ఏజెన్సీ స్వరాజ్య సింహం` చింతల చెరువు వెంకటాద్రి

‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది. ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్‌ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్‌’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్‌’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.

గిరిజన ప్రజలకు నెలవైన గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం ఏజెన్సీలో ఒకసాధారణ గ్రామం చర్ల. మన దేశంలో ఒకేపేరుతో అనేక గ్రామాలు ఉన్నాయి కానీ ‘‘చర్ల’’ అనే రెండు అక్షరాల పేరుతో మరెక్కడ ఒక్కగ్రామం లేకపోవడం ఒక విశేషం!! అలా ఎన్నో విశేషాలకు సాక్షి భూతమైన చర్ల ప్రాంతంలో తొలిసారిగా స్వరాజ్య ఉద్యమస్ఫూర్తిని అందించడానికి గిరిజనగ్రామాలలో కాలి నడకన,సైకిళ్లు,ఎడ్లబండ్ల, సాయంతోతిరిగి స్వరాజ్య స్ఫూర్తిని ఉద్యమ చైతన్యం నింపిన నాటి ఏజన్సీ‘‘స్వరాజ్య సింహం చింతలచెరువు వెంకటాద్రి’’.
గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా మృత్యుంజయ పురంలో ‘‘చింతలచెరువు వెంకట్రామయ్య – లక్ష్మమ్మ’’ దంపతులకు 5వ సంతానంగా 1889 నవంబరు20న వెంకటాద్రి జన్మించారు. పన్నెండేళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన ఆలనాపాలనా అన్న గార్ల మీదేపడిరది, బ్రతుకుతెరువు కోసం మిత్రుల సహాయ సలహాలతో వీరి పెదనాన్న వెంకటప్పయ్య గారు భద్రాచలం డివిజన్లోని వెంకటాపురంలో 1896సంవత్సరం పట్వారి ఉద్యోగంలో చేరారు, దానితో మిగతా కుటుంబ సభ్యులంతా వెంకటాపురం చేరుకొని ఆనాటి సాధారణ ఉద్యోగాలైన పట్వారి పనులు చేస్తూ కొందరు, మరికొందరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించారు. పట్వారి ఉద్యోగం చేసేవారు వ్యవసాయం చేయడం ఆ రోజుల్లో నిషేధం.
వెంకటాపురం సమీపంలోని ఆలుబాకలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న వెంకటాద్రిగారు, సోదరుని వద్ద సాధారణ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని స్వయంకృషితో తెలుగుతోపాటు ఇంగ్లీష్‌, హిందీ భాషలు నేర్చుకొని చక్కని సాహిత్య పరిజ్ఞానం కూడా పెంచుకున్నారు. అన్నగారి సాయంతో 1908 సంవత్సరం లో కొత్తగా ఏర్పడ్డ ‘‘పడిగాపురం’’(వాజేడు సమీపంలో ప్రస్తుతం అంత రించిన గ్రామం) సర్కిల్లో ‘‘పట్వారి’’ కొలువులో చేరారు.
గుంటూరుకు చెందిన మహాలక్ష్మమ్మని పెళ్లి చేసుకున్నారు వెంకటాద్రి,ఆమె అక్క గారు ఏలూరులోని ప్రముఖ ప్రచురణ సంస్థ వెంకట్రామా అండ్‌ కంపెనీ యజమాని ‘‘ఈదర వెంకట్రావు’’ గారి భార్య, దరిమిలా వెంకటాద్రిగారి తోడల్లుడు ద్వారా సాహితీవేత్తలతో పరిచయం. సాహిత్యంపై మక్కువ పెరిగాయి. దాని ద్వారా అందిన సామాజిక స్పృహ ఆయనను జాతీయోద్యమం వైపు నడిపించింది. 1908 సంవత్సరంలో భద్రాచలం డివిజన్‌ మద్రాసు రాజధాని పరిధిలో ఉండేది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా అక్షర పరిజ్ఞానం లేక పూర్తి స్తబ్ధతతో ఉన్న ఈగిరిజన ప్రాం తంలో వెంకటాద్రి వారిని చైతన్య పరచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉదర పోషణ కోసం ఉద్యోగం చేస్తున్న ఆయన ఆలోచనంతా సమాజ శ్రేయస్సు కోసమే ఉండేది.
ఆ రోజుల్లో వెలువడుతున్న ఒకేఒక తెలుగు దిన పత్రిక ‘‘ఆంధ్రపత్రిక’’దానిని ఈ ప్రాంతంలో పోస్టు ద్వారా తెప్పించుకున్న ఏకైక వ్యక్తి వెంకటాద్రి, నాటి స్వరాజ్య ఉద్యమ వార్తలు నాయకుల ప్రసంగాలు, ప్రకటనలు, చదివి తాను స్ఫూర్తి పొందడం కాక గాంధీజీ పట్ల ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులై ఉద్యమంపట్ల మక్కువ పెంచుకున్నారు. గ్రామగ్రామాన తిరిగి గిరిజనులకు నాటి దేశ పరిస్థితులు,బ్రిటిష్‌ వారి అరాచకాలు వివరించేవారు. కాలక్రమేణా ఆయనకు ఉద్యోగం కన్నా సమాజ సేవే ముఖ్య మని దేశ స్వరాజ్యమే ప్రధానం అనే భావన కలిగింది, ఈయన చర్యలు ఎప్పటికప్పుడు గమని స్తుండే పైఅధికారులు అతని పై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు. 1921 డిసెంబరులో అహ్మదాబాదులో భారత జాతీయ కాంగ్రెస్‌ ‘‘పన్నుల నిరాకరణ ఉద్యమా నికి’’ పిలుపునివ్వడంతో వెంకటాద్రి తన గ్రామ కర్నికానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఉద్యమంలో ప్రవేశించారు. నాటి ప్రముఖ స్వరాజ్య ఉద్యమ నాయకులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూ తన ‘‘ఉద్యమ స్నేహరాజ్యం’’ విస్తరించుకున్నారు. ఆయనలోని స్వరాజ్య కాంక్ష పట్టుదల మాట తీరు తదితర లక్షణాలు తెలిసిన దేశభక్త కొండా వెంకటప్ప య్య గారి పిలుపు మేరకు అష్టకష్టాలు పడి కాలినడకన ఇల్లందు చేరి అక్కడ నుంచి రైల్లో గుంటూరు వెళ్లి వెంకటప్పయ్య గారి నాయక త్వంలో ‘‘సహాయ నిరాకరణోద్యమంలో’’ పాల్గొన్నారు. అక్కడ టంగుటూరి ప్రకాశం, కళావెంకట్రావు,భోగరాజు పట్టాభి సీతారా మయ్య, కొండా వెంకటప్పయ్య, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వంటి పెద్దలతో పరిచయాలు ఏర్పడ్డాయి. అనంతర కాలంలో వారితో కలిసి వెంకటాద్రి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పది నెలల పాటు అక్కడే స్వరాజ్య ఉద్యమంలో గడిపి తిరిగి వెంకటాపురంచేరి తాను గుంటూరులో పొందిన ఉద్యమస్ఫూర్తితో గిరిజన గ్రామాలు తిరుగుతూ జాతీయోద్యమ అవసరాన్ని తనదైన వాక్చాతుర్యంతో ప్రచారం చేశారు.వెంకటాపురం నుంచి వి.ఆర్‌.పురం (వరరామచంద్రపురం) వరకు వెంకటాద్రి గారికి స్వరాజ్య ఉద్యమ అనుచరగణం ఉండేది. ఆ రోజుల్లో గోదావరి రేవు ప్రాంతం ‘‘దుమ్ముగూడెం’’ పెద్ద వ్యాపార కేంద్రంగా ఉండేది. స్వరాజ్య ఉద్యమకారులకు అదే కేంద్రంనిలయం. ఆప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత రంగూన్‌ రౌడీ నాటకకర్త ‘‘సోమరాజు రామానుజరావు’’ భద్రాచలంకు చెందిన కురిచేటి శ్రీరామ్మూర్తి,ఆర్‌.కొత్తగూడెం చెందిన భూపతిరాజు బుచ్చి వెంకటపతిరాజు, మొదలైన వారంతా ఆయన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించే వారు. ఈ క్రమంలో వెంకటాద్రి గారి కుటుంబాలకు అనివార్య కారణాలతో చర్లకు చెందిన భూస్వామి ‘‘ముత్యాల వెంకట స్వామి’’ స్నేహం లభించింది. ఆయన సలహా మేరకు చర్లకు చేరి వ్యవసాయ భూములు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం ద్వారా జీవనం సాగించేవారు, దీనితో వెంకటాద్రి గారి స్వరాజ్య పోరాట కేంద్రం చర్లకు మారింది. ఆయన కార్య దీక్షను తెలుసుకున్న విప్లవం వీరుడు’’అల్లూరి సీతారామరాజు’’తన అజ్ఞాత పర్యటనలో భాగంగా ఒకరాత్రి చర్లకు వచ్చి తన పోరాటానికి సహకరించమని వెంకటాద్రి గారిని కోరారు, కానీతాను మొదటి నుంచి గాంధేయవాదానికి అహింస సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పి రామరాజు అభ్యర్థులను సున్నితంగా తిరస్కరించారు.1926 సంవత్సరములో మన్యం ప్రాంతపు పోలవరం గ్రామంలో ‘‘పునులూరు కోదండరామయ్య’’ నేతృత్వంలో ‘‘స్వరాజ్య ఆశ్రమం’’నెలకొల్పారు 1929 మే 9న గాంధీజీ ఆ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు వెంకటాద్రి తన అనుచరగణంతో పోలవరం వెళ్లి మహాత్ముని తొలిసారి దర్శనభాగ్యం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
ఆ స్ఫూర్తితో ఆశ్రమం చేపట్టే ప్రతి ఉద్యమ కార్యక్రమాల్లో ఆయన పాత్ర ప్రముఖంగా ఉండేది. 1929 డిసెంబర్‌లో లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వెళ్ళిన వెంకటాద్రి అక్కడి నాయకుల ప్రసంగాలతో తనలో అచంచలమైన ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు.1930 సంవత్సరంలో గాంధీజీ ఉప్పుసత్యాగ్రహంకు పిలుపునిచ్చి దండి యాత్ర ప్రారంభించారు. సముద్ర తీర ప్రాంతాల ఉద్యమకర్తలు తమ ప్రాంతాల్లో ఉద్యమానికి మద్దతుగా ‘‘ఉప్పుతయారీలు’’ మొదలుపెట్టారు సముద్రానికి దూరంగా మన్యం ప్రాంతంలో ఉన్న వెంకటాద్రి గారికి ఏం చేయాలో అర్థంకాక చివరికి చౌడు మట్టి నుంచి ఉప్పు తీయవచ్చని ఆలోచనతో పాత చర్లలోని చెరువు దగ్గర ఆయన ఉప్పు సత్యాగ్రహ దీక్షకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఈ ఉద్యమం పెను సవాలుగా నిలిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటాద్రి గారి దీక్షను భగ్నం చేసి లాఠీలతో కొట్టి చిత్రహింసలకు గురి చేసి భద్రాచలం తీసుకువెళ్లి అక్కడి నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారానికి పంపించారు. అక్కడ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చారు. అనంతరం 1932లో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కూడా పాల్గొని ప్రముఖ పాత్ర పోషించారు.రాజాజీ మంత్రివర్గములో మద్రాసు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశం 1938 సంవత్సరంలో ‘‘జమిందారి రిపోర్ట్‌’’ తయారు చేయడానికి చర్ల వచ్చినప్పుడు ఆయన లోని కర్తవ్య దీక్షను వెంకటాద్రి ప్రత్యక్షంగా గమనించి ప్రభావితం చెందారు.
1939 సంవత్సరంలో త్రిపురలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశాలకు వెంకటాద్రి హాజరయ్యారు. సుభాష్‌ చంద్రబోస్‌ను ప్రత్యక్షంగా అక్కడే దర్శించుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చాక రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీకి, తూర్పుగోదావరి జిల్లా కమిటీ, సభ్యులుగా ఎన్నికయ్యారు.
1942 వ సంవత్సరంలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన మన్యం ప్రాంతానికి నాయకత్వం వహించి తన సహచరులతో కలిసి అనేక చోట్ల జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వరాజ్యఉద్యమ శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
స్వాతంత్రానంతరం ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా నిస్వార్ధంగా గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి తాను నమ్మిన పార్టీలోనే కొనసాగి తన కార్య క్షేత్రమైన చర్ల అభివృద్ధికి తన సొంత ఆస్తులు సైతం అందించిన త్యాగశీలి, 1951 ఫిబ్రవరి 14న చర్లలో ప్రాథమిక సహకార సంఘం, స్థాపించడం శాఖ గ్రంథాలయానికి సొంత స్థలం ఇల్లు వితరణ చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసిన త్యాగమూర్తి వెంకటాద్రి,
తన సహచరులు ‘‘దేవభక్తుని నందీశ్వరుడు’’ తదితరులతో కలిసి చర్లలో క్రీడా,సాంస్కృతిక, సేవా,కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషి నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంది.
ఆయన స్వరాజ్య, సంఘ సేవ కృషికిగాను 1982 సంవత్సరంలో నాటి మన ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాదులో సమరయోధులకు ఇచ్చే తామ్రపత్రం అందించారు. 1983 అక్టోబర్‌ 2న ‘‘మహాత్మా గాంధీ శతజయంతి సేవాసదన్‌’’ వారు మహాత్ముని జ్ఞాపికతో సత్కరించారు ‘‘ఏజెన్సీ లయన్‌’’ అనే బిరుదును ప్రదానం చేశారు. కడదాకా గాంధేయవాదంతో, ఖద్దరు వస్త్రధా రణతో, సేవ భావమే జీవనంగా బ్రతికిన ‘‘చింతలచెరువు వెంకటాద్రి’’ తన 96వ ఏట 15 జూలై 1986 న తన అభిమాన పుత్రుడు, సంఘసేవ వారసుడు, సి.వి.కె.రావు ఇంట చర్లలోని రైసుపేటలో తనువు చాలించి, మన్య ప్రాంతానికి ‘‘స్వరాజ్య పోరాట సింగమైనిలిచారు’’.- డా.అమ్మిన శ్రీనివాసరాజు

చెట్లు కూలితున్న దృశ్యం

తెలుగు కథావనంలో గిరిజన కథాసుమాలు…

అడవి బిడ్డలు అంటే అందమైన అడవుల్లో నివసిస్తూ స్వచ్ఛమైన జీవనం సాగిస్తూ శ్రమైక జీవన సౌందర్యంతో జీవిస్తూ అమూల్యమైన సంస్కృతిని అత్యంత విలువైన అటవీ సంప దను సంరక్షించు కుంటారు అని అందరం భావిస్తాం.. కానీ, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే! మరోవైపు నిత్యం జీవన్మరణ సమస్య తమ ప్రాంతంలోనే తాము పరాయి తనం అను భవిస్తూ దుర్భర జీవితం గడుపు తున్న దౌర్భాగ్యం వారిది.
ఇక గిరిజన కథలు ప్రారంభంలో వారి యొక్క జీవన్మరణ పోరాటం గురించిన నేపథ్యం తో రాగా ఇటీవలవారి వికాసం సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంతో కథలు వెలువడు తున్నాయి. ఈరెండు విభాగాల కథలను గురిం చిన అభిప్రాయాలు విభేదాలు ఎలాఉన్నా వేటి అవసరం వాటికి ఉంది. అలాగే ఈరెండు రకాల కథలను గిరిజన కథ సామ్రాజ్యంలో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. అందులో భాగంగానే గిరిజనకథల ప్రారంభ దశకు చెం దిన కథ ‘‘చెట్లు కూలుతున్న దృశ్యం’’ గురించిన విశ్లేషణలోకి వెళదాం.
రచయిత డాక్టర్‌ దిలావర్‌ అవిభక్త వరంగల్‌ జిల్లా ఇల్లందు తాలూకాలోని మారు మూల గ్రామం పాత కమలాపురంలో జన్మిం చినఉద్యోగరీత్యా 25సంవత్సరాలపాటు సంపూర్ణ గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయు డుగా తెలుగు ఉపన్యాసకునిగా సేవలు అంది స్తూనే తనకుగల పర్యటన అభిరుచి మేరకు అరకులోయ నుంచి ఆదిలాబాద్‌ వరకు అనేక గిరిజన ప్రాంతాలు పర్యటించి ఆయా ప్రాంతా లలోని విభిన్న పద్ధతుల్లో జీవిస్తున్న గిరిజనుల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి, తెచ్చు కున్న అనుభూతితో వారి జీవన్మరణ సమస్య లను చూస్తూ రాయకుండా ఉండలేను అన్న తపనతో అచ్చంగా అడవిబిడ్డల వ్యధలతో కూడిన 12కథలు రాసి 2014సంవత్సరంలో వాటిని ‘కొండా కోనల్లో’ పేరుతో సంపు టిగా ప్రచురించార్ను ఈడజనుకథల్లో మేటిగా నలుగురితో మెచ్చ బడిన కథే ‘‘చెట్లు కూలు తున్న దృశ్యం’’ పేరులోనే రచయితలోని కవి తొంగి చూస్తాడు, ఇక కథ నిండా అవసరం మేరకు రచయిత తన అడవి అనుభూతులను అందంగా కవితాత్మకంగా చెబుతూ స్థానిక సామెతలు,జాతీయాలు,ఉపయోగిస్తూ, కథా వస్తువుకు చేటు రానీయకుండా కథను చది వింపచేసే ప్రయత్నంలో రచయిత సఫలీకృ తులయ్యారు అనవచ్చు. ఇక కథ విషయానికొస్తే ‘‘జోజి’’ అని గిరిజన యువకుడు చదువుకుని అటవీ శాఖలో బీట్‌ అధికారికి సహాయకునిగా ఉండే ప్రభుత్వ ఉద్యోగం పొందుతాడు. అది తనకు తన కుటుంబానికి భరోసా కానీ తన యావత్‌ గిరిజన జాతి అభివృద్ధి తన అభివృద్ధి గా భావించే సామాజిక స్పృహ గల యువ కుడు’’జోజి’’. అందులో భాగంగానే తన జాతి మనుగడ కోసం చేయాల్సిన పోరాటాల గురించి చైతన్యపరిచే సభ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో జరుగుతుందన్న ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళిన ‘‘జోజి’’కి కలిగిన తన జాతి జీవన స్థితిగతులకు చెందిన ఆలోచనలు రూపమే ఈకథ. నిత్యం అడవుల్లో తిరిగే గిరిజ నులకు అక్కడ ఉండే క్రూరమృగాల బారినుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు, కానీ మానవత్వం లేని ఆధునిక మనుషులు అధి కారుల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలి యక నానా అవస్థలు పడుతున్న అడవిబిడ్డల స్థితిని రచయిత ‘‘డిలావర్‌’’ కళ్లకు కట్టినట్లు అక్షరీకరించారు. అది కూడా జోజి పనిచేసే అటవీశాఖ అధి కారులు తమ గిరిజనులను పెడుతున్న హింసకు తోటి ఉద్యోగి అయ్యికూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అతనిది, సాధా రణ అవసరాలు తీర్చుకోవ డానికి కూడా తనతల్లి లాంటి అడవి మీద ఆధా రపడ కూడదు అన్న అటవీ అధికారుల అనాలోచిత ఆంక్షలతో అడవిబిడ్డల ఆవేదన అంతా ఇంతా కాకుండా పోతుంది. ఒకరోజు తెల్లవారుజామున తన గూడెం ఆడపిల్లలు ఇప్పపువ్వు ఏరడానికి సమీపంలోని అడవికి వెళ్లగా అదును చూసి ఆ గిరిజన యువతులను అనుభవించిన అటవీ అధికారులు అకృత్యం చెవులారా విన్న జోజి హతా శుడై నివురుగప్పిన నిప్పులా మారిన సంఘటనను కూడా చాలా అందంగా ఆసక్తికరంగా కథనాత్మక గా అక్షరీకరించడంలో దిలావార్‌ సాబ్‌ మస్తు నైపుణ్యం కనబరిచాడు. అడవిలో ఉండే ప్రజలను జంతువులను రక్షించాల్సిన అటవీ అధికారులు, పోలీసు ఆఫీసర్లు, వారికి వాటికి ఎలా శత్రువులుగా తయారై హింసి స్తున్నారో ప్రత్యక్షంగా అనుభవైక్యం పొందిన రచయిత తనదైన ధర్మాగ్రహ రూపంలో పరిస్థితులను ‘‘అక్షర చిత్రీకరణ’’ చేసి భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు అనిపిస్తుంది ఈ కథ చదువుతుంటే!!!
‘‘కంచే చేను మేసిన వైనంగ’’ అటవీ అధికారుల చర్యలను ఈ కథలో వివరించే ప్రయత్నాలు అనేక సంఘటనల సాయంగ జరిగింది,
ఒకరోజు తెల్లవారుజామున తన విధుల్లో భాగం గా అధికారులతో కలిసి అడవి లో తిరుగుతున్న‘‘జోజి’’కి చిత్రమైన సంఘటన అనుభవమవుతుంది, కరెంట్‌ తీగల ద్వారా అడవి జంతువులను ఎలా వేటాడుతున్నారు దానికి అటవీ అధికారుల సహకారం ఎంత చిత్రంగా అందుతుం దో తెలుసుకున్న జోజి మనసు మొద్దు బారిపోతుంది, అప్పటివరకు కేవలం అడవి బిడ్డలే వారి అమానుష త్వానికి బలవుతున్నారు అనుకున్న జోజి ఆలోచన లకు కొత్త సమస్య వచ్చి చేరింది. అభం శుభం తెలియని మూగజీవాలు సైతం ఈ మృగాళ్ల బారిన పడి ఎలా జీవితాలు జీవనాలు కోల్పోతున్నారో తెలిసింది. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఎలా? అదే జోజి మనసులో చెలరేగుతున్న హిమజ్వాల!! తలవని తలంపుగా ఆ రాత్రి రేంజ్‌ ఆఫీసర్‌ ఇంట్లో జరిగే పార్టీకి రావాలని జ్యోతికి ఆహ్వానం అందిం ది. రాత్రి ఎనిమిదింటికల్లా చెప్పిన చోటికి చేరుకు న్నాడు జోజి అధికారుల మాట సమయపాలన పాటించే చిరుద్యోగిల అక్కడ ఏర్పాట్లు చూసిన జోజి మనసు ఏదో కీడు శంకించింది. మళ్లీ ఏదో చూడకూడని దృశ్యం ఏదో చూడాల్సి వస్తుందని ఆందోళనతో అటుగా వెళ్లి సిద్ధంగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అన్నట్టుగానే ఆధునిక మత్తుపానీ యాలు సిద్ధం చేయబడి ఉన్నాయి జోలికి కూడా అవకాశం కల్పించారు అధికారులు, తనకు అల వాటు లేదన్న విషయం చెప్పి వాళ్లతో హేళన చేయబడ్డాడు చివరికి దుప్పి మాంసం వేపుడన్నా మాతో కలిసి చేయమని ఆజ్ఞాపించిన తనపై అధి కారుల ఆదేశాలతో నివ్వెర పోవడమేకాదు పొద్దున అడవిలో కరెంటు తీగెల ఉచ్చులద్వారా వేటాడిన దుప్పి దృశ్యం కళ్ళముందునిలవడంతో ‘‘జోజి’’ మనసు కాకా వికలమై గుండెలు అలసిపోయి మూగ జీవాల ఆవేదన దీనంగా కళ్లముందు కదలాడిరది. అభయారణ్యాలు రక్షించేందుకు గాను ప్రభుత్వాలు వీరికి జీతభత్యాలు ఇస్తుంటే వీళ్ళు చేస్తున్న పని ఏమిటి?అంటూ అతని మనసు మూగగా రోది స్తుంది. అదే సమయంలో అక్కడ టీవీలో వస్తున్న పర్యావరణ సంబంధిత కార్యక్రమం పట్టు బట్టి మరీ చూస్తాడు జోజి. అది అక్కడ మత్తులో జోగు తున్న అటవీ అధికారులకు ససేమిరా నచ్చదు అయి నా జోజిమీద సానుభూతి చూపిస్తూ ఆ కార్య క్రమం చూసే అవకాశం కల్పిస్తారు. తన వృత్తి ధర్మంగా పర్యావరణ సంరక్షణ కార్యక్రమం అబ్బు రంగా ఆసాంతంచూస్తాడు. మర్నాడు జోజి తన పైఅధికారులతో కలిసి ఉద్యోగ ధర్మంలో భాగంగా చేస్తున్న క్షేత్ర పర్యటనలో మరో అనుభవం కలుగు తుంది. అధికారుల అండదండలతో కలప రవాణా చేస్తున్న లారీలను,ముఠా నాయకులను, ధైర్యంచేసి అడ్డగించి పట్టుకుని తనవృత్తి ధర్మంలో విజయం సాధించానని,న్యాయం చేస్తున్నానని సంబర పడ తాడు. కానీ అది క్షణకాలమేఅని అతని పై అధికా రుల ఆదేశాల ఫోన్‌ సమాచారంతో తెలుసుకుని చేసేదేమీలేక అధికారలేమి తో నిస్సహాయంగా ఉండిపోతాడు జోజి. ఈసంఘటనలు అన్నీ ఒక్కొ క్కటిగా కళ్ళముందు తిరుగుతూ జ్ఞాపకాలుగా గుర్తు చేసుకున్న జోజి అనబడే గిరిజన అటవీ ఉద్యోగి పాత్ర కేంద్రంగా ఈ కథ నడుస్తుంది.
కథ ఆసాంతం అడవులు, అడవిబిడ్డల దీనస్థితి,అడవి జంతువుల మూగ రోదన,కేంద్ర బిందువుగా అచ్చమైన స్వచ్ఛమైన అడవిఅందాల వాతావరణం,అడవిబిడ్డల వేషభాషలు, సంభాషణ ముచ్చట్లు,సాయంతో కొనసాగిన ‘‘చెట్లు కూలుతు న్నదృశ్యం’’ కథద్వారా రచయిత ఏమి చెప్పాలను కున్నాడు? ఎవరికి చెప్పాలను కున్నాడు?? చివరికి ఆయన అందించే సందేశం ఏమై ఉంటుంది?? అన్న ప్రశ్నలు అన్ని ప్రశ్నలు గానే మిగిలి పోతాయి. రచయిత భావన ప్రకారం తాను ప్రత్యక్షంగా గమ నించిన విషయాలను తన శైలిలో అక్షరీకరిం చారు ఏమిటి ?ఏమి చేయాలి?? అన్నది పాఠకుల ఇష్టానికే సొంతం చేసినట్టు అర్థమవుతుంది. రచ యిత కూడా అదే నిర్ధారణ చేశారు.
ఇక్కడ కథలోని జోజి ఒక్కడి ఆవేదనే అందరి ఆవేదనై మార్పుకోసం ఆచరణాత్మకంగా కృషి చేసిన నాడు మనం కోరుకున్న పర్యావరణ సమతుల్యత చేకూరి పుడమితల్లి పచ్చని అడవులతో అందరి పాలిట ఆరోగ్య దేవతగ నడయాడటం తథ్యం అనిపిస్తుంది.

సుప్రీం పీఠంపై తెలుగు తేజం

‘‘ తెలుగువాంతా గర్విస్తున్న సందర్బమిది. ఐదున్నర దశాబ్దాల తర్వాత తెలుగు బిడ్డ దేశంలోనే అత్యున్నతమైన పీఠాన్ని ఆథిరోహిస్తున్నారు.జస్టీస్‌ ఎస్వీ రమణ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవడంతో సామాన్యులంతా తమ ఇంట్లోని వ్యక్తికే ఈ గౌరవం దక్కినంతగా ఆనందిస్తున్నారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి స్వయకృషితో ఎదిగిన ఆయన ప్రస్థానం అందరకీ ఆదర్శం. చిన్నతనంలో కాలినడకన బడికి వెళ్లి చదువుకున్న వ్యక్తి…ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూనే తన లక్ష్యం దిశగా సాగిపోయిన తీరు స్పూర్తిదాయకం. తెలుగు రాష్ట్రాలు పొంగిపోతున్న వేళ ఆయన సొంతూళ్ళో సంబరాలు మిన్నంటుతున్నాయి. .. కష్టాలకు ఎదురీది అత్యున్నత న్యాయస్థాన పీఠానికి జస్టిస్‌ ఎస్వీ రమణ..ఎదిగారు.’’


కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగారు! గుంటూరులో చదువుకున్నారు! న్యాయవాదిగా ఎదిగారు. న్యాయమూర్తిగా ప్రస్థానించారు. ఇప్పుడు…భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనే… జస్టిస్‌ నూతల పాటి వెంకట రమణ! అందరికీ… జస్టిస్‌ ఎన్వీ రమణగా సుపరిచితుడు! సాధారణ దిగువ మధ్య తరగతి రైతు కుటుంబానికి చెందిన రమణ… ఇప్పుడు భారత చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణగా మారారు. ఆయన 1957 ఆగస్టు 27న జన్మించారు. తల్లిదండ్రులు… గణపతిరావు, సరోజనీ దేవి. స్వగ్రామం..కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం. ఆయనకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో గణపతిరావు కుటుంబం ఆర్థికంగా పలు ఇబ్బందులు పడిరది. స్వగ్రామంలో ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. బాల్యంలో కష్టాలు ఎదురైనప్పటికీ రమణ పట్టుదలతో కష్టపడి చదువుకున్నారు. కంచికచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. గుంటూరు జిల్లా ధరణికోట (అమరావతి) ఆర్‌వీవీఎన్‌ కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 1982లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.
యువరానర్‌ అంటూ…
రమణ 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. కర్నూలు మాజీ ఎంపీ ఏరాసు అయ్యపురెడ్డి వద్ద తొలినాళ్లలో జూనియర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ‘పిల్‌’ రమణగా పేరు తెచ్చుకోవడం విశేషం. ప్రజా సమస్యలపై ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా అనేక అంశాలపై న్యాయ పోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ వాదనలు వినిపించారు. కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రైబ్యునల్స్‌లోనూ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండిరగ్‌ కౌన్సిల్‌గా పని చేశారు. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్‌ అడ్వొకేట్‌గా వ్యవహరించారు. రాజ్యాంగం, క్రిమినల్‌, సర్వీస్‌, ఎన్నికలు, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసులను వాదించారు. రమణ ఆంధ్రప్రదేశ్‌ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ హోదాలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు.
న్యాయమూర్తిగా…
న్యాయవాదిగా మంచి పేరు తెచ్చుకున్న జస్టిస్‌ రమణ తొలుత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్‌ 27న రాష్ట్ర హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. సుమారు 13 ఏళ్లపాటు హైకోర్టు జడ్జిగా జస్టిస్‌ రమణ వేల కేసుల్లో తీర్పులు ఇచ్చారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజేగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ జుడీషి యల్‌ అకాడమీ చైర్మన్‌గా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పనిచేశారు.
ఏపీ నుంచి ఢల్లీికి…
జస్టిస్‌ రమణ 2013 సెప్టెంబరు 2న ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితు లయ్యారు. ఆ తదుపరి ఏడాదే సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సుప్రీం న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు… భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సౌమ్యుడిగా పేరుపొందిన జస్టిస్‌ రమణ చీఫ్‌ జస్టిస్‌గా నియమితులయ్యే క్రమంలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి అత్యున్నత స్థానాన్ని అధిష్టిస్తున్నారు.
దేశ విదేశాలకు…
జస్టిస్‌ రమణ మహిళా సాధికారత, పర్యావరణం, జుడీషియల్‌ యాక్టివిజమ్‌, జెండర్‌ జస్టిస్‌, సబ్‌-ఆర్డినేట్‌ కోర్టుల పాత్ర, మానవ హక్కులు, దివ్యాంగుల హక్కులు తదితర అంశాలపై జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలు సమర్పించారు. బ్రిటన్‌ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇంగ్లండ్‌ వెళ్లి, అక్కడి న్యాయవ్యవస్థ తీరును పరిశీలించారు. అమెరికాలో న్యాయపాలనపై అధ్యయనం చేశారు. పేద ప్రజలకు న్యాయం అందుబాటులోకి రావాలని, వారికి ఉచిత న్యాయసేవలు లభించాలని ఆయన కోరుకుంటారు. న్యాయసేవల అథారిటీ చైర్మన్‌గా జస్టిస్‌ రమణ వేలాది మంది పేద ప్రజల కేసులు ఉచితంగా పరిష్కారం అయ్యేలా చూశారు. దేశంలో కోర్టులను ఆధునికీక రించాలని, మౌలిక సదుపాయాలను పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇద్దరూ.. ఇద్దరే..! ఒకరు న్యాయశాస్త్రాన్ని ఔపోసన పెడితే, ఇంకొకరు వైద్యశాస్త్రం లోతులను తరచిచూసినవారు. వారే జస్టిస్‌ ఎన్వీ రమణ, డాక్టర్‌ యార్లగడ్డ నాయుడమ్మ. వీరిద్దరూ వియ్యంకులు. అవిభక్త కవలల శస్త్ర చికిత్సలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్‌ నాయుడమ్మ పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన కుమారుడు రితేశ్‌తో జస్టిస్‌ రమణ కుమార్తె భువనకు వివాహం జరిగింది.
లాయర్‌ కావాలనుకోలేదు…
న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠానికి ఎదిగిన జస్టిస్‌ రమణ నిజానికి న్యాయవాది కావాలని భావించలేదు. యాదృచ్ఛికంగానే ఆయన ఈ వృత్తిని ఎంచుకున్నారు. ఆయన కుటుంబం లోనూ ఎవరూ న్యాయవాదులు లేరు. విద్యార్థి దశలో చురుకుగా వ్యవహరిస్తూ, సామాజిక అభ్యుదయం కోసం పలు పోరాటాలు చేశారు. అనేక విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థులతో నిరసన ప్రదర్శనలు నిర్వ హించారు. ఒక దశలో తాను అరెస్టు నుంచి తప్పించుకున్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ ఒక సందర్భంలో చెప్పారు.
సుప్రీంకోర్టుకు కొత్త సారథి- తీవ్ర సవాళ్లు
సీనియర్‌ పాత్రీకేయులు,సాహితీవేత్త ప్రముఖ రచయిత తెలకపల్లిరవిగారి తెలియసిన మరికొన్ని వివరాలు ఇలాఉన్నాయి. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ నూతల పాటి వెంకట రమణ ప్రమాణ స్వీకారం చేశారు. 2013లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తిగా నియమితులైన జస్టిస్‌ రమణ అంతకుముందు ఉమ్మడి ఎ.పి హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢల్లీి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఎనిమిదేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన ఆయన సి.జె గా ఏప్రిల్‌ 24 నుంచి 2022 ఆగష్టు 26 వరకూ పదహారు నెలల పాటు పదవిలో వుంటారు. ఏప్రిల్‌ 23న సిజెఐ గా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ బాబ్డే సీనియారిటీ ప్రకారమే 48వ న్యాయమూర్తిగా ఆయన పేరును సిఫార్సు చేశారు. సుప్రీం న్యాయమూర్తులలో అత్యంత సీనియర్‌ను నియమించడం సంప్రదాయమైనా సరే నెల రోజుల ముందుగా తన తదుపరి సి.జె పేరు సిఫార్సు చేయడం ఆనవాయితీ. ఏ కారణం చేతనైనా సీనియార్టీ ప్రకారం వున్నవారిని నియమించలేని పరిస్థితి వస్తే ముందే చర్చ చేయవలసి వుంటుంది. జస్టిస్‌ రమణపై ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌ కొన్ని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొన్నప్పటికీ ఆయన నియమాకం తథ్యమని ముందే స్పష్టమైంది. సుప్రీం కోర్టులో ఖాళీల భర్తీ పైన, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్నను సుప్రీంకు తీసుకు వస్తే 2027లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవుతారనే అంశం పైన చర్చ జరిగింది తప్ప తదుపరి సిజెఐ గురించి కొలీజియంలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు కనిపించదు.
ఆరోపణల తోసివేత
జస్టిస్‌ రమణ పేరును సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు అదే సమయంలో ఆయనపై ముఖ్యమంత్రి జగన్‌ ఆరోపణలను తోసిపుచ్చినట్టు ప్రకటించింది. ఈ విషయంలో అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల వాదోపవాదాలు న్యాయవర్గాల నుంచి వినిపించాయి. ఈ ఆరోపణల విచారణకు సంబంధించి కొన్ని కథనాలు రాగా అంతర్గత విచారణ విషయాలు ఎప్పుడూ బహిరంగ పర్చబోమని వాటిని తోసిపుచ్చింది. అంతిమంగా ఆ ఆరోపణలలో పసలేదని తోసిపుచ్చినట్టు ప్రకటించింది. విచారణ ప్రక్రియ జరిపి తిరస్కరించడం పారదర్శకత లేదనే విమర్శకు సమాధానంగా భావించాల్సి వుంటుంది. అయితే ఆ ఆరోపణలను విచారించింది ఎవరు, ఏం తేల్చారనేది బయిటపెట్టి వుండాల్సిందని సీనియర్‌ న్యాయవాదులు కొందరు రాశారు. ఏమైనా అది ముగిసిన అధ్యాయం.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి నియమితులవటం ఇది రెండవ సారి. గతంలో ఎ.పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేసిన జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966-67 మధ్య సి.జె గా పనిచేశారు. 1993-94లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ వెంకటాచలయ్య కూడా ఇప్పటి ఎ.పి లోని లేపాక్షిలో జన్మించిన వ్యక్తి అయినప్పటికీ అది అప్పుడు ఉమ్మడి కర్ణాటక రాష్ట్రంలో భాగంగా వుండేది. మానేపల్లి నారాయణరావు వెంకటాచలయ్య అన్న ఆయన పేరు కూడా అచ్చం తెలుగు వారి పేరే అయినా చదువు కర్ణాటకలో సాగింది. ఈ మధ్య కాలంలో తెలుగువారు అనేకులు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా పని చేసినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి స్థానం దాకా పయనించే అవకాశం జస్టిస్‌ నూతలపాటి వెంకట రమణకే దక్కింది. ఆయన పదవీ కాలం కూడా సాపేక్షంగా చాలా మంది సి.జె ల కన్నా అధికంగా వుంటుంది.
సుప్రీం ప్రతిష్టపై నీలినీడలు
చాలా దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తమైనా సుప్రీం కోర్టు ప్రతిష్ట అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రధాన న్యాయమూర్తులుగా ఎస్‌.ఎ.బాబ్డే, అంతకు ముందు రంజన్‌ గొగోరుల హయాంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం ఒత్తిళ్లకు లోబడిపోయిందనే ఆరోపణ బలపడిరది. వరుసగా ఇచ్చిన తీర్పులు మోడీ సర్కారుకు సంతోషం కలిగించాయి. సిజెఐ గా రంజన్‌ గొగోరు అయోధ్య, రాఫెల్‌ తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యత్వం పొంది విమర్శలు మూట కట్టుకున్నారు. ఇక 2019 నవంబరులో ఎస్‌.ఎ బాబ్డే ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినప్పుడు కీలకమైన ఎన్నో కేసులు న్యాయస్థానం ముందు అపరిష్కృతంగా వుండిపోయాయి. జమ్మూ కాశ్మీర్‌కు రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి మూడు ముక్కలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన కేంద్రం నిరంకుశ చర్యను సవాలు చేస్తూ వంద పిటిషన్లు దాఖలయ్యాయి. కాని వాటిపై పూర్తి విచారణ జరగనేలేదు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) పైనా పిటిషన్లు వచ్చాయి. ఢల్లీితో సహా దేశవ్యాపితంగా నిరననలు సాగాయి. ముఖ్యంగా ఢల్లీిలో కుట్రపూరితంగా మత కలహాలు రగిలించి యువతను విద్యార్థులను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారు. జామియా మిలియా విశ్వవిద్యాలయం లోనూ దాడులు జరిగాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ లోకి గ్యాంగులు చొరబడి దౌర్జన్యం చేశారు. ఇవన్నీ కళ్ల ఎదురుగా జరుగుతున్నా పలుసార్లు కేసులు వస్తున్నా సుప్రీంకోర్టు న్యాయం చేసేందుకు చొరవ తీసుకోలేదు. హత్రాస్‌ అత్యాచారం ఘటనలో అన్యాయంగా అరెస్టు చేయబడిన కేరళ జర్నలిస్టు సిద్దిక్‌ కప్పన్‌ కేసు వస్తే విచారించి మీడియా స్వేచ్ఛను కాపాడకపోగా ఇలాంటి కేసులు హైకోర్టుకే వెళ్లేలా తాను చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. రోహింగ్యా శరణార్థులను ఆదుకునే విషయంలోనూ భారత దేశ సంప్రదాయం, రాజ్యాంగ విలువలు, అంతర్జాతీయ సూత్రాలను బేఖాతరు చేస్తూ జోక్యానికి నిరాకరించింది.
వివాదగ్రస్తమైన తీరు
ఇంతకంటే తీవ్రమైన విషయం ఎన్నికల బాండ్లకు సంబంధించిన కేసును పూర్తిగా పక్కన పెట్టేయడం. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఆ బాండ్లపై స్టే విధించాలంటూ పిటిషన్లు వస్తూనే వున్నాయి. ఇవి ఎప్పటినుంచో వున్నాయనీ, ఈ విధమైన అభ్యర్థనలను ఇదివరకటి నుంచి వస్తున్నాయంటూ ప్రతిసారి సుప్రీంకోర్టు ధర్మాసనం వాటిని పక్కన పెడుతూ వచ్చింది. వలస కార్మికుల దుస్థితిపై దాఖలైన వ్యాజ్యాల విషయంలోనూ ఇదే విధమైన స్పందనా రాహిత్యం తాండవించింది. వారికోసం ఏం చేయాలనేది ప్రభుత్వానికే బాగా తెలుసంటూ కేసును చాలా కాలం సాగదీశారు. వలస కార్మికులకు తిండి పెడుతున్నప్పుడు మళ్లీ ఆర్థిక సహాయం దేనికని ఆఖరుకు సి.జె బాబ్డే స్వయంగా ప్రశ్నించారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు సంబంధించిన పలు కేసుల్లో సుప్రీం కోర్టు అమితాసక్తి ప్రదర్శించింది. ఢల్లీిలో రైతుల ఆందోళనను పరిష్కరించాలనే కేసు లోనూ ఒక కంటితుడుపు కమిటీని వేసి కాలయాపన చేసింది. ఆ కమిటీ కూడా ప్రభుత్వ అనుకూల వ్యక్తులతో నిండి వుండటం, ఒకరు ముందే నిరాకరించడం దాన్ని మరింత పలచన చేసింది. తీరా ఆ కమిటీ సిఫార్సులు వచ్చి చాలా కాలం గడిచినా ఎలాంటి సానుకూల చర్యలు ఆదేశించింది మాత్రం లేదు. ప్రజల పేదల హక్కులను కాపాడ్డంలో ఈ విధంగా వ్యవహరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కార కేసుల పేరిట మాత్రం ఎంతో సమయం వెచ్చించింది. అయోధ్య కేసులో 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రాతిపదికగా చెప్పిన న్యాయస్థానం ఆ చట్టాన్నే సవాలు చేసే పిటిషన్‌ను అనుమతించడం మరో వైపరీత్యం. ఆ వెంటనే కాశీ, మధుర క్షేత్రాలలో వివాదాలను స్థానిక న్యాయస్థానాలు చేపట్టాయి.
న్యాయమూర్తుల నియామకం స్తంభన
కరోనా కారణంగా ఈ కాలంలో వర్చువల్‌ విచారణ పద్ధతి గొప్ప మార్పుగా చెబుతున్నా వాస్తవంలో అనేక కేసులు విచారణకు నోచుకోకుండానే పోయాయి. కేవలం 25 శాతం మాత్రమే విచారణ జరిగాయి. ఈ పరిస్థితి అనివార్యమైందనుకుంటే ఒక తీరు గాని ఇందుకు సి.జె బాబ్డేను పొగడ్తల్లో ముంచెత్తడం విచిత్రం. ఇప్పటికి వచ్చిన తీర్పులపైనే ఇంత అసంతృప్తి వుండగా కొత్తగా ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కోర్టు చర్చలు సాగిస్తున్నది. వాటి పాత్రపై న్యాయమూర్తులకే స్పష్టత వున్నట్టు లేదు. ఈ మొత్తం కాలంలో సుప్రీం కోర్టుకు ఒక్క న్యాయమూర్తిని కూడా అదనంగా నియమించలేకపోవడం పెద్ద లోపం. హైకోర్టుల్లోనూ 400 పైనే ఖాళీలున్నా కొలీజియం, కేంద్రం పరస్పరం బాధ్యతను నెట్టివేసుకుంటూ కాలం గడిపాయి. పదవీ విరమణకు ముందు రోజు సి.జె బాబ్డేతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 224(ఎ) అధికరణాన్ని దాదాపు 60 ఏళ్ల తర్వాత పునరుద్ధరించి, రిటైర్డు జడ్జిలను హైకోర్టులకు నియమించవచ్చునని ఆనుమతినిచ్చింది. క్రమబద్దమైన నియామకాలు పూర్తిచేయకపోగా ఈ విధంగా విచక్షణతో కూడిన నియామకాలు చేస్తే మళ్లీ అదెక్కడికి దారి తీస్తుందోననే సందేహాలు వున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతూ ఒత్తిడికి గురి చేస్తున్నదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. మాజీ సీనియర్‌ న్యాయమూర్తులు అరుణ్‌ మిశ్రా వంటి వారు ప్రధాని మోడీని అదేపనిగా పొగిడి తరించడం, రంజన్‌ గొగోరు రాజ్యసభకు వెళ్లడం ఆ సందేహాలను పెంచింది. తాజా మాజీ సి.జె బాబ్డే కూడా బహురంగాలలో ఆసక్తి వున్నవారు గనక పదవీ విరమణ తర్వాత ఏదైనా చేయవచ్చునని ప్రస్తుత సిజెఐ ఎన్‌.వి.రమణ వీడ్కోలు ప్రసంగంలో చెప్పడంలోనూ సంకేతాలున్నాయి.
భవిష్యత్‌ గమనం?
సిజెఐ గా ఎన్‌.వి రమణ పదవీ కాలం సాపేక్షంగా చాలా మంది కన్నా కొంచెం ఎక్కువగానే వుంటుంది. రాజకీయ నాయకులపై, ప్రజా ప్రతినిధులపై కేసులసు వేగంగా పరిష్కరించాలన్నది గతంలో జస్టిస్‌ రమణ తీసుకున్న కీలక నిర్ణయం. పేదలకు కూడా న్యాయ సహాయం సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నది ఈ సిఫార్సుకు ముందు రోజు ఆయన చేసిన ప్రసంగం. నదీ జలాల వివాదాలు రాష్ట్రాల హక్కులకు సంబంధించి కూడా ఆయన తీర్పులను ప్రస్తావిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకే నదీ జల వివాదాలు ఒకవైపు రాష్ట్రాల హక్కులపై కేంద్రం తీవ్ర దాడి మరోవైపు సాగుతున్న ఈ కాలంలో మరి ఆయన తీర్పుల పరంగానూ న్యాయ వ్యవస్థ నిర్వహణ పరంగానూ ఎలాంటి అడుగులు పడేది చూడవలసిందే. చట్టం వ్యవస్థపై ఆధారపడిరదే గాని వ్యవస్థ చట్టంపై ఆధారపడి వుండదన్న కారల్‌మార్క్స్‌ మాట ప్రకారం వ్యక్తులను బట్టి మౌలిక మార్పులకు పెద్ద అవకాశం వుండకపోయినా న్యాయమూర్తులు చేయగలిగింది చాలానే వుంటుంది. మసకబారిన సుప్రీం ప్రతిష్ట రీత్యా కొత్త సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి రమణ ఏం చేస్తారనేది రేపటి నుంచే చూడొచ్చు.
-సైమన్‌ గునపర్తి

వివాహ బంధం పటిష్ట పరచాలి

శక్తివంతమైన వేదమంత్రాలతో ఏర్పడిన వివాహబంధం తో ఒకటైన దంపత్యబంధం శాత్వతం, పవిత్రం. ..జీవితంలో ఎదురయ్యే ఆటుపోటులకు సమన్వయం తో ఒకరికొకరు తోడుగా ఉంటూ పరిష్కారించుకుంటూ ముందు కు సాగాలి. సంసారనౌక సజావుగా ప్రయాణించాలంటే ఓర్పు,నేర్పు, సమయస్ఫూర్తి ఉండాలి…నిర్వచనానికి అందని ఎత్తైన భావన దాంతప్యబంధం…సంతోషంలో భాగస్వామ్యం పంచుకుంటూ ఒకరి దుఃఖం లో మరొకరి ఓదార్పు పంచుతూ సంతానం యొక్క ఆలనా పాలనా చూసుకుని సంతోషపడతారు.. పరస్పర అనుకురాగం, అవగాహన కలిగి కలిసి నూరేళ్ళ జీవిత ప్రయాణమే వివాహబంధం యొక్క లక్ష్యం..అరమరికలు లేని ఆనందం పంచుకోవడం లోనే అంతర్లీనంగా ఒకరిపై మరొకరికి ఉన్న బాధ్యత, బంధం కలిసి ఉంటాయి.కేవలం ఆర్ధిక సంబంధ విషయాల వల్ల ఈ మధ్య వివాహ బంధాన్ని అతి సులువుగా రద్దు చేసేసుకుంటున్నారు…సంస్కృతి సంప్రదాయాలు గౌరవించడం నేటి తరానికి గిట్టనిమాటలు…విచ్చలవిడితనం కూడా పెరిగిపోయి వివాహబంధాన్ని తృణప్రాయంగా తీసిపారేస్తున్నారు… గత శతాబ్దంలో ఈ దుస్థితి లేదు..ఆదర్మవంతమైన జంట సీతారాములు…అరణ్య వాసంలో భర్తతో కలిసి కష్టపడడానికైనా సిద్ధపడినట్లు మనకి తెలుసు… సమస్యలు వచ్చాయని బయటపడకుండా భర్తకి, భార్య..భార్యకి భర్త ధైర్యం చెప్తూ కష్టం లోనూ సుఖంలోనూ తోడుగా నిలిచి ముందుకు సాగడమే దాంపత్య బంధం..
మానవ జీవితంలో ముడిపడిన అన్యోన్య బంధం వివాహం. పెళ్లిళ్లు భారతీయ సంస్కృతికి, సహజీవనానికి ఆనవాళ్ళు. పెళ్లిళ్లకు ప్రత్యేకించినది మాఘమాసం. పురోహితులు సూచించే శుభ ముహుర్తాలను బట్టి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. హిందూ సమాజంలో దాగివున్న పవిత్రమైన వేద మంత్రాల సాక్షిగా సాగే వివాహ మహోత్సవానికి మన దేశంలో సముచిత ప్రాధాన్యత,విలువ,గౌరవం ఉంటుంది. ఇప్పటికీ భారతీయులు వైవాహిక జీవిత విలువలను దైవ స్వరూపంగా పాటిస్తారు. ఇలాంటి వివాహ బంధాలు కొన్ని ఈ మధ్య కాలంలో విడిపోతున్న సందర్భాలు కుటుంబ పెద్దలను కలవరపెడుతున్నాయి. లక్షల కట్నాలతో లక్షణమైన సంబంధాలు వెతికి పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఇలాంటి సంక్షోభం మనోవేదనను కల్గిస్తున్నది. ఆలుమగల మధ్య అవగాహన లోపిస్తే, సంయమనం లేకపోతే సంసారం నిస్సారమవుతుంది. భార్యాభర్తల విభేదాలు వివాహబంధాన్ని విడదీస్తాయి. చివరికి విడాకులకు దారి తీస్తుంది. ప్రపంచ దేశాలతో పొల్చితే కేవలం ఒక శాతం విడాకులతో అత్యల్పంగా నమోదైన దేశంగా ఇండియాకు పేరుంది. గరిష్టంగా విడాకులు బెలారస్‌ దేశంలో 68శాతం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడాకుల రేటులో చైనా 2.2 శాతం, ఇటలీ 2.7శాతం,కెన్యా 15 శాతం ,బ్రెజిల్‌ 21శాతం,అస్ట్రేలియా 38 శాతం,స్విస్‌ 40శాతం, జర్మనీ 41శాతం , కెనడా45శాతం,అమెరికా 49శాతం, ఉత్తర కొరియా మరియు నూజిలాండ్‌ 53శాతం, బెల్జియం 56శాతం,స్వీడన్‌ 64శాతం,రష్యాలో 65శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విడాకుల పెరుగుదల రేటు 1960లో12 శాతం,1980లో 26శాతం,2000లో 25 శాతం,2010లో41శాతం,2017లో 44 శాతం,2020 నాటికి 51.8 శాతంగా నమోదు కాబడిరది. గత మూడేళ్ళలో వివాకుల రేటు 7.8 శాతం పెరుగుదల గమనార్హం. ఇండియాలో విడాకుల రేటు పూర్వంతో పోల్చితే క్రమంగా పెరుగుతోందని సంబంధించిన నిపుణులు వెల్లడిస్తున్నారు. మనదేశంలో విడాకులకు ముఖ్య కారణాలు- వివాహేతర సంబంధాలు, ఇరువురి మధ్య విశ్వాసం సన్నగిల్లడం, సంక్షోభాలు, బాల్యవివాహాలు, వితండ వాదనలు, ఆర్థిక సమస్యలు, చిర కాలంగా దంపతుల ఎడబాటు , గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక సమస్యలు, అహంభావ దోరణి, మానసిక వైకల్యం, సర్దుకునే దోరణి లేకపోవడం వంటివి ప్రముఖమైనవి. దేశ జనాభాలో 0.11శాతం అనగా1.36 మిలియన్ల మంది వివాహితులు విడాకులు తీసుకున్నారు. వారిలో పురుషుల కన్నా స్త్రీలు అధికం. దేశంలో విడాకుల సంఖ్య రాష్ట్రాల వారీగా మిజోరాం (6.34శాతం), మేఘాలయా (4.11శాతం ),సిక్కిం (2.16శాతం), కేరళ (1.59శాతం), మణిపూర్‌ (1.32శాతం), తమిళనాడు (1.22శాతం), మహారాష్ట్ర (1.08శాతం),వెస్ట్‌ బెంగాల్‌ (1.02శాతం ), ఆంధ్ర ప్రదేశ్‌ (1.12శాతం), గుజరాత్‌లో 1.08శాతంగా ఉంది. ఈ విడాకుల సంఖ్య గ్రామీణుల కంటే పట్టణవాసుల్లో , మద్యతరగతి కుటుంబాలలో, అందులోనూ విద్యాధికుల్లోనే నమోదు అధికం. విదేశీయుల్లో కంటే భారతీయుల్లో విడాకుల సంఖ్య తక్కువ ఉండటానికి ప్రదాన కారణం పూర్వం నుండే విడాకులనేది ఓ సామాజిక దురాచారంగా గుర్తించబడిరది. విడిపోయి జీవించటం అనేది ఒక అసామాజికమైనదిగా, దుస్సంస్కృతిగా భావించబడుతున్నది. వివాహేతర సంబంధాల్లో పురుషులు 75 శాతం,స్త్రీలు 25శాతం విడాకులు తీసుకుంటున్నారు. అందులోనూ 10 నుంచి 15 సంవత్సరాల వైవాహిక జీవితం గడిచిన తర్వాత 53శాతం మంది విడాకులు తీసుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. 20ఏళ్ళకు పైగా వైవాహిక జీవితం గడిపిన వారిలో విడాకులు చాలా అరుదుగా కన్పిస్తు న్నాయి. భారత్‌ లో వివిధ మతాల వారు హిందూ వివాహ చట్టం-1955 ను అనుసరిస్తున్నారు. ముస్లిమ్‌ విడాకులు ముస్లిం వివాహ చట్టం -1939, క్రిస్టియన్లకు భారతీయ విడాకుల చట్టం-1963, కుల మతాంతర వివాహాలకు ప్రత్యేక వివాహ చట్టం-1954 చేయబడ్డాయి. ఇతర కారణాలతో పోల్చితే ఉభయుల అంగీకారంతో విడాకులు తీసుకోవడం సులభంగా జరుగుతోంది.
పెళ్ళంటే నూరేళ్ళ మంట కాకూడదు
పెళ్ళంటే రెండువంశాలు కలిసే వేడుక. వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న ఇరువురిని ఒక బాటపై కలిసి నడవమని పెద్దలు ఏర్పాటు చేసే మొదటి మెట్టులాంటిది. అలాంటి సోఫానం శుభ్రంగా ఉండాలి కాని కలతలు, తగాదాలతో మొక్కుబడిగా చేసేవి, పాచి పట్టిన మెట్టులా తయారు చేయకూడదు. పెళ్ళంటే ఎవరికైనా కంగారు, హడావుడి సహజం. బాగా ధనవంతులైతే ఏమో చెప్పలేం గాని, మధ్య తరగతి, మరికొంచెం స్థితిమంతులైనా ఈ రోజుల్లో పెళ్ళంటే మాటలు కాదు. పెళ్ళి సంబంధాలు వెతకటం ఒక యజ్ఞం. అయితే, పెళ్ళి చేసి పిల్లని అత్తవారింటికి పంపేసరికి పిల్ల తల్లిదండ్రులకి కాస్తోకూస్తో అప్పులు ఆపైన నిందలు. లక్షల్లో చేరిపోయింది. కట్నాల రేంజ్‌. చదువులు ఎంత పెరిగాయో, దానికి సమా నంగా కట్నాలు లాగుతున్నారు అబ్బాయి తల్లిదండ్రులు. పెద్ద చదువులు, సంస్కారం నేర్పడానికి బదులు ఆశలు, దురాశలు నేర్పుతున్నాయి. కట్నాలు వద్దని గొప్పలకు పోయి, దానికి బదులుగా కానుకలంటూ, పదిరెట్లు ఆడపిల్లల తండ్రులు దగ్గరలాగు తున్నారు. పెళ్ళికూతురు మాత్రం పెద్ద చదువు చదవాలి, ఉద్యోగం చేసి రెండు చేతులా సంపాదించి భర్త చేతిలో పోయాలి. పనిపాటలు రావాలి. అత్తగారు ఎలా చెబితే అలా తల ఊపాలి. అంత చదువు చదివిన పిల్ల వ్యక్తిత్వం చంపుకుని ఎవరేం చెబితే అలా తలాడిరచేలా అణగిమణిగి ఉండాలి. కొడుకు ఎక్కడ కోడలి మాట వినేస్తాడోనని అత్తా మామలు కంగారుపడుతుంటారు.కొంతమంది అబ్బాయిల తరఫువారు అనేక రకాలుగా చికాకులు కలిగిస్తుం టారు. అందరికీ కూర్చోవడానికి వేసిన కుర్చీలు బాగోలేవని, భోజనాల్లో ఎక్కువ వెరైటీలు చేయించినా ఇంకా ఏవో తక్కువ అయ్యాయని, పెళ్ళికొడుకు స్నేహితులకి హోటళ్ళలో ఎ.సి. రూములు తీసుకోలేదని, పొద్దున్నే టిఫిన్లు తిరిగి రెండోసారి అడగలేదని వియ్యపురాలికి మాటమాటికి ఏం కావాలి? అని అడగలేదని సతాయిస్తుంటారు. కట్నాలు వద్దు, కానుకలు ఇవ్వండి అనే వారు కొందరు. పెళ్ళి బాగా చేయండి అంటూ పిల్ల తల్లిదండ్రి నుంచి ఎన్ని విధాలుగా రాబట్టాలో అన్ని విధాలా గుంజుకునేవారు కొందరు. మళ్ళీ పిల్లని కన్నతల్లిదండ్రులని గౌరవించరు. ఎంత పెద్ద చదువులు చదివినా సంస్కారం లేదని, ఇలాంటి పెళ్ళిళ్ళు రుజువు చేస్తున్నాయి. మర్యాద ఇచ్చుపుచ్చుకోమన్నారు. ఆడపిల్ల కన్నవాళ్ళని తేలిగ్గా చూసే తీరు మార్చుకోవాలి ఈనాటి వరుడి తల్లిదండ్రులు. ఒకసారి మనసులు బాధపడితే తర్వాత ఎంత మంచిగా మాట్లాడినా, అది నటనగానే ఉంటుంది అవతలి వారికి పెళ్ళిబాగా చేశారు అనే ఒక్కమాట కన్యాదాతకి ఎంత బలమిస్తుందో అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచించాలి. గతంలో అయితే పెళ్ళిళ్ళు ఇంటి ముందే పెద్ద, పెద్ద పందిళ్ళు వేసి అందులోనే జరిపేవారు. ప్రస్తుత కాలంలో చిన్నచిన్న ఇళ్ళు, ఇరుకు గదుల్లో ఉండే సందర్భంలో అలాంటి అవకాశా ల్లేవు. కాబట్టి ప్రతిఒక్కరూ కళ్యాణ మండ పాలనే ఆశ్రయిస్తున్నారు. వీటిని కూడా ఆర్థిక తాహతుకు మించి బుక్‌చేస్తున్నారు. పెద్ద పెద్ద మండపాల్లో చేసుకునేబదులు, తక్కువ ఖర్చుతో చిన్నమండపాల్లో చేసుకుంటే కొంత ఖర్చు కలిసివస్తుంది. ఇంకా ఇలాంటి అనవ సరపు వాటికి, ఆడంబరాలకు అదనంగా ఖర్చు చేస్తుంటారు. ఒక విధంగా ఆలోచిస్తే ఇవన్నీ వృధాయే. పెళ్ళిపేరజరిగే కొన్ని ఖర్చులు తగ్గించుకుని, వధూవరులకు అందిస్తే వారు జీవితంలో కొంత ఒడిదుడుకులు లేకుండా, ఆర్థిక అవసరాలకు పనికివస్తాయి. ఒక రోజు జరిగే తంతుకి ఎక్కువ ఖర్చుల జోలికిపోకుండా పొదుపు చేస్తే, తర్వాత ఏఇబ్బంది లేకుండా కొత్తగా పెళ్ళిచేసుకున్న వారి జీవితం హాయిగా సాగిపోతుంది. ఈ విషయాన్ని వధూ వరుల ఇరువైపులవారు ఆలోచించి జాగ్రత్తలు పాటిస్తే పెళ్ళంటే నూరేళ్ళపంట అవుతుంది, లేకుంటే నూరేళ్ళ మంట అవుతుంది
గిరిజన తెగలలో వారి సంస్కృతి, ఆచారాలలో జరిగే వివాహ వ్యవస్థ ఆదర్శవంతమైనవి. భిల్లు, గొత్తికోయ వంటి గిరిజనులు ఆర్థిక వెసులుబాటు లేక సహజీవనంతో సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిని అధ్యయనం చేసిన రaార్ఖండ్‌ లోని ‘నిమిట్టా’ అనే స్వచ్చంద సంస్థ 2016లో 200 జంట లను చేరదీసి పెళ్ళి చేసింది. వెంటనే మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేపించడంతోఆ మహిళలకు చట్టబద్దమైన హక్కులు లభించాయి. ఉత్తరాది రాష్ట్రాలలో వివాహ సంప్రదాయాలను పాటించాలని, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని, పర్యావరణ హితమైన పెళ్ళిగా ‘ రాధాసోమి ‘ అనుసరిస్తున్నారు. ఈ వివాహ సంప్రదాయంలో శుభలేఖ ఖర్చు రూ.5,భోజనాలు ప్లేటుకు రూ. 13కు మించడానికి వీల్లేదు. అమ్మాయి తరపు అతిధితులు 65మంది, అబ్బాయి తరపు బంధువులు 85 దాకా హాజరు కావాలి. ఈ రాథాసోమి అనేది ఉత్తరాధిన బహుళ ప్రాచుర్యం పొందిన అనేక ఆధ్యాత్మిక తెగల్లో ఇదొకటి. ప్రేమ పెళ్లిళ్ల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు సమాజ ఆమోదయోగ్యంగా ఉంటాయి. భారతీయ సంప్రదాయంలో మూడుముళ్ల వివాహ బంధం పట్ల పవిత్రత, పితృసామ్య వ్యవస్థ, వివాహిత ఇంటికి పరిమితం కావడం, సామాజిక విలువలు, గ్రామపంచాయతీ తీర్పులు, లింగ సమానతలు, పెద్దల మాటలు పాటించటం వంటివి మనదేశంలో విడాకుల రేటు తక్కువ నమోదుకు తోడ్పడుతున్నాయి. భారత హిందూ పవిత్ర వివాహబంధం మూడు పువ్వులు ఆరు కాయటంగా వర్ధిల్లుతూ, కుటుంబంలో నవ్వుల పువ్వులు పూయాలి. ప్రపంచ దేశాలకు బారతీయ వివాహవ్యవస్థ దీప స్తంభం కావాలి. ప్రస్తుత వివాహ వ్యవస్థలో ఆశించిన మార్పులు రావాలంటే సాంస్కృతికంగా సంప్రదాయంగా పెళ్లిల్లు రూపుదిద్దుకోవాలి. బాల్య వివాహాలను నిరోధించడానికి పేద, కార్మిక కుటుంబాలలో వ్యసనాలను తగ్గించడానికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. వివాహబంధం పటిష్ఠతకు అవసరమైన కౌన్సిలింగ్‌ కేంద్రాలను గ్రామ స్థాయి వరకు విస్తరించాలి. నవ దంపతులకు ఆర్ధిక, సామాజిక భద్రత కల్పించాలి. అన్ని వర్గాల ప్రజల ఆర్థిక వెసులుబాటును బట్టి మదుపుతో, కాలుష్యానికి తావులేకుండా పర్యావరణ హితంగా,ఆరోగ్యకర వాతావరణంలో పెళ్లిల్లు జరిగితే శుభకరం !
వ్యాసకర్త : –గుమ్మడి లక్ష్మీ నారాయణ, ప్రముఖ సాహితీవేతత 9491318409

గిరి కాన దీపం

శారీరక శ్రమకు చిరునామా దాయిగా సంస్కృతి సాంప్రదాయాకు నెవుగా చెప్పబడే మన ఆదివాసి బిడ్డు వారి జీవన ప్రస్థానం లో భాగంగా నివసించే ప్రాంతాను బట్టి వారిని రెండు రకాుగా చెప్పు కుంటాంము అందులో ఒకటి మైదాన ప్రాంతంలో నివాసముండే ‘‘ంబాడ’’ తెగకు చెందిన వారి జీవనంతో వారి మానసిక సంఘర్షణకు అక్షర రూపం ఇచ్చిన కథ ఈ ‘‘గిరి కాన దీపం’’. దీనికి ఈ పేరు పెట్టడంలో కూడా రచయిత్రి చాలా శ్రద్ధ తీసుకుని భాషాపండితు అభిప్రాయాను కూడా లెక్కచేయక ఎంతో మక్కువగా ఈపేరు పెట్టుకున్నారు, దీని రచనా కాం 06 /7 /2011 నవ్య వార పత్రిక ఉగాది కథ పోటీలో విశేష బహుమతి పొందిన కథ ఇది,
ఈకథా రచయిత్రి సమ్మెట ఉమా దేవి తన ఉద్యోగ జీవితాన్ని ంబాడా తండా కు అక్కడి విద్యార్థు విద్యాభివృద్ధికి వినియో గించిన విద్వత్‌మణి. తనఅభిరుచి రీత్యా కథా రచయిత్రి కావడంతో తను చూసిన అనుభ వించిన అనేక మానసికవేదనను ఒడిసిపట్టి ంబాడా గిరిజను కు చెందిన నేపథ్యంలోని కథాంశాను ఎంచుకుని సొంపైనవారి మాం డలికంలో సంభాష ణు పలికించారు. ఆమె వృత్తిరీత్యా ఆంగ్ల అధ్యా పకురాు అయినప్పటికీ అనేక తొగు కథు రాయడం విశేషం! ఖమ్మంకు చెందిన ఉమాదేవి ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి విశ్రాంత జీవితం గడుపు తున్నారు. ఉమాదేవి తండావాసు కథన్నీ ఊహించి రాసినవికాదు అనుభవించి రాసినవి. గిరిజనుల్లో కాస్త నాగరికత చెందిన వారిగా విద్య ఆర్థికంగా అభివృద్ధి చెందిన జాతిగా చెప్పబడె ంబాడా తెగ గిరిజనులోని విభిన్నకోణాు విభిన్న వ్యక్తి త్వాను దగ్గరగా చూసిన ఈమె ఆవేదన తన కథద్వారా చెప్పకనేచెబుతూ విని పించకనే వినిపిస్తుంది. ‘‘మనం ఎవరి గురించి రాస్తున్నామో వాళ్ళు అవి చదవక పోవచ్చు కానీ ఈసమాజంలో సాటి మనుషుగా ఉన్నవారి గురించి తొసు కోవాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. అంతేకాదు సమ కాలీన పరిస్థితును అక్షర బద్ధం చేసి నిక్షిప్త పరచడం రచయిత విద్యుక్త ధర్మం’’అని ఈరచయిత్రి ప్రగాఢ నమ్మకం. ఈవిధ మైనక్ష్యంతో రాయబడిరదే ఈ ‘‘గిరికాన దీపం’’ కథ. దీనికి ఈపేరు పెట్టడం లో కూడా రచయిత్రి చాలాశ్రద్ధ తీసుకుని భాషాపండితు అభిప్రాయాను కూడా లెక్క చేయక ఎంతో మక్కువగా ఈపేరు పెట్టుకు న్నారు. దీని రచనాకాం 06/7/2011 నవ్య వార పత్రిక ఉగాదికథ పోటీలో విశేష బహుమతి పొందిన కథ ఇది. ఇక ‘‘గిరికాన దీపం’’కథ విషయానికి వస్తే సూక్య-గవిరి దంపతు ఏకైక సంతానం జామ్మ మంచి తెలివైన అమ్మాయేకాదు తనతోపాటు తమ కుటుంబాన్నీ అభివృద్ధి చెందాని అందుకు చదువుకోవడమే ఏకైకక్ష్యం అనిగట్టిగా నమ్మిన యువతి. అన్ని సౌకర్యాకు దూరంగా జనా కు దూరంగా ఇలా కాయ కష్టానికి పరిమి తమై ఇంకా ఎన్నాళ్ళు ఇలా కష్టజీవుల్లా బ్రత కానే భావనతో తన యవ్వన జీవితంలోకి ప్రవేశిస్తుంది జా. ఒక్క చదువుతో మాత్రమే మనుషు మధ్య అసమానతను తొగిం చగమనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్న జా మ్మ తాను చదువుకోవడమే కాదు తన తండా లోని మిగతా ప్లిను చదివించే ప్రయత్నం చేస్తుంది తండాలోని తమవారికి అన్ని విష యాల్లో ఆసరాగాఉండే ఉన్నత వ్యక్తిత్వం గ యువతిగా జామ్మ పాత్రను తీర్చిదిద్దటంలో రచయిత్రి తీసుకున్న శ్రద్ధ ఆద్యంతం కనిపి స్తుంది. కష్టపడి చదివి టీచర్‌ ఉద్యోగం సంపా దించిన జామ్మ పెద్ద ఇష్టంతో పెళ్లి చేసు కుని ఆరు నెలు అయినా గడవక ముందే తనభర్తను వది లేయడానికి సిద్ధపడి తమ కులాచారం ప్రకారం పంచాయితీ పెట్టిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో భర్తతో సంసారం చేయనని కరా ఖండిగా చెబుతుంది, కుటుంబ సభ్యు బంధు వు అంతా ఒప్పించి సర్దిచెప్పే సంఘటనతో ప్రారంభమైన ఈకథ ఆద్యం తం ఆసక్తికరంగా సాగుతుంది. దిగుతో ఉన్న బంధువర్గం వారిజ్ఞాపకా దొంతర ద్వారా కథను చివరికంటూ ఉత్కంఠభరితంగా చదివించే ప్రయత్నంలో రచయిత్రి సమ్మెట ఉమాదేవి సంపూర్ణ విజయం సాధించారు.కథంతా తపోత గుండా సాగిన జామ్మ తన భర్తను ఎందుకు వదిలేయ దుచుకుంది అనేది పాఠకుకు ఉత్కంఠత కలిగి స్తుంది. కథ మొత్తం జామ్మ చుట్టూనే కొనసాగు తుంది సందర్భోచితంగా పాత్రోచిత సంభాషణు చెప్పిం చడంలో రచయిత్రితాను స్వతహాగా తండా ప్రజ నడుమ జీవించడం ద్వారా స్థానిక భాషా నైపుణ్యాను చక్కగా ఉపయోగించింది అనిపి స్తుంది. కథలో ప్రధాన పాత్రధారి అయిన జామ్మ తమ జాతి ఉన్నతికోసం చేసినకృషి ఆమెలోని పరోపకార తత్వాన్ని పట్టిచూపిస్తుంది.జాకు మొదటి నుండి ఉన్న ఆశ ఆశయం తమతండాకు పట్టణంలో లెక్క మంచి మంచి రోడ్లుఉండాని అనుకునేది ఆవిషయమే తండ్రికి చెప్పి మొరపెట్టు కునేది. అసు విషయం తెలిసిన తండ్రిచెప్పిన నిరుత్సాహ సమాధానంతో తీవ్ర అసంతృప్తి చెందేది ఆమె. ఒకరోజు తండాకు పట్నం నుంచి వచ్చిన ఇద్దరు ధనికు తమ ఇళ్లల్లో ఇంటిపని చేయడానికి ంబాడా అమ్మాయి కోసం వచ్చిన సందర్భంలో కూడా జామ్మ చాలా అసంతృప్తి చెందిెంది.చాలా రోజు నుంచి వారితండాలో జరుగుతున్నా ఈఅకృత్యా గురించి తీవ్రస్థాయిలో తన అసం తృప్తి వ్యక్తం చేయడమే గాక తన దగ్గరి బంధువు,’’ వీరు నాయక్‌ ‘‘కూతురు సీతను పట్నం పంపకుండా అడ్డు చెప్ప డమే కాక ఆడప్లిు హాస్టల్లో ఉండి చదువుకుంటే ప్రభుత్వం వారు ఎలాంటి ఆర్థిక సాయం అంది స్తారో వివరించి చెప్పివారి ఆలోచనా మార్గం మార్చే ప్రయత్నం చేస్తుంది. తానుమాత్రం ప్రతిరోజు తమతండాకు నాుగు మైళ్ళ దూరంలో గ దమ్మపేటకు వెళ్లి కష్టపడి చదువుకునేది. తమ తండాకు ఒక రోడ్డు ఒకబడి కావాని ఆమె ఎప్పు డూ కోరుకునేది, ఆమె పట్టుదతో కష్టపడి చదువు కుంటూనే ఆతండాకు పట్టణానికి ఉన్నదూరాన్ని తుడిచేయాని రోజు తపన పడేది.తమ తండా నుంచి ఆడప్లిను పట్టణం పంపించడం మాన్పిం చడంతోపాటు ఆప్లిు అందరూ ఎంచక్కా బడికి వెళ్లి తనలా చదువుకోవాని ఆమెపడ్డ ఆరాటం రోజు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా అము కావడంతో జా మనసు ఆనందంతో నిండేది. ఇలా ఉండగా ఒకసారి వచ్చిన ఓట్లపండగ సంద ర్భంగా పట ్టణానికి చెందిన రాజకీయ నాయకు తమ తండాకు వచ్చి యువతను మభ్యపెట్టి తమ ప్రచారానికి వాడుకున్న తీరుకు చాలా బాధపడిరది. జామ్మ ఇలా నిరంతరం సమాజ సమస్యతో నిత్యం సంఘర్షణ చేస్తూనే తను అనుకున్న ఉపాధ్యా య శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగం పొంది తన క్ష్యానికి చెరువుగా నిలిచింది.పెళ్లి వయసు మించి పోతుందని అటుఇంట్లోవాళ్ళు ఇటుఊరి వాళ్ళు పెట్టే పోరుపడలేక ఎట్టకేకు పెళ్లికి ఒప్పుకుని కొత్త తండాఅబ్బాయి తార్య నాయక్‌ను పెద్ద వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటుంది. అసు కథ అక్కడే మొదవుతుంది తన ఆలోచను తన సంక ల్పానికి పూర్తి భిన్నమైన ఆలోచనపరుడే కాక తన జాతి వాడు అయ్యుండి ఇతరు అభివృద్ధి కోసం స్వార్థబుద్ధితో పనిచేస్తున్న తన భర్త వ్యవహార శైలికి జామ్మ తీవ్రంగా కత చెందుతుంది. అంతేకాక జామ్మలోని గిరిజన సంస్కృతిని ఆచార వ్యవహారా ను కూడా మెచ్చని తనం ఆమెకు తీవ్రమనస్థాపం కలిగిస్తుంది.రాజ్యాంగబద్ధంగా ఆకులానికిగ రిజ ర్వేషన్‌ ఫలితాు అనుభవిస్తూనే అదే జాతి వికా సానికి అడ్డు పడటమే కాక ఆజాతి సంస్కృతిని చిన్నచూపు చూడ టంలోని కృతఘ్నత క్షమించ రానిది. ఇది కేవం జామ్మ భర్త తార్యనాయక్‌కు మాత్రమే కాదు అతనిలాంటి ఆలోచనా పరులైన అందరికీ వర్తిస్తుంది అనే తనఅనుభవా భావా ను జామ్మ పాత్ర ద్వారా రచయిత్రిచక్కగా చూపించారు అనిపిస్తుంది. చివరికి జామ్మ తన జీవితం తన కుటుంబం తనకు గసామాజిక హోదా అయిన పెళ్లి బంధా న్ని కూడా తృణప్రా యంగా వదిలి పెట్టడానికి సిద్ధపడడం త్యాగని రతిని వ్యక్తిత్వతీరును ఉన్నత త్వానికే ఉన్న తత్త్వంగా అభివర్ణించవచ్చు. జామ్మ తాను ఆదర్శప్రాయంగా అభివృద్ధి చెందడమేగాక తనజాతిసంస్కృతి పరి రక్షణ క్ష్యంతో చేసిన త్యాగం వర్ధమాన గిరిజన యువతకు అందరికీ ఆదర్శంగా నిలిచి తీరుతుంది.
జామ్మ తన భర్త తన జాతిని నీతిని మరిచి సొంత రక్తంలో పరాయితనాన్ని చూస్తున్న అతన్ని భరించలేకపోవడాన్నిచిత్రించిన వైనం కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించడంలో రచయిత్రి చేయి తిరిగిన తనం సంపూర్ణంగా కనిపిస్తుంది. చివర్లో జామ్మ తమ కుపంచాయతీ సందర్భంగా మాట్లాడుతూ తనభర్త గురించి తననిర్ణయం చెబు తూ‘‘మగాడే-కాక కానీ మన వాడు కాదు’’ అన్న వాక్యంతో కథ ముగిసిన, పాఠకు మెదళ్ళలో ఆలోచనాతరంగాు అప్పుడే మొదవుతాయి. రచయిత్రి భావించినట్టు జామ్మ తన నిండైన వ్యక్తిత్వం ద్వారా నిజమైన దారి దీపంగా నిుస్తుంది. కథ పేరులోని ఔచిత్యం కూడా కథాం శానికి తగ్గట్టుగా ఉండటం రచయిత్రి తీసుకున్న జాగ్రత్తల్లో మరొకటిఅని భావించాలి. గిరిజన జాతి అంతాతమకు తాముగా తమజాతి సంస్కృతి అభి వృద్ధికి త్రికరణశుద్ధిగా కట్టుబడి ఉన్నప్పుడు గిరిజన జాతి అభివృద్ధిని అడ్డుకునే ఏకు మత శక్తుగాని ప్రపంచీకరణ గానీ ఏమీ చేయలేవు అన్నది అక్షర సత్యం.
కథలోని కొతు నిర్మాణ భాగాు మాట అటుంచి రచయిత్రి ప్రారంభంలోనే చెప్పుకు న్నట్టు సమకాలీన సంఘటనను అక్షరీకరించి తన కర్తవ్యం పూర్తి చేయడమేగాక తనలోకలిగిన ధర్మా గ్రహాన్ని నిుపుద చేసుకోవడం కూడా జరి గింది అనవచ్చు.

దాడి

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘దాడి’’- `సంపాద‌కులు

తరాలు మారుతున్న కొద్దీ గిరిజను ఆలోచనా విధానాల్లో మార్పు రావడం అది తమ సొంతజాతి విచ్ఛిన్నతకి ఎలాకారణం అవుతుందో రచయిత తనదైన ధర్మాగ్రహశైలిలో చెప్పడం జరిగింది. గొత్తికోయ దీనస్థితి ఈకథలో కళ్ళకు కట్టబడిరది. ఛత్తీస్‌ఘడ్‌లోపోలీసు తమ స్వార్థంకోసం ఏర్పాటుచేసుకున్న సల్వాజుడుం రక్షక దళాల‌ హింస పడలేక అక్కడ నుంచి తొగు రాష్ట్రాకు తరలివచ్చిన గొత్తికోయ పరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో‘‘పడ్డట్టు అయింది. ఇక్కడి ఫారెస్ట్‌-పోలీస్‌ అధికాయి సంయుక్తంగా చేస్తున్న హింసాత్మక దాడుకు స్థానికంగా ఉండే గిరిజనును పావుగా వాడుకోవడం ఈకథలో రచయిత చూపించిన కొత్త కోణం. ప్వాంచకు చెందిన కవి,కథకుడు ‘‘ విద్యాసాగర్‌’’ తన యొక్క పర్యటన ‌,పరిశీల‌న ద్వారా అందివచ్చిన అనుభవం కొద్ది వ్రాసినకథ ‘‘దాడి’’ దీని రచనాకాం నవంబర్‌ 2000.

మానవ జాతిలోనే ఒకవిశేషమైనజాతిగా చెప్పబడే ‘‘గిరిజనజాతి’’ సంస్కృతిపరంగానేకాక వారి జీవన విధానం ద్వారాకూడా భిన్నత్వం రంగరించుగకుని ఒక్క ప్రత్యేకతను అందిపుచ్చుకుంది. అందుకే అందరూ వారిని గురించి ఆసక్తి చూపిస్తుంటారు.సాధారణంగా కంటికి కనిపించే విషయం గాక అసాధారణంగా ఉండే అంశాన్ని తీసుకుని దాన్నికథగా చెప్పడం ఉత్తమకథా క్షణాల్లో ఒకటి. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ప్వాంచకు చెందిన కవి,కథకుడు ‘‘ప్లొు విద్యాసాగర్‌’’ తన యొక్క పర్యటను,పరిశీన ద్వారా అందివచ్చిన అనుభవం కొద్ది వ్రాసినకథ ‘‘దాడి’’ దీని రచనాకాం నవంబర్‌ 2000.
ఆధునిక కాంలో గిరిజను జీవనవిధానం అనుకరణలోపడి తమదైన స్వచ్ఛ తత్వానికి స్వార్ధపు మరకు ఎలా అంటించుకుంటున్నారో చెప్పేప్రయత్నమే ఈ‘‘దాడి’’కథ ప్రధాన క్ష్యంగ కనిపిస్తుంది. తరాు మారుతున్న కొద్దీ గిరిజను ఆలోచనా విధానాల్లో మార్పు రావడం అది తమ సొంతజాతి విచ్ఛిన్నతకి ఎలాకారణం అవుతుందో రచయిత తనదైన ధర్మాగ్రహశైలిలో చెప్పడం జరిగింది.
ఇక కథ విషయానికొస్తే తమతల్లి లాంటి అడవిలోనే తాము పరాయివాళ్ళు అయ్యి స్వార్థపు శక్తు చేస్తున్నఎత్తుగడు వ్యూహాలో చిక్కుకొని నిువ నీడలేక నిత్య సంచార జీవనం గడుపుతున్న గొత్తికోయ దీనస్థితి ఈకథలో కళ్ళకుకట్టబడిరది.ఛత్తీస్‌ఘడ్‌లోపోలీసు తమ స్వార్థంకోసం ఏర్పాటుచేసుకున్న సల్వాజుడుం రక్షకదళా హింస పడలేక అక్కడ నుంచి తొగు రాష్ట్రాకు తరలివచ్చిన గొత్తికోయ పరిస్థితి ‘‘పెనంమీద నుండి పొయ్యిలో‘‘పడ్డట్టు అయింది. ఇక్కడి ఫారెస్ట్‌-పోలీస్‌ అధికాయి సంయుక్తంగా చేస్తున్న హింసాత్మక దాడుకు స్థానికంగా ఉండే గిరిజనును పావుగా వాడుకోవడం ఈకథలో రచయిత చూపించిన కొత్త కోణం.
ఒకరోజు ‘‘మడకంసిరమప్ప’’అనే స్థానిక గిరిజనుడు తమగూడెం సమీపంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ గొత్తికోయగూడెంకు వెళ్లడం అక్కడ ఆగూడెం దొర అనబడే పెద్దమనిషి‘‘దాదా’’ను కవడం అక్కడి వారిజీవనంచూసి ఆశ్చర్య పోవడం జరుగుతుంది. చిత్రమైన వారి జీవన ఏర్పాట్లు,అంతకు ముందుదాకా అక్కడగ అడవి,చెట్లు, అదృశ్యమయ్యి వాటిస్థానంలో పంటకు పనికొచ్చే పోడుభూమి కనబడటంతో సిరమప్పలో ఆశ్చర్యంతో నిండిన ఈర్ష్య కరుగుతాయి. గొత్తికోయు తమ పోడువ్యవసాయంకు వర్షపు నీరును ఎలాన్వి చేస్తారో నివాసం మొదు వ్యవసాయంవరకు కావసిన ప్రతిఉపకరణను,అటవీ కప నుండి గొత్తికోయు ఎలా తయారు చేసుకుంటారో రచయిత తాను ప్రత్యక్షంగా చూసిన అనుభవా అనుభూతు నుండి అందంగా ఆవిష్కరించారు.సిరమప్ప దాదాను సాధారణపకరింపులోభాగంగా ఇక్కడకుఫారెస్ట్‌ వాళ్ళుకానీ పోలీసుగాని వచ్చారా?అని అడగటంతో దాదాలోఒక్కసారిగా తనకు తెలియని భయం మొదలై గతంలోతాము నివసించే ఛత్తీస్‌ఘడ్‌లో ‘‘సల్వాజుడుం’’మూకు తమనివాసాపై సృష్టించిన బీభత్సం గుర్తుకొచ్చి గతం తాూకు విషాదం కన్నీళ్ళ రూపంలో తన్నుకొస్తుంది. ఎదురుగా ఇళ్ల తగబెట్టినపట్టి మంటు కనిపిస్తాయి. అలా నివా సాు కోల్పోయి బ్రతికిబట్ట కట్టి రోజుకు రోజు ు కాలినడకనమిగిలిన పిల్లాపాపతో కలిసి నడిచి వచ్చి ఇక్కడ ఇలావ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుబండ్లు లాక్కుంటూ ఉంటే ఇప్పుడు సిరమప్ప నోట పోలీసు ఫారెస్ట్‌ వాళ్ళమాట వినగానే దాదా మనసు మళ్ళీ కీడు తుస్తుంది జరగబోయే ఘోరం కళ్ల ముందు కదుతోంది. మళ్లీ ఇక్కడ నుంచి కూడా పారిపోవాలా? అని’’దాదా’’కు లాలో చను మొదవుతాయి. గొత్తికోయ గూడెం నుంచి ఇు్ల చేరిన సిరమప్ప అనుకున్నట్టుగానే ఫారెస్ట్‌ రేంజర్‌ వెంకయ్య పోలీస్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ వచ్చి ఉంటారు. ఇద్దరిలో ఒకరిని మించిన ఆందోళన మరొకరిది. అది వారి వారి కొువు కాపాడుకునే స్వార్థంతోనే తప్ప మరొకటి కాదు గొత్తికోయువ్ల ఫారెస్ట్‌ వారికి గ ఏకైక ఇబ్బంది అడవును నరికి పోడు భూము. నివాసాుగా చేసుకుంటు అడవును అంతం చేస్తారని, పోలీసు వారికి ఏమో నక్సలైట్లకు వాళ్లు భోజనాు పెట్టి వారికి సహాయ సహకారాు అందిస్తారని అనుమానం, వీటివల్లే పోలీసు ఫారె స్ట్‌ వారికి గొత్తికోయు శత్రువు అయ్యారు. గొత్తి కోయను తరిమికొట్టే పనిలో భాగంగా ఈ పోలీసు ఫారెస్టు అధికాయి వాళ్లు కష్టపడకుండా స్థానిక గిరిజనుతోనే వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టడం ఈకథలో కొత్తముగింపు. ఆపథకం తోనే అక్కడకు వచ్చిన ఫారెస్ట్‌ వెంకయ్య పోలీస్‌ ప్రభాకర్‌ు స్థానిక గిరిజన నాయకుడైన ‘మడకంసిరమప్ప’ను ప్రభావి తం చేస్తారు, కానీ సొంత సామాజిక వర్గం అయిన గొత్తికోయు మీద తనకు తెలియకుండానే సిరిమప్పలో జాలి కలిగి ‘కష్టపడి పోడుకొట్టుకు న్నారుగా ఇంకేం చేస్తాం బతకనివ్వండి పాపం’అన్న అతడి మాటతో వెంక య్య-ప్రభాకర్‌ వ్యూహం తప్పి పోతుందని ఆందో ళన మొదలై ఇక ఆఖరి అస్త్రం బయటపెడతారు. ఎప్పటినుండో ఇక్కడే ఉంటున్న మీకు చెందాల్సిన ఈ భూము ఎక్కడి నుంచో వచ్చిన గుత్తికోయు అనుభవించడం ఏమిటి మీరు ఇలాజాలిపడి చూస్తుంటే రేపు మీ ప్లికు సెంటుభూమి కూడా మిగదు అన్న పోలీస్‌ ప్రభాకర్‌ మాట బాణాు గురి తప్పలేదు సిరమప్పలో ఆలోచన మొదవు తుంది. ఆదివా సులో ఉండే సహజగుణం మెదిలిఅయిన ఈప నుకు మమ్మల్ని ఎందుకుగుంజుతారు. మీరు మీరు త్చేుకోండి అనిఅసహనంగాఅన్న అతడి మాటతో అతడి మొండితనం గమనించినవాళ్ళు ‘‘మ్లును మ్లుతోనే తీయాలి’’అనే సూత్రం గుర్తుతెచ్చుకొని కొత్త వ్యూహంతో అక్కడినుండి వెళ్ళిపోతారు. పోలీస్‌ప్రభాకర్‌కు వచ్చిన ఆలోచన ప్రకారంగొత్తి కోయకు నక్సల్స్‌తో సంబం ధాున్నాయనే నెపం తో అక్కడినుంచి తరిమి వేయా న్న పౌరహక్కు నేతతోకష్టం, ఒకవేళ అలా చేయకపోతే ఆప్రాంతం నిజంగానే నక్సల్స్‌ అడ్డాగా మరే ప్రమాదముంది. అలా ఆలోచనతో వెళుతున్న వెంకయ్య ప్రభాకర్‌ కు దారిలో పెద్దఆవుగుంపు ఒకటి గొత్తికో యు ఉంటున్న గుట్టవైపు మేతకు వెళ్లడంవారి కంట పడుతుంది, పోలీస్‌ ప్రభాకర్‌ కు మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. ‘‘వెంకయ్య గొత్తికోయ ను తరిమేయాలి అంతేనా? అయితే నేను చెప్పిన ట్టు చెయ్యి మూడో కంటికి తెలియకుండా తేడావస్తే బాగోదు’’అంటూ తన పోలీసు వ్యూహపు ఆలోచ నతో ఆదేశిస్తాడు ప్రభాకర్‌. కొద్దిరోజు గడిచాక ఒకరోజు మడకం వారి గుంపంతా సిరమప్ప ఇంటికి చేరుతుంది అందరిదీ ఒకటే ఆందోళన గతకొంత కాంగా అడవికి మేతకు వెళ్ళిన ఆవు ఒక్కొ క్కటిగా కనప డటం లేదు నెరోజుల్లో10ఆవు మాయ మయ్యాయి అక్కడకు చేరిన వాళ్ళంతా రకరకాుగా మాట్లాడుతున్నారు.అడవిలో కొత్త మనుషు కనిపిం చలేదు పులిజాడ కూడా లేదు మరి ఆవు ఎలామాయం అవుతున్నాయి? సిర మప్పకు అంతు పట్టలేదు రేపు పొద్దున్నే అడవికి పోయి మొత్తంగాలిద్దాం అందరూసిద్ధంగా ఉండం డి అంటూ తనగూడెం వాళ్లను ఆదేశిస్తాడు, సాధా రణంగా గిరిజనుల్లో ప్రతిపని సమిష్టిగా చేసే అ వాటు ఉంటుంది. మర్నాడు మడకంవారి గుంపు గిరిజ నుంతా అడవికి బయు దేరుతారు అడవిలో ప్రతిచోట వెతుకుతారు ఎక్కడాతప్పి పోయిన తమ ఆవు ఆచూకీ కనిపించలేదు. చివరి ప్రయత్నంగా గొత్తికోయు నివాసం ఉండి సాగు చేస్తున్న నాుగు గుట్టుచుట్టు గాలిస్తారు పోడు భూమికి పడమర దిక్కు వెళ్లగా అక్కడకొండగడ్డి దట్టంగా పెరిగి ఉంటుంది అక్కడికి గొత్తికోయ గుడిసొ కనిపిస్తు న్నాయి ఆ గడ్డి తొక్కుకుంటూ నడుస్తున్న సిరమప్పకు అక్కడ కనిపించిన దృశ్యంతో ఒళ్ళు జదరిస్తుంది. ఎముక కుప్పను చూసిన మిగతా జనాకు ఆవేశం తన్నుకొస్తోంది సిరమ ప్పకు నోట మాట రాలేదు. ఇది గొత్తికోయ పనే అని అందరూ అనుకుంటారు గొత్తికోయ గుడిసె వైపు ఆవేశాగ్ని గిరిజను రూపంలో వెళుతుంది క్షణాల్లో గొత్తి కోయ గుడిసొ అగ్గి మంటల్లో కాలి బూడిద అయిపోతాయి మంటల్లో కాగా మిగిలిన గొత్తి కోయు నెత్తురోడుతున్న శరీరాతో చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోతారు ఆమంటల్ని చూస్తూ గొత్తికోయ పెద్దదిక్కు దాదా మొదు నరికిన చెట్టులా కూలిపోతాడు. ఇదంతా ముందే తెలిసిన సిరప్ప గొత్తికోయు వదిలివెళ్లిన బంగారం లాంటి పాతిక ఎకరా పోడుభూమికి హక్కుదారుని అయ్యానని ఆనందంతో చిద్విలాసంగా నవ్వుతూ ఉండటం తో కథ ముగుస్తుంది.ఈ‘దాడి’కథ ద్వారా రచయిత విద్యాసాగర్‌ గొత్తికోయ పక్షమా! స్వార్థంతో గిరిజనేతర అధికాయి గిరిజను మధ్య ఎలాచిచ్చు పెడుతున్నారో చెప్పే ప్రయత్నమా ?లేక ఆధునికఅరాచకాకు అమాయకపు ఆది వాసు ఎలా సమిధవుతున్నారో చెప్పే క్ష్యమా ?అన్న ప్రశ్ను పాఠకుకు వస్తాయి కానీకథ చర మాంకంలో సిరమప్ప మానసిక స్థితిని రచయిత ఆవిష్కరించిన తీరు ఇలా ఉంటుంది. ఇలాంటివి ధ్వంసం చేస్తే పాతిక ఎకరా పోడుభూమితనకు దక్కుతుందని ఫారెస్ట్‌ అధికారి వెంకయ్య చెప్పిన మాటు సిరమప్పకు గుర్తుకు రావడం ఆవును చంపింది గొత్తికోయు కాదని ఫారెస్టరే వాటిని చంపించాడని పాతిక ఎకరా భూమిని ఆశచూపి తనను ఈ విధ్వంసానికి పావుగా వాడుకున్నాడని సిరమప్ప అంతరాత్మకు తొసు.
అలాచీర ముక్కు గిరిజనేతరు స్వార్థబుద్ధి సోకి అతనిలో ఒక ఫారెస్ట్‌ వెంకయ్య ఒక పోలీస్‌ ప్రభాకర్‌ ఒక సల్వాజుడుం సభ్యుడు అగుపిస్తున్నాయి కొత్తరూపం ఎత్తిన గిరిజ నేతరు ఉన్నాడు అంటూ స్వార్ధపు సహజగుణం గ గిరి జనుల్లో ఎలాంటి స్వార్థం దాడి చేస్తుందో చెబు తూ ప్రస్తుతం గిరిజనజాతి చాలావరకు ఈఅను కరణ ప్రవాహంలో పడి పోయిందని భవిష్యత్తులో మరింతగా కూరుకుపోయే ప్రమాదంఉందని భవి ష్యత్తును ఊహించి ఆశించే రచయితగా తనదైన హెచ్చరికతో కూడిన ధర్మాగ్రహం వ్యక్తం చేశారు రచయిత విద్యాసాగర్‌. ఇలాంటి స్వార్థపు దాడుల్లో ఎలాంటి అడవిబిడ్డు బలికావద్దనే విస్తృత ఆలోచ ను ఆచరణదిశగా అందరిలోరావాలి అప్పుడే మన దేశ మూవాసు అనిచెప్పబడుతున్న ఆది వాసు జాతి చరిత్రలో సుస్థిరంగ నిుస్తారు.

గోడమీది బొమ్మ..!

తొగు కథావనంలో గిరిజన కథాసుమాలు- 12వ భాగం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ గోడమీద బొమ్మ’’- `సంపాదకులు


గిరిజను అంటే కేవం శ్రమజీవు కాదు చక్కని సృజనాత్మకత కలిగిన కళాకాయి అని కూడా తొసుకోవాలి. వారి జీవన స్రవంతిలో భాగమైన వెదురు వస్తువు తయారీలో ఈవనజీవు కళాప్రతిభ కనిపిస్తుంది. అందులో భాగంగానే గిరిజన జాతుల్లో భాగమైన సవరు,వర్లీ,తెగ గిరిజను చక్కని చిత్రకాయిగా చరిత్రలో నిలిచారు. శ్రీకాకుళం జన్మస్థానం అయి ప్రస్తుతం భాగ్యనగరం ఆవాస కేంద్రంగా ఉన్న ప్రసిద్ధ అనుసృజనకారిణి,కథారచయిత్రి, ‘‘పార్నంది లిత’’రాసిన ఈ కథ 2015 డిసెంబర్‌ 27 నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురించబడిరది.గిరిజన చిత్ర కళల్లో ఒకటైనది నేటి ఆధునిక సమాజాన్ని బాగా ఆకర్షించిన ‘‘వర్లిగిరిజన చిత్రకళ’’వారి సంస్కృతిలో ఎలా అంతర్భాగం అయింది అది ఎలా ఉపాధి దారి పట్టింది వివరిస్తూ రచయిత్రి లిత ఈ కథను ఆద్యంతం అద్భుతం గా తీర్చిదిద్ది నడిపించారు.

గిరిజను అంటే కేవం శ్రమజీవుకాదు చక్కనిసృజనాత్మకత కలిగిన కళాకాయి అని కూడా తొసుకోవాలి. వారిజీవన స్రవంతిలో భాగమైన వెదురువస్తువు తయారీలో ఈవన జీవు కళాప్రతిభకనిపిస్తుంది.అందులో భాగంగానే గిరిజనజాతుల్లోభాగమైన సవర ు,వర్లీ,తెగ గిరిజను చక్కని చిత్రకా యిగా చరిత్రలోనిలిచారు.ప్రపంచీకరణ మనదేశ సంస్కృతిసంప్రదాయాపై దాడిచేసి వాటిని అంత రింపజేస్తుంది అనే ఆరోపణ ను మరో కోణం నుంచి చూపిస్తూ దానిసాయంతోనే మన సంస్కృతిని విశ్వ వ్యాప్తంగా కూడా చేయవచ్చును అనే సూచనతో కూడిన ‘‘కొత్త కోణం’’లో ఆవిష్కరించిన కథ‘‘గోడమీద బొమ్మ’’. శ్రీకాకుళం జన్మస్థానం అయి ప్రస్తుతం భాగ్యనగరం ఆవాస కేంద్రంగాఉన్న ప్రసిద్ధ అనుసృజనకారిణి.కథారచయిత్రి ‘‘పార్నంది లిత’’రాసిన ఈకథ 2015 డిసెంబర్‌ 27నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం అను బంధంలో ప్రచురించబడిరది. గిరిజనచిత్ర కళల్లో ఒకటైనది నేటిఆధునిక సమా జాన్ని బాగా ఆకర్షించిన‘‘వర్లిగిరిజనచిత్రకళ’’వారి సంస్కృతిలో ఎలాఅంతర్భాగం అయింది అది ఎలా ఉపాధిదారి పట్టింది వివరిస్తూ రచ యిత్రి లిత ఈకథను ఆద్యంతం అద్భు తంగా తీర్చిదిద్ది నడిపించారు. రచయిత్రి స్వయంగా ముంబై సమీపంలోని‘‘వాన్‌గావ్‌’’ అనే గిరిజనగ్రామాన్ని సందర్శించి తనకు దొరికిన అనుభవా అనుభూతు సింగారించి అతిప్రాచీనకాం నుంచి ఆకళ ను అక్కడి గిరిజ ను ఎలా పెంచి పోషించి నేటి తరానికి అందిస్తున్నారో సవివరంగా అక్షర చిత్రీకరణ చేసి చూపించారు.కథ విష యానికి వస్తే ‘‘అనన్య’’అనబడే ఒక జర్నలిస్టు ‘‘వర్లిచిత్రకళ’’ గురించి సవివర మైన కార్యక్రమం రూపొందించడం కోసం తాను ముంబై వెళ్లి అక్కడికి సమీపంలో గ వాన్‌గావ్‌ వెళుతుంది.ఆగ్రామానికి చెందిన గిరిజన యువకుడు,చిత్రకారుడు, అయిన సంజయ్‌ సాయంతో తనచిత్రకళ సందర్శన యాత్ర చేస్తుంది అనన్య. సంజయ్‌ ఇంటికి చేరిన అనన్య మనసంతా అపురూపమైన ‘‘వర్లిచిత్రకళ’’తో నిండి పోతుంది. అక్కడివర్లి తెగగిరిజనయువతీ- యువకుంత ప్రాచీనమైన తమ జాతి చిత్రకళను ఆధునికత సాయంతో అభివృద్ధి చేస్తుంటారు. మూలాు చెడకుండా! కొందరు ఆర్ట్స్‌ స్కూల్లో చదువుకుంటుండగా మరికొందరు పాఠాు చెప్పేస్థాయికి చేరుకున్నారు అదిఆప్రాంత గిరిజన యువత ప్రత్యేకత. అక్కడి గిరిజను అతి సాధా రణ పనిముట్లతో అద్భుతమైన బొమ్ము చిత్రిస్తున్నారు.పేడ నీళ్లుచల్లిన సాధారణ నే మీదకేవం ముగ్గుతో‘‘బిడ్డనెత్తుకున్న తల్లి బొమ్మ’’చూసిన అనన్య అబ్బురపడు తుంది అదివేసింది..జె.జె.పాఠశాలో డ్రాయింగ్‌ పాఠాు చెబుతున్న గిరిజన యువతి అని తెలిసి ఆశ్చర్య పడుతుంది. ఆ గ్రామంలోని గిరిజను ఇళ్లన్నీ మట్టితో అకబడి అందమైన వర్లీ చిత్రాను అం కరించుకుని, అందాను ఆరబోస్తున్న వైనం కళ్ళారా చూసిన అనన్య తానుండె ఆధునిక నగరాన్ని మర్చిపోతుంది ఆక్షణాన కదిలే వర్లీ సాంప్రదాయా ఉన్న సంజయ్‌ తల్లిని పరిచయం చేసుకున్న తనుభాష రాకపోయినా విశ్వ భాష అయిన’’సైగ భాష’’తోనే ఆమెవెంట వెళ్లివాళ్ళ పెరటితోటలో పండిరచుకునే కందు,పెసు వంటి పంట గురించి పనుగురించి ఆసక్తిగా తొసు కుం టుంది. అక్కడి పంటపొలాు,పశువు, పక్షు,అమాయక చూపుతో సహజమైన సింగారాతోవున్న వర్లిగిరిజనజనం.అక్కడి ప్రకృతిలో కలిసిపోయిన మాటకందని సోయ గాను మనసారా చూసుకుంటుంది అనన్య తనవైన జర్నలిస్టుకళ్లతో సంజయ్‌వాళ్ల ఇంట్లో ఆమెను అమితంగా ఆకర్షించిన బొమ్మ అతని చెల్లి పెళ్లి సమయంలో గోడమీద వేసిన బొమ్మ, బొమ్ము వేయకుండావాళ్ళు అసు పెళ్లి చేయ రట! అంటే ఆగిరిజను బొమ్ము వేసే సంస్కృతి వారిప్రధాన పనుల్లో ఎంతగా విలీనం అయిందో అర్థమవుతుంది. మరోవిశేషం ఈజాతి గిరిజను పెళ్లిపెద్దగా వ్యవ హరిం చేది భర్త చనిపోయినస్త్రీ దలేరి అనిపిలిచే ఈపెళ్ళిపెద్ద పెళ్లితంతులో మొదటి నుంచి చివరి వరకు అన్నిటతానే ముందుండి నడిపి స్తుంది. పాటుపాడుతుదీపంపట్టుకునిఆమె ముందు నడుస్తుంటే పెళ్లైనముత్తైదుమ ఆమె వెనకా నడుస్తారు.వర్లిగిరిజను భర్త చని పోయిన స్త్రీకిఇచ్చేప్రాధాన్యత స్త్రీజాతికే గర్వకార ణంగా ఉంటుంది. నుచదరపు పీటలాంటి బొమ్మదానిని దేవతగాభావించి పెళ్లి సమ యంలో పూజుచేసి ఆమెచుట్టూ వారు వాడే వస్తువువారు ఉపయోగించే సంగీత వాయి ద్యాు ఉంచి కొుస్తారు.ఈవిధంగా వాళ్లుచేసే పెళ్లితంతు అంతాపెళ్లి జరిగే ఇంటిగోడ మీద చిత్రించటం వారి సంస్కృతిలోభాగం. వారి ఇళ్ళల్లో జరిగేపెళ్లి సందడి గుర్తుగా వారిఇళ్ల గోడమీదబొమ్ము కనపడతాయి.వారిజాతి సంప్రదాయంలో భాగమైన జానపద కథను కూడా ఈగిరిజను బొమ్ముగా గీయడం వారిఆచారం. అంతటి ప్రాధాన్యత సంతరించు కున్న జాన పదగాధ తాూకు బొమ్ము కూడా అనన్య కెమెరా కళ్ళ కు అక్కడ కనపడ తాయి.‘‘ఏడుగురు అన్నద మ్ము ఏడుగురు అక్కచెల్లెళ్ళు వాళ్ళలోచిన్నచెల్లి ఒకరోజు తదువ్వుకుంటుండగా ఆమె బంగారుత వెంట్రుక ఒకటివూడివస్తే అదిభూమిమీద వేస్తే జంతువుకు,నీళ్ళలో వేస్తేచేపకు ఇబ్బంది. చెట్టుకు కడితే పక్షుకు ప్రమాదంఅని ఆలో చించి చివరికిఎవరికీ ఇబ్బంది రాకూడదని ఓచిన్న ప్లుకుచుట్టి నదిలో వేస్తుంది.తీరా అదిఏడుగురు అన్నదమ్ముల్లో ఒకడు ఆనదిలో స్నానం చేస్తుండగా అతని కంట పడుతుంది దానిని తీసిజాగ్రత్త చేసు కోవడమేకాదు దానిని అమితంగా ప్రేమించి ఆతవెంట్రుకగ అమ్మా యినె పెళ్లి చేసుకో వడానికి నిశ్చయించు కుంటాడు.తీరా ఆత వెంట్రుక తనచెల్లిదిఅని తెలిసాక కూడా తనమొండిపట్టు వీడడు. విషయం తెలిసినఆప్లి బాధతోచందనంచెట్టు కింద కూర్చుని రాత్రిపగుఏడ్చి ఈఅన్యాయం నుంచి రక్షించమని చంద్రుడిని వేడుకుంటుంది చందమామ తనకిరణాతోజాలిగా చూస్తాడు. ఆప్లిచందనం చెట్టుఎక్కి చందమామను చేరు కుంటుంది. ఇది వర్లిగిరిజను చెప్పుకునే ప్రసిద్ధమైన జానపద కథ.ఈ కథను కళ్ళకు కట్టే బొమ్మ బొగ్గుపొడితో కోరారంగు ముతక బట్టమీద వేసింది. వర్లిసాంప్రదాయంతో చిత్రిం చిన పెద్దచెట్టు ఆకు కొమ్ము త వెంట్రు కెతాడుగ పైన మబ్బు మధ్యగ నెవంకను చేసుకుంటున్న ప్లి చెట్టు కింద కన్నీళ్లు కారు స్తున్నతల్లి ఆశ్చర్యంతో కుటుంబమంతా…‘‘ఇది జానపదగాధ తాూకువర్లిచిత్రం.ఇలాంటి జానపదగాధను బొమ్ముగ గీసినచిత్రాు ఎన్నో సంజయ్‌ వాళ్ల ఇంట్లో ఆమెకు దర్శన మిస్తాయి. అతను ఒక్కో బొమ్మలో దాగిన జానపద గాథను చెబుతుంటే చిత్రాల్లోంచి కథు చిలికిన వెన్నెలా బయటికి వస్తూ ఉంటాయి. అనన్య పొద్దుటి నుంచి సాయం త్రందాకా ఆవర్లీ చిత్రా విశేషాు చూస్తూ వింటూ మధ్యమధ్యలో వారుఅందించిన ఆత్మీయ ఆహారాన్ని స్వీకరిస్తూ అబ్బురపడు తుంది, అక్కడ తను చూసిన బొమ్మన్నిటికీ కారకుడు సంజయ్‌ అనితెలిసి ఆపూర్వగాధు అతను తనఅమ్మమ్మ చెప్పగావిని నేర్చుకున్న తీరుకుఅబ్బుర పడుతుంది, అయితే నేటి ఆధునిక వర్లిచిత్రకాయి సాధారణచిత్రాు అయితే వేస్తున్నారుగానీ జానపదచిత్రాు వేసేవారు లేరని అతనొక్కడే చివరికి మిగి లానన్న సంజయ్‌మాటతో ఆమెలో నిరాశ కుగుతుంది. నే దున్నినందుకు భూదేవికి క్షమాపణ చెప్పేజాతి, గుహల్లోచిత్రించటం మొదు పెట్టిప్రస్తుతం స్కూల్‌ వరకు వెళ్ళిన ఘనమైన చరిత్రగ గిరిజనజాతి వర్లీది. అతి సాధారణ పరికరాు వస్తువు ఉపయోగించి అసాధారణమైన చిత్రాు గీయడంఒక్క వర్లిగిరిజనుకే చేతనైన కళ అనవచ్చును, తరతరా నుంచి వారి సంస్కృతి సాంప్ర దాయాలో అంతర్భాగంగా వస్తున్న ఈ చిత్రకళనేడు ఆధునిక మెరుగు దిద్దుకుని అమ్ముడు అవుతూ ఆ వన వాసుకు జీవనో పాధిగా మారింది, ఆదృక్పథంతోనే ‘‘మీరు ఏదైనా పెయింటింగ్‌ తీసుకుంటార?’’ అని సంజయ్‌ అనన్యను అడిగిన మాటల్లో అతని సున్నిత వ్యాపార తత్వం తొస్తుంది,.‘‘లేదు మీ గురించి నేనురాస్తాను దానివ్ల మీకుమంచి పబ్లి సిటీ వస్తుంది’’ అన్న అనన్య సమాధానంలో ఆధునిక వ్యాపారానికి పబ్లిసిటీ అనబడే ప్రచారం ప్రసారం అవసరం గురించి రచయిత్రి చమత్కారంగా చెప్పిన తీరుబాగుంది.గిరిజన సాంప్రదాయకళ వారిదగ్గరె ఎందుకు ఉండి పోవాలి?కళపరమార్థం అందరికీ చేరడమే కదా!? ఆధునికంగా వస్తున్న అన్నిరకా మాధ్యమాల్లో అవసరాన్ని బట్టి ఈ సాంప్రదాయ చిత్రకళను ఎందుకు ఉపయోగించకూడదు? నేటి ఆధునిక మానవుని ఆనందానికి మానసిక సంతృప్తికి అనాటి చిత్రకళ సాయం ఎందుకు తీసుకోరాదు? మనంఎంత ఆధునీకరించబడి ఎన్ని రకా వస్తువు తయారు చేస్తున్న వాటి తయారీకి మూసూత్రాు పూర్వం మన మహ నీయు రూపొందించిన సూత్రాలే కదా? వాటి పునాదు మీదనేటి ఆధునిక భవనాు ఆవిర్భ విస్తుంది.వంటి ఆలోచను తన మనసు నిండా నింపుకున్న అనన్య తిరుగు ప్రయాణం అవ్వ డంతో కథసుఖాంతమవుతుంది. ఈ‘‘గోడమీద బొమ్మ’’ కథలో రచయిత్రి లిత శిల్పానికన్న విషయానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తాను గమనించిన విక్షణమైన గిరిజన చిత్రకళ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయానే తపనతోనే కథనంతా నడిపిస్తుంది, అనవసరపు వర్ణను ఉపమానాు లేకుండా అవసరం మేరకే పదబంధాు ఉపయోగిస్తూ తను పొందిన అనుభూతిని అక్షరీకరించే క్ష్యంతో కృషి చేసిన ఆమె మొదటి నుంచి చివరి వరకు గురితప్పని బాణంలా దూసుకుపోతూ పాఠకుకు మివైన గిరిజన సంప్రదాయ విజ్ఞానాన్ని పంచడంలో విజయం సాధించింది అనవచ్చు.

ములుపు

తొగు కథావనంలో గిరిజన కథాసుమాలు.


ప్ర‌ముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్న ఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ ములుపు’’- `సంపాదకలు

శ్రమశక్తి చిరునామాలే కాదు..
పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవిబిడ్డల‌ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం..అజరామరం. ఆ అపురూప విషయాను కథావస్తువుగా తీసుకుని… ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితు కోక్లొు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత ‘‘ అల్లం రాజయ్య’’ ఒకరు. తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారం రంగరించి వ్రాసిన కథ ముపు 1991 సంవత్సరం లో వ్రాయబడిన కథ. గోదావరి పేరుతో భూమిక కథా సంకనంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ. శ్రమశక్తి చిరునామాలే కాదు.. పోరా టాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవి బిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం, అజరామరం. ఆఅపురూప విషయాను కథా వస్తువుగా తీసుకుని, ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితుకోక్కొలు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత అ్లం రాజయ్య ఒకరు. తానుప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవాల‌ సారాంశం రంగరించి రాసిన కథ ములుపు1991సంవత్సరంలో రాయ బడిన కథ. గోదావరిపేరుతో భూమికకథా సంక నంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజనుల‌ అధికంగా నివసించే అడవుల‌ జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ.

గోండుబెబ్బులిగాపేరుపొందిన కొమ రం భీమ్‌ పోరాటస్ఫూర్తి ఆప్రాంతాకు ఒక చైతన్య దీప్తి, అయినామారిన కాలాను బట్టి పరిస్థితును బట్టి చైతన్యశక్తి మారటం సహజం. ఆదిలాబాద్‌ ఆదివాసి పోరాటా తీరు కూడా అందుకు తీసిపోలేదు. ఇంద్రవెల్లి సంఘటన బలిదానాతో అక్కడి పోరాటచైతన్యంలో నూతనదైయి ఏర్పడ్డాయి. గిరిజన పోరాట రూప క్పనలో జరిగిన నూతన ఆవిర్భావం గురించి తనదైన కొత్తకోణంలో వాస్తవ సంఘట నను ఆసరాచేసుకుని రాసిన, ఈ ముపు కథ గిరిజన పోరాటా ప్రస్థానానికి నిజమైన మార్పు అన వచ్చు.మాటకన్నా చేతుమివైనవి అనే సూత్రం ఆధారంగా చెప్పబడ్డ ఈ కథలో రచయిత తీరు భాషణ వ్యతిరేకత్వం గా కనిపిస్తుంది.మాట అవసరం లేకుం డానే మిగతా జంతుజాం అంతా క్మషరహితంగా, జీవిస్తూంటే  మాటు నేర్చిన మానవుడు,మాయు చేస్తున్నాడు. మార్కెట్‌ వ్యవస్థకు మూలాధారం ఈమాయ మాటలే అని కథారచయిత దృఢవిశ్వాసం. ఈకోణం ఆధారంగానే  నూతనగిరిజన పోరా టా చైతన్యానికి, ఊక దంపుడు ఉపన్యాసా కన్నా చేతనే గిరిజను నమ్మి అటువంటి చేత నాయకునే అనుసరిస్తారు, అనేసత్యాన్ని అ్లం రాజయ్య ఈకథ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇకకథ విషయానికొస్తే అసిఫా బాద్‌ పరీవాహక గోండు గిరిజన గ్రామాల్లోని అడవి బిడ్డు వస వ్యాపారు అక్రమాకు ఎలా బలై ఆర్థికంగా నష్టపోతున్నది ఈకథ కళ్ళకు కడుతుంది. ఈప్రాంతంలో అధికసంఖ్య లో గోండు,అల్ప‌సంఖ్య‌ కోలాంజాతి గిరిజను నివసిస్తూ పోడువ్యవసాయం, పశువు కాపరులుగా జీవనం సాగిస్తూ ఉంటారు. ‘పూర్వం తమవంశీయులైన గోండ్వానా రాజ్యా న్ని పాలించారు. వారి వంశానికి చెందిన వారంమేము’అనే అ్పసంతోషం తప్ప ప్రస్తు తం..తమమంచితనాన్ని,అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాదోచుకుంటున్నారో గమనించలేక పోతుంటారు. ఇలాగ అతి మంచితనం అమాయకత్వంగ గోండు-కోలాం జాతి గిరిజనును చైతన్యపరిచి దోపి డీ నుంచి బయటపెట్టడం కోసం సామాజిక స్పృహ గ నాయకు తమ ప్రయత్నాు తాము చేస్తూఉంటారు. కానీ నిత్యంపోరాటం కోసం నాయకు మాటు విని విని విసిగిన గిరిజను మౌనంగా వింటూంటారు తప్ప చైతన్యం చెందరు. గోండుభాష,తొగు భాషు తెలిసిన పొగాకు వ్యాపారి చ్చయ్య నిరంతరం పొగాకు వ్యాపారం నెపంతో గిరిజనగూడేలో తిరుగుతూ వారి బాధను ప్రత్యక్షంగా చూస్తూ వస వ్యాపారు ఆగడాు అరికట్టే ప్రయత్నాు చేస్తూ ఉంటాడు. రాత్రి వేళల్లో రహస్యంగా గోండు గూడేలో జనసమీకరణు  చేసి తన మాట ద్వారా వాళ్ళను పోరాటం వైపు ఆకర్షించే ప్రయ త్నం చేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళల్లో చైతన్యం రాకపోవడం వ్ల వారిని సోమరిపోతుగా భావి స్తాడు.కానీ తనచైతన్య ప్రేరణ పని మాత్రం ఆపడు. తన పోరాట చైతన్య ప్రయత్నంలో మైదాన ప్రాంతా నికి చెందిన రైతుబిడ్డ పోరాటస్ఫూర్తి గ యువ కుడు అయిన రాఘవు ను కూడావెంటపెట్టుకుని గోండు గ్రామా పోరాట చైతన్య స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు చ్చయ్య. అతని వెంట తిరిగేరాఘవు ఆప్రాంతాల్లోని గిరిజను స్థితిగ తుతో పాటు అక్కడి వ్యాపారు అక్రమాను ఆగడాను ప్రత్యక్షంగా గమనిస్తాడు.గోండు జాతు  చైతన్య ప్రస్థానం’లో భాగంగా చ్చయ్య రాఘ వుతో కలిసి, గూడెం చేరి సిడాం మాన్కు గుడిసె కు చేరుకుంటాడు. ఆరాత్రి అక్కడే తన మకాం. చ్చయ్య వచ్చిన కబురు ఆ నోటా ఈనోటా గూడెం లో అందరికీ తెలిసి అతను చెప్పే మాటు హాయి గావిని, అతడు ఇచ్చే పొగాకు తీసుకోవడానికి, బువ్వతిని నెమ్మదిగా  సిడాంమాన్కు గుడిసె ముందు పెట్టిన నెగడు ముందుకు చేరారు. సిడాం మాన్కు బాకీకోసం ఆగ్రామ షావుకారు జగ్గయ్య అన్యా యంగా తీసుకుపోయిన కంకు (దుక్కి టెడ్లు) గురిం చిన ప్రస్తావన తీసుకు వచ్చాడు, పొగాకు చ్చయ్య. గతంలోగోండు చేసిన పోరాటా గురించి చెప్ప సాగాడు. అందరం కలిసిజగ్గయ్య మీద తిరుగు బాటుచేసి ఎవరి వస్తువు వాళ్లు తెచ్చు కోవాలి అంటూ వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పుకు పోతున్నాడు చ్చయ్య. గోండుభాష రాని రాఘవు ుకు అదిఅంతా చిత్రంగా అనిపిస్తోంది. అక్కడ చేరినవాళ్ళలో కొందరు చ్చయ్య మాటు  ఆసక్తి గా వింటూ ఉంటే, కొందరు కూర్చున్న చోటే కునికి పాట్లు పడుతూ నిద్రలోకి జారుకున్నారు. వెనక కూర్చున్న వాళ్ళు సప్పుడు చేయకుండా వెళ్ళి పోతు న్నారు. అక్కడ మిగిలిందికంకు కోల్పోయిన మాన్కు ఇతర వస్తువు ధాన్యం అక్రమంగా షావుకారు పాు చేసుకున్నవ్యక్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడి పరిస్థితి అంతా గమనించిన రాఘ వుకి ‘వీళ్లు ఇన్ని రకాుగా దోపిడీకి గురవుతూ ఎలా బ్రతుకుతున్నారు’ అనిపించింది. గతచరిత్రలో జరి గిన వివిధ గిరిజన పోరాటాు, అతను చదివిన ఉద్యమ సాహిత్యం గుర్తుకువచ్చి, వీళ్ళల్లో నిస్తబ్ధత ఎలాపోగొట్టాలి? అనేఆలోచనలో పడ్డాడు. వీళ్ళకు చెప్పడంకాదు, చేసిచూపించాలె, అని మెరు పులాం టి ఆలోచన అతనిలోకలిగింది.‘మాటకన్నా చేతుగావాలె’.చేతుచేసుకుంటూ మాటు చెప్పా లె’ అనుకున్నాడు. రాఘవు చ్చయ్యకు అదే విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. తెల్లారి ఇద్దరూ కార్యోన్ముఖులై షావుకారుజెగ్గయ్య ఇంటికి చేరారు. పొగాకు చ్చయ్య, తనపంథా మార్చి షావుకారు మీద కోపం చూపిస్తూ పౌరుష పదాతో మాన్కుకు ఎడ్లను ఇస్తావా?లేదా?ఇవ్వకపోతే,ఇల్లు తగ బెడతాం అంటూ దౌర్జన్యంగా మాట్లాడేసరికి షావు కారులో భయం తొంగి చూసింది.
   ల‌చ్చయ్య కూడా ఊహించని విధంగా ‘నీ మాట మీద నమ్మకంతో ఇస్తున్న ఎడ్లను త్కోపో, బాకీ మాత్రం తొందరగా కట్టమని మాన్కుకు చెప్పు. అంటూ తన సహజదర్పం ప్రదర్శించాడు భయ పడుతూనే జెగ్గయ్య. ఆసంఘటన ఆనోటా ఈ నోటా పడి నిప్పురవ్వలా వ్యాపించింది. ఇప్పుడు అతడు పొగాకు ల‌చ్చయ్యకాదు జెగ్గయ్యనుఎదిరించిన  భీమ దేవుడంత బంగ చ్చయ్య అయ్యాడు. అప్పటి దాకా పొగాకు పంతుగా పిలిచిన వారంతా పొరక సారు అనడం మొదు పెట్టారు. పొరక సారు, రాఘవు కలిసి తిరిగి గోండు నుంచి షావుకార్లు గుంజుకున్న వస్తువు తిరిగి ఇప్పిస్తా మని భరోసా ఇస్తూ వాళ్ళు కోల్పోయిన వెండి, బంగారం, భూము ,పశువు, వివరాు అన్నీ జాబితాు రాసుకున్నరు.పొరకసార్లు తమ వస్తువు ు తమకు ఇప్పిస్తారనే నమ్మకంతో,గూడేు గూడేు వీరిని అనుసరించటం మొదయ్యింది. ఆగోండు గూడేన్నింటికీ  పెద్దదైన వాంకిడిలో గల ఎక్కువ సంఖ్యలోని షావుకార్ల ఇళ్ళమీద దాడి చేయ డానికి, పొరక సార్లు  వ్యూహరచన చేశారు. 

ఆవూరిలో సంత జరిగే రోజే ఆ పనికి ముహూర్తం అయ్యింది. అన్ని గోండుగూడేకు ఈవార్త క్షణాల్లో వ్యాపిం చింది. కోల్పోయిన నగు, వస్తువు తమ సొం తం కాబోతున్నాయనే సంతోషంతో చెప్పిన సమ యానికి ఆదివాసి జనాంతా,చీమ బారుల్లా  బయు దేరారు. అరుపుతో నిండిపోయింది.ఇది చూస్తున్న షావు కార్ల కళ్ళు తెలియని భయంతో చూపు చూస్తు న్నాయి. వాంకిడి గ్రామం మొత్తం అడవి బిడ్డు పాదాతో పునీతం అయి పోయింది. ఆ చిన్న గ్రామం వేమందితో కిక్కిరిసిపోయింది. ఇంతకీ, దీనికి కారకులైన చ్చయ్య, రాఘవు వారి వెంటలేరు. వాళ్లుఎట్లా వస్తారో ఎక్కడ నుంచి వస్తారో  అని ఎవరికి వాళ్ళు ఊహాగానాు పెంచు కుంటూ,పొరకసార్లు తమసామాన్లు పంచ బోయే షావుకార్ల ఇండ్లవైపునడకు  సాగించారు, గోండు జాతి గిరిజనబిడ్డు. ముందున్న వాళ్ళకే అందుతా యేమో! వెనకబడితే అందుకోలేమనే ఆతృత మొదలై అక్కడ పెద్ద అజడి మొదలైంది. చూసే వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోగానే తొక్కిస లాట మొదలైంది.షావుకార్ల ఇళ్ళ ముందరి కంక దళ్ళు కూలిపోయాయి. ఇళ్లముందు పందిళ్ళు విరి గాయి. గూన పెంకుట్లిు కూలినయ్‌ ! గోండు జనం ఇళ్ళల్లో చేతికందినదల్లా తీసుకు న్నారు. బియ్యం,పప్పు,ఉప్పు,మిరపకాయు,బట్టు, ఆఖ రకు వెండి, బంగారు నగు చేతికి దొరికినదల్లా వదడం లేదు. వెనకనున్న వాళ్ళు తమకు అందవే మోనని  అరుస్తున్నారు. ఆ గలాటాలో అప్పు కాయి తాు,ఖాతా పుస్తకాు కనిపించిన కాగితాన్నీ చింపి పోగు పెట్టి నిప్పు పెట్టబడ్డాయి. గణపతి సేట్‌ గోండ్లు వాంకిడి మీదపడి దాడిచేస్తూన్న సమా చారం ఆసిఫాబాద్‌ పోలీసుకు చేరవేయ డంతో  రెండు వ్యాన్ల నిండా పోలీసు అక్కడికి వస్తు న్నారన్న వార్త వ్యాపించింది.జనాంతా సామాన్ల తో సహాఎట్లా వచ్చినవాళ్ళు అట్లానే అడవుల్లో కలిసిపోయారు.‘ఒకనిప్పురవ్వ రగిలింది అది ఆది లాబాద్‌ అడవును చుట్టేసి దావానమయింది’ అన్న వాక్యంతో ముగించిన ఈ కథలో కొత్త పోరాట మూలాన్ని రచయిత వినూత్నంగా ఆవిష్కరించి సఫలీకృతుడయ్యాడు. ఏపోరాటమైనా ప్రారంభంలో మాత్రమే నాయకు చేతిలో ఉంటుంది. అంత్య దశలో ప్రజ చేతుల్లోకి వెళ్తుంది.
 ప్రజ చేతిలో పడ్డ పోరాటమే ఫలితా ను సొంతం చేసుకుం టుంది అనే అసలైన సత్యం ఈ‘‘ముపు’’కథ ఆవిష్క రిస్తుంది.ఈ కథలో ఆద్యంతం పోరాట చైతన్య స్రవంతితోపాటు గోండు కోలాము జీవన విధా నం వాళ్ళలోని సామాజిక ఐక్యత సజీవంగా అక్షరీకరించడం ఈకథకు మరింత వన్నె చేకూరింది.

(వచ్చే సంచికలో పి.లిత కథ -గోడమీదబొమ్మ విశ్లేషణ)

ములుపు

తెలుగు కథావనంలో గిరిజన కథాసుమాలు..11వ భాగం

ప్రముఖ పరిశోధక రచయిత, విశ్లేషకుడు, డాక్టర్‌ అమ్మిన శ్రీనివాసరాజు థింసా పత్రిక కోసం ప్రత్యేకంగా రాస్తున్న ‘గిరిజన కథావిశ్లేషణ’ ధారావాహికంగా అందిస్తున్నఈ నెల సంచికలో కథా విశ్లేషణ ‘‘ ములుపు’’-`సంపాదకలు

శ్రమశక్తి చిరునామాలే కాదు..పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవిబిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం..అజరామరం. ఆ అపురూప విషయాను కథావస్తువుగా తీసుకుని… ఎన్నోఅపూర్వమైన కథు అల్లిన తొగుకథా రచయితు కోక్లొు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిర్యాకు చెందిన అగ్రశ్రేణి కథారచయిత ‘‘ అ్లం రాజయ్య’’ ఒకరు. తాను ప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారం రంగరించి వ్రాసిన కథ ముపు 1991 సంవత్సరంలో రాయ‌బడిన కథ. గోదావరి పేరుతో భూమిక కథా సంకనంలో ప్రచురించబడిరది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ములుపు కథ.

శ్రమశక్తి చిరునామాలే కాదు.. పోరాటాలో త్యాగధనుగా లెక్కించవసిన అడవి బిడ్డ జీవనంలోని ప్రతిఘట్టం ఒకఅద్భుతం, అజరామరం. ఆ అపురూప విషయాల‌ను కథా వస్తువుగా తీసుకుని, ఎన్నోఅపూర్వమైన కథలు అల్లిన తెలుగుకథా రచయితల కోక్కొల్లోలు. అలాంటి కథకులో ఆదిలాబాద్‌ ప్రాంతం మంచిల‌ర్యాకు చెందిన అగ్రశ్రేణి కథా రచయిత అల్లం రాజయ్య ఒకరు. తానుప్రత్యక్షంగా చూసిన సంఘటను అనుభవా సారాంశం రంగరించి రాసిన కథ ముపు1991సంవత్సరంలో రాయ బడిన కథ. గోదావరిపేరుతో భూమికకథా సంకల‌నంలో ప్రచురించబడింది. 1989లో గోండు జాతి గిరిజను అధికంగా నివసించే అడవు జిల్లా అయిన ఆదిలాబాద్‌ ప్రాంతంలోని ఆసిఫాబాద్‌ వాంఖిడి జనవాసాల్లో జరిగిన గిరిజన తిరుగుబాటు సంఘటనకు అక్షర సాక్ష్యమే ఈ ముపు కథ.

గోండుబెబ్బులిగాపేరుపొందిన కొమరం భీమ్‌ పోరాటస్ఫూర్తి ఆప్రాంతాల‌కు ఒక చైతన్య దీప్తి, అయినామారిన కాలాను బట్టి పరిస్థితల‌ను బట్టి చైతన్యశక్తి మారటం సహజం. ఆదిలాబాద్‌ ఆదివాసి పోరాటాల‌ తీరు కూడా అందుకు తీసిపోలేదు. ఇంద్రవెల్లి సంఘటన బలిదానాతో అక్కడి పోరాటచైతన్యంలో నూత న దాయి ఏర్పడ్డాయి. గిరిజన పోరాట రూప క్పనలో జరిగిన నూతన ఆవిర్భావం గురించి తనదైన కొత్తకోణంలో వాస్తవ సంఘట నను ఆసరాచేసుకుని రాసిన, ఈ ముపు కథ గిరిజన పోరాటా ప్రస్థానానికి నిజమైన మార్పు అన వచ్చు.మాటకన్నా చేతుమివైనవి అనే సూత్రం ఆధారంగా చెప్పబడ్డ ఈ కథలో రచయిత తీరు భాషణ వ్యతిరేకత్వం గా కనిపిస్తుంది.మాట అవసరం లేకుం డానే మిగతా జంతుజాం అంతా క్మషరహితంగా, జీవిస్తూంటే  మాటు నేర్చిన మానవుడు,మాయు చేస్తున్నాడు. మార్కెట్‌ వ్యవస్థకు మూలాధారం ఈమాయ మాటలే అని కథారచయిత దృఢవిశ్వాసం. ఈకోణం ఆధారంగానే  నూతనగిరిజన పోరా టా చైతన్యానికి, ఊక దంపుడు ఉపన్యాసా కన్నా చేతనే గిరిజను నమ్మి అటువంటి చేత నాయకునే అనుసరిస్తారు, అనేసత్యాన్ని అ్లం రాజయ్య ఈకథ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇకకథ విషయానికొస్తే అసిఫా బాద్‌ పరీవాహక గోండు గిరిజన గ్రామాల్లోని అడవి బిడ్డు వస వ్యాపారు అక్రమాకు ఎలా బలై ఆర్థికంగా నష్టపోతున్నది ఈకథ కళ్ళకు కడుతుంది. ఈప్రాంతంలో అధికసంఖ్య లో గోండు,అ్పసంఖ్యలో కోలాంజాతి గిరిజను నివసిస్తూ పోడువ్యవసాయం, పశువు కాపయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. ‘పూర్వం తమవంశీయులైన గోండ్వానా రాజ్యా న్ని పాలించారు. వారి వంశానికి చెందిన వారంమేము’అనే అ్పసంతోషం తప్ప ప్రస్తు తం..తమమంచితనాన్ని,అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎలాదోచుకుంటున్నారో గమనించలేక పోతుంటారు. ఇలాగ అతి మంచితనం అమాయకత్వంగ గోండు-కోలాం జాతి గిరిజనును చైతన్యపరిచి దోపి డీ నుంచి బయటపెట్టడం కోసం సామాజిక స్పృహ గ నాయకు తమ ప్రయత్నాు తాము చేస్తూఉంటారు. కానీ నిత్యంపోరాటం కోసం నాయకు మాటు విని విని విసిగిన గిరిజను మౌనంగా వింటూంటారు తప్ప చైతన్యం చెందరు. గోండుభాష,తొగు భాషు తెలిసిన పొగాకు వ్యాపారి చ్చయ్య నిరంతరం పొగాకు వ్యాపారం నెపంతో గిరిజనగూడేలో తిరుగుతూ వారి బాధను ప్రత్యక్షంగా చూస్తూ వస వ్యాపారు ఆగడాు అరికట్టే ప్రయత్నాు చేస్తూ ఉంటాడు. రాత్రి వేళల్లో రహస్యంగా గోండు గూడేలో జనసమీకరణు  చేసి తన మాట ద్వారా వాళ్ళను పోరాటం వైపు ఆకర్షించే ప్రయ త్నం చేస్తూ ఉంటాడు. అయినా వాళ్ళల్లో చైతన్యం రాకపోవడం వ్ల వారిని సోమరిపోతుగా భావి స్తాడు.కానీ తనచైతన్య ప్రేరణ పని మాత్రం ఆపడు. తన పోరాట చైతన్య ప్రయత్నంలో మైదాన ప్రాంతా నికి చెందిన రైతుబిడ్డ పోరాటస్ఫూర్తి గ యువ కుడు అయిన రాఘవు ను కూడావెంటపెట్టుకుని గోండు గ్రామా పోరాట చైతన్య స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు చ్చయ్య. అతని వెంట తిరిగేరాఘవు ఆప్రాంతాల్లోని గిరిజను స్థితిగ తుతో పాటు అక్కడి వ్యాపారు అక్రమాను ఆగడాను ప్రత్యక్షంగా గమనిస్తాడు.గోండు జాతు  చైతన్య ప్రస్థానం’లో భాగంగా చ్చయ్య రాఘ వుతో కలిసి, గూడెం చేరి సిడాం మాన్కు గుడిసె కు చేరుకుంటాడు. ఆరాత్రి అక్కడే తన మకాం. చ్చయ్య వచ్చిన కబురు ఆ నోటా ఈనోటా గూడెం లో అందరికీ తెలిసి అతను చెప్పే మాటు హాయి గావిని, అతడు ఇచ్చే పొగాకు తీసుకోవడానికి, బువ్వతిని నెమ్మదిగా  సిడాంమాన్కు గుడిసె ముందు పెట్టిన నెగడు ముందుకు చేరారు. సిడాం మాన్కు బాకీకోసం ఆగ్రామ షావుకారు జగ్గయ్య అన్యా యంగా తీసుకుపోయిన కంకు (దుక్కి టెడ్లు) గురిం చిన ప్రస్తావన తీసుకు వచ్చాడు, పొగాకు చ్చయ్య. గతంలోగోండు చేసిన పోరాటా గురించి చెప్ప సాగాడు. అందరం కలిసిజగ్గయ్య మీద తిరుగు బాటుచేసి ఎవరి వస్తువు వాళ్లు తెచ్చు కోవాలి అంటూ వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పుకు పోతున్నాడు చ్చయ్య. గోండుభాష రాని రాఘవు ుకు అదిఅంతా చిత్రంగా అనిపిస్తోంది. అక్కడ చేరినవాళ్ళలో కొందరు చ్చయ్య మాటు  ఆసక్తి గా వింటూ ఉంటే, కొందరు కూర్చున్న చోటే కునికి పాట్లు పడుతూ నిద్రలోకి జారుకున్నారు. వెనక కూర్చున్న వాళ్ళు సప్పుడు చేయకుండా వెళ్ళి పోతు న్నారు. అక్కడ మిగిలిందికంకు కోల్పోయిన మాన్కు ఇతర వస్తువు ధాన్యం అక్రమంగా షావుకారు పాు చేసుకున్నవ్యక్తు తప్ప ఇంకెవ్వరూ లేరు అక్కడి పరిస్థితి అంతా గమనించిన రాఘ వుకి ‘వీళ్లు ఇన్ని రకాుగా దోపిడీకి గురవుతూ ఎలా బ్రతుకుతున్నారు’ అనిపించింది. గతచరిత్రలో జరి గిన వివిధ గిరిజన పోరాటాు, అతను చదివిన ఉద్యమ సాహిత్యం గుర్తుకువచ్చి, వీళ్ళల్లో నిస్తబ్ధత ఎలాపోగొట్టాలి? అనేఆలోచనలో పడ్డాడు. వీళ్ళకు చెప్పడంకాదు, చేసిచూపించాలె, అని మెరు పులాం టి ఆలోచన అతనిలోకలిగింది.‘మాటకన్నా చేతుగావాలె’.చేతుచేసుకుంటూ మాటు చెప్పా లె’ అనుకున్నాడు. రాఘవు చ్చయ్యకు అదే విషయం అర్థమయ్యేటట్టు చెప్పాడు. తెల్లారి ఇద్దరూ కార్యోన్ముఖులై షావుకారుజెగ్గయ్య ఇంటికి చేరారు. పొగాకు చ్చయ్య, తనపంథా మార్చి షావుకారు మీద కోపం చూపిస్తూ పౌరుష పదాతో మాన్కుకు ఎడ్లను ఇస్తావా?లేదా?ఇవ్వకపోతే,ఇు్ల తగ బెడతాం అంటూ దౌర్జన్యంగా మాట్లాడేసరికి షావు కారులో భయం తొంగి చూసింది.
   చ్చయ్య కూడా ఊహించని విధంగా ‘నీ మాట మీద నమ్మకంతో ఇస్తున్న ఎడ్లను త్కోపో, బాకీ మాత్రం తొందరగా కట్టమని మాన్కుకు చెప్పు. అంటూ తన సహజదర్పం ప్రదర్శించాడు భయ పడుతూనే జెగ్గయ్య. ఆసంఘటన ఆనోటా ఈ నోటా పడి నిప్పురవ్వలా వ్యాపించింది. ఇప్పుడు అతడు పొగాకు చ్చయ్యకాదు జెగ్గయ్యనుఎదిరించిన  భీమ దేవుడంత బంగ చ్చయ్య అయ్యాడు. అప్పటి దాకా పొగాకు పంతుగా పిలిచిన వారంతా పొరక సారు అనడం మొదు పెట్టారు. పొరక సారు, రాఘవు కలిసి తిరిగి గోండు నుంచి షావుకార్లు గుంజుకున్న వస్తువు తిరిగి ఇప్పిస్తా మని భరోసా ఇస్తూ వాళ్ళు కోల్పోయిన వెండి, బంగారం, భూము ,పశువు, వివరాు అన్నీ జాబితాు రాసుకున్నరు.పొరకసార్లు తమ వస్తువు ు తమకు ఇప్పిస్తారనే నమ్మకంతో,గూడేు గూడేు వీరిని అనుసరించటం మొదయ్యింది. ఆగోండు గూడేన్నింటికీ  పెద్దదైన వాంకిడి లో గ ఎక్కువ సంఖ్యలోని షావుకార్ల ఇళ్ళమీద దాడి చేయ డానికి, పొరక సార్లు  వ్యూహరచన చేశారు. 
ఆవూరిలో సంత జరిగే రోజే ఆ పనికి ముహూర్తం అయ్యింది. అన్ని గోండుగూడేకు ఈవార్త క్షణాల్లో వ్యాపిం చింది. కోల్పోయిన నగు, వస్తువు తమ సొం తం కాబోతున్నాయనే సంతోషంతో చెప్పిన సమ యానికి ఆదివాసి జనాంతా,చీమ బారుల్లా  బయు దేరారు. అరుపుతో నిండిపోయింది.ఇది చూస్తున్న షావు కార్ల కళ్ళు తెలియని భయంతో చూపు చూస్తు న్నాయి. వాంకిడి గ్రామం మొత్తం అడవి బిడ్డు పాదాతో పునీతం అయి పోయింది. ఆ చిన్న గ్రామం వేమందితో కిక్కిరిసిపోయింది. ఇంతకీ, దీనికి కారకులైన చ్చయ్య, రాఘవు వారి వెంటలేరు. వాళ్లుఎట్లా వస్తారో ఎక్కడ నుంచి వస్తారో  అని ఎవరికి వాళ్ళు ఊహాగానాు పెంచు కుంటూ,పొరకసార్లు తమసామాన్లు పంచ బోయే షావుకార్ల ఇండ్లవైపునడకు  సాగించారు, గోండు జాతి గిరిజనబిడ్డు. ముందున్న వాళ్ళకే అందుతా యేమో! వెనకబడితే అందుకోలేమనే ఆతృత మొదలై అక్కడ పెద్ద అజడి మొదలైంది. చూసే వారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోగానే తొక్కిస లాట మొదలైంది.షావుకార్ల ఇళ్ళ ముందరి కంక దళ్ళు కూలిపోయాయి. ఇళ్లముందు పందిళ్ళు విరి గాయి. గూన పెంకుట్లిు కూలినయ్‌ ! గోండు జనం ఇళ్ళల్లో చేతికందినదల్లా తీసుకు న్నారు. బియ్యం,పప్పు,ఉప్పు,మిరపకాయు,బట్టు, ఆఖ రకు వెండి, బంగారు నగు చేతికి దొరికినదల్లా వదడం లేదు. వెనకనున్న వాళ్ళు తమకు అందవే మోనని  అరుస్తున్నారు. ఆ గలాటాలో అప్పు కాయి తాు,ఖాతా పుస్తకాు కనిపించిన కాగితాన్నీ చింపి పోగు పెట్టి నిప్పు పెట్టబడ్డాయి. గణపతి సేట్‌ గోండ్లు వాంకిడి మీదపడి దాడిచేస్తూన్న సమా చారం ఆసిఫాబాద్‌ పోలీసుకు చేరవేయ డంతో  రెండు వ్యాన్ల నిండా పోలీసు అక్కడికి వస్తు న్నారన్న వార్త వ్యాపించింది.జనాంతా సామాన్ల తో సహాఎట్లా వచ్చినవాళ్ళు అట్లానే అడవుల్లో కలిసిపోయారు.‘ఒకనిప్పురవ్వ రగిలింది అది ఆది లాబాద్‌ అడవును చుట్టేసి దావానమయింది’ అన్న వాక్యంతో ముగించిన ఈ కథలో కొత్త పోరాట మూలాన్ని రచయిత వినూత్నంగా ఆవిష్కరించి సఫలీకృతుడయ్యాడు. ఏపోరాటమైనా ప్రారంభంలో మాత్రమే నాయకు చేతిలో ఉంటుంది. అంత్య దశలో ప్రజ చేతుల్లోకి వెళ్తుంది.
 ప్రజ చేతిలో పడ్డ పోరాటమే ఫలితా ను సొంతం చేసుకుం టుంది అనే అసలైన సత్యం ఈ‘‘ముపు’’కథ ఆవిష్క రిస్తుంది.ఈ కథలో ఆద్యంతం పోరాట చైతన్య స్రవంతితోపాటు గోండు కోలాము జీవన విధా నం వాళ్ళలోని సామాజిక ఐక్యత సజీవంగా అక్షరీకరించడం ఈకథకు మరింత వన్నె చేకూరింది.
(వచ్చే సంచికలో పి.లిత కథ
గోడమీదబొమ్మ విశ్లేషణ)

ఏడాది గడిచిన మూడు రాజధాను ప్రకటన

‘‘ మూడు రాజధానుపై అసెంబ్లీలో తీర్మానం చేసి సంవత్సరం గడిచిపోయింది. అమరావతి రైతు, ప్రజానీకం చేపట్టిన ఉద్యమం ప్రారంభమై సంవత్సరం నిండిరది. ప్రభుత్వం సంక్షేమ పథకాు చేపట్టినా ఎక్కువ భాగం వివాదాస్పద నిర్ణయాు, కక్ష రాజకీయాు, వ్యతిరేక చర్యతో కాం గడిచిపోయింది. పాన కూడా కుంటుపడుతోంది. ముఖ్యమైన అంశాపై లిటిగేషన్లతో ప్రభుత్వం కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఈ కాంలో రాజధాని అభివృద్ధి స్తంభించింది. సంక్షేమం కొంతలో కొంత మెరుగైనా రాష్ట్రమంతా అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది’’


ఆనాడు ప్రపంచ స్థాయి, అద్భుత రాజధాని అంటూ టిడిపి ప్రభుత్వం ఆశు రేకెత్తించింది. పరిమిత పనుతో సరిపెట్టింది. నేడు రాజధానిని ముక్కు చేసే పేరుతో ప్రాంతీయ వైషమ్యాను రెచ్చ గొట్టి బ్ధి పొందాని వైసిపి ప్రయత్నిస్తోంది.ఆరున్నర సంవత్సరా నుండి కేంద్రంలో బిజెపినే అధి కారంలో కొనసాగుతోంది. ఈకామంతా రాజధానికి, రాష్ట్రానికి బిజెపి, కేంద్రంతీరని ద్రోహం చేసింది. బిజెపి నేత వీర్రాజు గారికి అమరావతి అకస్మాత్తుగా గుర్తొచ్చింది. 2024లో రాష్ట్రంలో అధికారం లోకి తీసుకు వస్తే రాజధానిని 5 వేకోట్ల రూపాయతో అభివృద్ధి పరుస్తామని సెవిచ్చారు. మాట మార్చ డం,మడమ తిప్పడం తమకు అవాటు లేదని నమ్మబుకుతున్నారు. ఆరున్నరేళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం మర్చిపోయినట్లున్నారు. గత ఐదుసంవత్సరాు రాష్ట్రంలో టిడిపితో కలిసి బిజెపి అధికారంలో కొనసాగిన సంగతి గుర్తున్నట్లు లేదు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్రానిదే. రాజధాని శంకుస్థాపన సందర్భంలో మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి తెచ్చి రాజధానికి నిధు ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజనోట్లో మట్టికొట్టారు. గత రెండుసంవత్సరా నుండి కేంద్ర బడ్జెట్లో అమరావతి ప్రస్తావనే లేదు. విజయవాడ మెట్రో గాలికొదిలేశారు. అమరావతికి రౖుె ప్రాజెక్టు ఏనాడో మర్చిపోయారు. ప్రత్యేక హోదా మాట ఇచ్చి నమ్మించి మోసం చేసింది బిజెపి కాదా? వెనుకబడిన ప్రాంతాకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏమైంది? పోవరం నిధు కోత పెడుతున్నారు. కడప ఉక్కుఊసే లేదు. ‘అమరావతిలోనే బిజెపి ఆఫీస్‌ నిర్మించుకున్నాం. మమ్మల్ని నమ్మండి’ అని వీర్రా జు పదేపదే చెబుతున్నారు. ఆఫీసునిర్మించుకుంటున్నారు కానీ రాజధాని నిర్మించడం లేదు. రాష్ట్రంలో అధికారం ఇస్తే తప్ప రాజధాని నిర్మాణం చేయమని పరోక్షంగా ప్రజను బెదిరిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో బిజెపికి ఓట్లు రాలేదనే కక్షతోనే హోదా ఇవ్వలేదా? రాజధానికి నిధు ఇవ్వటం లేదా? ఈ కామంతా రాజధానిపై పరస్పర భిన్నమైన ప్రకటనతో బిజెపి నేతు ప్రజను గందరగోళ పరుస్తూ వచ్చారు.మూడు రాజధాను కాకపోతే 30 రాజధాను ఉంటాయని ఒక నేత, మూడు రాజ ధాను కాదు మూడు సచివాయాు ఉండాని మరోనేత ఇలా పురకా వ్యాఖ్యు చేశారు. రాజ ధానితో తమకు సంబంధమే లేదనీ కేంద్రంలోని బిజెపి సర్కార్‌హైకోర్టులో అఫిడవిట్లు దాఖు చేసింది. అమరావతి అంగుళం కూడా కదదని చెప్పిననేతు ఇప్పుడు ఎక్కడున్నారు? ఢల్లీిని తదన్నిన రాజధాని నిర్మిస్తామని 2014లో మోడీ ఇచ్చిన మాట ఏమైంది? బిజెపి నేతతో తేడా వ్ల ఇలా మాట్లాడుతున్నారని కొందరు అమాయకంగా అనుకుంటున్నారు. బిజెపి నేతు ఈ నాటకంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అంతే తప్ప బిజెపి విధానంలో గందరగోళం లేదు. ప్రజను గందరగోళపరిచి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడమే వారి విధానం. అమరావతి రైతుపై కేసు పెడితే సహించం, దౌర్జన్యం చేస్తే ఊరు కోమని వీర్రాజు ఫీుంకరించారు. దేశంలో రైతు మీద నిర్బంధం, పౌర హక్కు ఉద్యమ నేతను ఏళ్ల తరబడి జైులో పెట్టడం, దళితు, మైనారి టీపై దాడు…చేస్తున్న బిజెపి దుర్మార్గాన్ని అంద రూ గమనించాలి. మోడీ దేవదూత అని ఓబడా నేత ఆనాడే పొగడ్తు కురిపించారు.నేను ఆ మోడీ దూతనని నేడు వీర్రాజు చెప్పుకుంటు న్నారు. మోడీ రైతు పక్షమని చిక పుకు పుకు తున్నారు. మోడీ రైతు పక్షమో అంబానీ, అదానీ పక్షమో దేశం కోడై కూస్తోంది. ఢల్లీిలో పోరాడుతున్న రైతాంగానికి ఖలిస్తాన్‌ ఉగ్రవాదు ముద్ర వేసిన బిజెపి అమరావతి రైతుపై ప్రేమ కురిపిస్తూ కపట నాటకం ఆడుతోంది. రాజధానిని, రాష్ట్రాన్ని నిండా ముంచిన బిజెపి ని నమ్ముకుంటే ఆత్మహత్యా సదశ్యమే అవుతుంది. అధికారం కోసం పావు కదుపుతోంది. బిజెపి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజు ఇప్పటికే గమనిస్తున్నారు. కానీ కొత్త రూపాలో ప్రజను నమ్మించడానికి కొత్త కుట్రకు బిజెపి తెర లేపుతోంది. అందుకే రాష్ట్ర రాజధానిని నాశ నం చేయడంలో ప్రధాన ముద్దాయి బిజెపి. తోడు ముద్దాయిు వైసిపి, టిడిపిు.
బిజెపి, టిడిపి, వైసిపిది ఒకటే వైఖరి
వైఎస్‌ఆర్‌ పార్టీ, ప్రభుత్వం రాజధానిపై పునరాలోచన చేయాలి. వివాదాను కట్టిపెట్టాలి. ఉన్న పరిమిత వనరుతోనైనా రాజధాని నమూనా మార్చాలి తప్ప, స్థలాన్ని మార్చానుకోవటం వృధా ప్రయాసే. పోటీ ఉద్యమాతో, అణిచివేతతో రాజ ధాని ప్రజ గొంతు నొక్కానుకోవటం తగదు. గతంలో రాజధానిలో జరిగిన అవినీతిపై విచారణ చేయవచ్చు. దోషులైన అధికారును గత పా కును శిక్షించవచ్చు. కానీ ప్రజను బలి చేయడం తగదు. బిజెపి కేంద్ర ప్రభుత్వ అండతో రాజధానిని ముక్కు చేయవచ్చని వైసిపి, ముఖ్యమంత్రి జగన్‌ భ్రమ పడుతున్నారు.మోడీ,అమిత్‌షాను వేడుకుంటే జరిగేది ఏమీ లేదు. రాష్ట్ర ప్రజను నమ్ముకుంటే మంచిది. అన్నీ ఒకే చోట కేంద్రీకరించానే చంద్ర బాబు మోడల్‌ రాజధాని విఫమయ్యింది. ప్రపం చానికే ఆదర్శం అని చెప్పిన భూ సమీకరణ ఎదురు కొట్టింది. రైతుల్ని, పేదను నట్టేట ముంచింది. ఇప్పటికీ ఈ వాస్తవాన్ని గమనించకుండా సింగపూర్‌ మోడల్‌ గురించి గొప్పు చెప్పుకోవడం టిడిపి కి తగదు. ఇప్పుడైనా తప్పు గుర్తించి సరిదిద్దు కోవ టం తదనుగుణంగా వ్యవహరించడం మం చిది. అమరావతి ప్రాంత రైతు ఈ దుస్థితిలో వుండ డం వెనుక తన బాధ్యత నుండి టిడిపి తప్పించు కోలేదు. అప్పుడు ఇప్పుడు రాష్ట్రానికి, రాజధానికి ద్రోహం చేసిన బిజెపిపై పల్లెత్తు మాట మాట్లాడ కుండా మోడీ భజన చేస్తే అమరావతి నిబడు తుందా? కేంద్రంపై పోరాడకుండా అమరావతి రైతును కాపాడతాం అంటే ఎలా నమ్ముతారు? అమరావతి ఉద్యమం విశాంగా,విస్తృతంగా నడ పాల్సింది పోయి అందులోనూ టిడిపి తన రాజకీ య ప్రయోజనాన్ని చూసుకుంటే రాజధాని రైతుకు జరిగే ప్రయోజనం కంటేనష్టమే ఎక్కువగా ఉంటుం ది.బిజెపి,టిడిపి,వైసిపిది అనేక విధానాలో ఒకటే వైఖరి. ఆనాడు బిజెపి, టిడిపి కలిసి భూస మీకరణ చేపట్టాయి. పూర్తిగా విఫం అయింది. కేంద్రంపై ఒత్తిడి చేయ డంలో టిడిపి, వైసిపి ది మెతక వైఖరే. ఇరుపార్టీది లోపాయికారి కుమ్మక్కే. రాజ ధానిలోను,రాష్ట్రంలోనూ పౌరహక్కును,ఉద్య మాను అణచి వేతలో ఎవరికి ఎవరు తక్కువ తినలేదు. రాజధాని ప్రాంతంలోని దళిత, అసైన్డ్‌ రైతు, భూమి లేని పేదు, కార్మికు బాగోగు ను గాలికొదిలేశాయి. ఆనాడు సింగపూర్‌, ఈనా డు దక్షిణాఫ్రికా నమూ నాు, విదేశీ కన్సల్టెన్సీు, దుబారా ఖర్చు, వృధా ఖర్చు షరా మామూలే. రాజధాని, రాష్ట్ర అభి వృద్ధి విషయంలో సూత్రబద్ధ వైఖరికి సిపిఎం అన్ని వేళలా కట్టుబడి ఉంది. అమరావతి రాజధానిపై అసెంబ్లీలో అన్ని పక్షాు ఏకాభిప్రాయానికి వచ్చి నందున రాజధాని స్థం మార్పుపై వివాదం చేయడం తగదని ముందు నుండి చెబుతూనే ఉంది. రాష్ట్ర ప్రజందరికీ అమరావతి సమదూరంలో ఉంది కాబట్టి రాజధాని రైతుకే కాదు, రాష్ట్రప్రజందరికీ ఇది మేని వైఖరి తీసుకుంది. శాసన సభ, సచివాయం ఒక దగ్గర ఉంటే పరిపాన సౌభ్యం, ప్రజకు మేని సిపిఎంభావించింది. హైకోర్టు కర్నూులో పెట్టా న్న ప్రభుత్వ ప్రతి పాదనపట్ల అభ్యంతరం లేదని సిపిఎం తెలిపింది. రాజధాని ఒకేచోట ఉన్నా అబి óవృద్ధి రాష్ట్రమంతా జరగాని విద్యా, వైద్య సంస్థ ు, పరిశ్రము అన్ని ప్రాంతాకు విస్తరిం చాని, అదే నిజమైన వికేంద్రీ కరణ అన్న వైఖరికి ఎప్పుడూ కట్టుబడి ఉంది. దానికోసం నిరంతర పోరాటం సాగిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతిలో ప్రజా ధనం ఖర్చుపెట్టారు, కాబట్టి వృధాచేయడం సరికా దని, ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిలో మార్చ టం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టు అని భావించింది. ఆనాడు రాజధానిపూలింగ్‌ విధానం తప్పని,పరి మిత స్థంలో రాజధాని నిర్మాణం చేసుకో వచ్చని చెప్పింది. పూలింగ్‌నువ్యతిరేకించి నందుకు ఆనాడు టిడిపి అభివృద్ధి నిరోధకుగా ముద్రవేసింది. ఈనాడు వైఎస్సార్‌ ప్రభుత్వం రాజధాని, ఇళ్ల స్థలా ుపేరుతో విశాఖలో భూ సమీకరణపేరు చెప్పి దళితు అసైన్డ్‌ భూము లాక్కుంటే తప్పని చెప్పింది, పోరాడిరది. హైకోర్టు లో కేసు వేసింది. దళితు పక్షాన నిబడి పోరాడి నందుకు ముఖ్య మంత్రి జగన్‌అసెంబ్లీ లోనే సిపిఎం పైన నిందు వేయడం చూశాం.రాజధాని అభివృద్ధి అంటే రాజ ధానిలో ఉన్న అన్నివర్గా ప్రజకు అభివృద్ధి ఫలాు అందాని దానికై నిరంతర కృషి సిపిఎం సాగిస్తోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ రైతుకు కౌు, సమానమైన ప్యాకేజీ అందించాని, పేదకు రాజధాని పెన్షన్‌ ఇవ్వాని, హామీు అము చేయాని అనేక ఉద్యమాు సాగిం చింది. పాక్షిక విజయాు సాధించింది. ఆనాడు టిడిపి అడ్డంకు పెట్టినా నిర్బంధాు ప్రయోగిం చినా ప్రజ మద్దతుతో తన కృషి సాగించింది. నేడు వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లోని పారిశుధ్య కార్మికుకు7నెలు జీతాు ఇవ్వక పోతే కార్మి కుకు అండగా సిఐటియు పోరాటం కొనసాగి స్తోంది. హైకోర్టు, రాష్ట్రసచివాయం కాంట్రాక్టు సిబ్బంది వేతనాు, భద్రతపై కార్మిక సంఘాు చేస్తున్న పోరాటానికి అండగా సిపిఎం నిుస్తోంది. పేదకు రాజధాని పెన్షన్‌ పెంపు, అసైన్డ్‌ భూము కు సమానమైన ప్యాకేజీపై ఎన్నిక ముందు తర్వాత వైసిపి ప్రభుత్వ నేతు మాటు తప్ప చేతులేవు. రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్య పై జరుగుతున్న కృషి, పోరాటం కొన్ని వర్గా మీడియాకు పట్టదు. రాజధాని ఉద్యమంతో గొంతు కుపుతోంది. వారికి అండగా నిుస్తోంది. అదే సందర్భంలో గతప్రభుత్వాు విధానా విషయం లో తనస్వతంత్ర వైఖరిని ప్రదర్శి స్తోంది.ఉమ్మడి ఉద్యమాకు మద్దతు ఇస్తోంది.ఢల్లీిలో రైతుఉద్య మం జరుగుతున్న తరహాలోనే రాజధాని లోనూ విశా ఉద్యమం సాగాలి.
సి.బాబూరావు

1 2 3