ఏపీలో ఈ భాషల్లోనూ చదువు చేప్తారని మీకు తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో తెలుగు హిందీ, ఇంగ్లీష్‌,భాషల్లో భోదన జరుగు తుంటుంది. అక్కడ క్కడా ఉర్దూలోనూ బోధిస్తారు. ఇప్పుడు మరికొన్ని కొత్తభాషల్లోనూ భోదన జరగనుంది. రాష్ట్రంలోని గిరిజనుల ప్రయోజనం కోసం వారికి అర్ధమయ్యేలా వారి స్థానిక భాషల్లోనే భోదన జర పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఇది పూర్తి స్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆరు గిరిజన భాషల్లో ప్రత్యేకంగా విద్యార్థులకు భోదించాలని నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోనే ఏజెన్సీప్రాంతాల్లో గిరిజనులు నివాసముంటున్నారు. వీరు మాట్లేడే భాషలకు లిపి ఉండదు. వీటిలో కోయ, సవర, కువి, అదివాసీ, కొండ, సుగాలి భాషలు ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ భాషల్లో విద్యార్థులకు బోధించనున్నారు. గణితం, సన్స్‌, సోషల్‌ వంటి సబ్జెక్టులు కూడా గిరిజన భాషల్లోనే బోధన జరగనుంది. లిపిలేని భాషలను సిలబస్‌ లో చేర్చడం ద్వారా గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది.
ప్రాథమిక పాఠశాలల్లో చేరే గిరిజన విద్యా ర్థులకు మాతృభాషలో తప్ప తెలుగు, ఇతర భాషల్లో ఏ మాత్రం ప్రావీణ్యం ఉండదు. దీంతో వారికి విద్యాబోధన ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజన గూడేల్లోని అడవి బిడ్డలకు వారి మాతృభాష ఆధారిత బహుళ భాషా విద్యాబోధనను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వశిక్షా అభియాన్‌ ద్వారా ఇకపై గిరిజన పాఠ శాలల్లో కోయ భాషలోని పదాలను తెలుగు అక్షరాలతో రాసేలా బోధన చేస్తూ..లిపి లేని ఆ భాషలకు ఊపిరి పోయాలని సంకల్పిం చింది. కొండకోనల్లో అంతరించిపోతున్న అరుదైన కోయ భాషలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. లిపి కూడా లేని వివిధ కోయ భాషలకు తెలుగులోనే అక్షర రూపం ఇచ్చి.. గిరిపుత్రులకు విద్యాబుద్ధులు నేర్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా మూడొం తుల మంది గిరిజనులకు మాతృభాష తప్ప మరో భాష రాదు. దీంతో వారు విద్యకు దూర మై వెనుకబడిపోతున్నారు. ఉపాధికి కూడా దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు మాతృ భాషను కొనసాగిస్తూనే తెలుగు భాషను అభ్యసిం చేలా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుడు తోంది.6 భాషలు..920 పాఠశాలల్లో అమలు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 8 జిల్లాల్లోని 920 పాఠశాలల్లో ఆరు రకాల కోయ భాషల్లో అమ లు చేయనున్నారు. ఈ విధానాన్ని‘కోయ భారతి’ పేరిట ఉభయగోదావరి జిల్లాల్లో ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రారంభించారు. అయితే, గత పాలకులకు దీనిపై చిత్తశుద్ధి లేకపోవడంతో ఏడాది తిరగకుండానే ‘కోయ భారతి’ కార్యక్రమం అటకెక్కింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం గిరిజనులకు వారి మాతృభాషలో తెలుగును సులువైన విధానంలో అలవాటు చేసేందుకు ప్రత్యేకంగా పాఠ్య పుస్తకాలు రూపొందించింది. తొలి దశలో ఒకటి నుంచి మూడో తరగతి వరకూ గిరిజన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించింది. పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ను గిరిజన భాషలోనే రూపొందించి పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో (కోయ),శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో (సవర),విశాఖపట్నం జిల్లాలో (కొండ,కువి,ఆదివాసీ),కర్నూలు, అనంతపురం జిల్లాల్లో (సుగాలి) భాషలకు అనుగుణంగా ప్రత్యేక పాఠ్య పుస్తకాలను తీసు కొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ సూచనల మేరకు ఐటీడీఏల్లో ఆరు భాషలపై పట్టున్న నిపుణుల తోడ్పాటు తీసుకున్నారు. వారి ఆలోచనల మేరకు 1నుంచి3వ తరగతి వరకూ తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం పుస్తకాలను సిద్ధం చేశారు. రూ.60 లక్షల వ్యయంతో పాఠ్యాం శాలు రూపొందించారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా920పాఠశాలల్లో 18,795 మంది గిరిజన విద్యార్థులకు తెలుగు, ఇతర సబ్జెక్టులను గిరిజన భాషలోనే బోధిస్తారు. ఇందుకోసం గిరిజన ఉపాధ్యాయులతో పాటు వారు లేని చోట ఆ భాషపై కాస్తోకూస్తో పట్టున్న విద్యా వలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చి నియామక పత్రాలు అందజేశారు.
కోయభాష విభిన్నం..
కోయ భాషలో అమ్మను యవ్వ అని..నాన్నను ఇయ్య అంటారు. అన్నను దాదా..అక్కను యక్క అంటారు. చెట్టును మరం అని.. ఈగను వీసి అని..కోడి పుంజును గొగ్గోడు అని..పిల్లిని వెరకాడు అని పిలుస్తారు.దోడ తిత్తినే (అన్నం తిన్నావా),బాత్‌ కుసిరి (ఏం కూర),దెమ్ము (పడుకో),ఏరు వాట (నీరు ఇవ్వు, పెట్టు), బెచ్చోటి (ఎంత పరిమాణం), మీ పెదేరు బాత (నీ పేరు ఏమిటి), కూడికేకు (కూడిక), తీసి వేతాకు (తీసివేత), వంటి పదాలు ఇకపై గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఈ పదాలు వాడుకలోకి రానున్నాయి.
గిరిజన విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు
గిరిజన బిడ్డలకు నాణ్యమైన చదువులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఒక్క చదువులోనే కాకుండా ఆటలు, సాంస్కృతిక అంశాల్లోనూ వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు వేసింది. వీటితోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను కూడా అందిపుచ్చుకుంటూ గిరిజనుల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది.ఏకలవ్య స్కూళ్ల ద్వారా ప్రతి విద్యార్థిని చదువుల్లో గురి తప్పని ఏకల వ్యులుగా తయారు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు మేలైన ఫలితాలు సాధిస్తుండగా ఏకలవ్య పాఠశాలలు మరింతగా ఊతమివ్వనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 19 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు ఉండగా కొత్తగా మరో 9 మంజూరయ్యాయి. 2021-2022 విద్యా సంవత్సరానికి మంజూరైన వీటిని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు.
ఏకలవ్య పాఠశాలల ప్రత్యేకతలు ఇవే..
?సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరు నుంచి 12వ తరగతి వరకు ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు ఉంటాయి. మొదటి ఏడాది ఆరో తరగతితో ప్రారంభించి ఆ తర్వాత ఏడాదికొక తరగతి చొప్పున 12వ తరగతి వరకు పెంచుతారు. ప్రతి తరగతికి 60మంది(బాలలు 30, బాలి కలు 30 మంది) ఉంటారు. 11,12 తరగ తుల్లో 90 మంది చొప్పున ప్రవేశాలు కల్పి స్తారు. ఒక్కో పాఠశాలను రాష్ట్ర ప్రభుత్వం 15 నుంచి 20 ఎకరాల స్థలంలో నిర్మిస్తుంది. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆట స్థలం ఇలా సమస్త సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 8బాలబాలికల కోసం వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక డార్మిటరీలు, ఆధునిక వంట గది, విశాలమైన భోజనశాల ఉంటాయి. 8 ఇండోర్‌ స్టేడియం, అవుట్‌డోర్‌ ప్లే ఫీల్డ్‌లను ఏర్పాటు ద్వారా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రత్యేక శిక్షణ అందిస్తారు. గిరిజన భాషలకు ప్రోత్సాహమేదీ?
ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ విద్యార్థులకు వారి సొంత గిరిజన భాషలో విద్య అందించే ందుకు ఏళ్ల తరబడి కొనసాగుతున్న భాషా వలంటీర్లను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెన్యువల్‌ చేయలేదు. దీంతో, వేలాది మంది ఆదిమ తెగల విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారింది.ఆదివాసీల్లో సవర,కువి,కొండ, కోయ, ఆదివాసీ ఒరియా తదితర భాషలు మాట్లాడే వారికి ఆ భాషతప్ప మరే భాషారాదు. తెలుగు కూడా తెలియదు. దీంతో,వారికి వారి గిరిజన భాషలోనే చదువు చెప్పడం,ఆట పాటల ద్వారా బమ్మలు చూపించి తెలుగు కూడా నేర్పించడం కోసం భాషా వలంటీర్ల నియామకం జరిగింది. సంబంధిత గిరిజన భాష మాట్లాడేవారు పది మంది ఉంటే,ఆ భాషను రక్షించేందుకు పాఠ శాలలను పెట్టి, ఉపాధ్యాయులను లేదా వలం టీర్లను నియ మించుకోవడానికి అవకాశంఉంది. వలంటీర్లు రెగ్యులర్‌ టీచర్లు మాదిరిగా పనిచేస్తున్నా, వారికి నెలకు రూ.5 వేలు మాత్రమే వేతనం ఇస్తున్నారు. గతేడాదికి సంబంధించి వలం టీర్లకు మూడు నెలల బకాయిలు ఉన్నాయి. తమను రెన్యువల్‌ చేయాలని, బకాయిలు చెల్లిం చాలని భాషా వలంటీర్లు పోరాడుతున్నా పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం,కురుపాం మండ లాల్లో ఆదిమ తెగల గిరిజన విద్యార్థుల కోసం 176 ప్రభుత్వ ప్రత్యామ్నాయ స్కూళ్లు (జిపిఎస్‌) పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1802 మంది విద్యార్థులు ఉన్నారు. 176 మంది సవర భాషా వలంటీర్లు ఉండేవారు. వీరిని రెగ్యువల్‌ చేయక పోవడంతో విద్యార్థుల చదువు సాగడం లేదు. విశాఖ ఏజెన్సీలోని ఆదివాసీల్లో వెనకబడిన కువి,కొండ,ఆదివాసీ ఒరియా భాషలు మాట్లాడే వారి కోసం 708 మంది భాషా వలంటీర్లు ఉండేవారు. వారిని రెన్యువల్‌ చేయకపోవడంతో సుమారు 7,500 మంది పివిటిజి విద్యార్థులు డ్రాప్‌ అవుట్‌ అయ్యే ప్రమాదం ఉంది. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఎ పరిధిలో సీతంపేట, కొత్తూరు మండలాల్లోని పాఠశా లల్లో సవర భాష విద్యా బోధన155 స్కూళ్లల్లో జరిగేది.వీటిలో 75ప్రభుత్వ ప్రత్యామ్నాయ స్కూ ళ్లు (జిపిఎస్‌),56 మండల పరిషత్‌ స్కూళ్లు, 16ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, నాలుగు గురుకులాలు,రెండు మినీ గురుకులాలు ఉన్నా యి.వీటిలో వలంటీర్లే విద్యా బోధన చేసేవారు. సుమారు 4,500 మంది విద్యార్థులు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు ఐటిడిఎ పరిధిలో కోయభాషవలంటీర్లు గత ఏడాది14 ఉండేవారు. వారందరినీ రెన్యువల్‌ చేయాలని ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు నివేదిం చినా ప్రభుత్వంలో స్పందన లేదు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం, జీలుగు మిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు గిరిజన మండలాల్లో 101 కోయ భారతి పాఠ శాలలు ఉన్నాయి. వీటిల్లో 101 మంది కోయ భాషా వలంటీర్లు రెన్యువల్‌ కోసం ఎదురు చూస్తు న్నారు.గిరిజన ప్రాంతంలోని భాషా వలంటీర్లను రెన్యువల్‌ చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ లేఖ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.-(జి.ఆనంద్‌ సునీల్‌ కుమార్‌)