కుటిల రాజకీయాలతోనే మణిపూర్‌ మంటలు

బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుం టామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు. మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర వుందని ఆరోపిస్తారు. గతంలో జరిగిన మరికొన్ని అఘాయిత్యా లతో పోటీ పెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపిస్తారు, వ్యాసాలు రాయిస్తారు. జరిగిందాన్ని కప్పిపుచ్చడానికి, తీవ్రత తగ్గించడానికి సకల శక్తియుక్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన.
ఘనమైన మోడీ గారికి ఈ సమస్య పట్టించుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందోళన,ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమ కుట్టి నట్టు లేకపోయింది.మణిపూర్‌ నుంచి బిజెపి తర పున రెండు ప్రతినిధి బృందాలు,ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయనను కలుసుకోవడానికి ఢల్లీిలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తు లందుకుంటున్నారు.అమెరికా,ఫ్రాన్స్‌ వంటి దేశాల లోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెం టును వాయిదా వేయించారు ! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా ?
ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా మణిపూర్‌ దురంతం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కార్‌ వాషింగ్‌ వర్క్‌షాప్‌లో పని చేసుకుని బతికే ఇద్దరు ఆదివాసి యువతులను వివస్త్రలను చేసి వెంటాడి మానప్రాణాలు బలిగొంటున్న బీభత్స దృశ్యం జాతిని కలచివేసింది. ఘోరకలి జరిగాక రెండున్నర నెలలకు ఈ వీడియోలు బయిటకు వచ్చినా ఇంత ఆగ్రహావేదనలు ప్రజ్వరిల్లాయంటే జరిగింది ఎంత దారుణమో,వాస్తవ పరిస్థితి మరెం త ఘాతుకంగా వుందోననే సందేహం ప్రతివారిలో కలిగింది.దానికదే విషయం బహిర్గతమయ్యే వరకూ తెలియనట్టే ప్రవర్తిస్తున్న డబుల్‌ డబ్బా పాలకులకు ఘోర పరాభవం ఎదురైంది.మొన్ననే ఎన్‌డిఎ విస్త్రుత సమావేశంలో గజమాల వేయించుకుని సూక్తులు వినిపించిన విశ్వగురు ప్రధాని మోడీ బోనులో నిలబడాల్సి వచ్చింది. అయితే అలాంటి పరాభవాలు పట్టించుకునే ఘటం కాదు గనక పార్లమెంటు సమావేశాల సందర్భంగా చేసిన అని వార్య వ్యాఖ్యలలో ఆయన ఈ తప్పుకు దేశంలోని వంద కోట్లమంది ప్రజలదీ బాధ్యత అన్నట్టు మాట్లాడేశారు. దేశం, సమాజం సిగ్గుపడాలన్నారు. విశ్వగురుగా గజమాల వేయించుకోవడానికి నమో నమో కీర్తనలతో ఊరేగడానికి తాను, అమాను షానికి మాత్రం అందరిదీ బాధ్యత! ఇంతకన్నా విడ్డూరమైన,విపరీతమైన విషయం మరోటి వుం టుందా?కాని బిజెపి మోడీ పాలనల్ఱో అదే భారతీ య వాస్తవం.
చర్చకే దిక్కు లేదు, చర్య ఎక్కడ
మణిపూర్‌ లోనూ ఢల్లీి లోనూ పాలించేది అక్షరా లా వారు చెప్పే డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌. ఆపైన ఈశాన్య రాష్ట్రాలకు బిజెపి తరపున బాధ్యుడూ, మంత్రిగా ఈ శాఖకు బాధ్యుడు కూడా తన కుడి భుజమైన హోంమంత్రి అమిత్‌షా నే. మణిపూర్‌ పాలకుడైన బీరేన్‌ సింగ్‌ సరేసరి. అయినాసరే దేశ ప్రజలు వంద కోట్ల మంది సిగ్గు పడాలిగాని ఈ ఇద్దరు ముగ్గురు మనుషులు ఈషణ్మాత్రం సిగ్గు పడినట్టు కనిపించరు. తమకు నచ్చని రాష్ట్రాలలో చీమ చిటుక్కుమంటే ట్వీట్లు పెట్టి ఫీట్లు చేసే సంఘ పరివార్‌ పెద్దలెవరూ స్పందించరు.నూతన పార్ల మెంటు భవనం ముందు ఈ ఘోర వార్తపై స్పం దిస్తూ మణిపూర్‌ పుత్రికలకు జరిగిన ఘోరం పట్ల ప్రతివారూ విచారిస్తున్నారని,కారకులెవరైనా వదలిపెట్టే ప్రసక్తి లేదని గంభీర ప్రకటన చేసిన ప్రధాని ఆ సభలోనే ఈ సమస్యపై చర్చకు హాజరు కారు.సమగ్ర చర్చకాకుండా స్వల్ప వ్యవధితో సరి పెడతామంటారు. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని గర్జించినవారు తమ అనుంగు ముఖ్యమంత్రిని మాత్రం ముట్టుకోరు, రాజీనామాకు ఆదేశించరు.మే 4న జరిగిన ఈ దారుణంపై మే 14న ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే ఇంతకాలం ఏగుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారని నిలదీయరు. ఇవన్నీ చేయకపోవడం ఒకటి, ఈ వీడియో ఇంతకాలం తర్వాత ఇప్పుడే రావడంలో కుట్ర వుందని ఆరోపి స్తారు. గతంలో జరిగిన మరికొన్ని అఘాయి త్యాలతో పోటీపెట్టి మాట్లాడతారు. చర్చలు జరిపి స్తారు, వ్యాసాలు రాయిస్తారు.జరిగిందాన్ని కప్పి పుచ్చడానికి, తీవ్రత తగ్గించడానికి సకల శక్తియు క్తులూ వెచ్చిస్తారు. అందుకే ఇది డబుల్‌ హిపోక్రసీ. రెట్టింపు వంచన. టెలిగ్రాఫ్‌ పత్రిక 79మొసళ్ల కార్టూన్‌ వేసి ఆ పైన మోడీ విచారాన్ని పెట్టింది. ఎందుకంటే నవ వర్ష నమో పాలన తర్వాత వీటికి తేలిగ్గా లోబడిపోయే స్థితిలో దేశ ప్రజలు లేరు.
కాషాయ వ్యూహాల కరాళ ఫలితమే
ఈశాన్య రాష్ట్రాలు కూడా తమ ప్రాబల్యంలోకి రావడం మోడీ మహత్తులలో ఒకటని చెప్పుకునే బిజెపి అందుకు అనుసరించిన ఎత్తులు, జిత్తుల పర్యవసానమే ఈశాన్య జ్వాలలు. గుర్తు చేసుకుంటే కొంతకాలం కిందట అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ల మధ్య సరిహద్దు వివాదం ప్రజ్వరిల్లడం ఎవరూ మర్చిపోలేదు. నిరంతరం తన మాటలతో వివా దాలు సృష్టించే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్‌ విశ్వశర్మ పరిష్కారానికి ఏమీచేసింది లేదు ఎగ దోయడం తప్ప. తర్వాత మేఘాలయ తోనూ ఇదే తరహా ఘర్షణ చెలరేగి ఆరుగురు చనిపోయారు. ఇవి అస్సాం నుంచి విడదీయబడిన రాష్ట్రాలు కావడం గుర్తుంచుకోదగింది. ఎందుకంటే 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చినపుడు ఈశా న్యాన మణిపూర్‌, త్రిపుర మాత్రమే కేంద్రపాలిత ప్రాంతాలుగా వుండేవి.1954లో అరుణాచల్‌ ప్రదేశ్‌,1963లో నాగాలాండ్‌,1969లో మేఘా లయ,1972లో మిజోరాం అస్సాం నుంచి విడదీసి ఏర్పాటు చేసినవే. మొదటి నుంచి వున్న మణిపూర్‌, త్రిపుర 1972లో పూర్తి రాష్ట్రాలయ్యాయి. ఈశాన్య ప్రాంతం నేరుగా బ్రిటిష్‌ వారి పాలనలో ఎన్నడూ లేదు.వారు కావాలనే చైనాకూ తమకూ మధ్య ఒక విడుపులాగా దాన్ని అట్టిపెట్టారు. అక్కడ అనేక జాతులు, ఉపజాతుల గిరిజనులు ఆదివాసులు జీవించేవారు. నాగా,కుకీ,మిసో తదితర తెగలు ఉపజాతులు అలాంటివే.గిరిజనులలో క్రైస్తవ మిషనరీల ప్రభావం కూడా ఎక్కువే. మణిపూర్‌ మైదానప్రాంతాలలో మైతేయిలు వుంటారు. కుకీలు మూలవాసులైనప్పటికీ రాజకీయ వ్యవస్థలో మైతే యిల ప్రాబల్యమే ఎక్కువ. ఈచిన్న రాష్ట్రంలో మొత్తం 36తెగలు, ఉపజాతుల వారు వుంటారంటే సమస్య అర్థమవుతుంది.మైతేయిలు ఇంఫాల్‌ లోయలో వుంటూ హిందూ మతాన్ని సనామహి అనే స్థానిక విశ్వాసాలను ఆచరిస్తారు. కుకీలు, నాగాలు అత్యధికంగా క్రైస్తవ మతానుయాయులు. ఈ తెగలు,ఉపజాతుల మధ్య స్వార్థ రాజకీయ శక్తులు పట్టించుకోని కేంద్రం కారణంగా నిరంతర ఘర్షణలు,తిరుగుబాట్లు జరుగుతూ వచ్చాయి. అందులో నాగా,కుకీల తగాదాలు ప్రధానమైనవి. 2017లో బిజెపి అధికారంలోకి రావడంతో ఆరెస్సె స్‌ రంగంలోకిదిగి హిందూవిశ్వాసాలు గల మైతే యిలను క్రైస్తవాన్ని అనుసరించే కుకీలకు వ్యతిరేకంగా కూడగట్టింది.దాంతో ఇది మత వివాదంలా కూడా మారిపోయింది.
ఎఫ్‌ఐఆర్‌ తెలియదా ?
పొరుగునే వున్న మయన్మార్‌లో 2021లో సైనిక నియంతృత్వం అధికారం కైవశం చేసుకున్నాక దాడి తట్టుకోలేక వేలాది మంది చిన్‌ శరణార్థులు వచ్చి పడటంతో పరిస్థితి మరింత దిగజారింది. వీరు కూడా కుకీలే. మిజోరాం, మణిపూర్‌ల లోని కుకీలు వారిని ఆహ్వానించి ఆశ్రయమిచ్చారు. కాని మోడీ ప్రభుత్వం వారికి ఆశ్రయం నిరాకరించి అక్రమ చొరబాటుదారులుగా ప్రకటించింది. ఇదే సమ యంలో బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వం రిజర్వు అడవుల నుంచి కుకీలను భారీ ఎత్తున తొలగించడం మొద లెట్టింది. అడవులలో మాదక ద్రవ్యాల పంటలను నాశనం చేసేందుకు దాడి కూడా గిరిజనులను దూరం చేసింది. కుకీలు అక్రమ చొరబాటుదారులని ప్రచారంచేసే తీవ్రవాద మైతేయి వర్గాలకు ఆరెస్సెస్‌ వత్తాసునిచ్చింది.అస్సాం ముఖ్యమంత్రి శర్మ, బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ ఆప్రాంతంలో పని చేస్తున్న కాలంలోనే కుకీ తీవ్రవాద సంస్థ యుకెఎల్‌ఎఫ్‌ (యునైటెడ్‌ కుకీ లిబరేషన్‌ ఫ్రంట్‌)తో సంబంధం పెట్టుకుని నిధులు సమకూర్చినట్టు తర్వాత వెల్లడైంది. ఇందుకు ప్రతిగా వారు 2017 లోనూ 2019లోనూ బిజెపికి ఎన్నికల్లో మద్దతు నిచ్చారు.ఈవిషయం బయిటకు వచ్చాక ముఖ్య మంత్రి బీరేన్‌సింగ్‌కు మైతేయిలలో కూడా మద్దతు లేకుండా పోయింది. తమ సమస్యలకు మూల కారణంగా భావించిన ఆయనను కుకీలు ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వున్నారు. బిజెపి లోనే వున్న పది మంది కుకీ ఎంఎల్‌ఎలు ప్రత్యేక పాలనా విభాగం కావాలని ఆందోళన మొదలెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న కల్లోలం వెనక ఇంత లోతైన నేపథ్యముం దని గుర్తుంచుకోవాలి.పులి మీద పుట్రలా ఈ పరిస్థి తులలో మైతేయిలను కూడా గిరిజనులుగా పరిగ ణించాలని మార్చి 27న మణిపూర్‌ హైకోర్టు తీర్పు చెప్పడం,దానికి అభ్యంతరం లేదని బీరేన్‌ సింగ్‌ హడావుడిగాప్రకటించడంతో ఈ ఘర్షణలు పరాకా ష్టకు చేరాయి.ఈ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు జోక్యం చేసుకోకపోగా కుటిల వ్యూహంతో మరింత రగలడానికి కారణమైనాయి.మే 4వ తేదీ మహిళలపై ఘోర కలి వీడియో జులై 20న బయిట కు వచ్చినప్పటికీ నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు ఈవిషయాలు తెలియవని కాదు. మే రెండవ వారంలోనే వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేయడం ఎఫ్‌ఐఆర్‌ నమోదు జరిగాయి. మే 29న అమిత్‌షా అక్కడ పర్యటించి వచ్చారు. ఇక ఘనమైన మోడీ గారికి ఈ సమస్య పట్టించుకోవాలనే ఆలోచనే లేకుండా పోయింది. ప్రతిపక్షాలు ఆందో ళన, ఆగ్రహం వెలిబుచ్చుతున్నా చీమ కుట్టినట్టు లేకపోయింది. మణిపూర్‌ నుంచి బిజెపి తరపున రెండు ప్రతినిధి బృందాలు, ప్రతిపక్షాల తరపున ఒక బృందం ఆయనను కలుసుకోవడానికి ఢల్లీిలో నిరీక్షిస్తుంటే ఆయన మాత్రం అమెరికాలో భుజకీర్తులందుకుంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ వంటి దేశాలలోనూ యూరోపియన్‌ పార్లమెంటులోనూ మణిపూర్‌ పరిస్థితిపై తీర్మానాలు చేస్తుంటే పట్టించుకోలేదు సరికదా చర్చ కూడా చేయకుండా మన పార్లమెంటును వాయిదా వేయించారు! కనుక మణిపూర్‌ పుత్రికలంటూ ఆయన మాట్లాడటాన్ని మొసలి కన్నీరు కన్నా మోడీ కన్నీరు అంటే చాలదా ?
జరగాల్సిందేమిటి ?
మాట్లాడితే వీర జవాన్లు, దేశభక్తి అంటూ ఊదరగొట్టే కేంద్ర పాలకులు కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికుని భార్యకు ఈ దుర్గతి పడితే స్పందించకపోవడాన్ని ఏమంటాం? మే 4 రాత్రి దుష్ట మూకలు వేల సంఖ్యలో ఆ గ్రామాన్ని చుట్టుముట్టి కుకీ కుటుంబాలను తరిమేయడమే గాక ఇద్దరు యువతుల బట్టలూడదీయించి మృగాల్లా హింసిస్తూ ఈడ్చుకు పోయారు. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. వాళ్లను కాపాడేందుకు వెళ్లిన వారిని చంపేశారు. రక్తసిక్తమైన శరీరంతో ఆ అభాగ్యురాళ్లు ఇద్దరినీ తీసుకుని వారు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్‌కు చేరుకుంటే పరిధి సమస్య వచ్చింది. దాన్ని మరో స్టేషన్‌కు బదలాయించారు. ఇంత జరిగినా ఏ చర్య తీసుకున్నది లేదు, ఇంటర్‌నెట్‌ సెన్సార్‌ వుంది గనక బయిటకు రాలేదు. ఈ లోగా మహిళా కమిషన్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్లినా స్పందన లేదు. వందల సంఖ్యలో ఇలాంటివి వస్తుంటే ఏదని చూస్తామన్నది వారి అహంకారపూరితమైన జవాబు. ఇంకా ఆ ముఖ్యమంత్రిని ముట్టుకోని కేంద్రాన్ని ఏమనాలి? ఈ విషయంలో ముందే జోక్యం చేసుకుని తీవ్రంగా ఖండిరచిన సిజెఐ డి.వై.చంద్రచూడ్‌ ప్రభుత్వం చర్య తీసుకోకుంటే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. అత్యు న్నత న్యాయమూర్తి స్పందనకూ ప్రభుత్వాధినేత స్పందనకూ తేడా కనిపిస్తూనే వుంది. వాస్తవానికి రాని స్పందనకోసం వ్యవధి ఇవ్వడం కంటే సుప్రీం కోర్టు వెంటనే రంగంలోకి దిగి చర్య తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తక్షణం గద్దె దిగాలి. ఇప్పటికీ బయిటకు రాని ఘోరాలు మరెన్ని వున్నాయో ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలి. బాధితుల రక్షణ కోసం తక్షణం కేంద్రం రంగంలోకి దిగాలి. (ప్రజా శక్తి సౌజన్యంతో..)