం పరిహాసం

ఇటీవల కాలంలో మొత్తం తెలుగు రాష్ట్రాలను రెండు వివాదాలు కుదిపేశాయి. అందు లో ఒకటి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవడం. రెండవది ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు లేదా పాలక పార్టీలూ మొదలెట్టిన వృథా వివాదాన్ని ఆపడం. ఇందులో మొదటిది ఇరు రాష్ట్రాల సుహృద్భావానికి, ఉమ్మడి వారసత్వానికి ప్రతీకగా నిలిస్తే రెండవది రాజకీయ పార్టీల సంకుచితత్వానికి అవాంఛనీయ వ్యూహాలకు అద్దం పట్టింది. వాస్తవానికి మొదటి సమస్యపై కూడా రెండో సమస్య తరహాలోనే స్పందనలు రాకపోలేదు. కాని ఇరు రాష్ట్రాలకు శూన్యహస్తమే చూపిస్తున్న మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు విషయంలోనూ క్రూర పరిహాసమే చేసింది. ఈ స్వల్వ వ్యవధిలోనే ఇరు రాష్ట్రాలనూ పాలిస్తున్న గతంలో పాలించిన పెద్ద పార్టీలకు మర్చిపోలేని పాఠాలు నేర్పించి తన ఆధిక్యతనూ ఏకపక్ష బాధ్యతా రాహిత్యాన్ని తనే వెల్లడిరచుకుంది.
ఆగిన గత ప్రయత్నాలు
2021 అక్టోబరు ప్రాంతంలో కేంద్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లేదా రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను వంద శాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. దీన్ని ఎవరికి ఎంతకు కట్టబెడతారనే దానిపైనా చాలా కథనాలు వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా భ్రష్టుపట్టిన అదానీ సామ్రాజ్యంలో ఉక్కు ఫ్యాక్టరీని కలిపేస్తారనే వార్తలు వచ్చాయి. ఇంకా దక్షిణ కొరియా కంపెనీ పోస్కో, టాటా వంటి పేర్లన్నీ కూడా వినిపించాయి. 1966లో తెలుగు ప్రజల పోరాటాలు, కమ్యూనిస్టు ఎంఎ ల్‌ఎల రాజీనామాలు, యువత ప్రాణార్పణలతో ఆవిర్భవించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది నాడు మార్మోగిన నినాదం. ఇందుకోసం తాము కూడా పోరాడామని తెలంగాణ ప్రభుత్వం అంటున్న మాట కూడా నిజమే. దానికి భూమిని సమకూర్చడం కోసం వేలమంది నిర్వాసితుల య్యారు. ఇప్పటికీ వారిలో అనేకులకు సరైన పరి హారం దొరికింది లేదు. ఆ ఫ్యాక్టరీని ప్రారంభించ డానికి చాలాకాలం పట్టినా ప్రజలు ఓపికగా నిరీక్షించారు. దాన్ని జయప్రదంగా నడిపించడంలో కార్మిక వర్గం ముఖ్యపాత్ర వహించింది. అనేక త్యాగాలు చేసింది. అనతి కాలంలోనే విశాఖ ఉక్కు ప్రపంచ చిత్ర పటంలో చోటు సంపాదించగలి గింది. పెట్టిన పెట్టుబడికి మించి లాభాలు అందిం చింది. అయితే దాని పురోగమనానికి చేయి కలపక పోగా కేంద్రం సైంధవ పాత్ర పోషించింది. సుదీర్ఘ సముద్ర తీరం, నిపుణులైన కార్మిక ఉద్యోగ అధికార బృందంతో మంచి విజయాలు సాధించే ఈ ఫ్యాక్ట రీకి ఇనుప గనులు కేటాయించకుండా తొండి చేసింది. దశాబ్దాల పాటు ఇదే పరిస్థితి కొనసాగు తున్నా రాష్ట్రంలో పాలకపార్టీలేవీ కేంద్రంలో తాము వున్నప్పుడు కూడా మార్పు తెచ్చింది లేదు. పైగా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ సంకేతాలివ్వడం, కార్మిక సంఘాల నిరసనతో వెనక్కు తగ్గడం జరుగు తూ వచ్చింది. విస్తరణకు నిధులివ్వకపోగాఉత్పత్తిని కుదించడం, కావాలని నష్టాల పాలు చేయ డం వాటి వ్యూహంగా అర్థమైంది. సరళీకరణతో ఈ ధోరణి మరింత ముదిరింది. అయినా కార్మిక సంఘాల ఐక్య ప్రతిఘటన కారణంగా కేంద్రం ఆ పని చేయలేకపోయింది. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి.
మోడీ సర్కారు ఏకపక్ష దాడి
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఉపసంహరణ అనే ప్రక్రియను పెద్ద ఆర్భాటంగా సాగించడం, అదానీ వంటి ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం నిత్యకృత్యమైంది. అయినా మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే విశాఖకు ఎసరుపెట్టే చర్యలు తీసుకున్న కేంద్రం మలి దఫా గద్దెక్కాక నేరుగా దాడి తీవ్రం చేసింది. వంద శాతం ప్రైవేటీకరణ చేయనున్నట్టు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. వాజ్‌పేయి హయాం లోనే ఇలాంటి ప్రతిపాదన వస్తే తాము అడ్డుకున్నా మని చంద్రబాబు నాయుడు తరచూ చెబుతుం టారు. కానీ మోడీ ప్రభుత్వంలో దీర్ఘకాలం పాటు భాగస్వామిగా వున్న ఆ పార్టీ నేతలు ఈ విషయమై సంకేతాలు వస్తున్నా నిరోధించే తీవ్ర ప్రయత్నమేదీ చేయలేదు. ఇప్పుడున్న వైసిపి జగన్‌ ప్రభుత్వం కూడా ముందస్తుగా అడ్డుకోకపోగా ప్రకటన వచ్చాక కూడా నీళ్లు నములుతూ కూర్చుంది. ప్రైవేటీకరణ తరహాలో వాటాలు విడుదల చేయాలని, భూములు అమ్మి అప్పులు కట్టాలనీ ముఖ్యమంత్రి మొదట్లోనే విడ్డూరమైన ప్రతిపాదనలతో లేఖ రాశారు. మరో వైపున కార్మిక సంఘాలు, వామపక్షాలు నిశితంగా వ్యతిరేకించడమే గాక సమరశీల పోరాటం మొదలె ట్టాయి. ఆ దశలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి తాము గట్టిగా మాట్లాడతామంటూ వారితో నమ్మబలికారు గాని ఆ దిశలో జరిగింది శూన్యం. టిడిపి,వైసిపి ఒకరినొకరు విమర్శించుకోవడమే తప్ప కేంద్రంపై ఏకోన్ముఖ పోరాటానికి సిద్ధం కాలేదు. బిజెపి ఎ.పినాయకులు రకరకాల మాటలతో గంద రగోళం పెంచడమేగాక ప్రైవేటీకరణ వల్ల ఉద్యో గాలకేమీ ముప్పు రాదని సమర్థన ఎత్తుకున్నారు. రామతీర్థం వంటి మతపరమైన అంశాలతో దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. బిజెపి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కేంద్రంతో మాట్లాడుతున్నానంటూనే రాష్ట్రానిదే తప్పని వింత వాదన తెచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకువెళ్లడానికి జగన్‌ సిద్ధం కాకపోవడం వల్లనే ఇదంతా జరిగిం దన్నారు. ఈవిధంగా మూడు పార్టీలు అవకాశవాద రాజకీయాలు అనుసరించడం బిజెపికి కొమ్ములు తెచ్చింది. కార్మిక సంఘాలు మాత్రం ఎవరి విధా నం ఎలా వున్నా అందరినీ కలుపుకొని లక్ష్యం సాధించడమే తమ మార్గమంటూ అందరికీ సహకారం అందించారు. మరో వంకన ఫ్యాక్టరీ స్థాపనకు దారితీసిన పరిస్థితులు మొదటి నుంచి కేంద్రం సాగించిన నయవంచన, లెక్కల టక్కుటమారం బహిర్గతం చేయడం ద్వారా గొప్ప సైద్ధాంతిక పోరాటం కూడా చేశాయి. స్వంత ప్రత్యేక గనులు (క్యాప్టివ్‌ మైన్స్‌) కేటాయించక పోవడం వెనక గల దుష్ట తంత్రం ఏమిటో, నష్టాలు ఎందుకు వచ్చాయో తెలియజెప్పాయి. ఈ చర్చ మొదలైన తర్వాత కూడా జరిగిన గనుల కేటాయిం పు సమయంలో ఒరిస్సా లోని గనుల కోసం ఒత్తిడి తెచ్చాయి. విశాఖ యాజమాన్యం కూడా వేలం పాటలో పాల్గొంది.కాని కేంద్రం కావాలని ప్రైవే టు కంపెనీలకే ప్రాధాన్యతనిచ్చింది.విశాఖ ఉక్కు అభ్యర్థనను పట్టించుకోలేదు.
మోడీ మొండి చేయి!
కార్మిక సంఘాల పోరాటం తీవ్రమైన కొద్దీ తమ నిర్ణయంలో మార్పు లేదని చెప్పడం పనిగా పెట్టుకుంది. ఇందుకోసం లీగల్‌,అసెస్‌ మెంట్‌,బిడ్డింగ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. మొదట్లో అదానీ,టాటా,దక్షిణ కొరియాకు చెందిన పోస్కో వంటి కంపెనీలు తీసుకోవచ్చనే కథలు వినిపించాయి. వ్యూహాత్మకంగానే టాటాల పేరు తెచ్చినట్టు కూడా చెప్పారు. కొద్ది మాసాల కిందట ప్రధాని మోడీ విశాఖ వచ్చినప్పుడు పాల్గొన్న బహి రంగసభ వేదికపై ముఖ్యమంత్రి జగన్‌ మొక్కుబడిగా విశాఖ ఉక్కు ప్రస్తావన తెచ్చారే గాని గట్టిగా మాట్లాడిరది లేదు. ఆయన స్పందన అంతకన్నా లేదు. అప్పుడే ప్రధానితో స్వల్ప సమావేశం జరిపిన పవన్‌ కళ్యాణ్‌ కూడా మంచిరోజులు వస్తాయని చెప్పడం తప్ప దీనిపై సాధించింది లేదు. కాకపోతే ఈ లోగా అదానీ బండారం బయిటపడిపోయింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి గనక కొంతకాలం కొత్త ఎత్తులతో కాలక్షేపం చేయొచ్చని బిజెపి వర్గాలు వెల్లడిరచాయి.
బిడ్ల ప్రహసనం, గడువు పెంపు
మొదటి నుంచి ఈప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకిస్తున్న కెసిఆర్‌ ఈ దశలో రంగంలోకి దిగి అమ్మకమే జరిగేట్టయితే తాము కూడా వేలంలో పాల్గొని కొనుగోలు చేస్తామనడంతో కొత్త వివాదం మొదలైంది. తెలంగాణ సర్కారు చూపిన పాటి తెగువ కూడా జగన్‌ ఎందుకు చూపడం లేదనే ప్రశ్న వచ్చింది.అత్యుత్సాహవంతులైన వైసిపి మంత్రులు బిఆర్‌ఎస్‌పై దాడి చేసేవరకూ వెళ్లారు. అయితే అక్కడ అమ్మకమే లేదని ఆసక్తి వ్యక్తీకరణ పేరిట వర్కింగ్‌ పెట్టుబడిని మాత్రమే ఆహ్వానిస్తు న్నారని ఎ.పి సర్కారు సలహాదారు సజ్జల రామ కృషా ్ణరెడ్డి సమర్థించారు. తాము విశాఖ ఉక్కు కొనుగోలు చేయడం కోసమనిగాక అక్కడ పరిస్థితిని, అవకాశాలను అధ్యయనం చేయడం కోసం అధికా రుల బృందాన్ని పంపుతామని కెటిఆర్‌ ప్రకటిం చారు. ఇది విశాఖ ఉక్కుపై జగన్‌ ప్రభుత్వ స్పంద నా రాహిత్యానికి సవాలేనని అందరూ భావించారు. కార్మిక సంఘాలూ ఆహ్వానించాయి. ఈదశలో సందర్శనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్తే తాము ఇప్పుడు ప్రైవేటీ కరణ కోసం గాక నిర్వహణ సామర్థ్యం పెంచే పెట్టుబడి కోసమే ప్రయత్నిస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. దీన్నిబట్టి తమవల్లనే కేంద్రం వెనక్కు తగ్గిందని, ఇది తెలంగాణ దెబ్బ అని కెటి ఆర్‌తో సహా బిఆర్‌ఎస్‌ నాయకులు నిన్న మధ్యా హ్నానికి హడావుడి మొదలెట్టారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు అంతగా తొందరపడకపోగా సాయంత్రం సమావేశంలో అదే కేంద్ర మంత్రిని స్పష్టత కోసం నిలదీశారు. దాంతో తానేమీ చెప్పలేనని ఆయన గొంతు మార్చారు. ప్రజాశక్తిలో నిన్న ఉదయమే కేంద్రం వంచన అంటూ పతాక శీర్షిక వచ్చింది. దాంతో సూటిగా తాము ప్రైవేటీ కరణకే కట్టుబడి వున్నట్టు కేంద్రం మొండి వైఖరిని పునరుద్ఘాటించింది. దాంతో ఒకప్రహసనం ముగి సింది. ఈ రోజు తెలంగాణ లేదా సింగరేణి తర పున బిడ్‌ దాఖలు కాలేదని సమాచారం. ఆ గడు వును మరో ఐదు రోజులు పొడగించినట్టు చెబుతు న్నారు. విశాఖ నుంచి మళ్లీ లోక్‌సభకు పోటీ చేస్తానని ప్రకటించిన సిబిఐ మాజీ జె.డి లక్ష్మీనారా యణ కూడా బిడ్‌ వేసి క్లౌడ్‌ఫండిరగ్‌తో ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఇవేవీ కూడా సమస్యకు అసలైన పరిష్కారాలు కావు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల చొరవతో మరో సమైక్య ఉద్యమం జరిపి దాన్ని ప్రభుత్వరంగంలోనే కొనసాగించేలా కేంద్రం మెడ వంచాల్సిందే. అందుకు భిన్నంగా ఎ.పి ప్రాంతీయ పార్టీలు తమ మెడలు వంచి మోడీకి వంత పాడుతుండటం దారుణం.20వ తేదీ తర్వాత కూడా ఈ పరిస్థి తిలో మార్పు ఆశించలేము. పైగా విశాఖ ఉక్కు సమర్థత పెంచడానికి వర్కింగ్‌ పెట్టుబడి సమకూ ర్చడం మరింత పటిష్టం చేసి ప్రైవేటు కార్పొరేట్‌కు కట్టబెట్టే కుట్రమాత్రమే.
వివాదాలు హానికరం
విశాఖ ఉక్కు అమ్మకంలో సాంకేతి కంగా తెలంగాణ సర్కారు లేదా సింగరేణి వారు పాల్గొనవచ్చునా, నిబంధనల మేరకు అందుకు కేంద్రం అనుమతినిస్తుందా అనేది ఇంకా అస్పష్టమే. అందుకు ఆటంకం కలిగించే నిబంధనలు కొన్ని వున్నాయి. అయితే విశాఖ ఉక్కును కాపాడుకో వడం కోసం ఇరు రాష్ట్రాల ప్రజల బలీయమైన ఆకాంక్షకు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చొరవ తీసుకోవడం ఆహ్వానించదగిందే. ఇలాంటి సమయంలో తెలం గాణ మంత్రి హరీష్‌రావు వ్యాఖ్యలు వాటిపై ఎ.పి మంత్రుల ప్రతిసవాళ్లు వివాదానికి దారితీయ డం దురదృష్టకరం.ఎనిమిదేళ్ల కిందటే విడిపోయి ఇంకా విభజన సమస్యలు కూడా పరిష్కారం గాని రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పర వ్యతిరేక భావాలకు ఆస్కారం ఇవ్వడం సరైంది కాదు. బిఆర్‌ఎస్‌, వైసిపి లు పార్టీలుగా వాదించుకోవచ్చు గాని సోదర రాష్ట్రా లుగా సవాళ్లు, ప్రతి సవాళ్లతో రెచ్చగొట్టుకోవడం ఉభయులకూ శ్రేయస్కరం కాదు. తమ తమ పథకాలను ఎవరైనా కీర్తించుకోవచ్చు గాని అంతిమ తీర్పరులు ప్రజలే. (ప్రజాశక్తి సౌజన్యంతో..)

ప్రజాస్వామ్యం బలహీనపడుతుందా?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడు తోందని స్వీడన్‌కు చెందిన వీ-డెమ్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని ఈ నివేదిక చెప్తోంది. స్వీడన్‌లోని గూటెన్‌బర్గ్‌ విశ్వవిద్యా లయానికి అనుబంధంగా వీ-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పనిచేస్తోంది.‘ఉదారవాద ప్రజా స్వామ్య సూచీ’ (లిబరల్‌ డెమొక్రసీ ఇండెక్స్‌) పేరుతో మొత్తం179 దేశాలకు ఈ సంస్థ ర్యాంకులు ఇచ్చింది. ఇందులో భారత్‌ 90వస్థానంలో నిలవగా,డెన్మార్క్‌ మొదటి స్థానం పొందింది. భారత్‌ పొరుగు దేశాలైన శ్రీలంక 70వ స్థానంలో, నేపాల్‌ 72వ స్థానంలో, పాకిస్తాన్‌ 126 స్థానంలో, బంగ్లాదేశ్‌ 154వ స్థానంలో నిలిచాయి. మోదీ ప్రభుత్వ పాలనలో మీడియా, పౌర సమాజం, ప్రతిపక్షాలకు స్థానం సన్నగిల్లు తుండటంతో భారతదేశం ప్రజాస్వామ్య హోదాను కోల్పోయే దిశలో ఉందని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలను, స్థానిక సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని తయారుచేసినట్లు వీ-డెమ్‌ ప్రతినిధులు తెలిపారు. సంక్లిష్టమైన డాటా ఆధారంగా ఈ రిపోర్ట్‌ తయారు చేశామని, అందువల్ల ఇది, మిగతా రిపోర్టుల కన్నా భిన్నమైందని తెలిపారు.
ప్రజాస్వామ్యం అంటే…
‘‘ప్రజాస్వామ్యానికి ఎనిమిది లక్షణాలు ఉండాలి. అవి…భావ ప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదం (సెక్యులరిజం), మత జోక్యం లేని ప్రభుత్వం, గణతంత్ర వ్యవస్థ, చట్టం ముందు అందరికీ సమానత్వం, ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు’’ ఉండాలని ప్రసార భారతి మాజీ ఛైర్మన్‌ ఎ.సూర్య ప్రకాశ్‌ అన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వైవిధ్యం ఎక్కువగా కనిపిస్తుందని ఆయన అన్నారు.‘‘ప్రతి దేశంలోనూ ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. మొత్తం తప్పును మోదీ ప్రభుత్వంపై మోపుతున్నారంటే, వాళ్లకి మన రాజ్యాంగం అర్థం కాలేదనే అనుకోవాలి. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాల్లో సగం వాటిలో వివిధ పార్టీలు అధికారంలో ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో 42 పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కూటమే! అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో సహా పలు దేశాల నేతలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశంసిస్తున్నారు’’ సూర్య ప్రకాశ్‌ అన్నారు. ‘‘భారత్‌లో తగ్గిపోతున్న ప్రజాస్వామ్య విలువలు, ముఖ్యంగా ఉదారవాదం క్షీణిస్తున్న పరిస్థితిని చాలావరకూ వీ-డెమ్‌ నివేదిక తెలియజేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వతంత్రకు ముప్పు, భిన్నాభిప్రాయాలను అణచివేయడం లాంటి విషయాల్లో ప్రభుత్వ అసహనం కనిపి స్తోంది’’ అని అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ప్రజాస్వామ్య నిపుణులు నిరంజన్‌ సాహూ అన్నారు. ‘‘భారత్‌లో మీడియాకు స్థానం తగ్గిపోతోందని ఈ నివేదికలో తెలిపారు. గత ఎనిమిది, పదేళ్లల్లో మన దేశంలో ఏం జరిగిందనే వీళ్లకు తెలీదు. ‘రిజిస్టార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌’ ప్రతి సంవత్సరమూ కొన్ని గణాంకాలను విడుదల చేస్తుంది. వీటి ప్రకారం 2014లో దినపత్రికల సర్క్యులేషన్‌ 14 కోట్లు ఉండగా, 2018కి అది 24 కోట్లకు పెరిగింది. దేశంలో ఉన్న 800 టీవీ ఛానళ్లలో 200 న్యూస్‌ ఛానల్స్‌ ఉన్నాయి. ఐదేళ్లల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్లు 15 కోట్ల నుంచీ 57 కోట్లకు పెరిగాయి. నియంతృత్వమే ఉంటే మీడియా ఇంతలా ఎలా విస్తరిస్తుంది? రోజూ టీవీ ఛానళ్లల్లో అనేకరకాల చర్చలు జరుగు తుంటాయి. ఒకరోజంతా సోషల్‌ మీడియాలో మోదీని దూషిస్తూ ఉన్న హాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవ్వడం గమనించాను. మీడియా స్వేచ్ఛ లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి?’’ అని సూర్య ప్రకాశ్‌ అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రవంటి కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ట్వీట్ల ఆధారంగా అరెస్టులు జరిగాయి. కానీ దానికి మోదీ బాధ్యులు ఎలా అవుతారు? రాష్ట్రాల్లో న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని తెలీదా?’’ అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో లోపమా?
‘‘ఒకప్పుడు భారతదేశంలో ప్రభుత్వ ఒత్తిడికి లొంగని న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం ఉండేవి. వీటి పనితీరు ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ సంస్థలన్నిటినీ ప్రభుత్వానికి అనుగుణంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్యకర్తలను, ప్రతిపక్ష నాయకులను నెలల తరబడి, బెయిల్‌ కూడా ఇవ్వకుండా నిర్బంధంలో ఉంచుతున్నారు. వీటన్నింటినీ చూస్తూ న్యాయ వ్యవస్థ ముఖం తిప్పుకుంటోంది. ఇలాంటి చర్యలకు జవాబు దారీతనం ఉండేలా చూసే యంత్రాంగం మాయమైపోయింది’’ అని నిరజంన్‌ సాహూ అన్నారు. ‘‘మత రాజకీయలకు పెద్ద పీట వేశారు. సోషల్‌ మీడియా ద్వారా మత రాజకీయలు ఎక్కువగా నడుస్తున్నాయి. దీనివల్ల పాలక వర్గం రాజకీయ లబ్ధి పొందుతోంది. ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛకు ప్రతికూలత ఏర్పడుతోంది. దేశంలో రాజకీయ వాతావరణం విషపూరితం అవుతోంది. మైనారిటీలను, ప్రతిపక్ష నాయకులను విలన్లుగానూ, దేశ ద్రోహులుగానూ చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆయన అభిప్రా యపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఇంతకుమునుపు కూడా కొన్ని నివేదికలు వచ్చాయి. వీ-డెమ్‌ ఒక్కటే కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మరి కొన్ని సంస్థలు కూడా ఇలాంటి నివేదికలను సమర్పించాయి.
అమెరికాకు చెందిన ‘ఫ్రీడం హౌస్‌’ సంస్థ 2019 ఘటనల ఆధారంగా విడుదల చేసిన నివేదిక… ‘‘మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య విలువలు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, భిన్నత్వానికి భంగం కలుగుతోంది. ఇలా అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కువకాలం మనుగడ సాగించలేదు’’ అని పేర్కొంది.2017లో సివికస్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో…. ‘‘భారతదేశంలో పౌర సమాజం స్థానం క్షీణిస్తోంది. 2014లో మోదీ ప్రభుత్వం పాలనలోకి వచ్చినప్పటినుంచీ ప్రజాస్వామ్యం నాణ్యత తగ్గుతోంది. ప్రతిపక్షాల స్థానం సన్నగిల్లుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినవారిని లక్ష్యంగా చేసుకునే అవకాశాలున్నాయి’’ అని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉందా?
జీ-20లోని అన్ని ప్రధాన దేశాలూ, అన్ని రంగాల్లోనూ నియంతృత్వ పోకడలను కనబరు స్తున్నాయని..భారత్‌, అమెరికా, టర్కీ, బ్రెజిల్‌ వంటి దేశాలలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని వీ-డెమ్‌ నివేదికలో పేర్కొన్నారు. ‘‘భారతదేశంలో కనిపిస్తున్న నియంతృత్వం, ప్రపంచంలో కొనసాగుతున్న నియంతృత్వంలో భాగమే. ప్రపంచ మార్గాన్నే భారతదేశం కూడా అనుసరిస్తోంది. ఈ ధోరణి కొనసాగితే ప్రపం చంలో 80 శాతం దేశాలు నితంతృత్వ దేశాలుగా మారే అవకాశాలున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం’’ అని వీ డెమ్‌ అధ్యక్షులు స్టాఫన్‌ లిండ్బర్గ్‌ అభిప్రాయపడ్డారు.‘‘దీనికి కారణం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే లోపాలున్నాయని అనుకునే అవకాశం ఉంది. అది మరింత ప్రమాదకరం. పోలాండ్‌, టర్కీ, భారత్‌, బ్రెజిల్‌, హంగేరీ, అమెరికా వంటి దేశాలలో నియంతృత్వ పోకడలు పెరుగుతున్నాయన్న విషయంలో సందేహం లేదు. అయితే ఈ ధోరణి గత దశాబ్దాలలో కూడా ఉందనే చెప్పాలి’’ అని నిరంజన్‌ సాహూ అభిప్రాయపడ్డారు.
‘‘నియంతలు రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్యంలోని అన్ని నిబంధనలను ఉపయోగించి అధికారంలోకి వస్తారు. అధికారంలో ఎక్కువకాలం కొనసాగడానికి చట్టాన్ని దుర్వినియోగం చేస్తారు’’ అని లిండ్బర్గ్‌ అన్నారు.ఇందుకు టర్కీని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్‌ పార్లమెంటును ఉపయోగించి రెండుసార్లు రాజ్యంగాన్ని మార్చివేశారు. ‘‘కరోనా మహమ్మారి కాలంలో భారతదేశంలో కొన్ని ప్రజాస్వామిక విలువలు దెబ్బతిన్నాయన్నది వాస్తవమే. కొన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ తప్పుదారి పట్టింది. కొన్ని అకారణ అరెస్టులు జరిగాయి. అయితే, ప్రజాస్వామ్య మూలాలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయలేదు’’ అని సూర్య ప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్యం అనేది గ్రీకు పదం, ‘‘డెమోస్‌’’ నుండి వచ్చింది, అంటే ప్రజలు. ప్రజాస్వా మ్యంలో, శాసనసభ్యులు మరియు ప్రభుత్వంపై సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నవారు ప్రజలే. ప్రపంచంలోని వివిధ ప్రజాస్వామ్యాలకు సూక్ష్మ నైపుణ్యాలు వర్తింపజేసినప్పటికీ, కొన్ని సూత్రాలు మరియు పద్ధతులు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాల నుండి వేరు చేస్తాయి.
ా ప్రజాస్వామ్యం అంటే అధికారం మరియు పౌర బాధ్యతను పౌరులందరూ నేరుగా లేదా వారి స్వేచ్ఛగా ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా వినియోగించుకునే ప్రభుత్వం.
ా ప్రజాస్వామ్యం అనేది మానవ స్వేచ్ఛను రక్షించే సూత్రాలు మరియు అభ్యాసాల సమితిబీ అది స్వేచ్ఛ యొక్క సంస్థాగతీకరణ.
ా వ్యక్తిగత మరియు మైనారిటీ హక్కులతో పాటు మెజారిటీ పాలన సూత్రాలపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రజాస్వామ్యాలు, మెజారిటీ ఇష్టాన్ని గౌరవిస్తూ, వ్యక్తులు మరియు మైనారిటీ సమూహాల ప్రాథమిక హక్కులను ఉత్సాహంగా పరిరక్షిస్తాయి.
ా ప్రజాస్వామ్యాలు సర్వశక్తిమంతమైన కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తాయి మరియు ప్రాంతీయ మరియు స్థానిక స్థాయిలకు ప్రభుత్వాన్ని వికేంద్రీకరిస్తాయి, స్థానిక ప్రభుత్వం ప్రజలకు వీలైనంత అందుబాటులో మరియు ప్రతిస్పందించేదిగా ఉండాలి.
ా వాక్‌ స్వాతంత్య్రం మరియు మతం వంటి ప్రాథమిక మానవ హక్కులను పరిరక్షిం చడం వారి ప్రధాన విధుల్లో ఒకటి అని ప్రజాస్వామ్యాలు అర్థం చేసుకున్నాయి. చట్టం ప్రకారం సమాన రక్షణ హక్కు, సమాజం యొక్క రాజకీయ,ఆర్థిక మరియు సాంస్కృతిక జీవితంలో పూర్తిగా నిర్వహించడానికి మరియు పాల్గొనడానికి అవకాశం.
ా ప్రజాస్వామ్యాలు పౌరులందరికీ బహిరంగంగా ఉచిత మరియు న్యాయమైన ఎన్నికలను నిర్వహిస్తాయి. ా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నియంతలు లేదా ఒకే పార్టీ వెనుక దాక్కున్న ముఖద్వారాలు కావు, కానీ ప్రజల మద్దతు కోసం ప్రామాణికమైన పోటీలు.
ా ప్రజాస్వామ్యం ప్రభుత్వాలను చట్ట పాలనకు లోబడి చేస్తుంది మరియు పౌరులందరికీ చట్టం క్రింద సమాన రక్షణ లభించేలా మరియు వారి హక్కులు న్యాయ వ్యవస్థ ద్వారా రక్షించబడుతున్నాయని నిర్ధారిస్తుంది.
ా ప్రజాస్వామ్యాలు విభిన్నమైనవి, ప్రతి దేశం యొక్క ప్రత్యేక రాజకీయ, సామాజిక మరియు సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రజాస్వామ్యాలు ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటాయి, ఏకరీతి పద్ధతులపై కాదు.
ా ప్రజాస్వామ్యంలో పౌరులకు హక్కులు మాత్రమే కాదు, వారి హక్కులు మరియు స్వేచ్ఛలను రక్షించే రాజకీయ వ్యవస్థలో పాల్గొనే బాధ్యత కూడా వారికి ఉంది.
ా ప్రజాస్వామ్య సమాజాలు సహనం, సహకారం మరియు రాజీ విలువలకు కట్టుబడి ఉంటాయి. ఏకాభిప్రాయానికి రాజీ అవసరమని ప్రజాస్వామ్యాలు గుర్తించాయి మరియు అది ఎల్లప్పుడూ సాధించబడకపోవచ్చు. మహాత్మా గాంధీ మాటలలో, ‘‘అసహనం అనేది హింస యొక్క ఒక రూపం మరియు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక అడ్డంకి.’’
ప్రజాస్వామ్యం ద్వారా పొందిన అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర పన్నుతోంది. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం ‘గోప్యత నిర్వీర్యం..అణచివేత..నిఘా..’ అనే ఫార్ములాను అనుసరిస్తోంది. ఓ వైపు రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూనే..ప్రజా ఉద్యమాలను అణచి వేస్తోంది. నిర్బంధాలను అమలు చేస్తోంది. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలైన చట్టసభలు, ఎగ్జిక్యూటివ్‌ వ్యవస్థ, న్యాయ వ్యవస్థతోపాటు మీడియాపై నిఘా పెట్టి.. ఎవరైనా తమకు అనుకూలంగా లేనట్టు తేలితే వారిని ముప్పు తిప్పలు పెడుతోంది. అదే విధంగా ప్రభుత్వం వైపు నుంచి పారదర్శకంగా ఉండాల్సిన విధానాల పట్ల గోప్యతను పాటిస్తోంది. 2014లో అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి కాషాయ పార్టీ పాటిస్తున్న విధానాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది.-(మహమ్మద్‌ ఆరిఫ్‌/జుబేర్‌ అహ్మద్‌)

1 2 3 11